తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ | Jagadish Reddy Comments On Telangana Speaker Row Latest Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌

Published Thu, Mar 13 2025 12:49 PM | Last Updated on Thu, Mar 13 2025 4:02 PM

Jagadish Reddy Comments On Telangana Speaker Row Latest Updates

👉తెలంగాణ అసెంబ్లీ: జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌
👉బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ వేటు
👉ఈ సెషన్‌ మొత్తానికి జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌
👉స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు
👉సభ నుంచి వెళ్లిపోయిన బీఆర్‌ఎస్‌ సభ్యులు

👉తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..

👉అసెంబ్లీ లాబీ లోకి చేరుకున్న మార్షల్స్

👉ఇప్పటికే స్పీకర్ తో అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులు భేటీ.

👉ఈ సభ మీ సొత్తు కాదని స్పీకర్ ను ఉద్దేశించి వాఖ్యానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

👉జగదీష్ రెడ్డి వాఖ్యల పట్ల అధికార కాంగ్రెస్ అభ్యంతరం..

👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు అధికార కాంగ్రెస్ డిమాండ్..

👉అధికార కాంగ్రెస్ ,ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యుల పోటాపోటీ నిరసన నేపథ్యంలో సభను వాయిదా వేసిన స్పీకర్..

👉సభలో జరిగిన వ్యవహారం పై సీఎం కు రిపోర్ట్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.

👉దలిత స్పీకర్ ను అవమానించిన విషయం లో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశం..

👉జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రులు నిర్ణయం .

👉సభ ప్రారంబంకాగానే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుబట్టాలని మంత్రి సీతక్కకు సూచించిన శ్రీధర్ బాబు..

👉అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఇవాళ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. స్పీకర్‌ను జగదీష్‌ అవమానించారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. అయితే జగదీష్‌ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని, కాంగ్రెస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ ప్రతి విమర్శలకు దిగింది.

👉గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఇవాళ శాసనసభలో గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సభ్యులు పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోగా.. ఒకానొక స్థితిలో పరిస్థితి చేజారిపోయింది. స్పీకర్‌ ఛైర్‌ను సభ్యులు ప్రశ్నించకూడదని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అనడంతో పరిస్థితి మారిపోయింది. 

👉ఈ సభ మీ ఒక్కరి సొత్తేం కాదంటూ జగదీష్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జగదీష్‌ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ సభ్యులు.. సభను అదుపులో పెట్టాలంటూ స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లి బీఆర్‌ఎస్‌ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ వాయిదా పడింది.

👉మరోవైపు.. హరీష్‌ రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను విడిగా కలిశారు. జగదీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు. అనంతరం హరీష్‌ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’’ అని అన్నారు.

👉ఇంకోవైపు.. జగదీష్‌‌రెడ్డి అంశాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకెళ్లారు. ఆయనకు ఫోన్‌లో విషయాన్ని తెలియజేశారు. అనంతరం సీఎం ఛాంబర్‌లో మంత్రులు ఈ అంశంపై భేటీ అయ్యారు. జగదీష్‌రెడ్డి స్పీకర్‌ ప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని, వినకుంటే సస్పెండ్‌ చేయాల్సిందేనని మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గతంలో స్పీకర్‌ చైర్‌లో పేపర్లు విసిరినందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని ప్రస్తావించినట్లు  తెలుస్తోంది. 

జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే సస్పెండ్ చేసే అవకాశం?

మరోవైపు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో ఒక్కొక్కరుగా మాట్లాడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పీకర్‌పై వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పకపోతే జగదీష్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశాన్ని సైతం పరిశీలించాలని స్పీకర్‌ను కోరతామని అన్నారు. ఇదిలా ఉంటే.. జగదీష్‌ మాట్లాడిందాంట్లో తప్పేం లేదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావు అంటుండగా, స్పీకర్‌ కుర్చీతో కాంగ్రెస్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగిందని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement