మెట్రోలో కేజ్రీవాల్కు బెదిరింపు మెసేజ్ రాసిన బ్యాంకర్ అరెస్ట్
Published
Wed, May 22 2024 11:11 AM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మెట్రోలో బెదిరింపు సందేశాలు రాసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని పేరు అంకిత్ గోయల్. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు మెట్రో స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దానిలో నిందితుడు బెదిరింపు సందేశం రాస్తూ కనిపించాడు. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు బరేలీ వాసి అని, ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को सरेआम दी जा रही जान से मारने की धमकी ‼️
PMO, BJP और नरेंद्र मोदी के इशारे पर राजीव चौक, पटेल नगर मेट्रो स्टेशन पर लिखी गई धमकी।
अरविंद केजरीवाल जी को कुछ भी होता है तो इसके लिए सीधे तौर पर बीजेपी और नरेंद्र मोदी ज़िम्मेदार होंगे। pic.twitter.com/vbbybDFSfJ
నిందితుడు అంకిత్ గోయల్కు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అతను మానసికంగా బాగానే ఉన్నాడని, గతంలో కేజ్రీవాల్కు మద్దతుగా జరిగిన పలు ర్యాలీలలో కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో కేజ్రీవాల్పై నిందితుడు ఆంగ్లంలో సందేశం రాశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాతలకు బీజేపీనే కారణమని ఆరోపించింది. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Police arrest accused Ankit Goyal, 33 for writing death-threatening graffiti against Delhi CM Arvind Kejriwal at a metro station. The Metro Unit of Delhi Police had registered an FIR and was investigating the matter: Delhi Police