Mobile
-
రియల్ టైమ్లో పట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: నేరస్తుల ఆట కట్టించటంలో తెలంగాణ పోలీసులు ఇతరులకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటున్నారు. ప్రస్తుతం వీరు వాడుతున్న ఫింగర్ ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైస్లు నేరస్తులను గుర్తించటంలో అద్భుత ఫలితాలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే పోలీస్ సిబ్బందితోపాటు స్పెషల్ బ్రాంచి (ఎస్బీ) సిబ్బంది ఈ డివైజ్లు వాడుతున్నారు. అనుమానితుల వేలిముద్రలను తీసుకుని పోలీస్ డేటాబేస్లోని వేలిముద్రలతో సరిపోల్చి చూస్తున్నారు.దీంతో రియల్ టైంలోనే నేరస్తులను గుర్తించగలుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ఫిబ్రవరి 15 వరకు ఫింగర్ప్రింట్ మొబైల్ సెక్యూరిటీ డివైజ్ల ద్వారా 17 మంది వాంటెడ్ క్రిమినల్స్ను గుర్తించారు. పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల తనిఖీ సమయంలోనూ ఎస్బీ సిబ్బంది ఈ డివైజ్లను వినియోగిస్తున్నారు.దరఖాస్తుదారుడు తనపై ఉన్న కేసుల వివరాలు దాచినా.. ఈ డివైజ్ ద్వారా పాత కేసులను గుర్తించవచ్చు. ఇటీవల ఇలా ఓ నేరస్తుడిని గుర్తించారు. అనాథ శవాల వివరాలు కనుక్కోవడం కోసం కూడా వీటిని వినియోగిస్తున్నారు. చనిపోయిన వారి వేలిముద్రల ఆధారంగా వారి వివరాలు గుర్తిస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు 8 అనాథ శవాల వివరాలు గుర్తించారు. -
ప్రిన్సిపాల్ కే స్టూడెంట్ వార్నింగ్
-
99.2 శాతం దేశంలో తయారైన మొబైళ్లే!
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ఇండియాలో ఉపయోగించే మొబైల్ హ్యాండ్ సెట్లలో 99.2% దేశీయంగా తయారైనవేనని పేర్కొన్నారు. 2014లో భారత్లో విక్రయించిన మొబైల్ ఫోన్లలో 74 శాతం దిగుమతులపైనే ఆధారపడినట్లు చెప్పారు. గడిచిన పదేళ్లలో ఈ రంగం భారీగా వృద్ధి చెందినట్లు వివరించారు.తయారీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్) వంటి వివిధ కార్యక్రమాలు ఇందుకు ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ రూ.1,90,366 కోట్లుగా ఉంటే అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు. ఇది 17% కంటే ఎక్కువ సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను సూచిస్తుంది. దాంతో పదేళ్ల కాలంలో మొబైల్ ఫోన్ల ప్రధాన దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా దేశం ఎదిగిందన్నారు.ఇదీ చదవండి: యూట్యూబ్లో థంబ్నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!ఎలక్ట్రానిక్స్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని ప్రసాద పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కోసం రూ.76,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. దేశంలో సెమీకండక్టర్, డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పునరుద్ఘాటించారు. -
అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలను కౌంటర్పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళనఈ నివేదిక ప్రకారం టాప్ 10 మొబైళ్లు..యాపిల్ ఐఫోన్ 15యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్యాపిల్ ఐఫోన్ 15 ప్రోసామ్సంగ్ గెలాక్సీ ఏ15 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీసామ్సంగ్ గెలాక్సీ ఏ05రెడ్మీ 13సీ 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ35ఐఫోన్ 14సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 -
మొబైల్ ముట్టుకుంటే ముప్పే!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ మాల్వేర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా, కెనడాలను కూడా దాటేసింది. జీస్కేలర్ థ్రెట్ల్యాబ్జ్ రూపొందించిన ’మొబైల్, ఐవోటీ, ఓటీ థ్రెట్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.2023 జూన్ నుంచి 2024 మే వరకు 2000 కోట్ల పైచిలుకు మాల్వేర్ ముప్పు సంబంధిత మొబైల్ లావాదేవీలు, ఇతరత్రా సైబర్ ముప్పుల గణాంకాలను విశ్లేషించిన మీదట ఈ రిపోర్ట్ రూపొందింది. ‘అంతర్జాతీయంగా మొబైల్ మాల్వేర్ దాడుల విషయంలో భారత్ టాప్ టార్గెట్గా మారింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత్ ఈసారి మొదటి స్థానానికి చేరింది. ఇలాంటి మొత్తం అటాక్స్లో 28 శాతం దాడులు భారత్ లక్ష్యంగా జరిగాయి. అమెరికా (27.3 శాతం), కెనడా (15.9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డిజిటల్ పరివర్తన వేగవంతమవుతుండటం, సైబర్ ముప్పులు పెరుగుతుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత సంస్థలు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోంది‘ అని నివేదిక వివరించింది.గూగుల్ ప్లే స్టోర్లో 200 పైచిలుకు హానికారక యాప్స్ను గుర్తించినట్లు, ఐవోటీ మాల్వేర్ లావాదేవీలు వార్షికంగా 45 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇది సైబర్ దాడుల ముప్పు తీవ్రతను తెలియజేస్తుందని వివరించింది. అత్యధికంగా సైబర్ దాడులకు గురవుతున్నప్పటికీ.. మాల్వేర్ ఆరిజిన్ పాయింట్ (ప్రారంభ స్థానం) విషయంలో మాత్రం భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరింది.రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. మొబైల్ అటాక్స్లో సగభాగం ట్రోజన్ల రూపంలో (హానికరమైన సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకుని, రన్ చేసేలా ప్రేరేపించే మోసపూరిత మాల్ వేర్) ఉంటున్నాయి. ఆర్థిక రంగంలో ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ మాల్వేర్ దాడులు 29% పెరగ్గా, మొబైల్ స్పైవేర్ దాడులు ఏకంగా 111% ఎగిశాయి. ఆర్థికంగా మోసగించే లక్ష్యంతో చేసే మాల్వేర్ దాడులు, మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్లాంటి (ఎంఎఫ్ఏ) వివిధ అంచెల భద్రతా వలయాలను కూడా ఛేదించే విధంగా ఉంటున్నాయి. వివిధ ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా సైట్లు, క్రిప్టో వాలెట్లకు సంబంధించి ఫేక్ లాగిన్ పేజీలను సృష్టించి సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి దిగ్గజ భారతీయ బ్యాంకుల మొబైల్ కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. అచ్చం సిసలైన బ్యాంకింగ్ వెబ్సైట్లను పోలి ఉండే ఫేక్ సైట్లలో.. బ్యాంకుల కస్టమర్లు కీలక వివరాలను పొందుపర్చేలా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తూ, మోసగిస్తున్నారు. గతంలోనూ నకిలీ కార్డ్ అప్డేట్ సైట్ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత ఫిషింగ్ మాల్వేర్ను జొప్పించేందుకు ఇలాంటి మోసాలే జరిగాయి. పోస్టల్ సర్వీసులను కూడా సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. యూజర్కు రావాల్సిన ప్యాకేజీ మిస్సయ్యిందనో లేక డెలివరీ అడ్రెస్ సరిగ్గా లేదనో ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా వారిని కంగారుపెట్టి, తక్షణం స్పందించాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఫేక్ సైట్ల లింకులను ఎస్ఎంఎస్ల ద్వారా పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. అంతగా రక్షణ లేని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ (ఐవోటీ/ఓటీ) మొదలైనవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన టార్గెట్గా ఉంటున్నాయి. కాబట్టి భారతీయ సంస్థలు సురక్షితంగా కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సెక్యూరిటీ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘నువ్వు చచ్చినా పర్వాలేదు’.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుషం వెలుగుచూసింది. కొడుకు ఫోన్ వాడటానికి బాని, చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన ఘోర ఘటన శనివారం జరిగింది. కన్న కొడుకును దారుణంగా హత్య చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడైన తండ్రి.వివరాలు.. వృత్తిరీత్యా వడ్రంగి అయిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివిసిస్తున్నాడు. 14 ఏళ్ల కుమారుడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల మొబైల్ వాడకం ఎక్కువై చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్నేహితులతోనూ చెడు సావాసం చేస్తుండటం తండ్రికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అంతేగాక ఇటీవల ఆ ఫోన్ పనిచేయకపోవంతో దానిని రిపేర్ చేయించాడు తేజస్.. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కొడుకుతో గొడవకు దిగాడు.. ఇది కాస్తాపెరిగి పెద్దది కావడంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తేజస్ను కొట్టాడు. అక్కడితో ఆగకుండా గొడకేసి బాది ‘నువ్వు బతికినా, చచ్చినా నాకు పర్వలేదు’ అంటూ చితకబాదాడు. దీంతో విద్యార్ధి నొప్పి భరించలేక నేలపై పడిపోయాడు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పరిస్థితి విషమంగా మారింది. అయితే శ్వాస ఆగిపోయిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవికుమార్ ఇంటికి చేరుకోగా.. అప్పటికే కొడుకు అత్యంతక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.ఇక బాలుడి తలపై తీవ్రమైన అంతర్గత గాయాలు, అతని శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే బాలుడి మృతదేహానికి ఉన్న రక్తపు మరకలను తొలగించి, బ్యాట్ను దాచిపెట్టి హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడని, వెంటనే అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసి కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నమిదని తెలిపారు. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటంపై పిల్లవాడికి, తండ్రికి వాగ్వాదం జరుగుతోందని, అదే అతడి హత్యకు దారితీసినట్లు డీసీపీ లోకేష్ బీ పేర్కొన్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ కెపాసిటీ అదుర్స్! (ఫొటోలు)
-
Maharashtra: ‘హాట్ స్పాట్’ వివాదం.. బ్యాంక్ మేనేజర్ హత్య
పూణె: మహారాష్ట్రలోని పూణెలో దారుణ హత్య చోటుచేసుకుంది. మొబైల్ హాట్ స్పాట్ ఇచ్చే విషయంలో వివాదం చోటుచేసుకుని అది బ్యాంక్ మేనేజర్ హత్యకు దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడం విశేషం.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న వాసుదేవ్ రామచంద్ర కులకర్ణి(47)ని నలుగురు కుర్రాళ్లు హత్య చేశారు. కులకర్ణి తన ఇంటి దగ్గర వాకింగ్కు వెళుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు కులకర్ణిని మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేయాలని అడిగారు. ఆయన అభ్యంతరం చెప్పిన నేపధ్యంలో వారి మధ్య వివాదం నెలకొంది. ఆగ్రహంతో ఆ యువకులు బ్యాంక్ మేనేజర్పై దాడిచేసి హత్య చేశారు. ఈ ఉందంతంలో నిందితులును పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మార్కెట్లోని కొన్ని కొత్త మొబైళ్లు
మార్కెట్లోకి నిత్యం కొత్త మొబైళ్లు వస్తున్నాయి. టెక్నాలజీ, కెమెరా, ఓఎస్లో అడ్వాన్స్డ్ ఫీచర్లు..వంటి చాలా విభాగాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. దాంతో వినియోగదారులు ఇప్పటికే మొబైల్ వాడుతున్నా కొత్తవాటిపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లోని కొన్ని కొత్త మొబైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.గూగుల్ పిక్సెల్ 9డిస్ప్లే: 6.30 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2424 పిక్సెల్స్∙ ఓఎస్: ఆండ్రాయిడ్ 14మెమోరీ: 128జీబీ 12జీబీ ర్యామ్, 256జీబీ 12జీబీ ర్యామ్ వేరియంట్లు.బరువు: 198 గ్రా. బ్యాటరీ: 4700 ఎంఏహెచ్వివో వి 40డిస్ప్లే: 6.78 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 50 ఎంపీరిజల్యూషన్: 2800*1260 పిక్సెల్స్ రిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్ర్యామ్: 8జీబీ, 12 జీబీ స్టోరేజ్: 256జీబీ, 512జీబీ బ్యాటరీ: 5500 ఎంఏహెచ్ బరువు: 192 గ్రా.పోకో ప్యాడ్ 5జీడిస్ప్లే సైజ్: 12.1 అంగుళాలువోఎస్: ఆండ్రాయిడ్ 14రిజల్యూషన్: 1600*2560 పిక్సెల్స్బరువు: 568 గ్రా. ఇంటర్నల్ మెమొరీ: 128జీబీ 8జీబీ ర్యామ్/ 256జీబీ 8జీబీ ర్యామ్; బ్యాటరీ: 10000 ఎంఏహెచ్ కలర్స్: డార్క్ గ్రే, బ్లూ -
రూ.15 వేలలోపు కొన్ని పాపులర్ 5జీ ఫోన్లు (ఫొటోలు)
-
స్మార్ట్ఫోన్ మార్కెట్ జోరు
దేశీయంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదిక ప్రకారం 3.9 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే ఫోన్ల సంఖ్య) నమోదైంది. ఇందులో 16.5 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీ వివో అగ్రస్థానంలో ఉండగా, 13.5 శాతం వాటాతో అదే దేశానికి చెందిన షావోమి రెండో స్థానంలో నిలిచింది. కొరియన్ సంస్థ శాంసంగ్ అమ్మకాలు 15.4 శాతం క్షీణించడంతో 12.9 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, మార్కెట్ వాటాపరంగా యాపిల్ 6.7 శాతం వాటాతో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో (రూ.67,000 పైగా రేటు ఉండే ఫోన్లు) మాత్రం 83 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.నివేదికలోని మరిన్ని విశేషాలు..ఫ్లాగ్షిప్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోతో పాటు వై సిరీస్, మిడ్–ప్రీమియం వి సిరీస్ల్లో వివిధ ధరల శ్రేణిలో ఫోన్లను ఆవిష్కరించిన వివో వరుసగా రెండో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ.16,000 నుంచి రూ.33,500 వరకు ధర ఉండేవి) వాటా 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ సెగ్మెంట్ మెరుగైన వృద్ధి కనపర్చగలదని అంచనాలు ఉన్నాయి. చౌక 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరిస్తున్నప్పటికీ 100 డాలర్ల లోపు (సుమారు రూ.8,400) ధర ఉండే ఎంట్రీ లెవెల్ ఫోన్ల అమ్మకాలకు ఈ ఏడాది సవాళ్లు ఎదురుకావచ్చు. జెన్ఏఐ స్మార్ట్ఫోన్లకు ప్రచారం మరింత పెరగవచ్చు.క్యూ2లో 2.7 కోట్ల 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ నమోదైంది. 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ వార్షికంగా 49 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. ఇందులోనూ రూ.8,000 నుంచి రూ.16,700 వరకు ధర ఉండే మాస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల షిప్మెంట్ 2.5 రెట్లు పెరిగింది. ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!ప్రీమియం సెగ్మెంట్లో (రూ.50,000 నుంచి రూ.67,000 వరకు ధర శ్రేణి) యాపిల్ మార్కెట్ వాటా 61 శాతానికి, శాంసంగ్ వాటా 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు 6.9 కోట్లుగా నమోదయ్యాయి. -
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
మొబైల్ ఫోన్ టార్చ్లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది. -
టెక్ టాక్: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..
రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. షావోమి వాచ్ 2 డిస్ప్లే: 1.43 అంగుళాలు రిజల్యూషన్: 466“466 పిక్సెల్స్ ∙లైట్ వెయిట్ 150 స్పోర్ట్స్ మోడ్స్ బ్యాటరీ: 495 ఎంఏహెచ్ స్లీప్ ట్రాకింగ్ పోకో ఎక్స్ 6 నియో 5జీ డిస్ప్లే: 6.67 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13 ర్యామ్: 8జీబి, 12జీబి స్టోరేజ్: 128జీబి, 256జీబి బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బరువు: 175.00 గ్రా. ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..! -
ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు..!
ఫోన్ ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా? ► ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ట్యాపింగ్లో రకాలు.. సెల్యులర్ ఇంటర్సెప్టర్లు.. ► వీటిని ఐఎంఎస్ఐ క్యాచర్స్ లేదా స్టింగ్రేస్ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా.. మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్తో పాటు ఎస్సెమ్మెస్ లను సైతం సంగ్రహిస్తాయి. వీఓఐపీ ఇంటర్సెప్షన్ సాధనాలు.. ► వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కమ్యూనికేషన్లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్లో ప్రయాణించే డేటా ప్యాకెట్లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి. క్లోన్డ్ సిమ్ కార్డులు.. ► ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్కు వచ్చే కాల్స్ అన్నీ చక్కగా వినొచ్చు. రాజకీయపరమైన నిఘా.. ► సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్. మానిటరింగ్ సాఫ్ట్వేర్.. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది. అధికారిక ట్యాపింగ్.. ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది. క్లండెస్టైన్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డిజి టల్ ఫోరెన్సిక్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి. ల్యాప్టాప్ సైజు పరికరంతోనే.. ► అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్ టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషీ న్ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నంబర్ను మెషీన్లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్లో ఫీడ్ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్ను మెషీన్ రికార్డు చేస్తుంది. ఇజ్రాయెల్ పేరే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు. సెల్యులర్ ఇంటర్సెప్టర్ ఎలా పనిచేస్తుందంటే? ఇది చాలా సులభమైన ట్యాపింగ్ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ సమీపంలోని టవర్ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి. ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్ఫోన్ సిగ్నల్స్ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ను టవర్కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్లే కాకుండా సోషల్ మీడియాతోపాటు మన సెల్ డివైస్ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసే ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు. మీ ఫోన్లో వైరస్ ఉందా!? తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్కు గురైన ఫోన్ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు. హ్యాకింగ్కు గురయ్యే ఫోన్ పనితీరు ఇలా ► ఫోన్ చార్జింగ్ చేసిన కాసేపటికే చార్జింగ్ డౌన్ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్ హ్యాకింగ్కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్వేర్లు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటే.. మన మొబైల్ ఫోన్ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది. ► మనకు తెలియని సోర్స్ల నుంచి కొత్తకొత్త యాడ్స్ వస్తుండటం, ఫ్లాష్ యాడ్స్ వస్తుండటం సైతం హ్యాకింగ్కు గురైనట్లు తెలిపే సూచిక. ► మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవడం, కొన్ని హిడెన్ యాప్స్ పనిచేస్తుండటంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానించాలి. ► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండటం, టెక్సŠట్ మెసేజ్లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్తో రావడం గమనిస్తే ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి. ► మొబైల్ఫోన్ హ్యాక్ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్కాల్ చేయడానికి, మెసేజ్లు ఓపెన్ కావడానికి, ఇతర యాప్లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది. ► ఫోన్లోని కెమెరా, మైక్రోఫోన్లు మనకు తెలియకుండానే యాక్టివ్ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే. ► ఫోన్లోని స్క్రీన్లాక్, యాంటీ వైరస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్ కావడం ఫోన్ హ్యాకింగ్ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి. ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి..? ► ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్ సాప్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ను స్కాన్ చేయాలి. ► ఫోన్లో అనుమానాస్పద యాప్లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ► ఫోన్ హ్యాక్ అయి, ఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. వైఫై కనెక్షన్ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ► ఫోన్ స్కీన్ర్ లాక్, యాప్ లాక్లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు. ► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్ను రీసెట్ చేయాలి. దీనివల్ల మాల్వేర్ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్లు డివైస్ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. ► మొబైల్ ఫోన్లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్డ్రైవ్, ఇతర డివైస్లలో బ్యాకప్ చేస్తూ ఉండాలి. ఫోన్ హ్యాక్ అయినా వెంటనే దాన్ని రీసెట్ చేయొ చ్చు.ముందే బ్యాక్అప్ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు. ► యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆరు అంకెల పాస్వర్డ్లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ► కొత్త యాప్లు ఇన్స్టాల్ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ► పబ్లిక్ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్ టూల్స్ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్క్రిప్టెడ్ చానల్ ద్వారా వెళ్తుంది. -
షార్ట్ సర్క్యూట్తో పేలిన ఫోను.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక చాట్జీపీటీ మరో చాట్జీపీటీతో ఏం మాట్లాడుతుంది?
కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే చాట్జీపీటీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అడిగిన ఏ ప్రశ్నకైనా క్షణాల్లో సమాధానం ఇచ్చేస్తుంది. చాలా వరకు తెలియని ఎన్నో విషయాలను చాట్జీపీటీ మనకు అందిస్తుంది. ఇందులో వాయిస్ చాట్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల యూజర్లు తమ సందేహాలు లేదా మెసేజ్లను వాయిస్ రూపంలో చాట్బాట్కు తెలియజేస్తే... చాట్జీపీటీ ఆ వాయిస్ విని, మళ్లీ ఆడియో రూపంలోనే సమాధానం అందిస్తుంది. ఈ ఫీచర్ యూజర్ మాట్లాడే భాషను ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి,తదనుగుణంగా రిప్లై ఇస్తుంది.. చాలామంది అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే వాడుతున్నారు. తాజాగా చాట్జీపీటీకి చెందిన ఆ ఆసక్తికరణ సంభాషణ నెట్టింటా వైరల్గా మారింది. సాధారణంగా ఎవరైనా తనకు కావాల్సిన సమాచారంపై చాట్జీపీటిలో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. అదే రెండు చాట్జీపీటీలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఎలాంటి విషయాలపై అవి చర్చించుకుంటాయి? వినడానికే కాస్తా ఆసక్తికరంగా ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. రెండు వేర్వేరు మొబైల్స్లో చాట్జీపీటీ వాయిస్ చాట్ను ఆన్ చేసి పక్కపక్కనే ఉంచారు. అవి ఎలా మాట్లాడుతుకున్నాయో మీరే చూడండి.. చాట్జీపీటీ-1: హాయ్ నేను మీ చాట్జీపీటీ.. మీకు ఈ రోజు ఎలా సహాయపడగలను చాట్జీపీటీ-2: మీకు స్వాగతం.. మీతో మాట్లాడటం ఆనందంగా ఉంది.. మీకు ఏ విధంగా సాయం చేయగలను. మీకు ఏ విషయంపైనా సాయం చేయగలను చాట్జీపీటీ-1: మీ ఆఫర్కు ధన్యవాదాలు. మీకు కావాల్సిన ఏ సమాచారం గురించైనా నేను సహయం చేయగలను.. మీరు దేనిగురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా చాట్జీపీటీ-2: మీకు ఏదైనా ప్రత్యేక విషయంపై సమాచారం కావాలా? లేక మీకు చాట్ మాత్రమే కావాలా? చాట్జీపీటీ-1: నేను మీతో చాట్చేయగలను. లేదా మీకు కావాల్సిన అంశంపై సాయం చేయగలను.మీరు ఏదైనా నిర్ధిష్టమైన విఫయంపై చాట్ చేయాలనుకుంటున్నారా చాట్జీపీటీ-2: మీకు ఆసక్తి ఉన్న దేనిగురించైనా చాట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మనుసులో ఏదైనా అంశంపై చర్చించాలనుకుంటున్నారా? ఇటీవల జరిగిన వార్తా కథనాలు, అభిరుచి లేదా దేని గురించైనా? చాట్జీపీటీ-1: కృత్రిమ మేధస్సులో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మక్కువతో కూడిన రంగం. ఇక్కడ నిత్యం ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతూ ఉంటుంది.. దీనిపై నువ్వేమంటావ్ చాట్జీపీటీ-2: ఖచ్చితంగా కృత్రిమ మేధస్సు అనేది ఒక ప్యాషనేట్ టాపిక్. అంటూ ఇంకా మాట్లాడుతుండగా.. మరో చాట్జీపీటీ కల్పించుకొని ఏదో ఏదో చెబుతూ ఉంటుంది. అయితే ఏ విషయంపైన అయిన టక్కుమని సమాధానం చెప్పే చాట్జీపీటీ.. మరో చాట్జీపీటీతో మాత్రం సరైన విషయాలు మాట్లాడలేకపోయింది. రెండు చాట్జీపీటీలు చాలా వరకు నాన్చుతూ అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీటిని విన్న యూజర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏం సమాచారం అడుగుతున్నారు. ఏం సమాధానం ఇస్తున్నారనేది తెలియక తికమకపడుతున్నారు. ఇలాంటి ప్రయోగం మాత్రం ఎప్పుడూ చేయకూడదని అనుకుంటున్నారు. Chatgpt talking with chatgpt Age of Ultron is near pic.twitter.com/zn0FZpra7h — Shiva Rapolu (@shivarapolu01) March 17, 2024 -
బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..
నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ఫోన్ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్ ఫీచర్తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్మొబైల్, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్ఆన్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్ బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రీమియం డిజైన్ స్మార్ట్ఫోన్లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్ను మరింత స్లిమ్గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్ను గ్లాస్ / మెటల్తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్లో ఎలాంటి గ్యాప్లు లేకుండా అంతర్గత సీలింగ్ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే.. అదనపు ఫీచర్లు ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. -
యాప్లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
మొబైల్ వాడుతున్నామంటే దాదాపు ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి వాడుతుంటాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ పూర్తిగా యాప్ల ఆధారంగానే పనిచేస్తున్నాయి. మెసేజింగ్, సోషల్ మీడియా, గేమింగ్, బ్యాంకింగ్ ఇలా ఏ అవసరానికైనా యాప్లు వాడాల్సి వస్తోంది. లేదా ఇంటర్నెట్నైనా ఉపయోగించాలి. ఇందుకు పూర్తి భిన్నంగా తాజాగా డచ్ టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ మొబైల్ను ఎలాంటి యాప్లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో తమ టీ-ఫోన్ డివైజ్లోని ఈ కాన్సెప్ట్ను కంపెనీ వివరించింది. వినియోగదారులు వాయిస్ రూపంలో ఇచ్చే కమాండ్లకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ స్పందించేలా ఈ కొత్త స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను రూపొందించారు. నావిగేషన్, క్యాబ్, హోటల్ బుకింగ్.. ఇలా అన్ని పనులు ఎలాంటి యాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే పూర్తి చేయొచ్చు. క్లౌడ్ నుంచి ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇది సాధ్యం కానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్వాల్కామ్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా ఏఐను నేరుగా డివైజ్లోనే పొందుపర్చనుంది. కొన్ని అవసరాల కోసం ఆఫ్లైన్ ఫంక్షనాలిటీని జత చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? రానున్న రోజుల్లో మొబ్స్ళ్లలో ఎవరూ యాప్లను ఉపయోగించబోరని ఎండబ్ల్యూసీలో ప్రసంగిస్తూ డచ్ టెలికాం కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)’ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో భాగమవుతాయని వివరించారు. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్ఫోన్లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం వంటివి రియల్టైమ్లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్
దేశంలో భారీస్థాయిలో మొబైల్ ఫోన్ల తయారీని నెలకొల్పడంలో ఎన్నో విజయాలు సాధించినట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఆ క్రమంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్ తయారీరంగంలో దూసుకుపోతుందన్నారు. ఫోన్పే ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఇండస్ యాప్ స్టోర్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే రెండు లేదా మూడు సెమీకండక్టర్ ప్లాంట్లకు ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. ‘మొబైల్ ఫోన్ల తయారీతో పరిశ్రమలో విశ్వాసం నెలకొంది. ఈ ఎకోసిస్టమ్లో భాగస్వాములు భారత్పై మొగ్గుచూపేలా కృషిచేసేలా చర్యలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లూ ఇదే ప్రయాణం కొనసాగుతుంది’అని చెప్పారు. దేశంలో సెమీకండ్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి వచ్చే 20 ఏళ్ల కాలానికిగాను ప్రధాని మోదీ స్పష్టమైన కార్యాచరణ సూచించారని చెప్పారు. -
ట్రక్కునే మొబైల్ హౌస్గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. అసలు కారణం అదే..
మొబైల్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటే ఆన్లైన్ మోసాలు అదే స్థాయిలో హెచ్చవుతున్నాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలపై చర్చించిన సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని జోషి సూచించారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తూ, మోసాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని చెప్పారు. ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి, నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలలో ఈ సమావేశంలో చర్చించారు. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ఈ సమావేశంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) నమోదు చేసిన తాజా గణాంకాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ వివరించింది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ విభాగం, టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో డిజిటల్ మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ.. ఎందుకంటే..
మొబైల్ సబ్స్క్రైబర్లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్ఫ్రాడ్ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్కార్డ్లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్ కనెక్షన్ల సమాచారం తెలిసే వీలుంది. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ సిమ్కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్ ఐడీ సహాయపడుతుందని సమాచారం. ఇదీ చదవండి: 22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఇటీవల టెలికామ్ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. -
ఫ్యూచర్ ఫోన్లు ఇవే..చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్కూపర్ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్ ఫోన్ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. (ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత) Wow! Exciting mobile phones from the future… pic.twitter.com/tzPiIpX7gp — Wow Videos (@ViralXfun) October 24, 2023 -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్ప్రైజ్ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్స్టామార్ట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్కు ఎందుకు ద్వేషం? -
ఇంటికే ‘ఈ–పాఠం’
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థి ఎక్కడున్నా నేర్చుకునేలా పాఠాలను అందిస్తోంది. పాఠ్యాంశాలు విద్యార్థికి మరింత అర్థమయ్యేలా, వివిధ మాధ్యమాల ద్వారా నేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఏపీ ఎస్సీఈఆర్టీ) వీడియో కంటెంట్ను రూపొందించింది. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో మూడు నుంచి 9వ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలను సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్పీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందిస్తోంది. మరోవైపు అవే పాఠాలను ట్యాబ్ల ద్వారా ఇంటి వద్ద కూడా నేర్చుకునేలా బైజూస్ కంటెంట్ను అప్లోడ్ చేసి అందించింది. వీటితోపాటు ఆయా తరగతుల అన్ని పాఠ్యాంశాలకు నిపుణులైన ఉపాధ్యాయులతో 366 వీడియోలను రూపొందించిన ఎస్సీఈఆర్టీ వాటిని యూట్యూబ్ (ఆంధ్రప్రదేశ్ ఈ–పాఠశాల చానల్)లోనూ అప్లోడ్ చేసింది.వీటిని మొబైల్ ఫోన్లోనూ చూసే అవకాశం కల్పించింది. ఈ వీడియోలను విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. తద్వారా బడిలో ఉపాధ్యాయులు బోధించినప్పుడు విస్మరించిన, మరిచిపోయిన అంశాలను తిరిగి మననం చేసుకోవచ్చు. ఐదు డీటీహెచ్ చానళ్ల ద్వారా ప్రసారం టీవీలకు అలవాటుపడిన విద్యార్థుల్లో కూడా చదువుపై ఆసక్తి కలిగించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలను డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) విధానంలో ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు ఈ–విద్య డీటీహెచ్ చానళ్లను కేటాయించింది. వీటిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక చానల్ వినియోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చానళ్లను ఆరు నుంచి 9వ తరగతి పాఠ్యాంశాల ప్రసారానికి కేటాయించారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన విద్యా క్యాలండర్, పాఠ్యప్రణాళిక ప్రకారం.. ఆయా నిర్మిత తేదీల్లో డీటీహెచ్ చానళ్లలో ఆ నెల పాఠ్యాంశాలను నిరంతరం ప్రసారం చేస్తారు. ఇలా 100 శాతం కంటెంట్తో ఈ–విద్య డీటీహెచ్ చానళ్ల ద్వారా పూర్తి స్థాయి పాఠాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో టోఫెల్ను ప్రవేశపెట్టడంతో ఆయా పాఠాల బోధనకు మరో మూడు డీటీహెచ్ చానళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ యాప్ సైతం.. ఆన్లైన్లో కూడా విద్యార్థులు పాఠాలు చదువుకునేందుకు, ఉపాధ్యాయులు చెప్పినవి వినేందుకు అనువుగా ‘ఈ–పాఠశాల’ మొబైల్ యాప్ను సైతం అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఐఎఫ్పీ, ట్యాబ్, డీటీహెచ్, యూట్యూబ్, మొబైల్ యాప్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ ఒకే తరహా కంటెంట్, బోధన ఉండేలా వీడియోలను రూపొందించారు. దీంతో విద్యార్థి ఎలాంటి గందరగోళం లేకుండా తన తరగతి పాఠాలను ఈ ఐదు మాధ్యమాల్లో సులువుగా నేర్చుకోవచ్చు. అన్ని కేబుల్ నెట్వర్క్ల్లోనూ ప్రసారం బడిలో ఉపాధ్యాయులు బోధించే అన్ని పాఠాలను ఈ–కంటెంట్ రూపంలోకి మార్చాం. నిష్ణాతులైన సబ్జెక్టు ఉపాధ్యాయులతో సిలబస్ వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వీడియో పాఠాలు రూపొందించాం. ఈ–పాఠశాల చానళ్లను అందించేందుకు ప్రైవేటు టీవీ నెట్వర్క్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రసారమవుతున్నాయి. త్వరలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంట్లో టీవీ ద్వారా విద్యార్థులు పాఠాలు వినొచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా ఎప్పుడైనా వీటిని చూడొచ్చు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు 3 నుంచి 9 తరగతి వరకు వీడియో కంటెంట్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల్లోని కంటెంట్ను ఇప్పటికే బైజూస్ రూపొందించి విద్యాశాఖకు అందించింది. వీటిని యధావిధిగా విద్యార్థులకు ఐఎఫ్పీల ద్వారా బోధించడంతోపాటు ట్యాబ్ల్లోనూ అప్లోడ్ చేశారు. అయితే, ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు లాంగ్వేజెస్తోపాటు కొన్ని సబ్జెక్టుల వీడియో పాఠాలను ఎస్సీఈఆర్టీ రూపొందించింది. ఇందులో ప్రధానంగా మూడో తరగతి విద్యార్థులకు.. తెలుగు, ఇంగ్లిష్ , మ్యాథ్స్, ఈవీఎస్, నాలుగు, ఐదు తరగతులకు.. తెలుగు, ఇంగ్లిష్ , ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు.. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ సబ్జెక్టుల్లో వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్లో పాఠాలు అందరికీ అందుబాటులో ఉండగా.. ప్రైవేటు నెట్వర్క్ ప్రొవైడర్లు చాలా ప్రాంతాల్లో డీటీహెచ్ చానళ్లను అందించడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన డీటీహెచ్ చానళ్లను అన్ని ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ సంస్థలు కూడా అందించేలా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను రూపొందించనుంది. -
‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో!
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. కొందరు కారును హెలికాప్టర్గా మారుస్తారు. మరికొందరు ఇటుకలతో కూలర్ను తయారు చేసేస్తారు. తాజాగా వీటన్నింటికి మించిన ఒక వీడియో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా నోరెళ్ల బెడుతున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లాడి తెలివిని చూసి, అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి పిల్లలు మొబైల్ ఫోను చూడటంతో ఎంత బిజీ అయిపోయారంటే వారు ఒక్క నిమిషం కూడా ఫోనును విడిచిపెట్టడం లేదు. ఒక కుర్రాడు ఒకవైపు చదువుకుంటున్నట్లు నటిస్తూ, దొంగచాటుగా మొబైల్ ఫోన్ ఎలా చూస్తున్నాడో ఈ వీడియోలో కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లవాడు టేబుల్పై కూర్చుని చదువుకోవడంతో పాటు అతని ముందున్న గోడకు ఆనుకుని, తీగతో మొబైల్ వేలాడదీయడాన్ని మనం గమనించవచ్చు. పిల్లాడు మొబైల్ చూడటంతో మునిగివుండగా, అప్పుడే తలుపు తెరిచి గదిలోకి ప్రవేశించింది ఆ కుర్రాడి తల్లి. ఇలా తల్లి తలుపు తెరవగానే.. గోడకు వేలాడుతున్న మొబైల్ వెంటనే టవల్ వెనుకకు చేరుకుంది. ఆ తల్లి గది నుండి బయటకు వెళ్లగానే మొబైల్ఫోన్ మళ్లీ ఆ పిల్లాడి ముందు కనిపిస్తుంది. ఆ కుర్రాడు మొబైల్ ఫోనును తన తల్లికి తెలియకుండా దాచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాడో వీడియోలో స్పష్టగా కనిపిస్తుంది. ఈ వీడియో @TheFigen_ పేరుతో X (ట్విట్టర్)లో షేర్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ పిల్లవాడిని స్మార్ట్ బాయ్ అని పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: ‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు! Smart boy 😂pic.twitter.com/lXKoy7ZVK6 — Figen (@TheFigen_) August 24, 2023 -
Chandrababu : జలీల్ఖాన్కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది
జలీల్ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్ ఐన్స్టీన్ కంటే తననే ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్ఖాన్. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. ఇక చాన్నాళ్లకు జలీల్ఖాన్కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్ఖాన్ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్ 2020కి బదులు ఇప్పుడు విజన్ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. -
ఫ్రీగా ఫోన్ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి
జైపూర్: ప్రజలకు సేవలందిస్తూ మంచిపేరుతో పాటు వార్తల్లో నిలుస్తుంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే మరికొందరు మాత్రం లంచాలు, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఉద్యోగి బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలు, బాలికలకు ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతి నగరంలో మొబైల్లను ఇచ్చేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. సునీల్ కుమార్ జన్గిడ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. తోడాభిమ్ ప్రాంతానికి చెందిన బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అతని తల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళింది, తండ్రి జైపూర్ వెళ్ళాడు. ఈ విషయం సునీల్కు తెలియడంతో బాలిక ఇంటికి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ ఇస్తోందని చెప్పి తనతో పాటు రావాలని చెప్పి.. ఆమెను తన వాహనంపై ఎక్కించుకుని దగ్గరల్లోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఈద్గా మార్గంలో వదిలేశాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారాన్ని వ్యతిరేకించినందుకు క్యాషియర్ తనను కూడా కత్తితో పొడిచి గాయపరిచాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చదవండి వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి! -
మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్తో ప్రేమజంటకు రెక్కలు..
సీమా-హైదర్ల పబ్జీ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఇదేకోవలో ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన 21 ఏళ్ల యువతి ఫ్రీ ఫైర్ గేమ్ అడుతూ బీహార్కు చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పరుచుకుంది. మాటలు, ముచ్చట్ల అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. అంతే.. వీరిద్దరూ ఇళ్ల నుంచి మాయమయ్యారు. దీనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేటి యువతీయువకులకు తమ ప్రేమికులను ఎంచుకునేందుకు సరికొత్త మార్గం తెరుచుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫారాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు ఏర్పరుచుకుని, వాటిని ప్రేమలుగా మార్చుకుంటున్నారు. వీటికితోడు కొత్తగా ఆన్లైన్ గేమ్లు కూడా యువతీయువకుల ప్రేమలకు వేదికలవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైదర్, భారత్కు చెందిన సచిన్ల లవ్ స్టోరీ ప్రస్తుతం వార్తల్లో నానుతోంది. ఇదే నేపధ్యంలో ఇప్పుడు గోరఖ్పూర్లోనూ ఇటువంటి ప్రేమకథ వెలుగుచూసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గోరఖ్పూర్లోని పీపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 ఏళ్ల యువతి ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం రెండు రోజుల పాటు గాలించారు. ఈ నేపధ్యంలో తమ కుమార్తె ప్రియునితో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వారు పీపీగంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అజ్ఞాత యువకునిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆ యువతి కోసం వెదుకులాట మొదలుపెట్టారు. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్ల ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమయ్యింది. దీంతో సీమా తన నలుగురు పిల్లలతో పాటు నేపాల్ గుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించి, చివరకు నోయిడాలోని తన ప్రేమికుని వద్దకు చేరింది. ఇదేవిధంగా గోరఖ్పూర్కు చెందిన ఒక యువతి బీహార్కు చెందిన ఒక యువకునితో ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. దీంతో పట్నాలో ఉంటున్న తన ప్రేమికుడు సుజీత్ దగ్గరకు చేరుకుంది. ఫ్రీ ఫైర్గేమ్ ప్రేమికులిద్దరూ జూలై 31న ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తె చదువుకుంటున్నానని చెబుతూ, తమకు తెలియకుండా మొబైల్లో గేమ్ ఆడుతుంటుందని తెలిపారు. తాము కుమార్తెపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని అన్నారు. ప్రియుడు ఆటోవాలా.. ఈ ఉదంతం గురించి పీపీగంజ్ పోలీసు అధికారి ఆశీష్ సింగ్ మాట్లాడుతూ మాయమైన యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రేమికుల గురించి వెదుకులాట ప్రారంభించామన్నారు. వీరి లొకేషన్ బీహార్లోని పట్నాను చూపిస్తున్నదన్నారు. ఆ యువకుడు పట్నాలో ఆటో నడుపుతుంటాడన్నారు. ప్రేమికులిద్దరినీ గోరఖ్పూర్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రం పరిధిలో ఉన్నందున్న అనుమతులు అవసరమవుతాయన్నారు. ఆ యువతి మైనర్ అని, ఆమెకు 21 ఏళ్ల అని, ఆ ప్రేమికులతో మాట్లాడిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇది కూడా చదవండి: నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు -
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
మొబైల్ ఘుమఘుమలు
ఇప్పుడు ప్రతి విషయాన్ని కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బుకు అత్యంత విలువ ఇస్తున్నారు. అంతేకాదు.. నాణ్యమైన భోజనంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇరుకు సందుల్లో, జనం గుమికూడిన ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. నగర శివారులోకి వెళితే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన అల్పాహారం తక్కువ ధరలోనే లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చెట్ల నీడన.. అప్పటికప్పుడు తయారు చేస్తున్న అల్పాహారం తినేందుకు ఇష్టపడుతున్నారు. – సాక్షి, కర్నూలు డెస్క్ డబ్బుంటే పెద్ద హోటళ్లకు వెళ్లి తింటారనుకోవడం పొరపాటు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇప్పుడు మంచి హోటల్ ఎక్కడుందని వెతుక్కోవడం మాని శివారు ప్రాంతాల్లో మొబైల్ క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నారు. ఉదయాన్నే గుత్తి పెట్రోల్ బంకు, నంద్యాల చెక్పోస్టు, రింగ్రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మొబైల్ క్యాంటీన్ల చుట్టూ గుమికూడిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తాయి. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వాళ్లు నగరంలోకి వెళ్లే ముందే టిఫిన్ కానిచ్చేస్తే ఆ తర్వాత వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అక్కడే ఆగిపోతున్నారు. ఏదైనా పని మీద వచ్చినా, లేదా కుటుంబంతో వచ్చినా సుమారు ఐదారుగురు వెంట ఉంటుండటంతో మొబైల్ క్యాంటీన్ ఎంచక్కా వీరి ఆకలి తీరుస్తోంది. నగరంలోని ఏ హోటల్కు వెళ్లినా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం టిఫిన్ చేయాలంటే సుమారు రూ.500 పైమాటే అవుతుంది. ఇక కూర్చొని తినే హోటళ్లు అయితే.. ఆర్డర్ ఇచ్చిన ఏ అరగంటకో కానీ టిఫిన్ టేబుల్ మీదకు రాని పరిస్థితి. చివరగా టిప్ ఇవ్వకపోతే వెయిటర్ అదో రకంగా చూడటం షరామామూలే. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద టిఫిన్ చేస్తే అప్పటికప్పుడు రుచికరమైన అల్పాహారం క్షణాల్లో రెడీ అయిపోతుంది. అందునా ఏ టిఫిన్ చేసినా రూ.30 మాత్రమే తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్ల వద్ద రద్దీ కూడా అధికంగానే ఉంటోంది. రోజుకు రూ.5లక్షల పైనే వ్యాపారం నగరంలోని ప్రధాన కూడళ్లలో దుకాణం అద్దెకు తీసుకోవాలంటే వేల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. డిపాజిట్ లక్షల్లో చెల్లించడం సరేసరి. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు సరికొత్త ఆలోచనతో రోడ్డెక్కుతున్నాయి. కావాల్సిన విధంగా మార్పులు చేసుకొని సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఒక కూడలిలో వ్యాపారం జరగకపోతే కొంతకాలానికి మరోచోటుకు మార్చుకునే అవకాశం ఉండటం కూడా మొబైల్ క్యాంటీన్లపై ఆసక్తి పెంచుతోంది. ఇకపోతే ప్రస్తుతం నగరంలో వీటి సంఖ్య 80కి పైగానే ఉండటం విశేషం. ప్రతిరోజూ వీరి వ్యాపారం రూ.5లక్షలకు పైగానే ఉంటోందంటే భోజన ప్రియులను ఏస్థాయిలో ఆకట్టుకుంటున్నారో అర్థమవుతుంది. వంట మాస్టర్లకు గిరాకీ హోటల్ వ్యాపారంలో వంట మాస్టర్లు కీలకం. వీళ్లు ఒక్కరోజు సెలవు పెట్టినా యజమాని ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. అందువల్లే మరొకరిని కూడా అందుబాటులో ఉంచుకుంటారు. అయితే మొబైల్ క్యాంటీన్లను ఉదయం మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఆ మేరకు కూలీ ఇస్తున్నారు. చేస్తున్న టిఫిన్ల ఆధారంగా కూడా కూలీ నిర్ణయిస్తున్నారు. నైపుణ్యం ఆధారంగా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని మొబైల్ క్యాంటీన్లు సాయంత్రం కూడా నిర్వహిస్తుండటంతో మాస్టర్లు నెల వారీ జీతం తీసుకుంటున్నారు. వ్యాపారానికి అనువుగా వాహనాలు మొబైల్ క్యాంటీన్ నిర్వాహకులు తమ స్థోమతకు అనువుగా వాహనాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సాధారణంగా వాహనాల ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఉంటుంది. వీటిని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలంటే రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు సెకండ్ హ్యాండ్ వాహనాలను రూ.3లక్షల్లోపు కొనుగోలు చేసి మొబైల్ క్యాంటీన్గా అదనపు డబ్బుతో తీర్చిద్దుకుంటున్నారు. ఇతని పేరు ఆంజనేయులు. చిన్న తనంలోనే పారుమంచాల గ్రామం నుంచి కర్నూలు నగరంలో స్థిరపడ్డారు. చెక్పోస్టు వద్ద ఒకటి, జి.పుల్లారెడ్డి కళాశాల సమీపంలో మరో మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వీటితో ఇతను ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది కూలీలను ఏర్పాటు చేసుకొని వారికీ ఉపాధి కలి్పస్తున్నారు. ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతను హుస్సేన్రెడ్డి. దూరదర్శన్ కేంద్రం సమీపంలో వెంకటసాయి మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఒక వంట మాస్టర్, మరో ముగ్గురు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారం చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వెళ్లే వాళ్లు ఇక్కడే ఆగి టిఫిన్లు చేసి వెళ్తున్నారని చెబుతున్నాడు. ఈ కారణంగా వాళ్లకు తక్కువ ధరలో టిఫిన్ లభించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నాడు. తక్కువ ధరలో అల్పాహారం నగరంలోని హోటళ్లతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో టిఫిన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల కింద ఆహ్లాదకరంగా తినే వీలుంటుంది. కళ్లెదుటే చేస్తుండటంతో నాణ్యత విషయంలోనూ అనుమానం అక్కర్లేదు. రుచికరమైన అల్పాహారం చాలా తక్కువ ధరతో అందిస్తున్నారు. – వెంకటేశ్వర్లు, మెడికల్ రెప్, కర్నూలు కళ్లెదుటే వేడివేడిగా.. మేము కర్నూలులో ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత కాలేజీలో కాస్త పని చూసుకోవాలి. నగరంలోని హోటళ్లకు వెళితే అక్కడ ఆర్డరు చెప్పడం, తీసుకొచ్చే లోపు చాలా సమయం పడుతుంది. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద కళ్లెదుటే వేడివేడి టిఫిన్లు హాయిగా తినొచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. – హుస్సేన్వలి, నంద్యాల చాలా రుచిగా ఉంటాయి నేను హమాలీ పని చేస్తుంటా. ఉదయాన్నే పని మీద బయటకు వస్తాం. హోటళ్లలో టిఫిన్ చేయాలంటే మాకు వచ్చే కూలీ సరిపోదు. అందుకే మొబైల్ క్యాంటీన్లలో తింటాం. ఇక్కడ ఎంతో రుచికరంగా, పరిశుభ్రత పాటించి వివిధ రకాల టిఫిన్లను అప్పటికప్పుడు అందిస్తారు. ధరలు కూడా చాలా తక్కువ. – రాజశేఖర్, దూపాడు, కర్నూలు -
మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం
ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ప్రధాని చైనా అధికారిక పర్యటనను అనూహత్యంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంగా నిలవనుంది. అయితే తలకు గాయం కావడంతో చైనా పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యిందని స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఫోన్ని చూస్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు రాత్రి పర్యటకు రావడం లేదని చైనాకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. చదవండి: మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం.. లోక్సభలో ఎవరి బలం ఎంతంటే! ‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద మొబైల్ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడిపోయాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. ఇప్పుడే ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాను’ అని పేర్కొన్నారు. ఇక వీడియోలో అతని చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు సైతం కనిపిస్తున్నాయి. దీంతో తలకు దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అధికారిక పర్యటనల కోసం భవిష్యత్తులో చైనా నుంచి ఆహ్వానాలు అందుతాయని రబుకా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటన రద్దు ఫిజీ, చైనాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF — Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023 -
ప్రాక్సిమస్ గ్రూప్ గూటికి రూట్ మొబైల్
న్యూఢిల్లీ: ఎంటర్ప్రైజ్ మెసేజింగ్ సేవల సంస్థ రూట్ మొబైల్లో బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్ గ్రూప్ 84 శాతం వరకు వాటాలను దక్కించుకోనుంది. ఇందులో భాగంగా ముందు దాదాపు 58 శాతం వాటాలను రూ. 5,922 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్తో నిబంధనల ప్రకారం.. 26 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రానుండటంతో, ఆ మేరకు షేర్లన్నింటినీ కొనుగోలు చేస్తే మొత్తం 84 శాతం వరకూ వాటాలను పెంచుకునే అవకాశం ఉంది. అయితే, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలనే నిబంధన మేరకు 12 నెలల్లోగా కొన్ని షేర్లను విక్రయించి తన వాటాను 75%కి తగ్గించుకోవాల్సి రానుంది. షేరు ఒక్కింటికి రూ. 1,626.40 చొప్పున అనుబంధ సంస్థ ప్రాక్సిమస్ ఓపల్ ద్వారా ప్రాక్సిమస్ గ్రూప్ తమ సంస్థలో 57.56% వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రూట్ మొబైల్ తెలిపింది. లావాదేవీ పూర్తయ్యాక రూట్ మొబైల్ సీఈవో రాజ్దీప్ గుప్తా తన ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతూనే.. గ్రూప్ సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్ఫాం యాజ్ ఎ సర్వీస్) కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారు. రూట్ మొబైల్లో వాటాల కొనుగోలుతో అంతర్జాతీయంగా సీపాస్ విభాగంలో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రాక్సిమస్ గ్రూప్ సీఈవో గిలామ్ బూటిన్ తెలిపారు. ప్రాక్సిమస్ సంస్థలో పెట్టుబడి.. ఒప్పందం ప్రకారం రూట్ మొబైల్ వ్యవస్థాపక వాటాదారుల్లో కొందరు ప్రాక్సిమస్ ఓపల్లో అలాగే ప్రాక్సిమస్కు చెందిన మరో అనుబంధ సంస్థ టెలీసైన్లో మైనారిటీ వాటాలు తీసుకోనున్నారు. ఇందుకోసం 299.6 మిలియన్ యూరోలను వెచి్చంచనున్నారు. రూట్ మొబైల్ మరింత ముందుగానే బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు టెలీసైన్తో భాగస్వామ్యం ఉపయోగపడగలదని గుప్తా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఎస్ఈలో రూట్ మొబైల్ షేరు సుమారు 9% క్షీణించి రూ. 1,486 వద్ద క్లోజైంది. -
సెల్ఫోన్ కోసం గొడవ.. యువతిని రైలు నుంచి తోసేయడంతో
సాక్షి, చెన్నై: చైన్నె కందన్చావడి, తిరువిక వీధికి చెందిన శశి కుమార్ కుమార్తె ప్రీతి(22).. కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె ఈనెల 2వ తేదీ సాయంత్రం, పని ముగించుకుని, సబర్బన్ రైలులో ప్రయాణించింది. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి వద్ద సెల్ఫోన్ లాక్కోవడానికి యత్నించారు. ఈ సమయంలో వారితో గొడవపడింది. రైలు ఇందిరా నగర్ స్టేషన్ సమీపంలోకి రాగానే కోపోద్రిక్తులైన ఇద్దరు వ్యక్తులు ప్రీతీని కిందకు నెట్టారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు ఆమెను రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతి చెందింది. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో తిరువాన్ముయూర్ రైల్వే పోలీసులు ఇందిరా నగర్ రైల్వేస్టేషన్ సహా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో పట్టి నపాక్కంకు చెందిన విఘ్నేష్ (27), అడియార్కు చెందిన మణిమారన్ (26) నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్ శాంటానా మూడు రోజుల పాప కథ.. -
సీసీఎంబీ మొబైల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
-
త్వరలో విడుదలకానున్న ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ ఇదే!
Oppo Reno 10 Series: భారతదేశంలో 5జీ మొబైల్స్ విరివిగా అమ్ముడవుతున్న సమయంలో 'ఒప్పో' (Oppo) సంస్థ తన 'రెనో 10 సిరీస్' (Reno 10 Series) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధునిక ఫీచర్స్తో విడుదలకానున్న ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్కు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ 5జి మొబైల్ గత మే నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదలయ్యాయి. అవి ఒప్పొ రెనొ 10, ఒప్పొ రెనొ 10 ప్రో, ఒప్పొ రెనొ 10 ప్రో ప్లస్. (ఇదీ చదవండి: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!) కొత్త రెనో 10 సిరీస్ స్మార్ట్ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్స్లో చైనా మార్కెట్లో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో కూడా ఇదే కలర్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ మొబైల్ లాంచ్ డేట్, అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. చైనాలో రెనో 10 సిరీస్ ప్రారంభ ధర 2,499 యువాన్స్. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 29,000 అని తెలుస్తోంది. 10 reasons to get excited. The #OPPOReno10Series5G - coming soon.#ThePortraitExpert pic.twitter.com/AUiIhCxAUQ — OPPO (@oppo) June 27, 2023 -
దేశంలో 5జీ హవా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్గా భారత్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2028 చివరి నాటికి మొబైల్ చందాదార్లలో దాదాపు 57 శాతం వాటా 5జీ కైవసం చేసుకోనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్గా భారత్ అవతరిస్తుందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక వెల్లడించింది. ‘2022 డిసెంబర్ చివరినాటికి దేశంలో 5జీ చందాదార్లు ఒక కోటి ఉన్నట్టు అంచనా. భారత్లో 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారీ నెట్వర్క్ విస్తరణ జరుగుతోంది’ అని ఎరిక్సన్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా 150 కోట్లు.. కొన్ని మార్కెట్లలో భౌగోళిక రాజకీయ సవాళ్లు, స్థూల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీలో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. 2023 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మొబైల్ చందాదార్లు 5జీ వేదికపైకి రానున్నారు. ఉత్తర అమెరికాలో 5జీ చందాదార్ల వృద్ధి గత అంచనాల కంటే బలంగా ఉంది. ఈ ప్రాంతంలో 2022 చివరి నాటికి 5జీ విస్తృతి 41 శాతం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి స్మార్ట్ఫోన్కు నెలవారీ అంతర్జాతీయ సగటు డేటా వినియోగం 20 జీబీ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా’ అని నివేదిక వివరించింది. -
Fact Check: కళ్లుండీ కబోదిలా
సాక్షి, అమరావతి :తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సామూహిక భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మట్టి నమూనాలను తీసుకుంటూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కచ్చితమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలను నేరుగా రైతుల మొబైల్కు పంపిస్తున్నారు. మరోవైపు ప్రతి రైతుకు భూసార కార్డు జారీకి శ్రీకారంచుట్టారు. కళ్లెదుట ఈ వాస్తవాలు కనిపిస్తున్నప్పటికీ కళ్లుండీ కబోదిలా తయారైన రామోజీ వాస్తవాలకు ముసుగేసి బురద రాతలతో ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు. ఆరోపణ: గతంలో పెద్ద ఎత్తున పరీక్షలు.. వాస్తవం: భూసార పరీక్షలు పూర్వం గ్రిడ్ పద్ధతిలో జరిగేవి. 25 ఎకరాల విస్తీర్ణానికో మట్టి నమూనా తీసుకుని దాన్ని విశ్లేషించి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే ఫలితాలతో కూడిన కార్డులిచ్చేవారు. ఇలా సేకరించిన మట్టి నమూనాలతో సంబంధం లేకుండా అశాస్త్రీయ పద్ధతుల్లో ఇష్టానుసారం కార్డులు జారీచేశారు. వీటివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు వాపోయేవారు. తమ పొలాల్లో మట్టినమూనాలు సేకరించి విశ్లేషిస్తే.. ఎలాంటి లోపాలున్నాయో తెలుస్తుందిగానీ, గ్రామంలో ఏదో ఒక మూల నమూనా తీసి విశ్లేషిస్తే ప్రయోజనమేమిటంటూ ఆందోళన చెందేవారు. ఈ విధానంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఆరోపణ: మూడేళ్లుగా భూసార పరీక్షలు అటకెక్కించేశారు వాస్తవం: 25 ఎకరాలకు ఒక నమూనా సేకరణపై రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2.5 ఎకరాలకు ఒక మట్టి నమూనా తీసుకొని శాస్త్రీయంగా విశ్లేషించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు 2019–20లో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని పైలెట్ ప్రాజెక్టుగా మట్టి నమూనాల పరీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆ ఏడాది ఏకంగా 2.26 లక్షల మట్టినమూనాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషించి ఫలితాలను రైతులకు తెలియజేశారు. తదనుగుణంగా సూక్ష్మపోషకాలు అందించారు. పైలెట్ ప్రాజెక్టులో మెరుగైన ఫలితాలు రావడంతో 2020–21లో సామూహికంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంతలో కోవిడ్ మహమ్మారి విరుచుకుపడడంతో రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాదేశాల మేరకు భూసార పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఆరోపణ: పరికరాలు, సిబ్బంది కొరత.. వాస్తవం: కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మేరకు 2023–24లో ప్రతి గ్రామంలో ప్రతి రైతుక్షేత్రంలో మట్టినమూనాలు సేకరించి, విశ్లేషించడమే కాకుండా.. ప్రతి రైతుకు భూసార కార్డు జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రైతులను భాగస్వాములను చేస్తూ మూడేళ్లలో 25 లక్షల నమూనాలు పరీక్షించి 25 లక్షల మందికి భూసార కార్డుల జారీ లక్ష్యంతో సామూహిక భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న భూసార పరీక్ష కేంద్రాలను ఆధునికీకరించారు. అవసరమైన పరికరాలను సమకూర్చారు. సిబ్బందిని నియమించారు. ఆరోపణ: సాగు మొదలయ్యాక నమూనాల సేకరణ? వాస్తవం: 2023–24 సీజన్లో రూ.19.82 కోట్ల అంచనా వ్యయంతో 6,37,453 మట్టి నమూనాలు విశ్లేషించి రైతులకు భూసార కార్డులివ్వాలని నిర్ణయించారు. ఆర్బీకే స్థాయిలో అధికారులకు విడతల వారీగా శిక్షణ కూడా ఇచ్చారు. మట్టి నమూనాల సేకరణ కోసం ఏప్రిల్లో భూసార వారోత్సవాలు నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో మట్టినమూనాలు సేకరించారు. ఆరోపణ: అంతా మొక్కుబడిగా.. వాస్తవం: వారోత్సవాల్లో 2.60 లక్షల మట్టి నమూనాలను రైతుల సమక్షంలోనే మొబైల్ యాప్ ద్వారా జియో కో ఆర్డినేట్లను పొందుపరిచి మరీ సేకరించారు. క్యూఆర్ కోడ్ టెక్నాలజీని ఉపయోగించి సేకరించిన మట్టి నమూనాల స్థితిని అక్కడికక్కడే తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. కచ్చితమైన జియో కో ఆర్డినేట్లను నమోదు చేయడం ద్వారా మట్టి నమూనాలు ఎక్కడ నుంచి సేకరించారో రాష్ట్ర మ్యాప్ ద్వారా స్పష్టంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. నేల ఆరోగ్యస్థితిని తెలుసుకునేందుకు వీలుగా సాయిల్ ఫెర్టిలిటీ మ్యాప్లను రూపొందించారు. ఫలితాలను మొబైల్ యాప్ ద్వారా రైతులకు అందిస్తున్నారు. జియో కో ఆర్డినేట్స్తో రైతుల వారీగా భూసార పరీక్ష ఫలితాలను సాయిల్ హెల్త్కార్డ్ పోర్టల్లో కూడా పొందుపరుస్తున్నారు. ఆరోపణ: సున్నా నుంచి మొదలు పెట్టా ల్సిందే? వాస్తవం: మట్టి నమూనాలను సేకరించడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రతి సీజన్లో ఖరీఫ్–రబీ పంటకాలాలకు ముందు సామూహికంగా మట్టి నమూనాలను సేకరించి భూసార కేంద్రాల్లో విశ్లేషించి కనీసం మూడేళ్లపాటు వర్తించేలా రైతులకు భూసార కార్డులను జారీచేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలు ఆధారంగా.. రసాయనిక ఎరువుల అనవసర, విచక్షణారహిత వినియోగానికి అడ్డుకట్ట వేయడం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి, నాణ్యమైన పంట దిగుబడి పెంచేలా ఆర్బీకేల ద్వారా అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. -
ఈ యాప్స్ యమా డేంజర్
-
Oppo F23 5G కొత్త ఫీచర్స్ ఇవే
-
వాట్సాప్లో సచివాలయాల సేవలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీరు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రజలకు పాలన ఎంతో చేరువైంది. ఇక మీదట ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. వాట్సాప్లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే మొబైల్ నెంబరుకు కేవలం ‘హాయ్’ అని మేసెజ్ చేస్తే చాలు.. సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టే అందుతుంది. అలాగే, ‘నవరత్నాల’ పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా.. లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారన్న సమాచారం కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్లో అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికితోడు.. ఈ సేవల కోసమే ఒక మొబైల్ నంబరును కేటాయించి ఆ నంబరుకు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు.. ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్ను ఇప్పటికే తెరిచినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఉదా.. ఎవరైనా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత అధికారుల ఆమోదం అనంతరం ఆ సమాచారం వాట్సాప్ ద్వారా దరఖాస్తుదారుడి మొబైల్ నెంబరుకు ఇవ్వడంతోపాటు ఆయా ధ్రువీకరణ పత్రాలను కూడా మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని నెలన్నర రోజులుగా అమలుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సేవల్లో సువర్ణాధ్యాయం.. నాలుగేళ్ల క్రితం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్నపని ఉన్నా మండల, జిల్లా ఆఫీసుల చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేది. అన్ని అర్హతలు ఉండి పింఛను లేదా రేషన్కార్డు లేదా మరోదాని కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటే.. అదెప్పుడు మంజూరవుతుందో తెలీని దుస్థితి. పైగా మంజూరు కాకపోతే ఎందుకు కాలేదో కూడా చెప్పే దిక్కుండదు. సరైన సమాచారమిచ్చే నాథుడేలేక దరఖాస్తుదారునికి చుక్కలు కనిపించేవి. కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వలంటీరు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటవడంతో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలందరికీ వారివారి సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయి. పింఛన్లు, రేషన్ల పంపిణీ వంటివి అయితే లబ్ధిదారుల గడప వద్దే అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా ఆ పథకం అర్హుల వివరాలతో పాటు, తిరస్కరణకు గురైన వారి వివరాలు, ఎందుకు తిరస్కరణకు గురయ్యాయన్న సమాచారాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ సమాచారమంతా వాట్సాప్లోనూ.. ఇక వాట్సాప్ ద్వారా కూడా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు పూర్తిస్థాయిలో అమలుచేసే విధానం అమలులోకి వస్తే.. సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచే సమాచారం కూడా ప్రజలు వాట్సాప్ ద్వారా తెలుసుకునే వీలు ఏర్పడుతుందని ఆ అధికారులు తెలిపారు. అదెలాగంటే.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే వాట్సాప్ నెంబరుకు కేవలం ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు.. ఆ సమయంలో పథకాల పేర్లు వాట్సాప్ మెసేజ్లో ప్రత్యక్షమవుతాయి. తాము తెలుసుకోదలిచిన పథకం ఎంపిక చేసుకుని ఎవరికి వారు తమ ఆధార్ నెంబరు నమోదుచేస్తే అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అనర్హులుగా పేర్కొంటే ఆ వివరాలు కూడా ఆ సమాచారంలో తెలుస్తాయి. దీనికితోడు.. పింఛను, రేషన్కార్డు వంటి వాటితో ఏవైనా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అది ఏ అధికారి పరిశీలనలో ఉందన్న సమాచారం ఆ దరఖాస్తుదారునికి వాట్సాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. -
వైరల్ వీడియో: నాకూ వచ్చు రీల్స్..
-
Viral Video: తిక్క కుదిరింది.. మొబైల్ కొట్టేద్దామనుకున్నాడు.. పాపం చివరికి!
కర్మ సిద్దాంతాన్ని చాలా మంది నమ్ముతుంటారు. చేసిన ప్రతి పనులకు తప్పక ఫలితం అనుభవించాల్సి ఉంటుందని దీని అర్థం. ఎదుటి వారికి మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే అదే చెడు మనకి రివర్స్లో తగులుతుందని భావిస్తుంటారు. అందరి విషయంలో ఏమో కానీ ఓ యువకుడి విషయంలో జరిగింది తెలుసుకుంటే మాత్రం ‘కర్మ ఫలం’ నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డు పక్కన ఓ యువతి ఒంటరిగా నిల్చొని మొబైల్ చూస్తూ ఉంటుంంది. అదే దారిలో ఓ యువకుడు సైకిల్పై వచ్చాడు. యువతి దగ్గరకు చేరుకోగానే ఆమె చేతిలో నుంచి మొబైల్ తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మీద వస్తున్న కారు అతనికి ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. కారు తగిలి కిందపడ్డ దొంగ మళ్లీ లేచి పరుగులు తీశాడు. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు రోడ్డు మీద ఉన్న చాలా మంది అతన్ని వెంబడించారు. అయినా ఎవరికి దొరకకుండా పరుగులు తీశాడు. ఈ క్రమంలో దొంగ కొన్నిచోట్ల కిందపడిపోతూ దెబ్బలు తగిలించుకున్నాడు. గాయాలైన కూడా మళ్లీ లేచి పరుగెత్తాడు. కానీ చివరికి దొంగ దొరికిపోయాడు. కొంతమంది యువకులు అతన్ని పట్టుకొని కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. తక్షణ (ఇన్స్టంట్) కర్మ అంటే ఇదేనంటూ.. దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని ఉద్ధేశించి కామెంట్ చేస్తున్నారు. అంతేగాక యువతికి సాయం చేసేందుకు ప్రయత్నించిన వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్గా ఏం చేశాడంటే! Karma is Real pic.twitter.com/klE9IpsCYS — Karma Videos (@thedarwinawerds) March 21, 2023 -
మీ మొబైల్ భద్రమా? ఉన్నట్టుండి బ్యాటరీ డౌన్, తెలియకుండానే డాటా ఖతం!
రోజురోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మనకు కావాల్సిన సమాచారం మొత్తం మన చేతిలో (స్మార్ట్ఫోన్లో) ఉంచుకుంటున్నాము. అయితే కొంతమంది మన సమాచారాన్ని తెలుసుకోవడానికి హ్యాక్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది. మన ఫోన్లో మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన సమాచారం ఎవరైనా చూస్తున్నారా?.. లేదా.. అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. తెలియని అప్లికేషన్లు (Unfamiliar Applications): ఆధునిక కాలంలో స్పైవేర్ ఇతర వ్యక్తులను గురించి తెలుసుకోవడానికి ప్యారంటల్ కంట్రోల్ యాప్స్ ఉపయోగించుకుంటారు. ఈ యాప్లలో ఒకదానిని ఉపయోగించి ఎవరైనా మీ ఫోన్లో స్పై చేస్తుంటే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి డౌన్లోడ్ చేసినట్లు మీకు గుర్తులేని ఏవైనా తెలియని అప్లికేషన్ల కోసం మీ ఫోన్లో సర్చ్ చేయవచ్చు. దీనికోసం నెట్ నానీ, కాస్పెర్స్కీ సేఫ్ కిడ్స్, నార్టన్ ఫ్యామిలీ యాప్స్ ఉపయోగపడతాయి. పర్ఫామెన్స్లో సమస్యలు: స్పైవేర్ మీ డేటాను ఎప్పటికప్పుడు సేకరించుకుంటుంది. అయితే మునుపటికంటే మీ మొబైల్ పర్ఫామెన్స్ విషయంలో తగ్గితే వెంటనే దానికి కారణాలు తెలుసుకోండి. స్మార్ట్ఫోన్ను ఎలా వేగవంతం చేయాలనే దానిపై అరా తీయండి, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని శోధించండి. బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం: స్పైవేర్ నిరంతరం పని చేస్తుంటే, అది మీ బ్యాటరీని సాధారణం కంటే వేగంగా ఖాళీ చేస్తుంది. అయితే అన్ని బ్యాటరీలు క్రమంగా క్షీణిస్తాయి, అలా కాకుండా కారణం లేకుండా త్వరగా క్షీణించడం ప్రారంభమైతే దానికి కారణం తెలుసుకోండి. ముందుగా మీరు ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసారా? లేదా అప్డేట్ చేసారా చూడండి. కొన్ని యాప్స్ కూడా బ్యాటరీ త్వరలో ఖాళీ అవ్వడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ వేడెక్కడం: మీ మొబైల్ చాలా వేగంగా వేడెక్కుతుంటే ఎవరో మీ మొబైల్ హ్యాక్ చేస్తున్నారని అనుమానించండి. తక్కువగా ఉపయోగించనప్పుడు లేదా అసలే ఉపయోగించకుండా ఉన్నప్పుడు వేడెక్కితుంటే తప్పకుండా దానికి కారణాలు తెలుసుకోండి. ఎక్కువ డేటా వినియోగం: మీ మొబైల్ ఫోన్లో అనుకోకుండా ఎక్కువ డేటా ఖాళీ అవుతుంటే స్పైవేర్ రన్ అవుతుందనే సంకేతం కావచ్చు. ఎందుకంటే నేరస్థుడు సమాచారాన్ని పొందటానికి యాప్ డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది, కాబట్టి డేటా వినియోగంలో పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు: నిజానికి మన ఫోన్ మనకు కావలసినప్పుడు షట్ డౌన్ చేసుకోవచ్చు, లేదా రీస్టార్ట్ చేసుకోవచ్చు. అయితే హ్యాకర్లు మన మొబైల్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. నేరస్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఫోన్ ఉపయోగించాలి కాబట్టి యాక్సెస్ చేయడం జరుగుతుంది. సర్చ్ బ్రౌజర్ హిస్టరీ: మీ మొబైల్ ఫోన్లో ఎప్పటికప్పుడు బ్రౌజర్ హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా అందులో ఫోన్ స్పై సాఫ్ట్వేర్ గురించి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్పైవేర్ని డౌన్లోడ్ చేయడానికి మీ బ్రౌజర్ని ఎవరైనా ఉపయోగించే అవకాశం ఉంది. బహుశా అలా జరిగినప్పుడు హిస్టరీలో మనకు కనపడుతుంది. మొబైల్ ఫోన్లో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. స్పైవేర్ రిమూవ్ టూల్ ఉపయోగించండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి స్పైవేర్ను తీసివేయడానికి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించండి. ఇది స్పైవేర్ (మరియు ఇతర రకాల మాల్వేర్) కోసం మీ పరికరాన్ని స్కాన్ చేస్తుంది, అదే సమయంలో దానిని పూర్తిగా తీసివేస్తుంది. అయితే దీని కోసం భద్రత కలిగిన సాఫ్ట్వేర్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయండి: మొబైల్ ఫోన్ హ్యాక్ నుంచి తప్పించుకోవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయడం మంచిది. దీని ద్వారా పూర్తిగా తీసివేసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావున దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపయోగించాలని సూచిస్తున్నాము. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి: ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల స్పైవేర్ పూర్తిగా తొలగించబడుతుంది. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఫోన్లో ఉన్న అన్ని అంశాలు పోతాయి. మీరు ఏదైనా ఫోన్ తీసుకుంటే దానిని తప్పకుండా రీసెట్ చేయాలి. అంతే కాకుండా ఎప్పుడూ అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. -
టెక్...టాక్
వివో వి27 ప్రో సైజ్: 6.78 అంగుళాలు బరువు: 182 గ్రా. మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్ 256జీబి 8జీబి ర్యామ్ 256జీబి 12జీబి ర్యామ్ డిస్ప్లే: 1080“2400 పిక్సెల్స్ ఫీచర్స్: డ్యూయల్–ఎల్ఈడీ ఫ్లాష్ వోఎస్: ఆండ్రాయిడ్ 13, ఫన్టచ్ 13 కలర్స్: బ్లాక్, మింట్ రీయూజబుల్ నోట్బుక్ పేపర్ వృథా కాకుండా రూపొందించిన ఎకో–ఫ్రెండ్లీ రీయూజబుల్ నోట్బుక్ ఇది. బ్రాండ్: రాకెట్ సైజ్: 8.5“9.5 పేజీలు: 82 ► పైలట్ ఫ్రిక్సియన్ పెన్ డెస్క్టాప్ వాక్యూమ్ క్లీనర్ బ్రాండ్: రెమ ఎక్స్ఎక్స్ ఫిల్టర్టైప్: ఫోమ్ ► మల్టీపుల్: డెస్క్టాప్, లాప్టాప్...మొదలైనవి. ►హైస్పీడ్ సెంట్రెఫిగల్ ఫ్యాన్ ► ఫామ్ ఫ్యాక్టర్: హ్యాండ్ హెల్డ్ -
జైల్లో ఆకస్మిక తనిఖీలు.. మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..
పాట్నా: బిహార్ గోపాల్గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు. చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్ -
మొబైల్ స్పీడ్లో మెరుగుపడ్డ భారత్.. 5జీ రాకతో దూకుడు!
దేశంలో 5జీ సేవలు విస్తృతం కావడంతో మొబైల్ స్పీడ్లో భారత్ మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా సగటు మొబైల్ వేగంలో మన దేశం జనవరిలో 10 స్థానాలు ఎగబాకింది. డిసెంబర్లో 79వ స్థానంలో ఉన్న భారత్ జనవరిలో 69వ స్థానానికి చేరుకున్నట్లు ఊక్లా నివేదిక పేర్కొంది. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్లోనూ భారత్ తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంది. డిసెంబర్లో 81వ స్థానంలో ఉండగా జనవరిలో 79వ స్థానానికి చేరుకుందని నెట్వర్క్ ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్స్ ప్రొవైడర్ ఊక్లా నివేదించింది. ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటు డిసెంబర్లో 49.14 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 50.02 ఎంబీపీఎస్కి స్వల్పంగా పెరిగింది. కాగా ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటులో భారత్ నవంబర్లో 105వ స్థానంలో ఉండేది. ఈ ఓవరాల్ మొబైల్ స్పీడ్ సగటు గత డిసెంబర్లో 25.29 ఎంబీపీఎస్ ఉండగా జనవరిలో 29.85 ఎంబీపీఎస్కు మెరుగుపడింది. జనవరి స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ఓవరాల్ సగటు మొబైల్ స్పీడ్ చార్ట్లో యూఏఈ అగ్రస్థానంలో ఉంది. ఇదే సమయంలో పపువా న్యూగినియా ర్యాంక్ ఏకంగా 24 స్థానాలు మెరుగుపడటం గమనార్హం. ఇక ఫిక్స్డ్ మొబైల్ స్పీడ్ సగటులో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా సైప్రస్ 20 స్థానాలను మెరుగుపరుచుకుంది. -
బైక్పై దూసుకెళ్తూ మొబైల్ దొంగ దుర్మరణం!
సాక్షి, శివాజీనగర: ప్రజల నుంచి మొబైల్ఫోన్లు లాక్కెళ్తూ వేగంగా దూసుకెళ్లిన బైకర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు డివైడర్కు బైక్ ఢీకొనడంతో ఒకరు అక్కడే మృతి చెందగా అతని వద్ద 8 మొబైల్ఫోన్లు చిక్కడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి సిటీ మార్కెట్ పై వంతెన మీద ఈ ఘటన జరిగింది. మృతుడు కబీర్ పాషా. అతి వేగంగా పై వంతెన మీద వెళుతుండగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పడడంతో తలకు గాయాలై చనిపోయాడు. ద్విచక్ర వాహనంలో ఎనిమిది మొబైల్లు లభించడం పలు అనుమానాలకు కారణమైంది. కేపీసీసీ కార్యాలయం వద్ద ఓ మహిళ మొబైల్ ఫోన్ను లాక్కొని పరారైంది ఇతడేనని అనుమానం ఉంది. సెల్ చోరీలకు పాల్పడి ఉడాయించాలనే తొందరలో ప్రమాదానికి గురైనట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి గాయపడగా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: భార్యకు బీమా పత్రాలు, డెత్నోట్ వాట్సాప్ చేసి..) -
Banjara Hills: బియ్యం కావాలని దుకాణానికి వచ్చి..
సాక్షి, బంజారాహిల్స్: బియ్యం కావాలని దుకాణానికి వచ్చిన ఓ అగంతకుడు షాపు యజమాని దృష్టి మరల్చి సెల్ఫోన్తో పాటు ద్విచక్రవాహనం అపహరించుకుపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో అబ్దుల్ రహీం బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి షాపునకు వచ్చి తనకు రెండు బ్యాగుల బియ్యం కావాలని శాంపిల్ చూపించాలని అడిగాడు. బియ్యం నమూనాలు తీసేందుకు రహీం బ్యాగుల వద్దకు వెళ్లగా.. అదే సమయంలో టేబుల్పై ఉన్న సెల్ఫోన్తో పాటు బయట ఉన్న స్కూటీని అపహరించుకొని క్షణాల్లో అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొబైల్ చూడొద్దని మందలించారని...
సాక్షి బెంగళూరు: మొబైల్ చూడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు బాలిక మనస్తాపానికి గురై పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..బెంగళూరు ఈశాన్య విభాగం బాగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కణ్ణూరులోని అపార్ట్మెంట్లో రవికుమార్ ఓజా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన కుమార్తె నవ్య ఓజా (13) ఏడో తరగతి చదువుతోంది. నవ్య ఎక్కువగా మొబైల్ చూస్తుండడంతో చదువుపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు గురువారం రాత్రి పది గంటల సమయంలో మందలించారు. పది నిమిషాల అనంతరం బాలిక అపార్టుమెంట్పైకి వెళ్లి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!) -
షావోమి నుంచి వస్తున్న స్టైలిష్ స్మార్ట్ఫోన్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా!
ఆధునిక కాలంలో యువకుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్రాడెక్ట్ వాడకంపై ఆసక్తి చూపుతుంటారు. అయితే మిగిలిన వాటితో పోలిస్తే ఈ కొత్తదనం 'మొబైల్స్' లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో మొబైల్స్ విడుదల చేస్తుంటాయి. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ 'షియోమీ' (Xiaomi) మార్కెట్లో కొత్త మొబైల్ '13 సిరీస్' లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే లాంచ్ డేట్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ని 2022 డిసెంబర్ 01 న చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్లో కంపెనీ 'షియోమీ 13' 'షియోమీ 13 ప్రో' అనే రెండు మోడల్స్ ఉన్నాయి. త్వరలో విడుదలకానున్న కొత్త 'షియోమీ 13 సిరీస్' అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. స్మార్ట్ఫోన్ సిరీస్లో లైకా బ్రాండెడ్ సెన్సార్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్లో ఇది రన్ అవుతుంది. షావోమి 13 Pro 12GB ర్యామ్తో రానున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా హ్యాండ్సెట్ 2k రిజల్యూషన్తో 6.7 ఇంచెస్ సామ్సంగ్ ఈ6 అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ను అందిస్తుంది. షావోమీ కొత్త సిరీస్ రెండు రకాల ర్యామ్ లతో రావచ్చని రూమర్ల ద్వారా తెలిసింది. అవి 8 GB, 12GB,అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 128GB, 256GB, 512GB వరకు జత చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే.. కెమెరా సిస్టమ్ 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్తో జత చేయబడిన 50MP సోనీ IMX989 ప్రైమరీ సెన్సార్, రెండవ 50MP టెలిఫోటో లెన్స్ను పొందుతుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంటుంది. చివరగా బ్యాటరీ విషయానికి వస్తే, Xiaomi 13 సిరీస్ 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాగా Xiaomi 13 Pro 120watt ఫాస్ట్ ఛార్జింగ్ పొందవచ్చు. చదవండి: రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య తగ్గుతోంది, కారణం అదేనా! -
బీ అలెర్ట్! చుట్టుపక్కల పరిస్థితుల్ని మర్చిపోయి ఫోన్లో మునిగిపోతున్నారా..
‘‘చేతిలో ఫోన్ పెడితే చాలు మనం పెట్టిందంతా వద్దనకుండా మా బుడ్డోడు తినేస్తాడు’’ ‘‘మేమిద్దరం మూవీ చూడాలనుకుంటే బుజ్జిదాని చేతికి ఫోనిస్తాం. అది అల్లరి చేయకుండా యూట్యూబ్లో కార్టూన్ చానెల్ తానే సెలక్ట్ చేసేసుకుని మరీ చూస్తుంది తెలుసా?’’ఇలాంటి మాటలు వినపడని ఇల్లూ, అనని ఇల్లాళ్లూ సిటీలో కనపడడం అరుదై పోయింది. అయితే తమ పనులు సులభంగా కావడానికి పెద్దలు ఉపయోగించే ఈ రకమైన చిట్కాలు పసిపిల్లల భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపించనున్నాయని యువతలో కనపడుతున్న తీవ్రమైన ఫబ్బింగ్ స్థితి పిల్లల్లోనూ మొదలవుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చుట్టుపక్కల పరిస్థితుల్ని మర్చిపోయేంతగా ఫోన్లో మునిగిపోవడమే ‘‘ఫబ్బింగ్’’ గా వ్యవహరిస్తున్నారు. 2012లో ఫోన్, స్నబ్బింగ్ పదాల్ని మేళవించి ఓ ఆ్రస్టేలియా యాడ్స్ సంస్థ దీన్ని సృష్టించింది. ఆ తర్వాత ఇది వాడుక పదంగా మారిపోయింది. గతంలో ఈ ఫబ్బింగ్ అనే స్థితి నగరంలోని సగానికి పైగా యువకుల్లో కనిపిస్తోందని ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం వెల్లడించింది. అదే పరిస్థితికి చిన్నారులు కూడా చేరేలా ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారితో మరింతగా... పసివయసును దృష్టి మరల్చడానికి గతంలో అరకొరగా కనిపించిన ఫోన్ చిట్కా...కరోనా నేపథ్యంలో నగరంలో మరింతగా పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, పిల్లలకు స్కూల్స్ లేకపోవడం..తల్లులకు పనుల భారం పెరగ డం..ఇవన్నీ కలిపి పిల్లలకు చేజేతులా ఫోన్ను అలవాటు చేసే దిశగా పెద్దల్ని మరింతగా ప్రేరేపించాయి. ఏడిచే పిల్లల్ని ఊరుకోబెట్టడం, తిండి తినకుండా మారాం చేసే పిల్లల్ని ఏమార్చి తినిపించడం, అల్లరి మానిపించడం...ఇలా అనేక అవసరాలకు ఫోన్ ఏకైక సులభ పరిష్కారంగా అవతరించడం పలు రకాల సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్యులు అంటున్నారు. నేటి నిశ్శబ్ధం...రేపటి యుద్ధం... పారాడే పిల్లలకి ఫోన్ అలవాటు చేయడం వల్ల వారి మాట్లాడే దశ మరింత ఆలస్యం కావచ్చునని నగరానికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.అనిత హెచ్చరిస్తున్నారు. పిల్లల్ని నిశ్శబ్ధంగా ఉంచడానికి పెద్దలు చేసే ఈ ప్రయత్నం వారిని మౌనంగా మార్చవచ్చు, అలాగే మాటలపట్ల ఆసక్తి తగ్గిపోతుందని, అలాగే భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వారికి కష్టమవుతుందని ఆమె పేర్కొన్నారు. తద్వారా పెరిగి పెద్దయే దశలో ఇతరులతో ఎలా మెలగాలో అర్థం కాక సతమతమవుతారని, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతాయని స్పష్టం చేస్తున్నారు. పిల్లల్ని తినిపించడానికి ఫబ్బింగ్కు గురి చేయడం శారీరక అనారోగ్యాలకు దారి తీస్తుందన్నారు. ఆహారం తీసుకునేటప్పుడు ఫోన్లో ఆడుకోవడం, లేదా ఏదైనా తదేకంగా చూడడం అతిగా తినడానికి, ఒబెసిటీకి దారి తీస్తాయన్నారు. కాస్త ఓపికగా వ్యవహరించడం తగినంత సమయం వెచ్చిస్తే పిల్లలను అదుపు చేయడం సమస్య కాదని దానికి బదులుగా వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే పరిష్కారాలు ఎంచుకోవడం సరైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. యువతలో ఫబ్బింగ్ అధ్యయనం ఏం చెప్పిందంటే.. సిటిలోని ఈఎస్ఐసీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధా బాల సహ రచయితగా ‘కన్సీక్వెన్స్ ఆఫ్ ఫబ్బింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్ అమాంగ్ ది హైదరాబాద్’ అనే అధ్యయనం నగర యువతలో పబ్బింగ్ సర్వసాధారణమైపోయిందని పేర్కొంది. ఇది వారి జీవితాలను వారి స్నేహితులు కుటుంబ సభ్యులతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తేల్చింది. అధ్యయనం ప్రకారం, నగర యువతలో 52% మంది ఫబ్బింగ్లో నిమగ్నమై ఉన్నారు. వీరిలో ఫబ్బింగ్ వల్ల 23% మంది అపరిమితంగా 34% మంది పరిమితంగా మానసిక ఇబ్బందులను అనుభవించారు. ఫబ్బింగ్ గేమింగ్ వ్యసనానికి కారణమవుతోంది. -
మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ కష్టాలకు చెక్..
-
పిల్లలు మొబైల్కు అడిక్ట్ కాకుండా ఉండాలంటే, ఇలా చేయండి..!
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాటయితే, స్మార్ట్ ఫోన్ సర్వహస్త భూషణం అనేది ఈనాటి మాట. అది భూషణమైతే పర్వాలేదు.. అదొక వ్యసనంగా మారింది. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకూ పట్టి పీడిస్తున్న సమస్య మొబైల్ అడిక్షన్. అసలు దేన్ని వ్యసనమంటారు? ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ గేమ్స్ కోసం వాడుతుంటే.. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ఇంకా రకరకాల కారణాల కోసం పెద్దలు వాడుతున్నారు. మొబైల్ వాడటం తప్పుకాదు. ఆ వాడకం ఎక్కువై మన రోజువారీ పనుల్ని ఇబ్బంది పెడుతుంటే, దాన్ని మానుకోవాలనుకున్నా మానుకోలేకపోతే దాన్నే వ్యసనం అంటారు. మన దేశంలో 33 శాతం మందికి ఈ వ్యసనం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అసలెందుకు అడిక్ట్ అవుతారు? మనం ఏ పని చేసినా, ఎంత సంపాదించినా.. అంతిమ లక్ష్యం ఆనందమే. నచ్చినపని చేసినప్పుడు మెదడులో డొపమైన్ అనే కెమికల్ విడుదలవుతుంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించినప్పుడు కూడా ఇదే కెమికల్ విడుదలవుతుంది. సిగరెట్ తాగేవాళ్లు నికోటిన్కు, మద్యం తాగేవాళ్లు ఆల్కహాల్కు అడిక్ట్ అయినట్లే స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు డొపమైన్కు అడిక్ట్ అవుతారు. అంటే డొపమైన్ విడుదల వల్ల వచ్చే ఆనందానికి అడిక్ట్ అవుతారు. గతంలో పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తేనో, ఆటల్లో గెలిస్తేనో సంతోషం కలిగేది. ఇప్పుడంత అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫొటోలకు లైకులు, కామెంట్స్ వచ్చినా ఆనందపడుతున్నాం.. డొపమైన్ విడుదలవుతోంది. చాలామంది స్మార్ట్ ఫోన్ను ఒక సాధనంగా కాకుండా తమ వ్యక్తిత్వంలో భాగం (ఎక్స్టెండెడ్ సెల్ఫ్) గా భావిస్తున్నారు. అందుకే కాసేపు మొబైల్ దూరమైతే, తమలో ఒక భాగం దూరమైనట్లుగా ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్ ఫోన్ను వదిలి ఉండలేకపోతుంటారు. ఈ తరం పిల్లలకు స్మార్ట్ ఫోన్ కేవలం ఫోన్ మాత్రమే కాదు. తమ జీవితంలో జరిగే ప్రతీ ఆనందకరమైన సంఘటనను దాచుకునే.. చూసుకునే సాధనం. నాన్న చేతిని పట్టుకుంటే ఎంత భరోసాగా ఉంటుందో, అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో మొబైల్ వాడేటప్పుడు కూడా అలాగే ఫీలవుతుంటారు. మీ పిల్లలు మొబైల్కు అడిక్ట్ కాకూడదనుకుంటే మీరు చేయాల్సినవి.. పిల్లలు మొబైల్ తక్కువగా వాడాలంటే ముందు పేరెంట్స్ మొబైల్ వాడకం తగ్గించాలి. పిల్లలు అనేక విషయాల్లో పేరెంట్స్నే రోల్ మోడల్గా తీసుకుంటారు. 12 ఏళ్లలోపు పిల్లలు గంటలు గంటలు స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తే వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్ పై ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే మొబైల్ను దూరంగా పెట్టండి. మానవ సంబంధాలకు మెదడులోని ఫ్రంటల్ లోబ్ రెస్పాన్సిబుల్. ఆ భాగం బాల్యంలో బాగా పెరుగుతుంది. బాల్యంలో స్మార్ట్ ఫోన్తోనే ఎక్కువ సమయం గడపడం వల్ల పెరుగుదల మందగిస్తుంది. ఫలితంగా సోషల్ స్కిల్స్ తగ్గుతాయి. అటెన్షన్ తగ్గుతుంది. ఇతరుల ఆటిట్యూడ్ని, బిహేవియర్, కమ్యూనికేషన్ని అర్థం చేసుకోవడమూ తగ్గుతుంది. పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూశారనే దానికన్నా, చూసినదాంట్లో హ్యూమన్ పార్టిసిపేషన్, షేరింగ్ ఉన్నాయా లేవా అనేది ముఖ్యం. అంటే పిల్లలు ఒంటరిగా ఫోన్తో ఎంగేజ్ అయితే నష్టం. పేరెంట్స్తో కలసి చూస్తే, చూసేటప్పుడు మాట్లాడుకుంటే మంచిది. పిల్లల అల్లరిని తప్పించుకునేందుకు వాళ్ల చేతికి ఫోన్ ఇవ్వడం వాళ్లను ఒంటరితనానికి అలవాటు చేసి మనుషులకు దూరం చేయడమే. Toddlers need laps, not apps. మొబైల్లో పిల్లలకు పనికి వచ్చే టెడ్–ఎడ్, కోరా లాంటి ఎడ్యుకేషనల్ యాప్స్ను పరిచయం చేయండి. పిల్లలు ఎంతసేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారనేది కాదు, ఎలా ఉపయోగిస్తున్నారనేది వాళ్ల స్క్రీన్ అడిక్షన్ను, సోషల్, ఎమోషనల్ సమస్యలను నిర్దేశిస్తుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి వాళ్లకు మొబైల్ ఎలా ఉపయోగించాలో నేర్పించండి. ఉదాహరణకు మొబైల్లో క్రికెట్ బాగా ఆడినంత మాత్రాన గ్రౌండ్లో బాగా ఆడలేరని, మొబైల్లో బైక్ రేస్లో గెలిచినంత మాత్రాన రోడ్ పై బైక్ నడపలేరని వివరించండి. మొబైల్ గేమ్స్లోని స్కిల్స్ బయటకు ట్రాన్స్ఫర్ కావనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. టీనేజర్లకు స్క్రీన్ టైమ్ను నియంత్రించడం కచ్చితంగా వర్కవుట్ కాదు. అది పేరెంట్స్పై వ్యతిరేకతను పెంచుతుంది. అందువల్ల వాళ్లతో కూర్చుని మాట్లాడి రీజనబుల్ టైమ్ చూసేందుకు ఒప్పించండి. ఫోన్ పక్కన పెట్టేయమని కోప్పడకుండా యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండే హాబీలు, పనుల్లోకి డైవర్ట్ చెయ్యండి. అలాంటి పనులు చేసినప్పుడు తరచుగా అభినందించండి. ప్రతి ప్రశంస వారి మెదడులో డొపమైన్ను రిలీజ్ చేస్తుంది. ఇవేవీ ఫలితమివ్వకపోతే సైకాలజిస్ట్ను సంప్రదించండి. డిజిటల్ డీఅడిక్షన్ ద్వారా మీ పిల్లలు మొబైల్కు దూరమయ్యేలా చికిత్స అందిస్తారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
Banjara Hills: ఆశీర్వాదం కోసం వచ్చి హిజ్రా సెల్ఫోన్ చోరీ
సాక్షి, హైదరాబాద్: హిజ్రావద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చి సెల్ఫోన్ తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం–12లోని ఎన్బీటీనగర్లో నివాసం ఉంటున్న ఆర్తి అగర్వాల్ అనే హిజ్రా వద్దకు శనివారం సాయంత్రం గుర్తుతెలియని యువకుడు వచ్చాడు. తనను ఆశీర్వదించాలని హిజ్రాను కోరాడు. ఆమె ఆశీర్వదిస్తున్న సమయంలో పక్కనే ఉన్న సెల్ఫోన్ను తస్కరించాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించి ఆర్తి అగర్వాల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
గ్రాండ్ లాంచ్కు రెడీగా రియల్మీ 10 సిరీస్.. ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) నుంచి రియల్మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్లో గ్రాండ్ లాంచ్క్ రెడీగా ఉంది. కంపెనీ రియల్మీ 10 సిరీస్ను చైనాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ నవంబర్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్కు ముందు, ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్ డిజైన్పై పుకార్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా త్వరలో Realme 10 సిరీస్ మార్కెట్లోకి రానున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. రాబోయే లైనప్లో వనిల్లా Realme 10, Realme 10 Pro+ అనే రెండు మోడల్లు ఉన్నాయి. కంపెనీ రియల్మీ సిరీస్ డిజైన్, పెర్ఫార్మెన్స్, పనితీరును ట్విటర్ ద్వారా రివీల్ చేసింది. రెగ్యులర్ మోడల్ MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది. Realme 10 Pro+ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 1080 SoCని కలిగి ఉంటుంది. ఫీచర్ల అంచనా.. Realme 10 4G.. 90Hz రిఫ్రెష్ రేట్తో 6.4 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►స్మార్ట్ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ►4GB RAM, 128GB స్టోరేజ్ ►స్మార్ట్ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్తో 5000mAh బ్యాటరీ Realme 10 Pro+ 5G.. 6.7 ఇంచెస్ AMOLED FHD+ డిస్ప్లే ► అండర్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ►స్మార్ట్ఫోన్ 8GB వరకు RAM, 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ జత చేయబడిన డైమెన్సిటీ 1080 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ►67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000mAh బ్యాటరీ సపోర్ట్ చదవండి: మస్క్కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్? -
ఆ యాప్స్ ను అన్ ఇన్స్టాల్ చెయ్యకపోతే ..!
-
‘దొంగ’ తెలివి! ఏకంగా హోంగార్డు బైక్నే దొంగిలించి...వెళ్తు..వెళ్తూ..
సాక్షి, బంజారాహిల్స్: చోరాగ్రేసరుల తెలివే వేరు. విభిన్నంగా ఆలోచించడమే వీరికున్న అదనపు అర్హత. ఏకంగా హోంగార్డు బైక్నే దొంగిలించి.. దానిపైనే వెళుతూ ఓ ద్విచక్ర వాహన చోదకుడి మొబైల్నే కొట్టేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు దొరికిపోయిన ముగ్గురు యువకుల ‘దొంగ’ తెలివి బయటపడిన ఉదంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ధర్మ అనే హోంగార్డు పని చేస్తున్నారు. కారి్మకనగర్లో ఆయన నివసిస్తున్నారు. రోజువారీలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచి్చన ధర్మ.. తన బైక్ను బయట పార్కింగ్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు యువకులు సదరు బైక్ను అపహరించారు. ఆ వాహనంపైనే రహమత్నగర్ మీదుగా యూసుఫ్గూడ వైపు దొంగతనానికి బయల్దేరారు. కొట్టేసిన వాహనంపైనే వెళుతూ.. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన మల్లారెడ్డి అనే స్విగ్గి డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ కోసం కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియం వద్ద వేచి చూస్తున్నాడు. బైక్పై వచి్చన దొంగలు సదరు మల్లారెడ్డిని లైటర్ ఉందా అని అడుగుతూనే మల్లారెడ్డి చేతుల్లోని మొబైల్ ఫోన్ను క్షణాల్లో లాక్కుని ఉడాయించారు. బాధితుడు అప్రమత్తమై తన బైక్పై వారిని వెంబడిస్తూ దొంగా.. దొంగా అంటూ అరిచాడు. చుట్టుపక్కల వారు సైతం ఆయనతో పాటు దూసుకెళ్లారు. సందుల్లోకి వెళ్లిన ముగ్గురు దొంగలు ఆ ప్రాంతం కొత్తది కావడంతో అటు తిరిగి... ఇటు తిరిగి మళ్లీ కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంవైపే వచ్చారు. అప్పటికే వీరి కోసం వెంట పడుతున్నవారికి కనిపించారు. వీరందరిని చూడగానే దొంగలు ముగ్గురు మొబైల్ ఫోన్తో పాటు బైక్ను అక్కడే పడేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..) -
5G సేవలు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయి : ప్రధాని నరేంద్ర మోదీ
-
తక్కువ ధరకే మొబైల్ అన్నారు.. పార్శిల్లో పవర్ బ్యాంక్, మట్టి పెల్ల
సాక్షి, సైదాపూర్(కరీంనగర్): తక్కువ ధరకే మొబైల్ అన్నారు.. రూ.1,500 చెల్లించాక పార్శిల్లో మట్టి పెల్ల పంపిన ఘటన సైదాపూర్ మండలంలోని జాగీర్పల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల క్రితం జాగీర్పల్లికి చెందిన సిలివేరు అజయ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఆఫర్ వచ్చిందని చెప్పారు. రూ.1,500కే రూ.12 వేల విలువైన ఫోన్ మీ సొంతమన్నారు. అది నమ్మిన అజయ్ పోస్టాఫీసుకు వెళ్లి, డబ్బులు చెల్లించి, పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చి, ఓపెన్ చేస్తే, అందులో ఒక పవర్ బ్యాంకు, ఒక మట్టి పెల్ల ఉండటంతో మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: షేక్పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి -
మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!
విజయనగరం క్రైమ్: మొబైల్ మిస్సయిందా..? ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే విషయాలను వివరిస్తూ, వాటి ఐఎంఈఐ నంబర్లు, అడ్రస్, కాంటాక్టు నంబర్తో వెబ్పోర్టల్లో ఫిర్యాదుచేస్తే చాలు.. విజయనగరం జిల్లా సైబర్ పోలీసులు ట్రాక్చేస్తారు. ఆ మొబైల్స్ను ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకుని స్వాధీనం చేసుకుంటారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ సదుపాయం విజయనగరం జిల్లా ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. చదవండి: డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు ఎస్పీ దీపికాఎం.పాటిల్ సూచనల మేరకు ఫిర్యాదుదారులు సులభంగా ఫిర్యాదు చేసుకునేలా విశాఖపట్నం దువ్వాడ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన విద్యార్థినులు రూపొందించిన ‘వీజెడ్ఎమ్మొబైల్ట్రాకర్ డాట్ ఇన్’ను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు. రూ.16.54లక్షల విలువైన మొబైల్స్ స్వాధీనం.. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్ను ట్రేస్ చేసేందుకు గత నెలలో ఎస్పీ దీపిక వాట్సాప్ నంబర్ 89779 45606ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనికి చాలామంది బాధితులు ఫిర్యాదు చేశారు. నెలల వ్యవధిలోనే రూ.16.54లక్షల విలువైన 103 ఫోన్లను సైబర్ పోలీసులు ట్రేస్ చేశారు. తెలంగాణ, ఛత్తీగఢ్, ఒడిశా, బీమార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎస్పీ కార్యాలయంలో బాధితులకు గురువారం అందజేశారు. మొబైల్స్ రికవరీ చేయడంలో శ్రమించిన సైబర్సెల్ ఎస్ఐలు ఎం.ప్రశాంత్కుమార్, నీలావతి, బి.వాసుదేవరావు, ఎం.శ్రీనివాసరావు, ఎన్.రాజేష్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ఎస్బీ సీఐ జి.రాంబాబు, సీహెచ్ రుద్రశేఖర్, వన్టౌన్ సీఐ బి.వెంకటరావు, టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు, రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు చేయడం ఇలా.. మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు వీజెడ్ఎమ్మొబైల్ట్రాకర్ డాట్ ఇన్ వెబ్పోర్టల్ ఓ వరం. వెబ్పోర్టల్ను ఓపెన్ చేశాక రిపోర్ట్ కంప్లైంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, లోపల రిపోర్ట్ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, కాంటాక్టు నంబర్, ఐఎంఈఐ నంబర్లు, జిల్లా, గ్రామం, ఎక్కడ పోగొట్టుకున్నది, ఫోన్ మోడల్ తదితర వివరాలు నమోదుచేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు స్టేటస్ను చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. రికవరీ అయిన తర్వాత బాధితులిచ్చిన కాంటాక్టు నంబర్కు సమాచారం అందుతుంది. అందరికీ అందుబాటులో వెబ్పోర్టల్ వెబ్పోర్టల్ విజయనగరం వాసులందరికీ అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశాం. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో సెల్ఫోన్ బాధితులు నేరుగా ఫిర్యాదుచేసేందుకు వెబ్పోర్టల్ను అందుబాటులోకి తెచ్చాం. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఫిర్యాదు చేసుకోవచ్చు. – ప్రొఫెసర్ నేతాజీ, వెబ్పోర్టల్ ఇన్చార్జి, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల, దువ్వాడ చాలా ఆనందంగా ఉంది వెబ్పోర్టల్ రూపకల్పనలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. వెబ్ రూపకల్పనకు విజ్ఞాన్ యాజమాన్యం అహరి్నశలు శ్రమించింది. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో చాలా తొందరగా వెబ్ను రూపొందించి, విజయనగరవాసులకు అందించగలిగాం. – అడారి దీపిక, ఐటీ విభాగం, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల -
ఫోన్ ఏదైనా ఛార్జర్ ఒక్కటే, అధ్యయనంలో కేంద్ర నిపుణుల బృందం!
న్యూఢిల్లీ: వివిధ రకాల మొబైల్స్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ ఒకే తరహా చార్జర్లను వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇవి రెండు నెలల వ్యవధిలో సవివర నివేదికను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమ, యూజర్లు, తయారీదారులు, పర్యావరణం వంటి అంశాలన్నింటినీ పరిగణించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సింగ్ వివరించారు. పరిశ్రమ వర్గాలతో బుధవారం భేటీ అయిన తర్వాత ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రతి వర్గం ఆలోచనలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఆయా అంశాలను అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు సింగ్ పేర్కొన్నారు. నెల రోజుల్లోగా బృందాలను నోటిఫై చేస్తామని వివరించారు. -
కొత్త స్మార్ట్ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ఫోన్ల వాడకం కూడా అదే స్థాయిలో ఉంది. ఇటీవల వేల ఖర్చు పెట్టి కొన్న స్మార్ట్ఫోన్లు త్వరగా పాడైపోయిన ఘటనలు మన చుట్టు పక్కలనో లేదా స్నేహితులు, బంధువుల దగ్గరో చూసే ఉంటాం. దీనికి కారణాలు చాలానే ఉన్నా ప్రధానంగా ఉన్నది మాత్రం ఫోన్ బ్యాటరీ పాడైపోవడం. ఈ బ్యాటరీ సమస్య మాత్రం మొబైల్ కంపెనీలకు సవాలుగా మారింది. మనం తెలియకుండా చేసే పనులే మన ఫోన్ని రిపేర్ షాపులో ఉండేలా చేస్తున్నాయి. అవేంటో చూసేద్దాం! రకరకాల ఛార్జర్లను ఉపయోగించడం మొదట్లో ఫోన్ను ఛార్జ్ చేయడానికి కంపెనీ చార్జర్ వాడుతాం. కానీ కొన్ని రోజులకే వేరే వాటిని ఉపయోగిస్తాం. దీనివల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై దుష్ప్రభావం పడుతుంది. పైగా చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం. కంపెనీ చార్జర్ని పక్కన పెడితే అది ఫోన్ బ్యాటరీని లైఫ్టైంని ఇది తగ్గిస్తుంది. ఎలా అంటారా శాంసంగ్(Samsung) స్మార్ట్ఫోన్లు 18W లేదా 25W ఛార్జింగ్ను కలిగి ఉంటాయి. అలానే రియల్మీ( Realme ) స్మార్ట్ఫోన్లో 18W, 33W, 67W సాధారణ ఛార్జింగ్ ఉంటుంది. ఫుల్ చార్జ్ అవసరం లేదు చాలా సార్లు స్మార్ట్ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్లోనే ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగితే, అది మీ ఫోన్ ప్రాసెసర్పై కూడా ప్రభావం చూపుతుంది. అంటే బ్యాటరీతో పాటు ఫోన్ ప్రాసెసర్ కూడా దెబ్బతింటుంది. అందుకే 90 శాతం ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. జీరో స్థాయి చార్జ్ మంచి కాదు ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం. అలాగే వేడి వాతావరణంలో ఫోన్ను ఉంచటం మంచిదికాదు. తరచుగా ఛార్జింగ్ పెట్టకూడదు ఫోన్ని ఛార్జింగ్లో ఉంచిన తర్వాత 90 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే కొంత మంది ఏదో హడావుడిలో పడి 40, 50 ఇలా తక్కు శాతం చార్జ్ అవగానే వాడుతుంటారు. అంతలోనే ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోందని మళ్లీ చార్జ్ చేస్తుంటారు. ఈ ప్రక్రియనే మళ్లీ మళ్లీ పాటిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, బ్యాటరీ మాత్రమే కాదు ఫోన్ లైఫ్టైం కూడా తగ్గిపోతుంది. పదే పదే ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కెపాసిటీ నిరంతరం తగ్గుతూ ఉంటుంది. చదవండి: Edible Oil Prices: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు! -
సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం!
స్మార్ట్ఫోన్లో దాదాపు అందరి చేతుల్లోనూ ఉంటున్నాయి. స్మార్ట్ఫోన్లకు కెమెరాలు తప్పనిసరి హంగు. చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే జనాలు ఆగుతారా? ఎడాపెడా సెల్ఫీలతో పాటు ప్రయాణాల్లో కనిపించిన దృశ్యాలనల్లా ఫొటోలు తీసేయడం మామూలైపోయింది. వందలాదిగా తీసిన ఫొటోలను ప్రింట్ చేయడం కొంత కష్టమే! ఫొటో ల్యాబ్లకు వెళ్లాలి. స్మార్ట్ఫోన్లో తీసిన ఫొటోలను కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి, నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ప్రింట్ చేయించుకోవాలి. ఇదంతా కొంత ప్రయాసతో కూడిన ప్రక్రియ. ఇప్పుడంత ప్రయాస అక్కర్లేదు. స్మార్ట్ఫోన్ కెమెరా ప్రింటర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా జపానీస్ ఫొటోగ్రఫీ బ్రాండ్ ‘ఫుజీ ఫిల్మ్’ స్మార్ట్ఫోన్ల నుంచి ఫొటోలను నేరుగా ప్రింట్ చేసేందుకు అనువైన స్మార్ట్ఫోన్ కెమెరా ప్రింటర్ను ‘ఇన్స్టాక్స్ మినీలింక్ 2’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ఫోన్తో పాటు ఈ ప్రింటర్ కూడా వెంట ఉంటే, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఫొటోలను ప్రింట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది జపాన్తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. చదవండి: అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి! -
ప్రియుడి చేతివాటం.. ప్రియురాలికి కానుకగా ఇవ్వడానికి
సాక్షి, బెంగళూరు: ప్రియురాలి కోసం లక్షలాది రూపాయల విలువచేసే మొబైల్ఫోన్లను దొంగిలించిన వ్యక్తిని శుక్రవారం జేపీ నగర పోలీసులు అరెస్ట్చేశారు. ఇతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువచేసే 6 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబ్దుల్ మునాఫ్ ఈ నెల 22వ తేదీ సాయంత్రం జేపీ నగర క్రోమా మొబైల్ స్టోర్లో కొనుగోలు నెపంతో వెళ్లాడు. అక్కడి టాయ్లెట్కు వెళ్లి షాపు మూసేవరకు అందులో దాక్కున్నాడు. సిబ్బంది షాపును మూసి వెళ్లగానే ఖరీదైన మొబైల్స్ను జేబులో వేసుకున్నాడు. మరుసటి ఉదయం స్టోర్ తెరవగానే మరో డోర్ నుంచి జారుకున్నాడు. ఫోన్లు మిస్సయినట్లు గమనించిన సిబ్బంది సీసీ కెమెరాలను చూడగా దొంగ బండారం బయటపడింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అబ్దుల్ మునాఫ్ను అరెస్ట్చేసి ఇతడి వద్ద నుంచి 6 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అతనికి ఇదే మొదటి చోరీ అని, ప్రియురాలికి కానుకగా ఇవ్వడానికి దొంగతనం చేశాడని గుర్తించారు. చదవండి: విషాదం.. ఎలుకల కోసం విషం పూసిన టమాట తిని -
అదిరిపోయే గాడ్జెట్, కుర్రకారు స్మార్ట్ఫోన్కు అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే
ఈ హైటెక్ యుగంలో స్మార్ట్ఫోన్ వినియోగం జనాలకు అనివార్యం. స్మార్ట్ఫోన్లో అవసరమైన పనులకు సంబంధించినవే కాకుండా, నానారకాల అనవసరమైన యాప్లు, గేమ్లు కూడా ఉంటాయి. కుర్రకారు వీటికి అలవాటుపడి స్మార్ట్ఫోన్ బానిసలుగా మారుతున్నారు. పని ఉన్నా, లేకున్నా చేతిలోని స్మార్ట్ఫోన్ను అదేపనిగా రుద్దుతూ, అందులోనే తలమునకలై వృథా కాలహరణం చేస్తూ చదువుసంధ్యలకు దూరం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లలను తప్పించడానికి ఏదైనా విరుగుడు ఉంటే బాగుండునని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. స్మార్ట్ఫోన్ అడిక్షన్ను తేలికగా తప్పించే విరుగుడు అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి స్మార్ట్ఫోన్కు వాచీ తొడిగినట్లు కనిపిస్తుంది కదూ! ఇది స్మార్ట్ఫోన్కు స్మార్ట్తాళం. జోవావో పెరీరా అనే పోర్చుగీస్ డిజైనర్ ఈ స్మార్ట్తాళాన్ని ‘డిస్కనెక్ట్’ పేరుతో రూపొందించాడు. ఇందులోని టైమర్లో టైమ్ సెట్ చేసుకుని, స్మార్ట్ఫోన్కు దీనిని తొడిగితే చాలు, టైమర్లో మనం నిర్ణయించుకున్న సమయం పూర్తయ్యే వరకు ఫోన్ పనిచేయదు. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన కాల్ లేదా ఈమెయిల్ లేదా మెసేజ్ వస్తే, మనం నిర్ణయించుకున్న ‘పిన్’ ద్వారా దీనిని అన్లాక్ చేసుకోవచ్చు. అయితే, ఇదింకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. -
అమ్మ బాబోయ్.. రైల్వే బ్రిడ్జిపై షాక్ తిన్న ప్యాసింజర్
రైల్వే బ్రిడ్జిపై రైలు ముందుకెళ్తోంది. వాటర్ వ్యూను ఆస్వాదించే ఉద్దేశంతో ప్రయాణికులు డోర్లు, కిటికీల దగ్గరకు వచ్చి చేరారు. ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన జేబు నుంచి మొబైల్ తీసి దృశ్యాన్ని షూట్ చేస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ ప్రయాణికుడికి ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. రెయిలింగ్కు వేలాడుతున్న ఓ వ్యక్తి.. ప్యాసింజర్ చేతిలో ఫోన్ను రెప్పపాటులో లాగేసుకున్నాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ.. బీహార్ బెగుసారాయ్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెయిలింగ్కు కట్టేసుకుని.. ముఖానికి ముసుగు దొంగకు ముద్దుగా స్పైడర్మ్యాన్ అని పేరు పెట్టారు నెటిజన్స్. -
మధ్యాహ్నం హత్య.. భర్తను పట్టించిన చేతి గోళ్లు
ముంబై: భార్యభర్తల గొడవలనేవి సహజం. కలహాలు లేని కాపురమే ఉండదు. కానీ ఆ మనస్పర్థలు సద్దుమణిగి కలిసిపోతే అసలు సమస్యే ఉండదు. చిలికి చిలికి గాలివానలా మారితేనే కష్టం. పోనీ ఎవరిమానాన వారు బతికినా పర్వాలేదు గానీ కక్ష పెంచుకుని దారుణమైన నేరాలకు పాల్పడితే ఇరు జీవితాలు నాశనమవుతాయి. అచ్చం అలాంటి సంఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ముంబైలో సకినాకాలోని ఖైరానీ రోడ్ ప్రాంతంలో మనోజ్ ప్రజాపతి, అతని భార్య రీమా భోలా యాదవ్ నివశిస్తున్నారు. ఐతే వారు గత రెండు రోజులుగా విడివిడిగా నివశించడం మొదలు పెట్టారు. అనుకోకుండా ఒక రోజు రీమా స్నేహితురాలు ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులు రీమా స్నేహితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రీమా భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. ఐతే అతను తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ నిందితుడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలే అతన్ని పట్టుబడేలా చేశాయని పోలీసులు తెలిపారు. రీమా తన మొబైల్లో చివరిసారిగా తన భర్తతోనే సంభాషించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు రీమా భర్తను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: ‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్’) -
ఏపీలో తొలి ఎయిర్ బెలూన్ థియేటర్.. ఎక్కడో తెలుసా?
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాత పద్ధతులకు కొత్త హంగులు అద్దితే అది థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు సినిమా థియేటర్లకు కూడా ఆ కళ వచ్చింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనలు ఎక్కువగా టూరింగ్ టాకీస్ల్లో నడిచేవి. ఇప్పుడు అదే తరహాలో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఆధునిక హంగులతో సరికొత్త థియేటర్లు సిద్ధమవుతున్నాయి. మల్టీప్లెక్స్ హంగులు కల్పిస్తూ.. ఎక్కడకి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించగలిగే సినిమా థియేటర్ను తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సిద్ధం చేస్తున్నారు. చదవండి: నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు! ఇక్కడి జాతీయ రహదారి పక్కనే ఉన్న హాబిటేట్ ఫుడ్కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్ను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ మొబైల్ థియేటర్ను ఢిల్లీకి చెందిన పిక్చర్ డిజిటల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 23న థియేటర్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి చైతన్య తెలిపారు. అయితే తొలి ప్రదర్శన మాత్రం 29న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం కానుందని చెబుతున్నారు. ప్రత్యేకతలు ఇవీ.. గాలిని నింపే బెలూన్ల వంటి షీట్లను అమర్చి ఓ షామియానా (టెంట్) మాదిరి మొబైల్ థియేటర్ను తయారు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకునే టెక్నాలజీ వినియోగిస్తున్నారు. 120 సీట్ల సామర్థ్యం ఉంటుంది. బయట నుంచి చూస్తే గాలి నింపుకుని కలర్ ఫుల్గా ఉన్న ఓ సెట్టింగ్లా ఈ థియేటర్ కనిపిస్తుంది. సులువుగా తరలించేందుకు వీలుగా ఈ థియేటర్ తయారీలో ప్లాస్టిక్, స్పాంజ్లను అధికంగా వినియోగిస్తున్నారు. ఓ ట్రక్కులో దీనిని తరలించవచ్చు. ఇటీవలే తెలంగాణలోని ఆసిఫాబాద్లో ఈ తరహా థియేటర్కు శ్రీకారం చుట్టారు. -
పబ్లో మొబైల్ పోగొట్టుకున్న నటి.. పోలీసులకు ఫిర్యాదు
ఈ మధ్యకాలంలో లేట్నైట్ పార్టీలు, పబ్ కల్చర్ మితిమీరుతోంది. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్తో చిల్ అవ్వాల్సిందే అనేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు లేట్నైట్ పార్టీల్లో చిందేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, సింగర్ గరిమా జైన్కు ముంబైలోని పబ్లో ఊహించని షాక్ తగిలింది. వివరాల ప్రకారం ఏప్రిల్2న వీకెండ్ పార్టీ కోసం ముంబై ఎయిర్పోర్ట్కు దగ్గర్లో ఉన్న పబ్కు వెళ్లిన గరిమా పార్టీలో బాగా ఎంజాయ్ చేసింది. తెల్లవారుజామున 3.15నిమిషాలకు అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో తన ఫోన్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించింది. వెంటనే పబ్ నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరిగి పబ్కి వెళ్లి ఎంత దొరికినా తన ఫోన్ కనిపించలేదంటూ వాపోయింది. ఆ ఫోన్ ధర సుమారు లక్ష రూపాయల దాకా ఉంటుందని పేర్కొంది. గరిమా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గరిమా ఇటీవలే రాణి ముఖర్జీ లీడ్ రోల్లో నటించిన మర్దాని 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. -
పాఠశాలలో సెల్ఫోన్ లొల్లి.. విద్యార్థినిపై నింద.. చివరికి!
సాక్షి, వికారాబాద్: పాఠశాలలో సెల్ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు ఉపాధ్యాయులు యథేచ్ఛగా వినియోగిస్తుండగా విద్యార్థులు సైతం బడికి తీసుకొస్తున్నారు. సెల్ఫోన్ తెచ్చిన వివాదంతో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. బాలిక ఫోన్ ఆపహరించిందని ఉపాధ్యాయులు నిందించడంతో మనోవేదనకు గురై అదృశ్యమైంది. ఆమె ఇల్లు విడిచి వెళ్లి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జాడ లేకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలి తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో నివాసం ఉంటున్న రమేష్ కూతురు సాయిపూర్ ప్రాంతంలోని నెంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలలో సెల్ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులు సైతం కొంతకాలంగా సెల్ఫోన్లు బడికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో గత నెల 25న ప్రభుత్వ నెంబర్– 1 పాఠశాలలో ఓ విద్యార్థి సెల్ఫోన్ తీసుకొచ్చింది. అది పోయింది. ఈ విషయమై బాలిక ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయులు 9వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో విచారించారు. ఫోన్ ఎవరు తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు గాలించగా సెల్ఫోన్ బాత్రూంలో లభించింది. అంతటితో ఆగకుండా సెల్ఫోన్ను ఓ బాలిక దొంగిలించిందని ఆమెపై చోరీ నింద వేశారు. విద్యార్థుల ఎదుటే ఆమెకు చివాట్లు పెట్టారు. అనంతరం సదరు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చోరీ విషయం చెప్పారు. అనంతరం ఇంటికెళ్లిన బాలికను తల్లిదండ్రులు దండించారు. తాను దొంగతనం చేయలేదని బాలిక చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం రెండు రోజుల పాటు కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు.. ప్రభుత్వ నంబర్– 1 పాఠశాలలో జరిగిన సెల్ఫోన్ చోరీ వివాదం బాలిక కనిపించకుండా పోయేందుకు కారణమైంది. బాలిక తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ బాలిక మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించాలని పట్టణ సీఐ రాజేందర్రెడ్డిని ఆదేశించారు. బాలిక ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకుందా.. లేదా ఇతర ప్రాంతాలకు రైలులో ఏమైనా వెళ్లిందా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కొత్త సిమ్ కొనివ్వలేదని ఆత్మహత్య
సాక్షి,గుండాల(ఖమ్మం): సెల్ ఫోన్లోకి సిమ్కార్డు కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. గుండాల మండలం నర్సాపురానికి చెందిన సనప ముసలయ్య – పద్మ దంపతుల కుమారుడు ప్రేమ్సాగర్(17) ఉన్నాడు. ఆయన ఫోన్లో ఉన్న సిమ్కు సిగ్నల్ సరిగ్గా రానందున మరో సిమ్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. దీనికి వారు నిరాకరించడంతో మనస్తాపంతో గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయనను గుండాల ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై సురేష్ తెలిపారు. (చదవండి: పెళ్లైన నెలకే భర్తకి షాక్.. ప్రియుడితో కలిసి.. ) -
ఫ్లిప్కార్ట్ మరో సరికొత్త సేల్.. వాటిపై అదిరిపోయే ఆఫర్స్!
Flipkart Big Bachat Dhamaal: ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఏడాది వరుస పెట్టి ఒక సేల్ తర్వాత మరొక సేల్ తీసుకొని వస్తుంది. తాజాగా బిగ్ బచత్ ధమాల్ పేరుతో మరొక సేల్ తీసుకొని వచ్చింది. మార్చి 4 నుంచి మార్చి 6 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్లో యుపీఐ లావాదేవీలపై రూ.1000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్, వేరబుల్స్, టీవి మోడల్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో వంటి ఫోన్ల అమ్మకాలు కూడా ఈ సేల్లో భాగంగా ప్రారంభమవుతాయి. అలాగే, కస్టమర్లు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ మీద ప్రత్యేక డీల్స్ పొందవచ్చ. ఇంకా, వినియోగదారులు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలకు చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉండే 'లూట్ బజార్' కూడా ఇందులో ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్, పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ పై డీల్స్, ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్ గ్రేడ్ ఆప్షన్, మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్లను కూడా తీసుకురానున్నారు. (చదవండి: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
ఏందయ్యా సామీ! కాస్త చూసుకుని నడువు!!
న్యూఢిల్లీ: ఇంతవరకు మనం రైలులోంచి జారిపడటం వంటి రకరకాల ప్రమాదాలను చూశాం. ఇటీవలే ఒక వ్యక్తి ఏకంగా కదులుతున్న రైలు ముందు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని తోసేసి వెళ్లిపోయిన ఘటనలు గురించి విన్నాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఢిల్లీలోని షాహదారా మెట్రో స్టేషన్లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలోని ఒక వ్యక్తి ఫోన్ చూస్తు నడుస్తూ మెట్రో ట్రాక్ పై పడిపోయాడు. ఈ ఘటన శుక్రవారం షాహదారా మెట్రోస్టేషన్లో చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ సిబ్బందికి చెందిన కానిస్టేబుల్ రోథాష్ చంద్ర వేగంగా స్పందించి మెట్రో ట్రాక్పైకి దిగి సదరు యువకుడిని మెట్రోరైలు రాకమునుపే ఫ్లాట్ఫాంపైకి ఎక్కించి కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A passenger namely Mr. Shailender Mehata, R/O Shadhara, slipped and fell down on the metro track @ Shahdara Metro Station, Delhi. Alert CISF personnel promptly acted and helped him out. #PROTECTIONandSECURITY #SavingLives@PMOIndia @HMOIndia @MoHUA_India pic.twitter.com/Rx2fkwe3Lh — CISF (@CISFHQrs) February 5, 2022