
‘కంది’గింజంత లాభంలేదు
కందిగింజంత లాభం కూడా ఈఏడాది లేదు. పెట్టిన పెట్టుబడి ఎక్కువైంది. కౌలు ధరలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటాయి. వాతావరణం సరిగాలేక ఈఏడాది దిగుబడి ఎకరాకు కేవలం 2–3 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. పెట్టుబడి ఎకరాకు రూ.20 వేలకు పైగా అయింది. గిట్టుబాటు ధర కూడా లేకపోవటంతో నష్టాలు వచ్చాయి. ప్రైవేటు వ్యక్తులు క్వింటాలు రూ.6700 కు మించి కొనటంలేదు. కొనుగోలు కేంద్రం క్వింటాలు రూ.7550 ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోగా గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదు.
– కోటేశ్వరరావు, రైతు, ఎన్ఎస్పీ అగ్రహారం
Comments
Please login to add a commentAdd a comment