
హాంకాంగ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకల్ని ఆన్లైన్ వేదికగా నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కన్నుల విందుగా జరిగాయి.
ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి ప్రారంభించగా, శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్ తో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు.