కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి

Published Tue, Mar 11 2025 1:45 AM | Last Updated on Tue, Mar 11 2025 1:42 AM

కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి

కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి

సత్తెనపల్లి: ప్రతి మనిషిలో ఓ కళ ఉంటుందని, ఆ కళని సాధించడానికి నిరంతర కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ రాసంశెట్టి నరసింహారావు అన్నారు. చైతన్య కళా స్రవంతి సత్తెనపల్లి 46వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి తెలుగు సినిమా పాటల పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాల్లో ఆదివారం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నరసింహారావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ వర్ధమాన గాయకులు విజయపథం వైపు పయనించాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి తెలుగు సినిమా పాటల పోటీలలో ప్రథమ బహుమతి మాధవి (విజయవాడ), ద్వితీయ బహుమతి కె.రామారావు (కారంపూడి), తృతీయ బహుమతి కె.దుర్గాప్రసాద్‌ (హైదరాబాద్‌) కై వసం చేసుకున్నారు. వీరితోపాటు 10 మంది కన్సొలేషన్‌ బహుమతులు, 15 మంది ప్రత్యేక బహుమతులను అందుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి చైతన్య కళా స్రవంతి గౌరవ సలహాదారు లయన్‌ ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎ.విశ్వేశ్వరరావు(పిడుగురాళ్ల), ఎస్‌.కళాంజలి(రాజంపేట), ఎం.రవివర్మ (నరసరావుపేట) వ్యవహరించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామ కోటేశ్వరరావు, శ్రీమారుతీ ట్రేడర్స్‌ అధినేత ఆత్మకూరి వెంకట హరేరామచెంచయ్య, వెంకటసుబ్బయ్య, కళాస్రవంతి అధ్యక్షుడు లయన్‌ కమతం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గుండ వరపు అమర్‌ నాధ్‌, ట్రెజరర్‌ ఎస్‌సీయం. సుభాని, మహేష్‌, బాలరాజు, ఆచారి, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ రాసంశెట్టి నరసింహారావు

జాతీయ స్థాయి సినిమా పాటల పోటీల విజేత విజయవాడ మాధవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement