బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు: ఎంపీ మిథున్‌ రెడ్డి | YSRCP MP Mithun Reddy Serious Comments On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు: ఎంపీ మిథున్‌ రెడ్డి

Published Mon, Jun 24 2024 11:13 AM | Last Updated on Mon, Jun 24 2024 1:27 PM

YSRCP MP Mithun Reddy Serious Comments On BJP

సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి నేతలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి. అలాగే, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో తాను పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

కాగా, పార్లమెంట్‌లో ప్రమాణం చేసేందుకు ఎంపీ మిథున్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ వద్ద మిథున్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. హ్యాట్రిక్‌ విజయాలతో పార్లమెంట్‌లో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌లో పని చేస్తాను.

జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు మద్దతిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం. బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు. కూటమి నేతలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. గతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతానని ప్రచారం చేశారు. వైఎస్‌ జగన్‌ నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారు. వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం సాధించే వరకు కష్టపడతాను. రాజంపేటలో అత్యధిక రోడ్డు వేయించిన ఘనత మాదే’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement