రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: కేటీఆర్‌

Published Wed, Apr 3 2024 2:32 PM

Ex Minister Ktr Comments On Bjp - Sakshi

సాక్షి, వికారాబాద్ జిల్లా: రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్‌లో  ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా పాత బీఆర్‌ఎస్‌ నేతలేనన్నారు.

చెవెళ్లలో కొండా, రంజిత్ రెడ్డి.. మల్కాజిగిరిలో ఈటల, సునీతా.. వరంగల్‌లో ఆరురి, కడియం కావ్య.. ఆదిలాబాద్‌లో నగేష్, భువనగిరిలో బూర.. వీరంతా బీఆర్‌ఎస్‌లో పనిచేసిన వాళ్లేనన్నారు. పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌నుంచి తీసుకెళ్లారంటూ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

నాకు ఎలాంటి సంబంధం లేదు
‘ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము. తాట తీస్తాం. నేను భయపడను’ అను కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్‌ సృష్టించిన కొరత: కేటీఆర్‌ ఫైర్‌
 

Advertisement
Advertisement