
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు పవన్ కలయికపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సెటైర్లు వేశారు. వీరి కలయిక దేనిని సూచిస్తుందో ప్రజలకు బాగా తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబును పవన్ పరామర్శించడం చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు.
ఈ మేరకు ఎంపీ భరత్ మాట్లాడుతూ.. 'పవన్ బీజేపీతో పొత్తు ఉందంటూనే చంద్రబాబును కలుస్తారు. ప్యాకేజీల గురించి మాట్లాడుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. నిర్మొహమాటంగా బయటికి చెప్పొచ్చు. చంద్రబాబు సభల్లో 11మంది చనిపోయారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నాడు. బాధిత కుటుంబాలను పరామర్శించడం మానేసి చంద్రబాబును, పవన్ పరామర్శించడానికి వచ్చారంటే వీరిద్దరి మధ్య ఉన్న అనైతిక కలయిక బయటపడుతుంది. పవన్ కల్యాణ్కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు.