జాతీయ లోక్ అదాలత్లో 197 కేసులు పరిష్కారం
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్లో 197 కేసులు పరిష్కారం కాగా, రూ.1.88 కోట్లు కక్షిదారులకు పరిహారం కింద లభించిందని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. అదాలత్లో సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, చెల్లని చెక్కు, ముందస్తు వ్యాజ్యాలు, మనోవర్తి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు పరిష్కారం అయ్యాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు కె. మధుస్వామి, ఎన్. లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.
రాజాధిరాజ వాహనంపై నారసింహుడు
మంగళగిరి/ మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై దర్శనమిచ్చారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో భక్తి గీతాలు, కూచిపూడి నృత్యం తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించగా.. కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. స్వామివారు ఆదివారం రాత్రి యాలివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
జాతీయ లోక్ అదాలత్లో 197 కేసులు పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment