టీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ ఫ్లాప్‌‌: బండి సంజయ్‌ | Telangana BJP President Bandi Sanjay Comments On CM KCR | Sakshi
Sakshi News home page

లక్ష మందితో సభ అన్నారు ఏమైంది..?

Nov 28 2020 9:54 PM | Updated on Nov 29 2020 5:32 AM

Telangana BJP President Bandi Sanjay Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ సభలో పస లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు కేసీఆర్‌ తప్పతాగి ఫాంహౌస్‌లో పడుకున్నారని.. అందుకే ఢిల్లీ నుంచి తమ నాయకులు వస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచి కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. లక్ష మందితో సభ అన్నారు ఏమైందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అని ఎద్దేవా చేశారు. ‘‘మూసి ప్రక్షాళన కాదు కేసీఆర్‌ నోరు ప్రక్షాళన చేయాలి. మాది గల్లీ నుంచి ఢిల్లీకి విస్తరించిన పార్టీ’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. (చదవండి: ‘ఇంట్లో చెప్పే వచ్చా.. చావుకు భయపడేది లేదు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement