
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్స్టార్ ప్రకటించింది.
ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది.