అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు: ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijayasai Reddy Satirical Comments On CM Chandrababu | Sakshi
Sakshi News home page

అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు: ఎంపీ విజయసాయిరెడ్డి

Published Tue, Sep 17 2024 10:11 AM | Last Updated on Tue, Sep 17 2024 10:59 AM

YSRCP MP Vijayasai Reddy Satirical Comments On CM Chandrababu

సాక్షి, తాడేపల్లి: ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు అని అన్నారు. అలాగే, సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు. ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు!. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే. సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుఫై కట్టిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నారు. దీంతో, బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది!?. అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 ఇది కూడా చదవండి: ‘కార్మిక నేతలే స్టీల్‌ప్లాంట్‌ అమ్మేయాలని చూస్తున్నారు’: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement