guntakandla jagadish reddy
-
‘ఓటుకు నోటు కేసుపై రేవంత్కు రిపోర్ట్ చేయొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిస్తూ విచారణ ముగించింది. అయితే.. ఈ కేసులో సీఎం, హోం మంత్రి జోక్యం చేసుకోవద్దంటూ మాత్రం ఆదేశాలిచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డి సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అయితే.. కేసును విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది. ఏసీబీ డీజీ ప్రాసిక్యూషన్కు కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ కేసుపై సీఎం, హోం మంత్రికి రిపోర్ట్ చేయకండి. స్వతంత్ర, పారదర్శక విచారణ జరపాలనదే మా ఉద్దేశం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ట్రయల్ జరపాలన్న వినతిని సైతం తిరస్కరించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలు: కవిత బెయిల్ పిటిషన్ కామెంట్లపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెపుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. క్షమాపణలు పబ్లిక్ గా చెప్పారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ తమ విధులు నిర్వహించాలి. రాజ్యాంగ వ్యవస్థలోని మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవం ఇవ్వాలి. కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలకు ఒకే కానీ లక్ష్మణ రేఖ దాటవద్దు. రేవంత్ రెడ్డి తరఫు వాదనలు 👇 కవిత బెయిల్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కు క్షమాపణ తెలిపిన రేవంత్ అది నా ట్విట్టర్ హ్యాండిల్ కాదు నేను అడ్మినిస్ట్రేటర్ కాదు నేను పీసీసీ అధ్యక్షుడిని కాదు ప్రాసిక్యూటర్ ను మార్చాలని, దీనికి పొలిటికల్ ట్విస్ట్ ఇస్తున్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరపు వాదనలు 👇 ఏసీబీ డీజీ సీఎం నియంత్రణలో ఉన్నాయి స్వతంత్ర వ్యవస్థ నుంచి ప్రాసిక్యూటర్కు ఆదేశాలు ఉండాలి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నుంచి మాత్రమే ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు అందాలి -
కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర మాటలని మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే పద్దతుల్లో కొంతమంది సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం నిరాధారమైన కేసని మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, తాము ఊహించినట్లుగానే కవిత ముత్యంలా బయటకు వచ్చిందని తెలిపారు.చరిత్రల్లో సీబీఐ , ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసుల్లో ఇదొకటని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ , కేజ్రీవాల్ను ఇబ్బందిపెట్టడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. విచారణ సందర్బంగా ఆధారాలు లేకపోవడంతో ఈడీ, సీబీఐ న్యాయవాదులు ఇబ్బందిపడ్డారని అన్నారు. నోట్ల కట్టలతో పట్టపగలు దొరికి అధికారం చేలాయిస్తున్న మీరు నిరాధార కేసులో కవిత బెయిల్పై వస్తే ఏడుపెందుకని ప్రశ్నించారు.‘తెలంగాణ కాంగ్రెస్ ప్రధాని మోదీకి బీటీమ్గా పనిచేస్తుంది. మోదీ దగ్గర రేవంత్కు ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేదు. రేవంత్ సీఎం కావడం మోదీ చాయిసే. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసి కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కి వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారు.లిక్కర్ కేసులో రాహుల్ , రేవంత్ లు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అయితే గయితే పీసీసీ సహా తెలంగాణా కాంగ్రెసే బీజేపీలో విలీనమౌతుంది. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదు. ఎప్పటికయినా మోదీ , రాహుల్కు ప్రత్యామ్నాయం కేసీఆరే’ అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయను అమిత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్ఎస్ అధిష్టానం ఓకే అంటే.. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడినుంచైనా పోటీచేసేందుకు సిద్ధమని పలుమార్లు ప్రకటించిన గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబం ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకుంది..? తాము పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోమని బీఆర్ఎస్ అధిష్టానానికి ఎందుకు తెగేసి చెప్పింది? దీనిపై పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలోని వర్గపోరే ఇందుకు కారణమని తెలుస్తోంది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా ఇతర నేతలతో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల్లో ఏం సహకరిస్తారంటూ సుఖేందర్రెడ్డి కుటుంబం నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుంచి తాము తప్పుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమిత్రెడ్డి దారెటు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో గుత్తా అమిత్రెడ్డి భేటీ కావడంతో.. ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే, దానిని అమిత్ ఖండించారు. సీఎం రేవంత్రెడ్డికి గుత్తా కుటుంబానికి బంధుత్వం ఉండటంతో ఆ ప్రచారం సాధారణమేనని, తాము పార్టీ మారే ఆలోచన లేదని సుఖేందర్రెడ్డి ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. పోటీకి సిద్ధంగా ఉన్నామన్నా.. తన కుమారుడు అమిత్రెడ్డి బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని గుత్తా సుఖేందర్రెడ్డి గతంలో ప్రకటించారు. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే, బీఆర్ఎస్లోని జిల్లా నేతలు కొందరు అమిత్కు టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి చెప్పారు. మొదటి నుంచీ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, సుఖేందర్రెడ్డికి మధ్య సఖ్యత లేని కారణంగా మాజీ మంత్రి వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది. తాము పోటీ చేస్తామని చెబుతున్నా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఇతరులను బరిలో నిలిపేందుకు చర్చలు జరిపారంటూ గుత్తా వర్గం మండిపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి భువనగిరి టికెట్ అడుగుతున్నారన్న చర్చ జోరందుకుంది. అయితే, తాము పార్టీ మారుతారనే ప్రచారాన్ని గుత్తా అమిత్రెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా మంత్రి కాబట్టే తాను కలిశానని పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, జిల్లాలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలన్నింటిని కేటీఆర్, హరీష్రావుకు అమిత్రెడ్డి వివరించినట్లు తెలిసింది. ‘గుత్తా’కు అందని ఆహ్వానం! పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో సోమవారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీలో నిలిపే అభ్యర్థి విషయంపై చర్చించారు. అనంతరం వారంతా మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సమావేశానికి గుత్తా అమిత్కు ఆహ్వానం పంపలేదని తెలిసింది. అందుకే ఆయన హాజరుకాలేదని సమాచారం. ఆ ఇద్దరిలో ఒకరు నల్లగొండ పార్లమెంట్ నియోజకర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విషయంపై మాజీ సీఎం కేసీఆర్తో జిల్లా నేతలు చర్చించారు. జగదీష్రెడ్డి నేతృత్వంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్కుమార్, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్ తదితర నేతలు సోమవారం కేసీఆర్ వద్దకు వెళ్లారు. అభ్యర్థి విషయంలో ఏదైనా నిర్ణయానికి వచ్చారా అని కేసీఆర్ అడగ్గా నలుగురైదుగురు అడుగుతున్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే, గట్టి పోటీ ఇవ్వగలిగే వారిలో మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను సూచించినట్లు తెలిసింది. వారిద్దరిలోనే ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. లక్ష్మిని పోటీచేయించే యోచనలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచీ వ్యవహరిస్తోంది. భువనగిరిలో ఎవరైతే భారీ మెజారిటీతో గెలుస్తారన్న విషయంపైనా కాంగ్రెస్ అధిష్టానం సర్వే చేయిస్తోంది. ప్రస్తుతం టికెట్ అడుగుతున్న వారందరి పేర్లతోనూ సర్వేలు చేయించింది. బలమైన అభ్యర్థినే పోటీలో నిలుపాలన్న ఆలోచనలో ఉంది. అయితే, ఇక్కడి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. లక్ష్మీని పోటీచేయించాలంటూ అధిష్టానం రాజగోపాల్రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లుగా తెలుస్తోంది. -
మంత్రి జగదీష్రెడ్డి ఆస్తుల విలువ రూ.4.26 కోట్లు
సూర్యాపేట : బీఆర్ఎస్ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి గురువారం వేసిన నామినేషన్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రూ.1.58 కోట్ల స్థిర ఆస్తులు, రూ.2.68 కోట్ల చరాస్తులు మొత్తం కలిపి రూ.4.26 కోట్లు ఉన్నాయని.. రూ.2.60 లక్షల అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.2.86 లక్షలు ఉన్నట్లు తెలిపారు. తన సతీమణి సునీత చేతిలో రూ.9.8 లక్షలు ఉండగా.. ఆమె పేరున రూ.5.94 కోట్ల స్థిరాస్తులు, రూ.4.66 కోట్ల చరాస్తులు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని.. రూ.3.27 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆయన పేరున ఒక కారు, తన సతీమణి పేరున రెండు కార్లు, ఒక బైక్, ట్రాక్టర్ ఉన్నట్లు చూపారు. తనపై ఒక కేసు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. సంకినేని కుటుంబ ఆస్తి రూ.రూ.22.63 కోట్లు సూర్యాపేట : బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వర్రావు ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను రూ.22.63 కోట్లుగా చూపారు. వెంకటేశ్వర్రావు పేరున రూ.1.51 కోట్ల చరాస్తులు, రూ.40 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు రూ.1.50 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి లక్ష్మి చేతిలో రూ.13.75 లక్షలు ఉండగా.. 730 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.25.32 కోట్ల చరాస్తులు ఉన్నట్లు చూపారు. తనపై నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. దామోదర్రెడ్డిపై నాలుగు కేసులు.. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్రెడ్డి రూ.13.94 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.88 కోట్ల స్థిరాస్తులు తన చేతిలో రూ.25 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై నాలుగు పెండింగ్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
రేవంత్ పిండం వ్యాఖ్యలపై మంత్రిజగదీష్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డిపై విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనకు పిండం పెడతామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. రాజకీయ కక్షలతో కేసీఆర్ ఏనాడు వ్యవహరించలేదని తెలిపారు. పాలించమని ప్రజలు కేసీఆర్కు అధికారమిచ్చారని పేర్కొన్నారు. లాంటి నీచమైన మాటలు మాట్లాడమని కేసీఆర్ తమకు నేర్పలేదని అన్నారు. రేవంత్ కాంగ్రెస్కు పిండే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జగదీష్ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వక, నీళ్ళు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఆయన ప్రతిసారీ గుర్తుచేస్తున్నది వాళ్ల పార్టీ(టీడీపీ) చరిత్రనేనని దుయ్యబట్టారు. దుర్మార్గమైన పార్టీల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, ఆంధ్ర తొత్తులకు తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన ద్రోహి అని మంత్రి ధ్వజమెత్తారు. క రెంట్ నీళ్ళు, ఉద్యోగాలు, మత్స్య కార్మికులు, గొర్ల పెంపకదార్లకు అండగా ఉన్నందుకు కేసీఆర్కు పిండం పెడతావా అని రేవంత్ను నిలదీశారు. రేవంత్ కేవలం కేసీఆర్కు మాత్రమే కాదని, తెలంగాణ ప్రజలకు పిండం పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ అభివృద్ది ఏంటో, ఏం చేస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నువ్వు, నీ బాస్(చంద్రబాబు) చేసిన కుట్రల నుంచి బయట పడి, చావు అంచుల దాకా వెళ్లి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ అభివృద్ధి చేస్తూ, దేశంలోనే నంబర్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. మీ వల్ల దెబ్బ తిన్న ప్రజలను కాపాడింది కేసీఆర్. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి మాటలా మాట్లాడేది?. పైసలు పెట్టీ తెచ్చుకున్న పదవిలో కూర్చొని అహంతో మాట్లాడుతున్నావు. ఎక్కువ ఊహాలోకి వెళ్ళకు రేవంత్. వచ్చే రోజుల్లో ప్రజల నుంచి భంగం తప్పదు. సోయి లేకుండా మాట్లాడకు. ఎవరి కోసం త్యాగం చేసి వచ్చావు. రూ.50 లక్షలతో దొరికి చంద్రబాబును ఖతం చేశావు. కరెంట్ విషయంలో మాట్లాడి కాంగ్రెస్ను ఖతం చేశావు. చంద్రబాబును, టీడీపీని తెలంగాణలో ఖతం చేసింది నువ్వే కదా’ అని రేవంత్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
‘నాగార్జునసాగర్ కూడా కేసీఆరే కట్టించాడా?’
సాక్షి, నల్లగొండ: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయని మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సోమవారం గుర్రంపోడులో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలే క్షమాపణలు చెప్పాలన్న మంత్రి జగదీశ్ కామెంట్లపై భట్టి స్పందించారు. తెలంగాణ కోసం పోరాడిందే.. జలాల కోసం. అలాంటిది అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు కావస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. నేను ప్రశ్నిస్తే ముక్కు నేలకు రాయాలంటూ విమర్శలు చేసిన మీరు నీళ్లు ఇవ్వకుండా గాడిదలు కాస్తున్నారా?. ఎస్ఎల్బీసీ పూర్తి కాకుండా అడ్డుకున్నది ఎవరు?. నల్లగొండ జిల్లా ప్రజలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. దీనిపై చర్చించేందుకు నేను సిద్ధం. పది సంవత్సరాలుగా డిండి, ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తి చేయనందుకు చిత్తశుద్ధి ఉంటే సుఖేందర్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయాలని భట్టి అన్నారు. జిల్లాలో ఏ చిన్న పిల్లాడిని అడిగిన నాగార్జునసాగర్ కట్టింది, కాలువలు తవ్వింది కాంగ్రెస్ అని చెప్తారు. నాగార్జునసాగర్ కూడా కేసీఆర్ కట్టాడన్న భ్రమలో జిల్లా మంత్రి(జగదీష్ రెడ్డిని ఉద్దేశించి..) ఉన్నాడు. ఎందరో మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నల్గొండ జిల్లాలో మంత్రిగా జగదీష్ రెడ్డి ఉండడం దురదృష్టకరం. నాగార్జునసాగర్ నిర్మాణం చేసినందుకా? పార్లమెంట్లో మెజార్టీ లేకున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకా? ఢిల్లీ వరకు ముక్కు రాయాలి?. భూస్వామ్య గడీల మనస్తత్వం ఉన్నవారే ముక్కు నేలకు రాయమంటారు. జగదీష్ రెడ్డి మీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారా? కేసీఆర్ కు భజన చేస్తూ భూస్వామ్య, ఫ్యూడలిజం సమాజంలో ఉన్నారా?. కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీష్ రెడ్డిలా ఇసుక దందా, భూదందా చేయలేదు. పొద్దు తిరుగుడు పువ్వులా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరే సుఖేందర్ రెడ్డి గారు మీ గత ఆస్తులకు ఇప్పుడు పొంతన ఉందా?. ఏ మాన్యువల్ లేని విధంగా ఎమ్మెల్యేలకు కూడా పైలట్ వాహనాలు ఇచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు కేసీఆర్ ని నిధులు ధైర్యం గుత్తా, జగదీష్ రెడ్డిలకులేదు. వారే రెండు చేతులు జోడించి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తే అర్హత జిల్లా మంత్రికి లేదు. యాదాద్రి పవర్ ప్లాంటు త్వరితగరితన పూర్తి చేయకుండా జిల్లా మంత్రి గాడిదలు కాస్తుండా?. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని పవర్ ప్రాజెక్టులు కట్టింది?. ఏ పవర్ ప్రాజెక్టుల నుంచి కరెంటు ఇస్తున్నారు?. ఏ పవర్ ప్రాజెక్టు కట్టి విద్యుత్ ఇస్తున్నారో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పాలి అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇదీ చదవండి: గవర్నర్-కేసీఆర్.. ఓ ఇంట్రెస్టింగ్ పరిణామం -
మంత్రి జగదీష్రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: క్యాన్సర్ వ్యాధి బాధితురాలు ధరావత్ స్వాతి కలను తెలంగాణ పోలీసులు నెరవేర్చారు. ఒక్కరోజు ఎస్సైగా ఉండాలన్న స్వాతి కోరికను తీర్చారు. ఇటీవల మంత్రి జగదీష్రెడ్డిని కలిసిన ఆమె.. తన కల ఎస్సై కావాలని స్పష్టం చేసింది. దానికి స్పందించిన మంత్రి.. అందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్వాతి కలను నేడు పోలీసులు నెరవేర్చారు. కాగా, నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు అయిన స్వాతి అనే యువతిని ఆయన ఇటీవలే మంత్రి జగదీష్రెడ్డి పరామర్శించారు. ఎప్పటినుంచో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకోవాలని అనుకుంటున్న యువతి కోరికను కుటుంబ సభ్యులు, వైద్యాధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్వాతి తో ముచ్చటించిన మంత్రి మనో ధైర్యంతో ఉండాలని.. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి సూచించారు. కుటుంబం నేపథ్యాన్ని స్వాతి పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. పక్షపాతానికి గురైనటువంటి స్వాతి తండ్రి ధరావత్ చింప్లా వైద్య ఖర్చులను కూడా తానే భరించి చికిత్స చేయించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసు అధికారి కావాలని తన జీవిత లక్ష్మామని స్వాతి మంత్రి దృష్టికికి తీసుకెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కోరికను కూడా త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు స్వాతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఏ సాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్పందన చూసిన గిరిజన యువతి కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. తాజాగా స్వాతి ఒక్క రోజు ఎస్సైగా ఉండాలన్న కోరిక తీరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
మంత్రి జగదీష్రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
-
గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. గవర్నర్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. సీఎం రాజ్భవన్కు ఎప్పుడు రావాలనేది ఆయన ఇష్టం అని మంత్రి తెలిపారు. గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గవర్నర్ రాజకీయాలు మాని.. తన పని తాను చేసుకోవాలని హితవు పలికారు. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై ఆరోపణలు చేయడం గవర్నర్కు ఫ్యాషన్గా మారిందని ధ్వజమెత్తారు. నిత్యం వార్తల్లో ఉండేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదా.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు వరంగల్: గవర్నర్ తమిళిసై బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గవర్నర్గా ఆమె చేష్టలు ప్రజలను బాధపెడుతున్నాయని అన్నారు. హుందాగా ప్రవర్తించాలని గవర్నర్ను కోరుతున్నట్లు తెలిపారు. తమిళిసై రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ, ఆ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తుండటం వల్లనే తమిళిసైకి తగిన గౌరవం దక్కడం లేదని అన్నారు. కాగా గవర్నర్ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాజ్ భవన్ లో తమిళిసై ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో రాజ్భవన్ ప్రజాభవన్గా మారిందని గవర్నర్ అన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని, ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సీఎంకు లేఖలు రాశానని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఎవరూ ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె వ్యాఖ్యనించారు. -
గులాబీ నేతలకు కామన్ సెన్స్ లేదు.. టీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్
సాక్షి, నల్గొండ: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొందరు టీఆర్ఎస్ నేతలకు కామన్ సెన్స్ లేదని మండిపడ్డారు. మునుగోడులో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడంలేదన్నారు. బీసీ అనే కాకుండా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు నర్సయ్య గౌడ్ చెప్పారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉందని, ఆ ఈక్వేషన్స్తోనే టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. బలమైన బీసీ నేతనని తెలిసినా తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారని, ఎందుకు సమాచారం ఇవ్వడం లేదో ఆయన్నే అడగాలని పేర్కొన్నారు. ఎవరికి టికెట్ వచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తాన్నారు.మునుగోడుఎన్నికపై దేశం మొత్తం చర్చ జరగుతోందని, సర్వేలపరంగా టీఆర్ఎసే గెలుస్తుందని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖ చిత్రం మీదే ఈ ఎన్నిక ఉండబోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో లాభియింగ్ నడవదని, ముఖ్యమంత్రి నిర్ణయమే తుది నిర్ణయని వెల్లడించారు. 'మునుగోడు పేరులొనే గోడు ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మునుగోడును కేసీఆర్ దత్తత తీసుకునే అవకాశం ఉంది.రాష్ట్రంలో కొత్తగా 33 గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. మునుగోడు కు జూనియర్ కళాశాల లేదు. గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవాలి. మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. నాకు పదవులు ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. ఎవరు చెప్పిన చెప్పకున్నా ముఖ్యమంత్రి దిశానిర్దేశంతోనే పని చేస్తా' అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. చదవండి: ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల -
దొంగలకు ఆశ్రయం కల్పిస్తున్న బీజేపీ
మునుగోడు: దేశంలోని పేద ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపుతూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని దొంగల్ని, అక్రమ సంపాదనాపరుల్ని కాపాడేందుకు పార్టీలో ఆశ్రయం కల్పిస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పంటల సాగుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే దానిని అడ్డుకునే కుట్రలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదని, కేవలం ఆయన ఆస్తులు పెంచుకునేందుకే రూ. 21వేల కోట్ల విలువైన కాంట్రాక్టు పనుల్ని తెచ్చుకుని అమ్ముడుపో యారని ఆరోపించారు. రాజగోపాల్రెడ్డి కొన్ని వందలసార్లు సీఎం కేసీఆర్ చుట్టూ తిరిగి టీఆర్ఎస్లో చేరతానని బతిమిలాడినా చేర్చుకోలేదన్నారు. 20న మునుగోడులో సభ: ఈ నెల 20న మునుగోడులో మండల కేంద్రంలో ప్రజా తీర్పు సభ నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి? -
లాక్డౌన్: విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు.. మంత్రి ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పేరిట పోలీసులు విద్యుత్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే 12 నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ నుంచి అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాటిలో విద్యుత్ శాఖ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండలో లాక్డౌన్లో భాగంగా పోలీసులు విద్యుత్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డులు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోవడమే గాక అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో శనివారం విద్యుత్ ఉద్యోగులు ఈ విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా నల్గొండ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి అనంతరం డీజీపీతోనూ ఈ అంశంపై చర్చించారు. విద్యుత్శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. చదవండి: లాక్డౌన్: చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్.. చివరికి! -
కొందరికి లాభం..కొందరికి నష్టం
సాక్షి, హైదరాబాద్: స్వల్ప తేడాతో శ్లాబులు మారిపోయి చాలామంది వినియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. గతంలో ఎన్న డూ లేని విధంగా జూన్ నెలలో విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోయాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో మంత్రి ఈ అంశం పై వివరణ ఇచ్చారు. మార్చి 23 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలులోకి రావడంతో ఏప్రిల్, మే నెలల్లో మీటర్ రీడింగ్ తీయడం సాధ్యం కాలేదని, దీంతో గత మూడు నెలల విద్యుత్ వినియోగానికి సంబంధించిన మీటర్ రీడింగ్ను ఈ నెలలో ఒకేసారి తీసి సగటున ఒక్కో నెల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేశామని తెలిపారు. సోమవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, స్వల్పంగా కొన్ని పాయింట్ల తేడాతో అనేకమంది వినియోగదారులకు సంబంధించిన శ్లాబులు మారిపోయింది వాస్తవమే అని అంగీకరించారు. దీంతో కొంత మంది వినియోగదారులు లాభపడ్డారని, కొందరు నష్టపోయారని అన్నారు. వేసవిలో విద్యుత్ను ఎక్కువగా వాడడం వల్లే చాలా మందికి బిల్లులు అధికంగా వచ్చాయన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్మిశ్రా, ఎమ్మెల్యేలు సైతం తమకు బిల్లులు ఎక్కువ వచ్చాయంటూ ఫిర్యాదు చేశారని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఏవైనా సాంకేతిక లోపాల వల్ల ఎవరికైనా అధికంగా బిల్లులు వస్తే వాటిని సరిదిద్దుతామన్నారు. గత మూడు నెలలకు సంబంధించిన బిల్లుల బకాయిలను వచ్చే మూడు నెలలపాటు వాయిదాల్లో 1.5 శాతం వడ్డీతో చెల్లించేందుకు అనుమతిస్తామని మంత్రి ప్రకటించారు. -
క్షమించండి.. పోటీ చేయలేను : సునీత
సాక్షి, సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సతీమణి సునీత ‘సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ కావాలి’ అంటూ వచ్చిన కరపత్రాలు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఆమె చైర్పర్సన్ అయితే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందంటూ ఆ పార్టీ జిల్లా నాయకులు పోలా రాధాకృష్ణ పేరుతో ఈ కరపత్రాలు వెలువడ్డాయి. అంతేకాకుండా ఈ కరపత్రాల విషయం ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి నిజంగానే ఆమెను చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో దింపుతారా..? అని టీఆర్ఎస్తో పాటు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చర్చ జరిగింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జగదీశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేశారు. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లడం, విద్యావంతురాలు కావడంతో ఆమె మున్సిపల్ బరిలోకి దిగుతారా..?’ అని పార్టీ ముఖ్య నేతలు కూడా గుసగుసలాడారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళా కావడంతో మంత్రి ఆమెను బరిలోకి దింపితే స్వాగతిస్తామని కొందరు నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మీ కోరికను మన్నించలేక పోతున్న... శనివారం నామినేషన్లకు చివరి రోజున సునీత స్పందించారు. పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సూర్యాపేట పట్టణ ప్రజలకు నమస్కారం. గత కొద్దిరోజులుగా నన్ను సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికలలో పోటీ చేయాలని చాలా మంది అభిమానులు కోరుతున్నారు. కానీ మా పిల్లల చదువు బాధ్యతల దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చెయ్యడానికి సిద్ధంగా లేను. 2014,2018 శాసనసభ ఎన్నికలలో నా భర్త గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలో నన్ను ఆదరించి వారిని గెలిపించిన మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న యస్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు అందిస్తున్న సేవలు ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాను. నాపై అభిమానం చూపించి నన్ను ఆహ్వానించిన మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ కోరికను మన్నించలేక పోయినందుకు క్షమించాల్సిందిగా విజ్ణప్తి చేస్తున్నాను.’ అని ప్రకటన విడుదల చేశారు. -
30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి
సాక్షి, సూర్యాపేట: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన హాజరై మాట్లాడారు. మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏ ఒక గడువు పెట్టకుండా ఏ పనులు కూడా కావడం లేదని తెలిసి ఈ కార్యక్రమానికి 30రోజుల ప్రణాళికగా డెడ్లైన్ పెట్టారని చెప్పారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, డ్రెయినేజీల శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయాలన్నారు. 14ఏళ్లు ఉద్యమంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్ని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబవర్వన్గా నిలపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయని విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం సీఎం ఆకాంక్ష.. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచనతో సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గ్రామాభివృద్ధి చేయడంలో ప్రజలను మమేకం చేయాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఈ 30రోజుల ప్రణాళికలో భాగస్వాముడు కావాలన్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదన్నారు. వీలున్న చోట్ల మొక్కలు నాటి పచ్చధనం ఉండేలా చూడాలన్నారు. గ్రామాలకు గతం కంటే మెరుగ్గా నిధులు.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రమంత ఒకేసారి చేస్తే విజయవంతమవుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారని, గ్రామాలకు గతం కంటే నిధులు మెరుగ్గా ఉంటాయన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ నడుం బిగించి 30రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్ దుగ్యాల అమయ్కుమార్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సుల్లో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, డీఆర్ఓ చంద్రయ్య, ఆర్డీఓ మోహన్రావు, అర్వపల్లి జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు సాగర్ గేట్లు ఎత్తనున్న ఇరు రాష్ట్రాల మంత్రులు
సాక్షి, నాగార్జునసాగర్ : రెండు రాష్ట్రాల పరిధిలోని రైతులకు సాగునీరు అందించేందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డితో కలిసి సంయుక్తంగా సాగర్ కుడి, ఎడమ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం ఎల్.ఎల్.సి, ఎంఆర్ కాలువల ద్వారా మంత్రి జగదీష్రెడ్డి నీటిని విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మంత్రి జగదీష్ నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు -
మెడికల్ కాలేజ్ ఏర్పాటు అనుకోని కల!
సాక్షి, సుర్యాపేట: సూర్యాపేట జిల్లా చరిత్రలో నవశకానికి అడుగులు పడబోతున్నాయి. మెడికల్ కళాశాల ఏర్పాటు ఊహకందని కల అని, కళ్ల ఎదుటే సాక్షాత్కరించబోతుందని స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో సూర్యాపేట చరిత్రలోనే నవశకానికి నాంది పడింది అన్నారు. అభివృద్ధిలో జిల్లా ముందు ఉందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్ రావడంతో ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. అంతేకాక కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళి చేసిన సేవలు మరువలేమన్నారు. కళాశాల అభివృద్ధి కి ఉన్న అడ్డంకులను అన్ని అధిగమించి కళాశాల ఏర్పాటు చేసుకొవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన తీర్చడానికి నేను ఉన్నానంటూ విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. సూర్యపేట మెడికల్ కళాశాలో చదువుకున్న విధార్ధులు దేశ వ్యాప్తంగా పేరు తీసుకురావాలని కోరారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రజలకు అంకితం చేస్తుడటంతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి ఆశయం వెరసి ఏర్పడిన మెడికల్ కళాశాలలో శ్రావణ శుక్రవారం తొలిఘడియాలలో మొదటి బ్యాచ్ ప్రారంభం కాబోతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాల పునర్విభజన లో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపిస్తే సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటూ 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు పరచడమే కాకుండా అదనంగా కొత్త జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని పేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలులో సాక్షాత్కరించబోతుంది. సుమారు 500 కోట్ల అంచనా వ్యయంతో పేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినా శాశ్వత భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నఅంశాన్ని గుర్తించిన మంత్రి జగదీష్ రెడ్డి మినరల్ ఫండ్తో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మెడికల్ కళాశాలను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేసిన విషయం విదితమే.ఇచ్చిన హామీని అతి తక్కువ కాలంలో ఆచరణలోకి తేవడమే కాకుండా కళాశాలను ప్రారంభిస్తున్న శుభవేళ సూర్యాపేటలో పండుగ వాతావరణం నెలకొంది. -
పేలుతున్న మాటల తూటాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు, ఇతర నేతలు ఒకటి.. రెండంటూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చివరకు రాజకీయ విమర్శలు కాస్త.. వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ నల్లగొండ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిపై విమర్శల దాడిని మొదలు పెట్టారు. ఈ విమర్శలకు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తొలుత ప్రతి విమర్శకు పోకుండా ఒకింత సంయమనం పాటించారు. కాంగ్రెస్నుంచి వ్యక్తిగత విమర్శల దాడి పెరగడంతో వేమిరెడ్డి కూడా ప్రతివిమర్శలకు తెరలేపారు. మరోవైపు జిల్లా మంత్రి జి.జగదీశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై, ప్రధానంగా అభ్యర్థి ఉత్తమ్ కుమార్రెడ్డిలపై ఘాటైన విమర్శలే చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం మంత్రి జగదీశ్రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. దీం తో ఆయన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, సమావేశాలు, రోడ్షోలలో పాల్గొంటూ.. కాంగ్రెస్పై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ‘వేమిరెడ్డి’పై మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకత్వం మండిపడుతోంది. ‘అభ్యర్థులకు ముఖం చెల్లకే .. కేసీఆర్ను చూ సి ఓట్లేయమని అడుగుతున్నారు. కేసీఆర్ డమ్మీలకు, భూ కబ్జాదారులకు టికెట్లు ఇచ్చి తెలగాణ ప్రజ లను అవమాన పరుస్తున్నారు. రా ష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాల ని టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఇది కేసీ ఆర్ నిరంకుశత్వానికి నిదర్శనం..’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రచారంలో తీవ్రస్థాయిలోనే టీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారు. ఉత్తమ్ చేస్తున్న విమర్శలను అటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తిప్పికొడుతున్నారు. ‘ఉత్తమ్కు ఓటమి భయం పట్టుకుంది. నాపై మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే.. నేను దేనికైనా సిద్ధం.. నిరూపించలేక పోతే ఉత్తమ్ ముక్కు నేలకు రాస్తాడా...’ అని వేమిరెడ్డి సవాల్ చేశారు. మరో వైపు మంత్రి జగదీశ్ రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్ధిపై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. ‘కాంగ్రెస్ నాయకుల మధ్య వారికి వారికే సమన్వయం లేదు. ఉత్తమ్ నాయకత్వంపై ఆ పార్టీ వారికే నమ్మ కం లేదు. అందుకే ఎమ్మెల్యేలు టీఆ ర్ఎస్లో చేరుతున్నారు. ఆయన నా యకత్వంలో గాంధీభవన్కు తాళం పడడం ఖాయం.. ఏప్రిల్ 11తో కాంగ్రెస్ శని విరగడవుతుంది..’ అని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శలు గుప్పించారు. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రక్తి కడుతోంది. ‘ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. మంత్రిగా చేసినప్పుడు హౌసింగ్లో అవినీతికి పాల్పడ్డాడు. అది త్వరలోనే రుజువు అవుతుంది. కారులో నోట్ల కట్టలు తగలబెట్టుకుంది ఆయన కాదా..? నిన్న కూడా ఆయనకు సంబంధించిన డబ్బుల కట్టలు పట్టుబడ్డాయి.’ – వేమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ‘ఉత్తమ్ .. ఉత్తర కుమారుడు. ఎంపీగా గెలుస్తానని నమ్మకం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలంటే పారిపోతుండు. ఉత్తమ్ నాయకత్వంలో గాంధీభవన్కు తాళం పడడం ఖాయం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఆయన తన ఓటమిని ముందే అంగీకరించాడు.’ – జి.జగదీశ్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ‘టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన డమ్మీ అభ్యర్థి. అలాంటి వ్యక్తి పార్లమెంటులో ఎలా మాట్లాడుతారు? రూ.100కోట్లు తీసుకుని టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చింది..’ – ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి -
‘ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే’
నల్గొండ: తెలంగాణాలో ఏ ఎన్నికలు జరిగినా అంతిమ విజయం టీఆర్ఎస్దేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో ఈ నెల 16న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే పార్లమెంటు స్థాయి సన్నాహక సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు గాదరి కిషోర్, భూపాల్ రెడ్డి, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత, ఆయన మార్క్ పాలన దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాక్యానించారు. ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఢిల్లీలో శక్తిగా మారుతుందని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలతో యువతలో పార్టీ క్యాడర్లో జోష్ నెలకొన్నదని చెప్పారు. గులాబీ కార్యకర్తలను సైనికుల్లాగా కేటీఆర్ తయారు చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం గులాబీ పార్టీ గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీ నేతలు టీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ వందేళ్లు నిలిచి, గెలిచేలా సీఎం కేసీఆర్ పునాదులు వేస్తున్నారని పొగిడారు. పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా పని చేస్తున్నారని కొనియాడారు. -
పెద్దగట్టు జాతర ప్రారంభం
సూర్యాపేట: లింగా ఓ లింగా నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని శ్రీ లింగమంతులస్వామి ఆలయం మార్మోగింది. రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతులస్వామి (గొల్లగట్టు) జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో వేడుకలు మొదలయ్యాయి. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో దేవరపెట్టెకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజలు చేసి తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదవులు ఈ పెట్టెను కాలినడక పెద్దగట్టుకు చేర్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి చేరుకున్నారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ అమయ్కుమార్ పాల్గొన్నారు. -
విధేయతకు పట్టం
సీఎం కేసీఆర్ విధేయతకు పట్టం కట్టారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న గుంటకండ్ల జగదీశ్రెడ్డికి మంత్రి పదవి ఖాయం చేశారు. సీఎం నేరుగా జగదీశ్రెడ్డికి ఫోన్ చేసి మంత్రి పదవి ఇస్తున్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం మిగతా మంత్రులతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన రెండో సారి మంత్రి పదవి చేపడుతున్నారు. సాక్షిప్రతినిధి, సూర్యాపేట: టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా జగదీశ్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసిన తర్వాత అధికారుల నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి జగదీశ్రెడ్డి 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఆయన ఒక్కడికే మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో పార్టీతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనదే పై చేయి అయింది. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా ఉమ్మడి జిల్లా నుంచి జగదీశ్రెడ్డికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారు. సీఎం జిల్లాకు ఎప్పుడు వచ్చినా జగదీశ్రెడ్డి ముందుండి కార్యక్రమాలు నడిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మది స్థానాల్లో ఆపార్టీ విజయఢంకా మోగించడం, సూర్యాపేట నుంచి జగదీశ్రెడ్డి విజయంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. నేతలు, పార్టీ శ్రేణుల ప్రచారాన్ని వాస్తవం చేస్తూ సీఎం మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అనుచరగణం ఆనందంలో మునిగింది. ఉద్యమం నుంచి గులాబీ బాస్ వెన్నంటే.. ఉద్యమం నుంచి జగదీశ్రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్కు వెన్నంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ్యుల్లో ఒకడిగా ఉండడంతో తొలి నుంచి కేసీఆర్ ఆయనకు గుర్తింపునిచ్చారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఆయన ఇన్చార్జిగా వ్యవహరించారు. తొలి సారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పని చేశారు. విద్యుత్ శాఖ ఆయనకు అప్పగించిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందించింది. అంతేకాకుండా దామరచర్ల, పాల్వంచ, మణుగూరులో నూతనంగా విద్యుత్ ప్లాంట్లు మంజూరయ్యాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంతో ప్రభుత్వం సాధించిన ఘనతలో జగదీశ్రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు అందాయి. ఇలా అన్నింటా కేసీఆర్కు అనుంగు నేతగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కింది. ప్రమాణస్వీకారానికి తరలుతున్న నేతలు.. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో జరగనుంది. అయితే జగదీశ్రెడ్డికి సీఎం నుంచి మంత్రి పదవిపై ఫోన్ రావడంతో జిల్లాలోని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ఆయన వెంటే ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయనను అభినందించడానికి జిల్లా నుంచి తరలివెళ్తున్నారు. జగదీశ్రెడ్డి బయోడేటా పేరు : గుంటకండ్ల జగదీశ్రెడ్డి తండ్రి : చంద్రారెడ్డి తల్లి : సావిత్రమ్మ భార్య : సునీత కుమారుడు : వేమన్రెడ్డి కూతురు : లహరి పుట్టినతేదీ : 18.07.1965 స్వగ్రామం : నాగారం (నాగారం మండలం) విద్యార్హత : బీఏ, బీఎల్ 27.04.2001 టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యులు 2001 సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి, సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి 2002 మహబూబ్నగర్ పాదయాత్ర ఇన్చార్జి (జల సాధన 45 రోజుల కార్యక్రమం. పాదయాత్ర ఆలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు..) 2003 మెదక్ ఉప ఎన్నికల ఇన్చార్జి 2004 సిద్దిపేట ఉప ఎన్నికల ఇన్చార్జి (హరీష్రావు ఎన్నిక) 2005 సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి 2006 కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల ఇన్చార్జి 2008 ముషీరాబాద్, ఆలేరు ఉప ఎన్నికల ఇన్చార్జి, మెదక్ జిల్లా ఇన్చార్జి 2009లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ 2013లో నల్లగొండ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి 2014లో సూర్యాపేట నుంచి పోటీ .. విజయం తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రి ఆతర్వాత విద్యుత్శాఖ , ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి 2108 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు.. సూర్యాపేట నుంచి విజయం -
అయోమయంలో ప్రతిపక్షాలు
ఆత్మకూర్ –ఎస్ (సూర్యాపేట) : టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని.. వారికి ఏం హామీలు ఇవ్వాలో తెలియక ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయని మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మండల పరిధిలోని పాతర్లపహాడ్ ఎక్స్రోడ్డు వద్ద దాదాపు 70 హోలియ దాసరి కుటుంబాలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధిని చూసి వివిధ వర్గాలు టీఆర్ఎస్లో చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్నాయకులు ఇచ్చే హామీలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కాకి కృపాకర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బెల్లంకొండ యాదగిరి, మర్ల చంద్రారెడ్డి, ఆరెంపుల దానియేల్, గోపగాని సత్యం, తూడి నర్సింహారావు, కసగాని బ్రహ్మం, లింగయ్య, ముత్తయ్య, వెంకటయ్య, వీరయ్య, దానబోయిన సాయిల్, రావుల శ్రీనివాస్, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
గుంటకండ్ల జగదీష్ రెడ్డి - లీడర్
-
కేసీఆర్ సభతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ
నల్లగొండ రూరల్ : కేసీఆర్ సభతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆపద్ధర్మ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు . మంగళవారం మర్రిగూడ బైపాస్లోని సీఎం సభాస్థలి ఏర్పాట్లను మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీప నియోజక వర్గాలనుంచి 50 వేల మందిని తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సభకు ఉమ్మడి జిల్లా నుంచి 4 లక్షల మంది తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం సభతో జిల్లాలో 12 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామన్నారు. సీఎం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సభలో సీఎం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్లో చేయబోయే అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తారన్నారు. కాంగ్రెస్లో రౌడీ , గుండా నాయకులు ఉన్నారని ప్రజలను గౌరవిం చి మాట్లాడే విధానం వారికి తెలియదని ఆయన విమర్శించారు. హెలీపాడ్ ట్రయల్ రన్.. నల్లగొండలో జరిగే సీఎం సభకు హెలిపాడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 4న సీఎం నల్లగొండలో నిర్వహిస్తున్న ఆశీర్వాద సభకు వస్తుండడంతో హెలిప్యాడ్ను ట్రయల్ రన్ను ప్రత్యేక అధికారులు పరిశీలించారు. టీఆర్ఎస్లో పలువురి చేరిక కనగల్ : మండలంలోని లింగాలగూడెం గ్రామపంచాయతీకి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లా కేం ద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ లో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో టీ æఆర్ఎస్ వందకుపైగా ఎమ్మెల్యే స్థానాలను గెల ు స్తుందన్నారు.ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓర్సు మారయ్య, సైదులు, నాగయ్య, మైసయ్య, వెం కన్న, పరశురాం, రాజు, లింగయ్య, వెంటయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మేమేంటో.. సభే చెబుతుంది
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ‘ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని.. చెప్పేలా ఈ నెల 4న నల్లగొండ జిల్లాకేంద్రంలో సభ నిర్వహిస్తున్నాం.. గతంలో ఏ పార్టీ చేయనట్లుగా ఈ సభ అద్భుతంగా ఉండబోతోంది. ప్రజలు ద్విచక్ర వాహనాలు, పాదయాత్రలతో స్వచ్ఛందంగా.. ఉత్సాహంగా సభకు తరలేందుకు సన్నద్ధమవుతున్నారు. మూడున్నర లక్షల మంది ఈ సభకు హాజరుకాబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో ఏం చెబుతారో వినేందుకు ప్రజలు తరలుతున్నారు. మాయకూటమికి ఉమ్మడి జిల్లాలో ఓటు అడిగేందుకు.. ఒక్క అంశంపైనా అర్హత లేదు. ఉమ్మడి జిల్లాలో మేమేంటో సభే చెబుతుంది’ అని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండలో నిర్వహించబోతున్న ఆ పార్టీ సభ, అభ్యర్థుల విజయావకాశాలు, ఉమ్మడి జిల్లాకు చేసిన అభివృద్ధిపై సోమవారం ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే.. టీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉంది.. రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉంది. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అక్షరాన్ని అమలుచేశాం. ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఉమ్మడి జిల్లాలో ప్రతి కేటగిరీ లబ్ధి పొందింది. టీఆర్ఎస్ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం.. రైతులకు రైతుబంధు, ప్రమాదబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్ ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచాం. గ్రామీణవృత్తులకు జీవం పోసింది.. ఈ ప్రభుత్వమే. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలకాపరులకు గొర్రెలు, మత్స్య కార్మికుల కోసం చేపల పంపిణీ చేపట్టి వారి ఆదాయాన్ని పెంచాం. ఇలా వంద కారణాలు ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేయడానికి ఉన్నాయి. మాయకూటమిలోని పార్టీల పాలనలో భూములకు నీళ్లందాయా.. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల కాలంలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లందలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగర్లో డెడ్స్టోరేజీ నీళ్లు ఉన్నా.. సాగుకు నీళ్లిచ్చాం. రాజవరం, ముదిమాణిక్యం, జానపహాడ్ లాంటి టెయిలాండ్ భూములకు ఇప్పుడు నీళ్లందాయి. జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలు ఏనాడైనా సాగునీళ్ల కోసం తమ ప్రభుత్వాల్లో ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తే తమ మంత్రి పదవులు ఎక్కడ ఊడిపోతాయోనని మిన్నకుండా ఉన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి రావాల్సిన కరెంటు, నీళ్లను ఇవ్వొద్దంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశాడు. ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో సాగర్, శ్రీశైలం నీటి విడుదలపై పేచీ పెట్టింది టీడీపీ కాదా. 12 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం.. జిల్లాలో 12 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయబోతుంది. నాలుగైదుసార్లు మంత్రులుగా పనిచేసిన వారి ఇలాఖాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడబోతోంది. ఉమ్మడి జిల్లాలో పాలమూరు, డిండి, శివన్నగూడెం, ఎస్సారెస్పీ జలాలు, నల్లగొండ, సూర్యాపేటకు మెడికల్ కళాశాలలు, ఏయిమ్స్, యాదాద్రి పవర్ప్లాంటు, యాదాద్రి దేవాలయం ఇలా అభివృద్ధి ఆకాశాన్ని తగిలింది. ప్రజలు ఈ అభివృద్ధిని చూసే 12 స్థానాల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టబోతున్నారు. ఫ్లోరోసిస్ భూతాన్ని ఉమ్మడిజిల్లాలో తరిమికొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. రక్షిత మంచినీటిని అందించేందుకు పెట్టిన మిషన్భగీరథ పథకం సక్సెస్ అవుతోంది. మరోవైపు 28 ఏళ్లలో ఏనాడు నాటి పాలకులు మూసీ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీటిని అందించలేదు. కాకతీయులు, అసఫ్జాహీలా కాలంలో తవ్విన కాలువలు ధ్వంసమైతే తమ ప్రభుత్వమే ఆధునికీకరించింది. తొలిసారి ఖరీఫ్, రబీ పంటలకు వరుసగా.. నీళ్లు ఇచ్చింది తమ ప్రభుత్వమే. అసమ్మతులు సమసిపోతున్నాయ్.. ప్రజాభిమానం ఉన్న పార్టీలో టిక్కెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా పోటీ పడడం అన్నది సహజం. జిల్లాలో అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో అసమ్మతులు సమసిపోతున్నాయ్. అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అందరం కలిసి కృషి చేస్తున్నాం. ఈనెల 4న జరిగే సభతో మా సత్తా ఏంటో ఉమ్మడి జిల్లాలో తేలిపోతుంది. జిల్లాలో మాకేదో ఉందని.. బీరాలు పలుకుతున్న నేతల కళ్లు సభను చూసి బైర్లు కమ్ముతాయి. 59 మండలాలకు వెళ్లా.. ఉమ్మడి జిల్లాలో 59 మండలాల్లో 400 గ్రామాలకు వెళ్లా. ఈ గ్రామాల్లో శంకుస్థాపనలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశా. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏ మంత్రి కూడా అన్ని మండలాలకు వెళ్లి ఇన్ని గ్రామాలను సందర్శిం చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి మంత్రివర్గానికి చేసిన సూచనలతో ప్రజల వద్దకు పాలన అంటూ గ్రామాలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో గడిపాం. వాళ్లకు ఏం కావాలో ఇచ్చాం. వాళ్లడగనివి సైతం అమలుచేశాం. ఇదే మా గెలుపునకు గీటురాయి. -
ఆ మంత్రికి టికెట్ రాదు.. వస్తే డిపాజిట్ రాదు..!
సాక్షి, నల్గొండ : ‘నాకు మంత్రి పదవి వద్దు.. ముఖ్యమంత్రి పదవి వద్దు.. కేసీఆర్ను గద్దె దింపడమే ధ్యేయంగా పనిచేస్తానని’ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుగురి చేతిలో నలిగిపోతుందని కోమటిరెడ్డి అన్నారు. అంతేకాక వారి చేతిలో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు నల్గొండలో పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విదేశాల నుంచి విమానాలలో మిషనరీ తెస్తున్నారు.. కానీ నల్గొండలోని ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డిపై కోమటిరెడ్డి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డికి టికెట్ రాదని.. ఒకవేళ టికెట్ వచ్చినా డిపాజిట్ కూడా దక్కదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ సీట్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకురాలు సోనియాగాంధీకి అంకితం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎలాగైనా తనను తప్పించి, శాసనసభ్యత్వం రద్దు చేసి, గన్మెన్లను తీసేశారని గుర్తుచేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని బయటికి తీస్తామని ఆయన ధ్వజమెత్తారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని, కొత్త ప్రాజెక్టులు కడితే కమిషన్లు వస్తాయని, పాత ప్రాజెక్టులు పూర్తి చేయడంలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారు.. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కాకలు తీరిన కార్యకర్తలు.. ఉద్దండులైన నాయకులందరూ నల్గొండలో ఉన్నారన్నారు. జిల్లా ప్రజలు అవసరం వచ్చినప్పుడు తమ శక్తిని చూపెడతారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారని జానారెడ్డి గుర్తు చేశారు. జిల్లాకు వీర చరిత్ర ఉంది.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కానుకగా అన్ని స్థానాలు గెలిపించి ఇవ్వాలని జానారెడ్డి కోరారు. ఈ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ పద్మావతి, దామోదర్ రెడ్డి, మల్లు రవి, బూడిద బిక్షమయ్య గౌడ్, భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి విచ్చేసిన వారికి బాణసంచా కాల్చి కోమటిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. -
విద్యుత్ సరఫరాలో నంబర్వన్
చివ్వెంల(సూర్యాపేట) : 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంలో దేశంలోనే తొలిరాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో నిర్వహించిన రైతుబంధు కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 60 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వం సాధించని ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని పేర్కొన్నారు. రైతుల అభివృద్ది కోసం, రైతులను రారాజులుగా చూడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రైతురుణమాఫీ పథకం ప్రవేశ పెట్టిన రైతులు రుణ గ్రహితలు కాకూడదని, దాని కోసం పంట పెట్టుబడి పథకం ప్రవేశపెట్టాలనే నిర్ణయంతో ఎకరాకు రూ.4వేలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నాటి ప్రభుత్వంలో రైతు ప్రతి దానికి అప్పులు చేసేవారని అటువంటి సమస్య ఇకా ఉండబోదన్నారు. వచ్చే సంంవత్సరం నాటికి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు పూర్తి అయి కోటి ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఆంధ్రాకు పెట్టుబడి పెడుతుంటే మాట్లాడని ఉత్తమ్, జానారెడ్డిలు ఓట్ల కోసం ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్ల కోసం వస్తే వాళ్లకు వాతలు పెట్టడానికి గ్రామాల్లో రైతులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సూర్యాపేటలో గత 20 సంవత్సరాలుగా ఉన్న రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు తనను ఎన్నుకున్నారన్నారు. ఇప్పటికే నియోజక వర్గంలో ప్రతి గ్రామానికి రూ.కోటి వ్యయంతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈసందర్భంగా పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. అంతకు ముందు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్దే ధ్యేయంగా పాలన చేస్తుందని, అది చూసి ఓర్వలేకనే ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఈసందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 200 మంది పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ మోహన్రావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ భాషా, మారినేని సుధీర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ శాఖ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, నాయకులు సుంకరబోయిన శ్రీనివాస్ యాదవ్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, చందుపట్ల పదయ్య, కొణతం అప్పిరెడ్డి. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ భుక్యా వెంకటేశ్వర్లు, ఎఓ ఆశాకుమారి, సర్పంచ్ రతీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సాహసానికి ప్రతీక..‘మిషన్’భగీరథ
సూర్యాపేటరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసానికి మిషన్ భగీరథ ప్రతీక అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖా మాత్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామం వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను కలెక్టర్ కే.సురేంద్రమోహన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5 నాటికి ట్రయల్రన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు , కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంచినీటి కోసం తెలంగాణ ఆడపడుచులు రోడ్డు ఎక్కొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. పథకంగడువు 2018 చివరి వరకు ఉన్నప్పటికీ అనుకున్న దానికి ముందే పనులు శర వేగంగా పూర్తవుతున్నాయన్నారు. ఒక పక్క అధికారులు , మరో పక్కన ప్రజాప్రతినిధులు రేయింబవళ్లు ఏజెన్సీల వెంట పడడంతో పాటు వేసవిలో ప్రజలకు దా హార్తి సమస్య తలెత్తకుండా ఉండేందు కు పడ్డ శ్రమకు తగ్గ ఫలితాలు త్వరలోనే అందబోతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే మే 5న సూర్యాపేటకు నాగా ర్జున్సాగర్ టెయిల్పాండ్ నుంచి అందించనున్న మంచినీటిని సూర్యాపేట సమీ పంలోని ఇమాంపేట నీటిశద్ధి కేం ద్రం వద్ద ట్రయల్రన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా పైప్లైన్ వద్ద ఎన్ని గ్యాప్లు ఉన్నాయో పరిశీలించి ప్రతి గ్యాప్ వద్ద కచ్చితంగా ఒక టీమ్ను ఏర్పాటు చేసే పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ఆదేశిం చారు. అనంతరం ఉర్లుగొండ గుట్టపై నిర్మిస్తున్న వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్యాంక్ను పరిశీలించారు. పర్యటనలో మిషన్ భగీరథ సూపరింటెండెంట్ మధుబాబు, ఈఈ వెంకటేశ్వర్లు, మోహన్రెడ్డి, గ్రం థాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనువాస్ గౌడ్, డీఈ నరేష్ పాల్గొన్నారు. -
‘ఆయనకు అవార్డు వస్తే మీకెందుకు మంట’
సాక్షి, హైదరాబాద్ : కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నిన పార్టీగా త్వరలోనే కాంగ్రెస్కు అవార్డు దక్కుతుందని, అయినా కేసీఆర్కు అవార్డు వస్తే ఎందుకంత కడుపు మంట అని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. పోరాడటానికి ప్రజా సమస్యలేవీ లేక కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. వారం రోజులుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి సీఎం కేసీఆర్కు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంపై చేస్తున్న విమర్శలు హుందాగా లేవన్నారు. అరవై ఏళ్లుగా రైతులపై మొసలి కన్నీళ్లు కార్చడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని, గతంలో ఇలాంటి అవార్డు ఆ పార్టీ సీఎంలకు ఎవరికైనా వచ్చిందా అని నిలదీశారు. అవార్డులు భవిష్యత్లో కూడా రావని, ఆ పార్టీ అదృశ్యం కావడం ఖాయమన్నారు. ఈ అవార్డుతోనే తాము తృప్తి చెందడం లేదని, త్వరలో ప్రజలే అవార్డు ఇవ్వబోతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత మాట్లాడేందుకు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కు ఉండరని జోస్యం చెప్పారు. ఎన్ని వందల కేసులు వేసినా కేసీఆర్ సంకల్పాన్ని దెబ్బతీయ లేరని, ఉత్తమ్ వంటి నేతలకు బియ్యం ఎలా వస్తాయో తెలుసా అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోయేంత తెలివితక్కువ వాళ్ళు ఎవరూ లేరని, కాంగ్రెస్లోకి వలసలుంటాయని చెబుతున్నాయన ఆ పార్టీలో ఉంటారా అని వ్యాఖ్యానించారు. రైతు సమన్వయ సమితిలపై అఖిల పక్షం పెట్టాల్సిన అవసరం లేదని, వ్యవసాయంపై ప్రతిపక్షాలకు అవగాహన ఉంటే కదా వారి సలహాలు తీసుకునేది అని అన్నారు. -
విడతలవారీ కరెంటే నయం!
►నిరంతర విద్యుత్ వల్ల బావుల్లో నీరు అడుగంటుతోంది: తుమ్మల ► విడతలవారీగా అంటే సీఎం కేసీఆర్ ఒప్పుకోరు: మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘తొమ్మిది గంటలు నిరంత రాయంగా కరెంటు ఇవ్వ డం వల్ల మా ప్రాంతంలో మెట్ట పంటలకు నష్టం జరుగుతోంది. అవసరానికి మించి నీళ్లు ఇవ్వడం వల్ల పామాయిల్ తోటల దిగు బడి కూడా తగ్గుతోంది. అందుకే మా ప్రాంత రైతుల కోరిక మేరకు తొమ్మిది గంటలు కాకుండా రెండు, మూడు విడతల్లో కరెంటు ఇవ్వాలని కోరుతున్నా..’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పందిస్తూ సీఎం ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రైతులు గట్టిగా డిమాండ్ చేస్తే.. ఒకే ఫీడర్ కింద ఉన్న రెండు, మూడు గ్రామాల రైతులు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ఇస్తే విడతలవారీగా సరఫరాకు ఆలోచన చేస్తాం’ అని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలోని మంత్రి ఈటల రాజేందర్ చాంబర్లో ఈ ఇద్దరు మంత్రుల మధ్య విద్యుత్ సరఫరాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ మంత్రులు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల మోటార్లు పూర్తిగా ఆన్లోనే ఉంటున్నాయని, దీంతో అవసరానికి మించి నీటిని తోడేస్తున్నాయని, ఫలితంగా భూగర్భ జలమట్టం పడిపోతోందని తుమ్మల అన్నారు. తెలంగాణలోని చాలాప్రాంతాల్లో నిరంతర కరెంటు వల్ల బావుల్లో నీరు అడుగంటిపోతోందని, తిరిగి ఊరడానికి సమయం పడుతోందని, విడతల వారీగా కరెంటు ఇస్తే రైతు లకు వెసులుబాటు ఉంటుందని తుమ్మల నాగేశ్వర్రావు విశ్లేషించారు. విడతలవారీగా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, అయినా, రైతులు చెబుతున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతామని జగదీశ్రెడ్డి అన్నారు. కరెంటు కోత పెట్టాల్సిన పరిస్థితులు తెలంగాణలో లేవని చెప్పారు. 2004 మార్చి నాటికి ఇప్పటికీ కరెంటు డిమాండ్ పెరిగినా, ఎలాంటి సమస్య తలెత్తలేదని, ఇక, ఇప్పుడు ఏపీ కరెంటు కూడా అవసరం లేదని, ఇతర ప్రాంతాల కంటే ఏపీ కరెంటు ధర ఎక్కువని అన్నారు. ఇప్పటికీ పది గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వగలు గుతామని, వచ్చే ఏడాదయితే ఇరవై నాలుగు గంటలూ పవర్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పెద్దగట్టు అభివృద్ధికి కృషి
సూర్యాపేటరూరల్ : దురాజ్పల్లిలోని పెద్దగట్టు జాతరకు రూ.1.7 కోట్లు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంపీడీఓ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం లింగమంతుల జాతర సందర్భంగా యాదవులకు సంప్రదాయ దుస్తులు, భేరీలను పంపిణీ చేసి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు తెలంగాణ సంస్కృతిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పెద్దగట్టు జాతరకు అధికారులు పంపిన నివేదిక కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జాతరలో యాదవులు భేరి ధరించి నృత్యం చేస్తుంటే ఆ ఊపు ఏమిటో తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసన్నారు. గట్టుపైన భక్తులకు ఇబ్బంది లేకుండా విశ్రాంతి భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే అన్నీ ఇస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు ఈ సంవత్సరం 20 లక్షల గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం గ్రామానికి 15 మంది యాదవులను ఎంపిక చేసి మొత్తం 50 యూనిట్ల భేరీలు, సంప్రదాయ దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ యాదవులకు రూ.10 లక్షల వ్యయంతో సంప్రదాయ దుస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెద్దగట్టుపై కోనేరును ఆధునికీకరించినట్లు పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం సూర్యాపేట మండలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ స్థానిక ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు సూర్యాపేట పట్టణంలోని గొల్లబజారులో మకరతోరణం తరలింపు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ ధరావత్ శకుంతల, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లిక, వైస్ చైర్మన్ నేరేళ్ల లక్ష్మి, ఆర్డీఓ మోహన్రావు, పెద్దగట్టు చైర్మన్ సుంకరబోయిన శ్రీనివాస్యాదవ్, గొర్రెల కాపరుల సహకార యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన నర్సయ్యయాదవ్, బడుగు లింగయ్యయాదవ్, సూర్యాపేట ఎంపీడీఓ నాగిరెడ్డి, తహసీల్దార్ మహమూద్అలీ, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, ముదిరెడ్డి అశోక్రెడ్డి, చల్లా సురేందర్రెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, వెన్న చంద్రారెడ్డి, గొర్ల గన్నారెడ్డి, బుడిగె నవీన్గౌడ్, సంకరమద్ది రమణారెడ్డి, మాద కృష్ణ, మచ్చ మల్సూర్, పాముల హనుమంతు పాల్గొన్నారు. -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
సూర్యాపేట : ప్రస్తుత సమాజంలో మహిళల పాత్రే కీలకమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పబ్లిక్క్లబ్లో భానుపురి మహిళా సమాఖ్య ప్రథమ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళల పేరున అమలు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేది మహిళలేనని.. సమాజం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి ఉంటుందన్నారు. కుటుంబం మహిళల చైతన్యంపై మనుగడ సాధిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు నడుం బిగించి రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు. కుటుంబ వార్షిక ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని 799 మహిళ స్వయం సహాయ సంఘాలకు రూ. 25 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ సామాజిక మార్పు, ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలోని 584 గ్రామ సంఘాలు, 18148 స్వయం సహాయక సంఘాల్లోని 2 లక్షల మంది సభ్యులకు మార్గనిర్దేశం చేసేందుకు భానుపురి జిల్లా సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2016-17లో అర్హత కలిగిన 13,286 సంఘాలకు రూ. 215 కోట్ల లింకేజీని ఇవ్వాలని లక్ష్యం నిర్ణయిస్తే ఇప్పటివరకు 3723 సంఘాలకు రూ.119 కోట్ల 17 లక్షల లింకేజీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే స్త్రీనిధి ద్వారా 6075 సంఘాలకు రూ.68 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు చెప్పారు. ఈ ఖరీఫ్ రూ. 5 కోట్ల విలువైన ధాన్యాన్ని మహిళ సంఘాల ద్వారా ఇప్పటి వరకు కొనుగోలు చేయించినట్లు పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాలు నిజాయితీగా ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జె.పరిమళహననూతన్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నీలిమ, ఉపాధ్యక్షురాలు నాగేంద్ర, కోశాధికారి లక్ష్మమ్మ, డీఆర్డీఓ సుందరి కిరణ్కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం, ఈఎస్ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ సోహెల్, వ్యవసాయ శాఖ అధికారిని జ్యోతిర్మయి, కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు. -
రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం
సూర్యాపేట : వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. రెండళ్ల పాలనలోనే చేసి చూపించామని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని మైనార్టీ గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం వస్తే ఏం వస్తుందని ఎద్దేవా చేసిన వారున్నారని.. కానీ రాష్ర్టం వస్తే బంగారు తెలంగాణఅవుతుందని అప్పుడే కేసీఆర్ చెప్పారన్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకునేలా పాలన సాగిస్తున్నారన్నారు. ఊహించిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పా రు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. మోదీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురిం చి మాట్లాడుతున్నారని తెలిపారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించామని పేర్కొన్నారు. విద్య ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే కేసీఆర్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావ్, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆర్డీఓ కిషన్రావు, ఈడీ ఎండీ సలీంపాషా, ఓఎస్డీ సిరాజుల్లాఖాన్, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, తహసీల్దార్ మహమూద్అలీ, కమిషనర్ వడ్డె సురేందర్, నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, గండూరి ప్ర కాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, కెక్కిరేణి నాగయ్యగౌడ్, షేక్ తాహేర్పాషా, ప్రిన్సిపాల్ షేక్ జానిమియా, పి.స్వరూపారాణి, కరుణాకర్, మండాది గోవర్ధన్గౌడ్, మీర్ అక్బర్ పాల్గొన్నారు. -
కాలిఫోర్నియా క్యాబేజీ కథేంటి?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇంత పెద్ద గొర్రుతో ఏం చేస్తారు.. ఈ గొర్రు నిండా పైపులు అమర్చారెందుకు.. వర్షాలు తక్కువగా పడితే సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు... అసలు కాలిఫోర్నియా క్యాబేజీ కథేంటి.. ఈ ప్రశ్నలన్నీ ఏంటనుకుంటున్నారా..? అమెరికా పర్యటనలో ఉన్న జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డికి వచ్చిన సందేహాలివి. తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు రోజుల ముందే అమెరికా వెళ్లిన జగదీశ్రెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ సాగు చేస్తున్న క్యాబేజీ తోటల్లోకి వెళ్లి పంటల సాగు గురించి తెలుసుకున్నారు. బహుళ ప్రయోజనంతో రూపొందించిన గొర్రు ఎలా పనిచేస్తుందనే దాని గురించి కూడా ఆయన ఆసక్తిగా ఆరా తీశారు. ఏ పైపు నుంచి విత్తనాలు వేస్తారు.. ఏ పైపు నుంచి యూరియా చల్లుతారు.. ఏ పైపు నుంచి మందు పిచికారీ అవుతుంది.. భూమి లోపల యూరియా పడుతుందా.. చెట్టు మీద పడుతుందా.. మందు పిచికారీ ఎక్కడ జరుపుతారు.. అనే అంశాలపై అక్కడి శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రస్తుతం మనకు కరువు పరిస్థితులున్న నేపథ్యంలో అసలు వర్షాభావ పరిస్థితులున్నప్పుడు అమెరికాలో వ్యవసాయం ఏ విధంగా చేస్తారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు... తక్కువ నీటిని వినియోగించుకుని ఏయే పంటలను సాగు చేస్తారన్న దాని గురించి ఆరా తీశారు. తన అమెరికా పర్యటనలో శుక్రవారమంతా వ్యవసాయ పరిస్థితులను అధ్యయనానికే గడి పిన మంత్రి జగదీశ్రెడ్డి అమెరికా నుంచి ‘సాక్షి’ తో ఫోన్లో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వచ్చేలా అమెరికాలో వ్యవసాయం చేస్తున్నారని, ఇక్కడి రైతులు అవలంబిస్తున్న పద్ధతులు మన దగ్గర పాటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్న బంగారు తెలంగాణ సులభతరమవుతుందని వ్యాఖ్యానించారు. అమెరికాలో వ్యవసాయ పద్ధతులను మన రాష్ట్రంలోనికి కూడా తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. మంత్రి వెంట జిల్లాకు చెందిన నంద్యాల దయాకర్రెడ్డి, అమెరికా తెలంగాణ తెలుగు సంఘం ప్రతినిధి ఏనుగు శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాంస్కృతిక పండుగ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లిన మంత్రి జగదీశ్రెడ్డి అక్కడ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు గాను ఎన్ఆర్ఐలు ఇతోధికంగా కృషి చేయాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నేతలు పూర్ణచందర్, నవీన్ జలగం, రంగినేని అభిలాష్, పొన్నాల శ్రీని, రజనీకాంత్, భాస్కర్, యశ్వంత్లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘పేట’లో సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం
సూర్యాపేట : ఖమ్మంలో బుధవారం నిర్వహించనున్న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు మంగళవారం సూర్యాపేటలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సుమారు గంట సేపు జాతీయ రహదారిపై వందలాది మంది నాయకులు, కార్యకర్తలు వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి కొత్త బస్టాండ్ వద్దకు చేరుకొని తన కాన్వాయ్ నుంచే పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. స్వాగతం పలికిన వారిలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పార్టీ అధ్యక్షులు బండా నరేందర్రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, తహ సీల్దార్ మహమూద్అలీ, సూర్యాపేట, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్లు గండూరి ప్రవళిక, వంటిపులి అనిత, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సోమా భరత్కుమార్, నంద్యాల దయాకర్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాశ్, వైవీ, గోదల రంగారెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, గుడిపూడి వెంకటేశ్వరరావు, ఉప్పల ఆనంద్, కెక్కిరేణి నాగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్ పర్యవేక్షణలో పట్టణ సీఐ వై.మొగలయ్య ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
జయశంకర్ స్ఫూర్తితో ముందుకెళ్తాం
సూర్యాపేట ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయశంకర్కు జిల్లాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్కు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఉద్యమాన్ని నడిపించడంలో ముందున్నారన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం దురదృష్ణకరమన్నారు. కృష్ణా నీళ్లు జిల్లాకు రాకుండా ఆంధ్రాకు పోతున్నాయని, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి జయశంకర్ అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణలో పాలుపంచుకోవాలన్నారు. ఏ చర్చ జరిగినా సార్ను గుర్తు చేసుకోకుండా సీఎం కేసీఆర్ ఏ పని చేయరన్నారు. తెలంగాణ మహోపాధ్యాయుడు, నిరంతరం తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్కూరి గన్నారెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గండూరి ప్రకాష్, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ వట్టె జానయ్య యాదవ్, గుడిపూడి వెంకటేశ్వర్రావు, కాకి దయాకర్రెడ్డి, వుప్పల ఆనంద్, శనగాని రాంబాబుగౌడ్, బూర బాలసైదులుగౌడ్, కుంభం నాగరాజు, పోలెబోయిన నర్సయ్య యాదవ్, కౌన్సిలర్లు ఆకుల లవకుశ, గండూరి పావని, కల్లెపల్లి మహేశ్వరి దశరథ, వనజ, కృపాకర్, బొమ్మగాని శ్రీనివాస్గౌడ్, రమాకిరణ్, అనిల్రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పుట్టిన రోజు.. ‘పుష్కర సేవ’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ పన్నెండేళ్లకోసారి పుష్కరాలు... ఎప్పుడు వస్తాయో.. ఏ ముహూర్తంలో వస్తాయో కూడా తెలియదు.. అలాంటి పుష్కరాలు పుట్టినరోజు కలిసివచ్చేలా వస్తే... ఆ రోజు అధికారికంగా మంత్రి హోదాలో పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే అవకాశం వస్తే... అంతకు మించిన సేవ ఏముంటుంది? పుష్కర స్నానం చేయడం ఎంత పుణ్యమో.. అంతకుమించి పుష్కరాలకు వచ్చే భక్తులకు అధికారికంగా సేవ చేయడం అంతే పుణ్యం కదా.. అలాంటి అవకాశమే వచ్చింది మన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాలలో అద్భుత సేవ చేసే అవకాశం మంత్రి హోదాలో లభించింది ఆయనకు. తన 51వ పుట్టిన రోజు అయిన శనివారం మంత్రి జగదీశ్రెడ్డి భద్రాచలంలోనే గడిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వెళ్లిన ఆయన శనివారం తెల్లవారుజామునుంచే పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణలో బిజీబిజీగా గడిపారు. ముఖ్యంగా భద్రాచలం సమీపంలో ట్రాఫిక్ జామ్ కాకుండా నివారించేందుకు గాను అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగంతో కలిసి ఆయన సమీక్షించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోడుగా ఆయన శనివారం పూర్తిగా పుష్కర సేవలోనే నిమగ్నమయ్యారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లోనే ఆయన దాదాపు 2 గంటలకు పైగా ఉన్నారు. ఘాట్లో స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా దేవాదాయ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో కూడా ఆయన భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. శనివారం ఒక్కరోజే భద్రాచలానికి దాదాపు 5.5లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానం చేసేందుకు రాగా, ఆదివారం కూడా అదే తరహాలో వస్తారన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం కూడా మంత్రి జగదీశ్ భద్రాచలంలోనే ఉంటారని సమాచారం. ఈ విషయమై మంత్రి జగదీశ్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం కోసం భద్రాచలం వచ్చానని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
మానవ మనుగడకు చెట్లే ఆధారం
నూతనకల్ మానవ మనుగడకు చెట్లే ఆధారమని.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్, గుండ్లసింగారంలోని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో హరితహారం కింద మొక్కలు నాటారు. అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదెరి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. చెట్లను నరకడం వలన ఏడారిగా మారి ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణ కాలుష్యం పెరగడంతో వర్షాలు కురవడం లేదన్నారు. కేవలం లెక్కల కోసం రికార్డుల్లో మొక్కలు పెంచడం కాదని క్షేత్రస్థాయిలో నాటిన మొక్కలను బతికించాల్సిన బాధ్యత అధికారులది, వనసంరక్షణ కమిటీ సభ్యులదేనన్నారు. అడవుల నరికివేతతోనే వర్షాలు కురవడం లేదు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ అడవులను విచ్చలవిడిగా నరకడం వల్ల వర్షాలు సక్రమంగా కురవడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలన్నారు. మంత్రి స్వయంగా వాటర్ ట్యాంకర్ గల ట్రాక్టర్ను నడుపుతుండగా అధికారులు మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ మం త్రికి జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ దామోదర్రెడ్డి, సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కాసోజు సుమలత, జెడ్పీటీసీ గుగులోతు నర్సింగ్నాయక్, వైస్ ఎంపీపీ తొనుకునూరి లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్ఏ రజాక్, తహసీల్దార్ డి. దశరథ, ఎంపీడీఓ ఎండీ ఫసియోద్దిన్, ఈఓపీఆర్డీ సాంబిరెడ్డి సర్పంచ్లు ఏనిగతల సోమయ్య, బూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఎలిమినేటి రమాదేవి పాల్గొన్నారు. ‘నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి’ సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలు, అధికారులపై ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల స్టేడియంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు. చెట్లతోనే మావనవాళికి మనుగడ సాధ్యమని, బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, కమిషనర్ వడ్డె సురేందర్, తహసీల్దార్ మహమూద్ అలీ, ఎంపీడీఓ నాగిరెడ్డి, నాయకులు తేరా చిన్నపరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, గండూరి ప్రకాష్, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్, గుడిపూడి వెంకటేశ్వర్రావు, వుప్పల ఆనంద్, శనగాని రాంబాబు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
జిల్లాను హరితవనంగా మార్చాలి
బొల్లేపల్లి(భువనగిరి అర్బన్) హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాను హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని విద్యుత్శాఖ మంత్రి గుంతగండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని బొల్లేపల్లి గ్రా మంలో గల ప్రథమిక ఆరోగ్య కేం ద్రంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవరకొండ, మునుగోడు, భు వనగిరి, ఆలేరు ప్రాంతాల్లో అడవులు, చెట్లు లేకపోవడంతో కరువు ప్రాంతాలుగా మారే ప్రమాదం ఉం దన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న విధంగా మొక్కలను పెంచితే వర్షాలు కురుస్తాయన్నారు. మొక్కలను నాటడమేకాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రా మంలో లక్ష నుంచి రెండు లక్షల మొ క్కలను పెంచాలన్నారు. రెండు రోజుల్లో 10 లక్షల మొక్కలను నాటామని, ఆదివారం సుమారు 5 లక్షల మొక్కలను నాటినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4 కోట్ల 80 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యాంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, వేముల విరేశం, కుసుకుంట్ల ప్రభాకర్, జేసీ సత్యనారాయణ, డ్వామా పీడీ దామోదర్రెడ్డి, ఆర్డీఓ ఎన్. మధుసూదన్, డీఎస్పీ ఎస్. మోహన్రెడ్డి, ఎంపీపీ తోట కూర వెంకటేష్యాదవ్, జెడ్పీటీసీ సందెల సుధాకర్, వైఎస్ ఎంపీపీ ఎం. శ్రీనివాస్, ఎంపీడీఓ ఎం. సరస్వతి, గ్రామ సర్పంచ్ గోద శ్రీనివాస్గౌడ్, అబ్బగాని వెంకట్గౌడ్, జీలుగు సతీష్పవన్, ఎంపీటీసీ జిన్న మల్లేష్, చింతల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్గౌడ్, పట్టణ, మండల అధ్యక్షులు కె.అమరేందర్, మారగోని రాముగౌడ్, సింగిల్విండో చైర్మన్ ఎండ్ల సత్తిరెడ్డి, నాయకులు జనగాం పాండు, చిన్న శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఆస్పత్రి వైద్యులు పద్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్
సూర్యాపేటరూరల్ః వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట మండలంలోని లక్ష్మీనాయక్తండా, దుబ్బతండా, రామన్నగూడెం, కే.టీ అన్నారం నుంచి వెదిరెవారిగూడెం గ్రామాలకు రూ.8 కోట్ల 25 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంబించి మాట్లాడారు. 60 ఏళ్లుగా ఆంధ్రాపాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతం ఎంతో వెనుకబాటుకు గురైందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. చంద్రబాబు విద్యుత్ సమస్యను సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని, ఆ కుట్రలను మనం తిప్పికొట్టగలిగామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వేసవిలో సైతం విద్యుత్ కోతలు లేకుండా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి కరెంటు ఇస్తోందన్నారు. వచ్చే ఏడాది నుంచి రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేకుండా 24 గంటలు సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి, సర్పంచులు ఒంటెద్దు వెంకన్న, సాయిని నాగేశ్వరరావు, ధరావత్ భారతి, కాట సాని వెంకటరెడ్డి, పాముల హనుమంతు,ఎంపీటీసీలు బోళ్ల కరుణాకర్, ముక్కాముల పద్మ, ఎల్గూరి వెంకటేశం, చింత శ్రీనివాస్, నాయకులు గవ్వా ప్రతాప్రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, ఆవుల దయాకర్రెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, సూర వెంకన్న, కఠ్ల జగత్దాస్, బోళ్ళ శ్రావణ్రెడ్డి, ముక్కాముల సుమన్, పీఆర్ డీఈ కృష్ణమూర్తి, తహసిల్దార్ వెంకటేశం, ఎంపీడీఓ నాగిరెడ్డి, ఏఈ మనోహర్, కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే అర్హత లేదు
యాదగిరిగుట్ట :కాంగ్రెస్, బీజేపీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం గుట్ట పట్టణ శివారులోని శ్రీసా యి ఫంక్షన్హాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని అన్నారు. సీమాంధ్ర ప్రభుత్వాల కాలంలో తెలంగాణ యువత తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని గ్రాడ్యుయేట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ నిర్వాకం వల్లే తెలంగాణ అనేక విధాలుగా నష్టపోయిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అబివృద్ధికి ఏమి చేసిందో స్పష్టం చేయాలని పేర్కొన్నారు. యువతకు, విద్యావంతులకు మేలు జరగాలంటే టీఆర్ఎస్కు మాత్రమే ఓటు వేయాలని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తనకు ఒక అవకాశం కల్పించి గెలిపిస్తే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆ పార్టీ యువజన విభాగం ఆలేరు నియోజకవర్గం అధ్యక్షుడు గడ్డమీది రవీందర్గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డిని, విప్ సునీతారెడ్డిని , పల్లా రాజేశ్వర్రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి యాదగిరిగుట్ట స్వామి వారి చిత్రపటాలతో కూడిన జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి , పవన్కుమార్, తుంగబాలు, గుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్న రవీందర్గౌడ్, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ వెంకటయ్య , బూడిద స్వామి, సీస కృష్ణ, తాళ్లపల్లి నాగరాజు, మిర్యాల దుర్గాప్రసాద్, అంకం నర్సింహ, బీర్ల మహేష్, పాండవుల భాస్కర్గౌడ్, శతృజ్ఞ, కౌడె మహేందర్, ముక్కెర్ల నర్సింహయాదవ్, బొజ్జ శ్రీనివాస్, వాసం రమేశ్, పేరబోయిన సత్యనారాయణ యాద వ్, బుడిగె సత్తయ్య పాల్గొన్నారు. -
పనిచేసే వారికే పదవులు
నల్లగొండ రూరల్ :టీఆర్ఎస్ పార్టీలో పైరవీలకు తావులేదని, పనిచేసేవారికే గుర్తింపు..పదవులు లభిస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆది వారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ఎస్ గార్డెన్స్లో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రజాబలం ఉన్న నాయకులకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వారి స్థాయిని బట్టి పదవులు దక్కుతాయన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు స్వీకరించేందుకు ఎమ్మెల్సీ లు సిద్ధంగా ఉన్నారని వివరించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు జిల్లాలోని అర్హత గల పట్టభద్రులను ఓటర్లు గా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ వాటా కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామన్నారు. ఏడాది లో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మంద శ్యామేల్, బక్క పిచ్చయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్కుమార్, శశిధర్రెడ్డి, కాసోజు శంకరమ్మ, శివరాం కృష్ణ, లాలునాయక్, అభిమన్యు శ్రీనివాస్, జమాల్, శ్రీను, సాయి, వెంకన్న, బాలు పాల్గొన్నారు. అర్హులందరికీ.. ఆహారభద్రత : పల్లా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను కార్యకర్తలు దీటుగా ఎదుర్కొవాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే.. : నోముల సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మాయ్య మాట్లాడుతూ పంటలు చేతికి రాకముందే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా..? రైతుల ఆత్మహత్యలపై ప్రతిపాక్షలు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. అండగా ఉంటాం : ఎంపీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలన్నారు. కార్యకర్త లు నిరాశ చెందవద్దని, వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుం దన్నారు. ఉద్యమ స్ఫూర్తిని అభివృద్ధిలో చూపించాలని కోరారు. ఓటరు నమోదుపై దృష్టిసారించాలి : బండా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 40 వేల పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారని, 2011 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత మాట్లాడుతూ కార్యకర్తలంతా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదులో కీలకపాత్ర పోషించాలని కోరారు. పేదల సంక్షేమమే ధ్యేయం : కర్నె ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణే ధ్యేయంగా అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమ కోసం పనిచేస్తుందన్నారు. వాటర్గ్రిడ్ను సీఎం మన జల్లా నుండే ప్రారంభించబోతున్నారని తెలిపారు. -
పారదర్శకమైన పాలనే ధ్యేయం
సూర్యాపేట : ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గండూరి ప్రవళిక అధ్యక్షత జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో జరిగిన తప్పిదాల వలన ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేం దుకు కృషి చేస్తామన్నారు. పట్టణ పరిధిలోని చెరువులను అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు నీటి సమస్య రాకుండా కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలో ప్రధానమైన సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిని పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలో ఉన్న కంపచెట్ల తొల గింపు కార్యక్రమం వెంటనే చేపట్టాల న్నారు. అందుకు స్థలాల యజమానులకు కౌన్సిల్ నుంచి ముందస్తు సమాచారమందించాలన్నా రు. పారిశుద్ధ్య మెరుగుదల కోసం బయో మరుగుదొడ్ల నిర్మాణా నికి కసరత్తు జరుగుతుందని చెప్పారు. పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు సేకరించా లని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నివాస గృహాల మధ్యలో, పైభాగంలో విద్యుత్ తీగలు ఉన్నట్టయితే సత్వరమే తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్, వైస్ చైర్మన్ నేరెళ్ల లక్ష్మి, తహసీల్దార్ వెంకటేశం, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి డీఎస్వీ శర్మ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
పోలీసులే అసలైన హీరోలు
సూర్యాపేట : సినిమాల్లో పోలీసుల పాత్ర పోషించే వారు నిజమైన హీరోలు కాదు.. 24 గంటలూ శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులే నిజమైన హీరోలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ‘తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధునికీకరణ’ అనే అంశంపై బుధవారం సూర్యాపేట సమీపంలోని సదాశివరెడ్డి ఫంక్షన్హాల్లో సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహించిన అవగాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. పోలీసులు రాత్రింబవళ్ళు విధులు నిర్వహిస్తూ మానసికి ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రజలు శాంతి కోరుకుంటున్నారని, సూర్యాపేటలో గత పరిస్థితులు రానివ్వనని, అధికార పార్టీని అడ్డుపెట్టుకొని తప్పులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని గతంలోనే పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పానన్నారు. పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీసులు అనే విధంగా ప్రజల దృష్టికి పోవాలని తెలిపారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ పోలీసులు అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వారు మన కుటుం బాల నుంచి వచ్చిన వారేనన్నారు. ఎస్పీ టి.ప్రభాకర్రావు మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతలు పరిరక్షిం చడంలో భాగంగా ఎందరో పోలీస్లు ప్రాణత్యాగాలు చేశారని, వారి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నామని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటే చాలా వరకూ నేర సంఘటన లు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముందు పోలీస్ అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు పోలీస్శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యం తో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. సుమారు 85 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్ళిక, ఆర్డీఓ శ్రీనువాస్రెడ్డి, డీఎస్పీలు శ్రావణ్కుమార్, శ్రీనువాస్, రామ్మోహనరావు, సీఐలు నర్సింహారెడ్డి, శ్రీనువాస్లుతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐలు, రెడ్క్రాస్సొసైటీ చైర్మన్ మీలా సత్యనారాయణ, డిస్ట్రిక్ సెక్రటరీ ఆమరేందర్రావు, వైస్ పెసిడెంట్ ఇరిగి కోటేశ్వరీ, ఉప్పల రాజేంద్రప్రసాద్, అడ్వకేట్ రమాదేవి, దుర్గాబాయి, రాంచందర్నాయక్ పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
సూర్యాపేట : అల్లాపై భక్తికి రంజాన్ ప్రతిరూపమైతే త్యాగానికి ప్రతీక బక్రీద్ అని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మైనార్టీ నాయకుడు అక్బర్ అలీ నివాసానికి చేరుకొని సేమీయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అన్నిమతాలవారు ఐకమత్యంగా ఉండి స్నేహపూర్వకంగా పండగలను జరుపుకోవాలని కోరారు. ముస్లింల అభివృద్ధికి నిరంతరం తాను కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, నాయకులు నిమ్మల శ్రీనివాస్గౌడ్, గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, నాతి సవీం దర్, ఆకుల లవకుశ, పుట్ట శ్రీనివాస్గౌడ్, డాక్టర్ కరుణాకర్రెడ్డి, శనగాని రాంబాబుగౌడ్, నెమ్మాది భిక్షం, నగేష్ పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యం తెలంగాణ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కన్నోజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు సోమవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మిగతా వారు కూడా ఆంధ్రా పార్టీలను విడిచి టీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. చేరిన వారిలో టీడీపీకి చెందిన నారగాని కన్నయ్య, రాచకొండ సైదులు, మల్లేష్, శనగాని వెంకన్న, మడ్డి మల్లేష్, చవగాని దుర్గయ్య, సత్తయ్య కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ఆత్మకూర్.ఎస్ మం డల అధ్యక్షుడు కాకి కృపాకర్రెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యమ ద్రోహమే కాంగ్రెస్కు శాపం
హుజూర్నగర్ : తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే ఆ పార్టీని శాపంగా వెంటాడుతోందని రాష్ట్ర విద్యాశాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టౌన్హాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వా రికి మెడలో గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం జగదీష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రజలు ఉద్యమం చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిందన్నారు. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి అండగా ఉండేందుకు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వంద రోజుల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని కొందరు నాయకులు అర్థంపర్థంలేని మాటలుమాట్లాడుతున్నారని విమర్శించారు. ఎడమకాల్వకు సాగునీరు విడుదల చేయకుండా చేతగాని దద్దమ్మల్లా కూర్చొని నోరు మెదపకుండా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. ఆంధ్రోళ్లకు నీళ్లమ్ముకున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య.. రైతుల ఆత్మహత్యల గురించి మా ట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి ము ఖ్యమంత్రి కేసీఆర్ జెట్ వేగంతో తీసుకువెళ్తున్నారన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 1000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం జరిగితే,ఇందులో 10 వేల ఇళ్ల బిల్లులు కాజేశారన్నారు. త్వరలోనే అక్రమాలు వెలుగులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, సాముల శివారెడ్డి, కాసోజు శంకరమ్మ, చిలకరాజు నర్సయ్య, శ్రీనివాసరెడ్డి,ప్రవీణారెడ్డి, దొ డ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్కుమార్ పాల్గొన్నారు. -
మంత్రి పదవి రాగానే మాటెత్తని ‘ఉత్తమ్’
మేళ్లచెర్వు : మంత్రి పదవి రాగానే మూతికి గుడ్డ కట్టుకున్న మాజీమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కనీసం పులిచింతల పునరావాస పనులను కూడా పూర్తి చేయలేకపోయారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజల కోసం పనిచేయని కాంగ్రెస్ నాయకులు తమకు అనుభవం లేదనడం విడ్డూరమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు తెలంగాణద్రోహుల పార్టీల న్నారు. తెంలంగాణ ప్రభుత్వం సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీరున్నా ఎడమ కాలవకు నీటిని విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సఖేందర్రెడ్డి తమకు అనుభవంలేదనడాన్ని ఆయన మరొకమారు తప్పుబట్టారు. తమ ప్రభుత్వం దళితులకు సేవలు చేసేందుకు దళితులకు మూడు ఎకరాల భూమి పంచుతుందన్నారు. ఇటీవల జరిగిన సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లెందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెంలంగాణ అన్నిరంగాలలో అభివృద్ధి చెందనుందన్నారు. టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి అన్ని గ్రామాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. అనంతరంఎంపీపీ భూక్యా ఝూమా చోక్లానాయక్, మాజీ ఎంపీపీ పాలేటి రామారావు, రామాపురం మాజీ సర్పంచ్ భసవయ్య, వేపలమాధవరం సర్పంచ్ శ్రీనివాస్, కోటయ్యల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రవీణారెడ్డి, శంకరమ్మ, శివారెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ నిర్మిద్దాం
నల్లగొండ : ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం....వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే దిశగా అందరం కృషి చేసి ‘బంగారు తెలంగాణ’ నిర్మిద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం 68వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్గ్రౌండ్లో జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మంత్రి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఆత్మాభిమానం కోసం ప్రజల అరవైఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ కోసం పోరాడి ఆత్మబలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, రైతులు, చేనేత కార్మికులకు రుణమాఫీ, వ్యవసాయ ఆధారిత పేద దళిత కుటుంబాలకు మూడెకరాల సాగుభూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీ యువతుల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 50వేల ఆర్థిక సాయం, ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంటు వంటి కీలక నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. హామీల అమలు దిశగా... ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించి, ఫ్లోరైడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. సమగ్ర సాగు,తాగునీటి పథకాలు చేపట్టి ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారన్నారు. పంటరుణాల మాఫీ రుణమాఫీ వల్ల జిల్లాలో సుమారు 4,20,936 మంది రైతులకు దాదాపు 1895 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో ప్రకృతి ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం 304.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను, ఇప్పటి వరకు కేవలం 124.7 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్ర మే నమోదైందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఆదుకోవడానికి జిల్లా వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ పంటల సాగు కు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నాగార్జునసాగ ర్ ప్రాజెక్టు నీటిమట్టం 515.8 అడుగులు ఉన్నప్పటికీ ఈ నెల 6వ తేదీన సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశామన్నారు. తెలంగాణ హరితహారం జిల్లాలో భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం, కేవలం 5.8 శాతం మాత్రమే ఉందని, దీంతో తరచు కరువుకాటకాలు ఏర్పడుతున్నాయన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హరితహారం’లో భాగంగా జిల్లా లో ఒక్కో గ్రామపంచాయతీలో ప్రతి ఏడాది 33 వేల మొక్కలు నాటడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. తండాలు...పంచాయతీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కలిగిన గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా మార్చుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 210 గిరిజన తం డాలను గ్రామపంచాయతీలుగా ఏర్పడబోతున్నాయన్నారు. భూ పంపిణీ వ్యవసాయ కూలీలుగా కొనసాగుతున్న దళిత కుటుంబాల ఆర్థిక ఉన్నతి కోసం ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూ పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద నియోజకవర్గానికి ఒకగ్రామం చొప్పున 12 గ్రామాల్లో 620 ఎకరాల భూమిని 232 మంది ఎస్సీ మహిళల కు పంపిణీ చేస్తున్నామని చెప్పా రు. మనఊరు-మనప్రణాళిక ‘మన ఊరు-మన ప్రణాళిక’ను ప్రజల భాగస్వామ్యంతో రూపొందించామన్నారు. జిల్లాలో మొత్తం 1176 గ్రామపంచాయతీల ప్రణాళికలో 4,357 వేల కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు, మండల ప్రణాళికలో 1015 కోట్ల రూపాయలు, జిల్లా ప్రణాళికలో భాగంగా సుమారు 3500 కోట్ల రూపాయల విలువ గల పనులను గుర్తించామని, ఈ పనుల ప్రాధాన్యతననుసరించి దశలవారీగా చేపడతామన్నారు. సమగ్రకుటుంబ సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే విశిష్టంగా ఈ నెల 19వ తేదీన సమగ్ర సర్వే చేయిస్తున్నారని, ఈ సర్వేలో ఎన్యుమరేటర్లకు సమగ్రమైన సమాచారాన్ని అందించి, బంగారు తెలంగాణ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలంటూ ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు చేయూత 1969 నుంచి 2014 దాకా ఎంతోమంది తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మబలిదానం చేశారని, వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవడానికి ప్రతీ అమరవీరుడి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. అమరువీరుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని, అంతేకాకుండా ఉద్యమకారులపై నమోదైన కేసులన్నింటిని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందన్నారు. ముస్లిం రిజర్వేషన్లు సమాజంలో అసమానతలు తొలగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, జనాభా నిష్పత్తిలో అవకాశాలు అందరికి దక్కాలని, అందుకే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి అన్నారు. అందుకోసం కమిషన్ ఏర్పాటు చేశామని, ఈ కమిషన్కు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ చిరంజీవులు, జెడ్పీచైర్మన్ బాలునాయక్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్రెడ్డి, సీపీఎం నేతలు నర్రా రాఘవరెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, జాయింట్ కలెక్టర్ ప్రీతీమీనా, ఏఎస్పీ రమారాజేశ్వరి, ఏజేసీ వెంకట్రావు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
మోత్కూరు :ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్), విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డిలు అన్నారు. గురువారం మోత్కూరు, కొండగడప గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామాల్లోని వనరులను సద్వినియోగం పర్చుకోవడం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. దీనిలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యం ప్రకారం పరిష్కరిస్తారని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెండింగ్లో ఉందని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. రూ.లక్ష వరకు ఎలాంటి షరతులూ లేకుండా పంట రుణమాఫీ ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. దసరా, దీపావళి వరకు ప్రభుత్వం కొత్తరేషన్కార్డులను మంజూరు చేస్తుందని తెలిపారు. నవంబర్ మాసం నుంచి వివిధ రకాల పింఛన్లు పెంచి అందజేయనున్నట్లు తెలిపారు. 500 జనాభా గల ప్రతి తండా ఆవాసాలను కచ్చితంగా నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేసిన గ్రామాల్లో 500 ధాన్యం నిలువ గోదాములను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. అభివృద్ధి కమిటీలతో గ్రామాభివృద్ధి.. మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చినా అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అందులో భాగంగానే ‘మన ఊరు-మన ప్రణాళిక’ను సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్నారని వివరించారు. వివిధ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామాభివృద్ధికి దోహదపడుతున్న కొండగడపవాసులను అభినందించారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నూతన భవనానికి నిధులు మంజూరు కావాలని కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అత్యాధునిక సౌకర్యాలతో భవనం నిర్మాణంకోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కొండగడపను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.. కొండగడప గ్రామానికి చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ భారత అధికారి కొప్పుల శ్రీకర్రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో తాను ఎక్కడ ఉన్నా జన్మభూమిని విస్మరించబోనన్నారు. గ్రామాభివృద్ధికోసం తన వంతు కృషిచేస్తానని తెలిపారు. జిల్లాలో కొండగడపను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో వివిధ కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి దశలో గ్రామాన్ని నడిపిస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఆలేరు, నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు గొంగిడి సునీతారెడ్డి, వేముల వీరేశం, కె.ప్రభాకర్రెడ్డి, భువనగిరి ఆర్డీఓ ఎన్.మధుసూదన్, డీపీఓ కృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ ఆమోస్, జెడ్పీ సీఈఓ దామోదర్, డ్వామా పీడీ సునంద, డీఆర్డీఏ పీడీ సుధాకర్, మండల స్పెషల్ ఆఫీసర్ నిరంజన్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు చింతల వరలక్ష్మి, సర్పంచ్లు కె.ఉమారాణి, బయ్యని పిచ్చయ్య, ఎంపీటీసీ సభ్యులు జంగ శ్రీను, ఎర్రబెల్లి పద్మ, మోత్కూరు సింగిల్విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కె.యాకుబ్రెడ్డి, నాయకులు కాసోజు శంకరమ్మ, వెంకటాచారి, కె.ప్రకాశ్రాయుడు పాల్గొన్నారు. వీఆర్వోల సమస్యల పరిష్కరించాలి గ్రామ రెవెన్యూ అధికారులకు జూనియర్ అసిస్టెంట్ల పేస్కేల్ను అందజేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు తెలంగాణ వీఆర్వోల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.కె.చాంద్పాషా ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని, వివిధ సమస్యలను విన్నవించారు. -
ఆంధ్ర తొత్తుగా మారిన జానారెడ్డి
నల్లగొండ రూరల్ : సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఆంధ్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని రాష్ట్ర విద్యాశాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపిం చారు. మంగళవారం ఆయన నల్లగొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను ఇబ్బంది పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్, పోలవరం, ఫీజు రీయింబర్స్మెంట్పై సమస్యలు సృష్టిస్తుంటే జానారెడ్డి ఏనా డు నోరు విప్పలేదన్నారు. రాజకీయ భవిష్యత్, పదవుల వ్యామోహం తప్ప ఆయనకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. జానారెడ్డి ప్రా తినిధ్యం వహిస్తున్న సాగర్ నియోజకవర్గానికి కూడా చేసింది ఏమీ లేదన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను సిద్ధం చేసిందని, వీటిని దసరా, దీపావళి నుంచి ప్రారంభించనున్నారని చెప్పారు. ఇందులో రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, దళితు ల భూ పంపిణీ, ధనలక్ష్మి, డబుల్బెడ్ రూమ్ ఇళ్లు తదితర పథకాలు ఉన్నాయని తెలిపారు. మునగాల ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ వారేనని, మన విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే ‘పాస్ట్’ను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహా రెడ్డి, మైనం శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, రేఖల భద్రాద్రి, జమీల్, బక్క పిచ్చ య్య, చింత శివరామకృష్ణ, అయ్యడపు ప్రకాశ్రెడ్డి, రవినాయక్, నాగార్జున, శోభన్బాబుు పాల్గొన్నారు. -
జిల్లాకు.. విద్యాశాఖ
- మంత్రిగా ప్రమాణం చేసిన గుంటకండ్ల జగదీష్రెడ్డి - మాట నిలబెట్టుకున్న కేసీఆర్ - టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం సాక్షిప్రతినిధి, నల్లగొండ, ‘‘జగదీష్రెడ్డిని గెలిపించి, నాకు ఇవ్వండి. ఆయనను మంత్రిని చేసి సూర్యాపేటకు పంపిస్తా..’’ అని గత ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట బహిరంగ సభలో హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట నిలబెట్టుకున్నారు. తన కేబినెట్లో జగదీష్రెడ్డికి చోటు కల్పించారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు 11మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలి విడతలోనే అవకాశం దక్కించుకున్న జగదీష్రెడ్డికి విద్యాశాఖ బాధ్యతలు అప్పజెప్పారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో, జిల్లాకు తొలిమంత్రిగా జగదీష్రెడ్డి రికార్డుల్లో నిలిచిపోనున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించిన టీఆర్ఎస్.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సహజంగానే, జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడైన జగదీష్రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. జిల్లానుంచి టీఆర్ఎస్ తరపున ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచినా, సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి కూడా అయిన జగదీష్రెడ్డికే అవకాశాలు ఉంటాయని అంచనా వేశారు. దానికి తగినట్టుగానే మంత్రి పదవికి పోటీపడే సీనియ ర్లు ఎవరూ లేకపోవడం కూడా కలిసి వచ్చింది. తొలిసారి జిల్లాకు.. విద్యాశాఖ గతంలో వివిధ ప్రభుత్వాల్లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు మంత్రులుగా పనిచేశారు. అయినా ఇప్పటిదాకా జిల్లాకు విద్యాశాఖ దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్)లో ఎక్కువకాలం మంత్రిగా పనిచేసి రికార్డు సొం తం చేసుకున్న నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుం దూరు జానారెడ్డి ఎక్కువ శాఖలకూ ప్రాతి నిధ్యం వహించారు. కానీ ఆయన కూడా విద్యాశాఖను ఇంతవరకు నిర్వహించలేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన పాల్వాయి గోవర్దన్రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు గడిచిన నాలుగు దశాబ్దాల్లో మంత్రులుగా పనిచేసినవారే. రాష్ట్ర పాలనలో కీలకమైన హోం, పంచాయతీరాజ్, వ్యవసా యం తదితర శాఖలూ జిల్లాకు దక్కాయి. కానీ, ఈసారి అనూహ్యంగా జగదీష్రెడ్డికి విద్యాశాఖ దక్కింది. గతంలో విద్యాశాఖను మూడు ముక్కలు చేసి ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పినా, ఈసారి మాత్రం విద్యాశాఖను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక్క మంత్రికే అప్పజెప్పినట్లు చెబుతున్నారు. మలి విడతలో తీసుకునే మంత్రులకూ శాఖలను విడగొట్టి ఇవ్వనిపక్షంలో విద్యాశాఖ మంత్రిగా నియమితులైన జగదీష్రెడ్డి అధీనంలోనే ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు ఉంటాయని భావిస్తున్నారు. తొలి విడతలోనే జగదీష్రెడ్డికి మంత్రిపదవి దక్కడంతో టీఆర్ఎస్ శ్రేణు లు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ జిల్లా ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్న ఆయన, ఇప్పుడు మంత్రి కూడా కావడంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగిపోయారు.