నారా లోకేష్‌కు చేదు అనుభవం | Bitter Experience To Nara Lokesh At Dondapadu In Guntur | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌కు చేదు అనుభవం

Oct 12 2020 6:01 PM | Updated on Oct 12 2020 9:11 PM

Bitter Experience To Nara Lokesh At Dondapadu In Guntur - Sakshi

అయితే, లోకేష్‌ను ఇంటికి రావొద్దంటూ రెబ్బమ్మ కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. వెనక్కి వెళ్లిపోవాలని గ్రామస్తులు నినాదాలు చేశారు.

సాక్షి, గుంటూరు: అమరావతి పర్యటనలో నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు (మ) దొండపాడులో లోకేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు స్థానికులు. నిన్న (ఆదివారం) రాజధాని రైతుల పేరుతో చేసిన ర్యాలీలో.. ట్రాక్టర్ ఢీకొని కొప్పుల రెబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ సోమవారం అక్కడ పర్యటించారు. అయితే, లోకేష్‌ను ఇంటికి రావొద్దంటూ రెబ్బమ్మ కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. వెనక్కి వెళ్లిపోవాలని గ్రామస్తులు నినాదాలు చేశారు.
(చదవండి: పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్‌ కౌంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement