hotstar
-
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మే నెలలో రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజవుతుండగా ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే..నాని హీరోగా నటించిన 'హిట్ 3' - మే 1సూర్య హీరోగా నటించిన 'రెట్రో' - మే 1అజయ్ దేవ్గణ్ 'రైడ్ 2' - మే 1సంజయ్దత్, సన్నీ సింగ్ల 'భూతిని' - మే 1ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్🎬 చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (సిరీస్) - ఏప్రిల్ 28🎬 ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ద బిగ్ ఫైట్ (మినీ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ఎక్స్టెరిటోరియల్ - ఏప్రిల్ 30🎬 ద ఎటర్నాట్ - ఏప్రిల్ 30🎬 టర్నింగ్ పాయింట్: ద వియత్నాం వార్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ద రాయల్స్ (వెబ్ సిరీస్) - మే1🎬 యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ - మే 1🎬 ద బిగ్గెస్ట్ ఫ్యాన్ - మే 1🎬 ద ఫోర్ సీజన్స్ (వెబ్ సిరీస్) - మే 1🎬 బ్యాడ్ బాయ్ (వెబ్ సిరీస్) - మే 2అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 అనదర్ సింపుల్ ఫేవర్ - మే1జీ5🎬 కొస్టావో - మే 1హాట్స్టార్🎥 కుల్ల్: ద లెగసీ ఆఫ్ ద రైసింగ్స్ (వెబ్ సిరీస్) - మే 2🎥 ద బ్రౌన్ హార్ట్ (డాక్యుమెంటరీ) - మే 3ఆహా🎬 వేరేలెవల్ ఆఫీస్ రీలోడెడ్ - మే 1సోనీలివ్🎥 బ్రొమాన్స్ - మే 1🎥 బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (వెబ్ సిరీస్) - మే 1ఎంఎక్స్ ప్లేయర్🎬 ఈఎమ్ఐ - మే1టుబి🎥 సిస్టర్ మిడ్నైట్ - మే 2యాపిల్ టీవీ ప్లస్🎬 కేర్ మీ - ఏప్రిల్ 30చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి -
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ మరో క్రేజీ సినిమా ప్రారంభం
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 3 పేరుతో ఒక చిత్రం రానుంది. ప్రేమ, కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హార్ట్టచ్ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు భావోద్వేగపు అనుభవాన్ని అందించనుంది.ఈ చిత్రం ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోంది. హరికృష్ణ, భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని భావిస్తున్నారు.విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయని తెలిపారు. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు, విజయాలను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించారు. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి ఈ చిత్రం ద్వారా మంచి కుటుంబ జోనర్ ఉన్న కథను ఎంపిక చేసుకున్నారు.దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ.. TSR మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో ఈ బ్యానర్లో తికమక తాండ, కొబలి వంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయని గుర్తుచేశారు.కొబలి సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అయిన హాట్స్టార్ లో బాగా ట్రెండ్ అయ్యిందన్నారు. అలాంటిది ఈ బ్యానర్లో ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుందని చెప్పారు. -
తెలుగులో మిస్టరీ థ్రిల్లర్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు, సిరీసులు నేరుగా వీటిల్లో రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఈ జానర్ లో తీసిన లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేయండంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)నవదీప్, దీక్షిత్ శెట్టి ('దసరా' ఫేమ్) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. స్కూల్ చదివే ఓ కుర్రాడి.. శవాన్ని ముట్టుకుని ఎవరు హత్య చేశారో చెప్పే అద్బుతమైన శక్తి ఉంటుంది. మరోవైపు పోలీస్ పాత్ర పోషించిన నవదీప్ మాత్రం ఈ కుర్రాడిపై కాస్త సందేహంగానే ఉంటాడు. మరి హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.హాట్ స్టార్ లో ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన సిరీస్ లు పెద్దగా క్లిక్ కాలేదని చెప్పొచ్చు. మరి 'టచ్ మీ నాట్' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
ఐపీఎల్ 2025... డిజిటల్ మార్కెటింగ్ బొనాంజా...!
వేసవి వచ్చిందంటే.. విద్యార్థులకు సెలవుల సరదా.. మామిడి పండ్ల మజా.. అంతేనా..? క్రేజీ క్రేజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి కూడా..! ప్రస్తుతం కొనసాగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ హంగామాకు తెరలేవనుంది. ఈ క్రికెట్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ‘జియో హాట్స్టార్’ చానల్ కూడా ఇందుకుతగ్గట్లే మార్కెటింగ్ వ్యూహాలతో సన్నద్ధమవుతోంది.రిలయన్స్కు చెందిన జియో సినిమా, డిస్నీ హాట్స్టార్ విలీనమై ‘జియో హాట్స్టార్’గా ఏర్పడిన తర్వాత ఇదే తొలి ఐపీఎల్ సీజన్. దీంతో ప్రకటనల ద్వారా భారీ ఆదాయానికి గురిపెట్టింది. అందుకోసం డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ వ్యూహాలను అమలు చేస్తుండడం తాజా పరిణామం. ఇప్పటికే గూగుల్, మెటా సంస్థలు ఈ పద్ధతి ద్వారా భారీగా ప్రకటనలు రాబడుతున్నాయి. ఇదే పద్ధతిలో.. జియో హాట్స్టార్ సైతం భారత్తో పాటు యావత్ ప్రపంచంలో క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించే ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయంపై కన్నేసింది. – సాక్షి, అమరావతిమార్చి 22 నుంచి మే 25 వరకు దేశంలోని 13 నగరాల్లో నిర్వహించే 74 మ్యాచ్లకు భారీగా వీక్షకులను ఆకర్షించడం ద్వారా జియో హాట్స్టార్ రికార్డు స్థాయిలో ప్రకటనల ఆదాయంపై గురిపెట్టింది. ఐపీఎల్–2025 భారీ మార్కెటింగ్ ఆదాయ వనరుగా మారనుంది. టీవీలు, డిజిటల్ మీడియా ప్రసారాలు, టీమ్ స్పాన్సర్షిప్లు, స్టేడియంలలో ప్రకటనలు, ఇతరత్రా మాధ్యమాల ద్వారా దాదాపు రూ.7 వేల కోట్లు వస్తాయని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసార హక్కులు పొందిన జియో హాట్స్టార్ అందులో రూ.4,500 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డుస్థాయిలో వ్యూయర్షిప్ సాధించడం ద్వారా తమ చానల్లో ప్రకటనలు ఇస్తే వినియోగదారులకు మరింత చేరువ కాగలమని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు నమ్మకం కలిగించాలన్నది ఉద్దేశం. అందుకోసం జియో హాట్స్టార్ అడ్వర్టైజ్మెంట్ విభాగం ఇటీవల బెంగళూరులో పారిశ్రామిక, వ్యాపార సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సెమినార్ నిర్వహించింది. కార్పొరేట్ పరిశ్రమలు, భారీ వ్యాపార సంస్థల నుంచే కాదు.. రాష్ట్రం/నగరాలకు పరిమితమైన వ్యాపార సంస్థల నుంచి ప్రకటనలు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 17 వేల అమెరికన్ డాలర్లు (రూ.14.80లక్షలు)తో ప్రకటనల ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా ఏ వీక్షకుడి మొబైల్ ఫోన్లలో ఎటువంటి ప్రకటనలు ఇవ్వాలన్నది ముందుగానే గుర్తిస్తామని వారికి వివరించింది.భారీ వ్యూయర్షిప్పే లక్ష్యం!ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్లు ఉన్నప్పటికీ ఐపీఎల్ లెవలే వేరు. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 2008లో ప్రారంభించిన ఐపీఎల్కు ఏటా ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అటు స్టేడియాలు, ఇటు టీవీలు, స్మార్ట్ఫోన్లలో భారీ వ్యూయర్షిప్ ఐపీఎల్ సొంతం. ఈసారి దీనిని మరింతగా పెంచుకోవాలని జియోహాట్స్టార్ భావిస్తోంది. ఒక్కో మ్యాచ్ను కనీసం 4 కోట్ల టీవీలు, 42 కోట్ల మొబైల్ ఫోన్లలో వీక్షించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ ప్యాకేజీల కింద చానల్ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చింది.డిజిటల్ మ్యాపింగ్ అంటే..వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ పిల్లలను ఇంటర్మీడియట్ తరువాత ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చించాలనే విషయంపై వాట్సాప్లో చాటింగ్ చేశారు. అంతే..! కాసేపటికే వారి ఫేస్బుక్ వాల్పై దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల ప్రకటనలు వరదలా పారాయి. స్మార్ట్ ఫోన్పై ఫేస్బుక్ ఖాతాను స్క్రోల్ చేసినా ఇంజినీరింగ్ కాలేజీల ప్రకటనలే. ఇది ఎలా సాధ్యం?ఆ వ్యక్తులు ఇంజనీరింగ్ కాలేజీలపై వాకబు చేయనున్నారని ఫేస్బుక్ యాజమాన్య సంస్థ ‘మెటా’కు ఎలా తెలిసింది!? ఈ ప్రశ్నకు సమాధానం.. ‘డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్’. దీనిని సర్వైలెన్స్ క్యాపిటలిజం (నిఘా పెట్టుబడిదారీ విధానం)గా చెబుతారు. డిజిటల్ టెక్నాలజీ యుగంలో పారిశ్రామిక, వ్యాపార సంస్థల మార్కెటింగ్ ప్రణాళికల్లో సర్వైలెన్స్ క్యాపిటలిజం అత్యంత కీలకంగా మారింది.డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ను సొమ్ము చేసుకుంటున్న సంస్థలుగూగుల్, మెటా, అమెజాన్ వంటివి తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, వారి అభిరుచులు, వారి వ్యవహార శైలి మొదలైన డేటాను ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తాయి. ఇదే ‘డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్’. ఈ డేటాను కొనుగోలు చేసేందుకు గూగుల్, మెటాలతో పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ సంస్థలకు అందిన డేటా ఆధారంగా.. ఖాతాదారుల అభిరుచి, అవసరాలకు తగినట్లుగా వ్యాపార ప్రకటనలు వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రసారమవుతాయి. ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి. అంటే సోషల్ మీడియా ఖాతాదారులు తమ ఫోన్లలో చేసే ప్రతి సెర్చ్, ప్రతి క్లిక్ కూడా డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్కు దోహదపడుతోంది. తద్వారా సర్వైలెన్స్ క్యాపిటలిజం మార్కెటింగ్ ప్రణాళికలు రూపొందించేందుకు ఉపకరిస్తోంది. ఇప్పటివరకు గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలే డిజిటల్ బ్రెయిన్ మ్యాపింగ్ను సొమ్ము చేసుకుంటున్నాయి. మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లి భారీగా ప్రకటనల ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా ఇకపై జియో హాట్స్టార్ కూడా ఈ పద్దతిని అనుసరించనుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించే అభిమానుల అభిరుచులను దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, నగరాల వారీగా విభజించి విశ్లేషించి అందుబాటులోకి తేనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా, భారత దేశం అంతటా, రాష్ట్రాలు, నగరాల వారీగా ఎక్కడికక్కడ వివిధ ప్యాకేజీల కింద ప్రకటనలను రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. -
రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు'
'బలగం' లాంటి మరో సినిమా అని ప్రచారం చేసిన సినిమా 'బాపు'. తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ గతవారమే థియేటర్లలోకి రాగా.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బాపు'. ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు. తెలంగాణలోని రైతుల ఆత్మహత్య నేపథ్య కథతో ఈ చిత్రం తీశారు. ప్రచారం వరకు ఓకే కానీ థియేటర్లలో అస్సలు జనాలు పట్టించుకోలేదు. దీంతో బిగ్ స్క్రీన్ పై రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు.ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 7న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరీ రెండు వారాలకే ఇలా సినిమాల్ని ఓటీటీలోకి తీసుకొచ్చేస్తే.. చిన్న చిత్రాల్ని చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లడం గ్యారంటీగా తగ్గించేస్తారు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)'బాపు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ గ్రామంలో మల్లయ్య (బ్రహ్మాజీ) పత్తి రైతు. వరసగా మూడేళ్లు పంట వేసి నష్టపోతాడు. ఈసారి కూడా అలానే జరుగుతుంది. ఆత్మహత్య చేసుకుంటే రూ.5 లక్షలు వస్తాయని అనుకుంటాడు గానీ ప్లాన్ వర్కౌట్ కాదు. 'మీరు చనిపోవడం ఎందుకు.. మీ బాపూ(తండ్రి) చనిపోయినా డబ్బులు వస్తాయి కదా' అని భార్య (ఆమని) సలహా ఇస్తుంది. అప్పుడు మల్లయ్య ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మలయాళం నుంచి మరో థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ) View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu) -
ఓటీటీలో చిన్నారులను మెప్పించే 'సైన్స్ ఫిక్షన్' సినిమా
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది. -
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్లు రిలీజ్
వాలంటైన్స్ వీక్ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు..బాపు - ఫిబ్రవరి 21రామం రాఘవం - ఫిబ్రవరి 21రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - ఫిబ్రవరి 21జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21ఓటీటీ రిలీజెస్..జీ5క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21 జియో హాట్స్టార్ది వైట్ లోటస్: సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 17విన్ ఆర్ లూజ్ - ఫిబ్రవరి 19ఊప్స్! అబ్ క్యా? - ఫిబ్రవరి 20ఆఫీస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21నెట్ఫ్లిక్స్అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో (డాక్యు సిరీస్) - ఫిబ్రవరి 17కోర్ట్ ఆఫ్ గోల్డ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18జీరో డే (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20డాకు మహారాజ్ - ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్రీచర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్సర్ఫేస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21హోయ్చోయ్చాల్చిత్రో: ద ఫ్రేమ్ ఫాటల్ - ఫిబ్రవరి 21చదవండి: ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్ -
జియో హాట్స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్న జియోస్టార్, జియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను పరస్పరం విలీనం చేస్తూ సమగ్ర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ‘జియో హాట్స్టార్(JioHotStar)’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ విలీనంతో దేశంలోని తమ వినియోగదారులకు వినోదం, క్రీడలతోపాటు మరెన్నో ఎంటర్టైన్మెంట్ సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థల అధికారులు తెలిపారు.సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఇలా..జియో హాట్ స్టార్ హైబ్రిడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాలీవుడ్ సినిమాలు మినహా ప్రతి నెలా పరిమిత గంటల పాటు వినియోగదారులు కంటెంట్ను ఉచితంగా వీక్షించవచ్చు. అంతకుమించి వీక్షించాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐపీఎల్ను జియో, హాట్స్టార్లు ఫ్రీగా అందించేవి. కానీ మ్యాచ్ను పూర్తిగా వీక్షించాలంటే మాత్రం ఇకపై ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలతో కేవలం మొబైల్ మాత్రమే వీక్షించాలంటే త్రైమాసికానికి రూ.149 నుంచి సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ త్రైమాసికానికి రూ.499గా నిర్ణయించారు. రెండు డివైజ్లకు సపోర్ట్ చేసేలా రెండు సూపర్ ప్లాన్ల(యాడ్ బేస్)ను తీసుకొచ్చింది. దీనికి త్రైమాసికానికి ధర రూ.299. ఏడాదికి రూ.899 చెల్లించాలి. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499గా నిర్ణయించారు.ప్రస్తుత వినియోగదారులపై ప్రభావంజియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను ప్రస్తుతం వాడుతున్న చందాదారులు జియో హాట్స్టార్కు మారుతారు. జియో సినిమా ప్రీమియం చందాదారులు తమ ప్లాన్ల మిగిలిన కాలవ్యవధి కోసం జియో హాట్ స్టార్ ప్రీమియంకు మైగ్రేట్ అవుతారు. డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రైబర్లు మూడు నెలలపాటు అదే ప్లాన్లో కొనసాగి తర్వాత జియో హాట్స్టార్కు మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: యాప్ స్టోర్లో టిక్టాక్ పునరుద్ధరణ!జియో హాట్స్టార్లో కంటెంట్..డిస్నీ, ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, హెచ్బీఓ, పారామౌంట్.ప్రాంతీయ, బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.ఎక్స్క్లూజివ్ ఒరిజినల్స్ అండ్ రియాలిటీ షోలు, డ్రామా, థ్రిల్లర్స్, ఎంగేజింగ్ రియాలిటీ కంటెంట్.ఐపీఎల్, డబ్ల్యుపీఎల్, ఐసీసీ ఈవెంట్లు వంటి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ వంటి ప్రపంచ క్రీడా ఈవెంట్లు. -
OTT: పది రోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్
ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందిన కోబలి వెబ్ సిరీస్కు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రేవంత్ లేవాక దర్శకత్వం వహించారు. 'నింబస్ ఫిలిమ్స్', 'యు1 ప్రొడక్షన్స్', 'టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్' సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 4న హాట్స్టార్లో రిలీజైన ఈ సిరీస్ ఏడు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు కోబలి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళయింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపనతో 'కోబలి' మొదలుపెట్టాను. ఒక కాఫీ షాప్లో ఈ కథ విన్నాను. నచ్చింది. కానీ ఇది ముందుకు వెళ్తుందనే నమ్మకం కలగలేదు.ఎందుకంటే అంతా కొత్తవాళ్లే. ఈ కంటెంట్లో అమ్ముడు పోయే ముఖం ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ ఈ సిరీస్ను ప్రేక్షకులు ఆదరించారు. నిజాయితీగా పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు" అంటూ చెప్పుకొచ్చారు. రాకీ సింగ్ మాట్లాడుతూ.. "చిన్న పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చిన వెంకట్ గారికి థాంక్స్. కానీ సీజన్ 2 లో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఇది జస్ట్ ట్రైలరే" అన్నారు. సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. "నిజంగానే ఇందులో అంతా కొత్తవాళ్లే. కానీ హాట్ స్టార్ సంస్థ మమ్మల్ని నమ్మింది. ప్రేక్షకులు బాగా ఆదరించారు. 7 భాషల్లోనూ కోబలి మంచి విజయాన్ని అందుకుంది. రేవంత్, నాతో కూడా ఒక సినిమా చెయ్యి. అంతకు మించి నీ హార్డ్ వర్క్ గురించి పొగడలేను. స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది.కంటెంట్ బాగుంటే కొత్త, పాత తేడా లేదని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు" అని చెప్పుకొచ్చారు. చదవండి: సుకుమార్ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్ చేసిన తబిత -
ఓటీటీలో 'మహేశ్ బాబు' మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్
'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఓటీటీలోకి రానుంది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. 'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు మరోసారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈ 'దేవకీ నందన వాసుదేవ'. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. మైథలాజికల్ యాక్షన్ సినిమాకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించింది. మేనల్లుడి కోసం మహేష్ బాబు కూడా ఇందులో నటించబోతున్నాడని నెట్టింట ప్రచారం దక్కడంతో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఫిబ్రవరి 8 నుంచి 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, హిందీ వర్షన్లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు మూవీ అయినప్పటికీ ఓటీటీ, టీవీలో మొదట హిందీ వర్షన్ రావడం విశేషం. అయితే, తెలుగు వర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులోకి రావచ్చని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని పాన్ ఇండియాలో కూడా ప్రమోట్ చేశారు. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్గా చేశాడు. 'దేవకి నందన వాసుదేవ' సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్లతో కథను రాసుకున్నారు. సాయి మాధవ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. -
ఓటీటీలో 'ముఫాసా: ది లయన్ కింగ్' స్ట్రీమింగ్
హాలీవుడ్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్స్టార్కు సంబంధించిన ఒకరు స్క్రీన్రాంట్ మీడియాతో తెలిపారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో టైటిల్ రోల్కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం. -
ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!
కొత్త ఏడాదికి తెలుగు సినిమా గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ (Sankranthiki Vasthunam Movie)తో బాక్సాఫీస్ ఇప్పటికీ కళకళలాడుతోంది. జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా సైతం మంచి వసూళ్లు రాబట్టింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం తడబడింది. ఈ సినిమాలు ఇప్పుడప్పుడే ఓటీటీ (OTT)లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. అయితే జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు, సిరీస్లు రెడీ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ 'పుష్ప 2', త్రిష 'ఐడెంటిటీ' వంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. ఆ పూర్తి జాబితా ఓసారి చూసేద్దాం..థియేటర్లో విడుదలమదగజరాజ (తెలుగు వర్షన్) - జనవరి 31రాచరికం - జనవరి 31మహిహ - జనవరి 31ఓటీటీనెట్ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్హంట్: ఓజే సింప్సన్ (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 29పుష్ప 2 - జనవరి 30ద రిక్రూట్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 30లుక్కాస్ వరల్డ్ - జనవరి 31ది స్నో గర్ల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 31 హాట్స్టార్ద స్టోరీటెల్లర్ - జనవరి 28యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్మ్యాన్ (కార్టూన్ సిరీస్) - జనవరి 29ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ (వెబ్ సిరీస్) - జనవరి 31జీ5ఐడెంటిటీ - జనవరి 31 అమెజాన్ ప్రైమ్ర్యాంపేజ్ - జనవరి 26ట్రిబ్యునల్ జస్టిస్ సీజన్ 2 (రియాలిటీ కోర్ట్ షో) - జనవరి 27బ్రీచ్ - జనవరి 30ఫ్రైడే నైట్ లైట్స్ - జనవరి 30యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ - జనవరి 30 యాపిల్ టీవీ ప్లస్మిథిక్ క్వెస్ట్ సీజన్ 4 (వెబ్ సిరీస్) - జనవరి 29సోనీలివ్సాలే ఆషిక్ - ఫిబ్రవరి 1లయన్స్ గేట్ప్లేబ్యాడ్ జీనియస్ - జనవరి 31ముబిక్వీర్ - జనవరి 31చదవండి: రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?' -
ఓటీటీలో 'శ్వేతా బసు' సినిమా.. టీజరే ఇలా ఉంటే..!
జార్ఖండ్ బ్యూటీ 'శ్వేతా బసు ప్రసాద్'(Shweta Basu Prasad) నటించిన మూవీ 'ఊప్స్ అబ్ క్యా' (Oops Ab Kya) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు తాజాగా అడల్ట్ రేటెడ్ డైలాగ్స్తో ఒక టీజర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. పెళ్లికాని ఒక యువతి అనారోగ్యంగా కారణంగా ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్స్ చేసిన చిన్న పొరపాటుతో ఆమె ప్రెగ్నెట్ అవుతుంది. ఇంతకూ ఆస్పత్రిలో జరిగిన సంఘటన ఏంటి..? అనే సరికొత్త కాన్సెప్ట్తో ఊప్స్ అబ్ క్యా చిత్రం రానుంది. అయితే, ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది.కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు వారికి దగ్గరైన శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఊప్స్ అబ్ క్యా చిత్రం డైరెక్ట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో(Disney+ Hotstar) స్ట్రీమింగ్ కానుంది. సినిమా చాన్స్లు తగ్గిన తర్వాత శ్వేతా పలు వెబ్ సిరీస్లలో నటించింది. ఈ క్రమంలో ఆమె నుంచి వస్తున్న చిత్రం కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ప్రస్తుతం హిందీ వర్షన్లో మాత్రమే రిలీజ్ కానుంది. అయితే, తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.( ఇదీ చదవండి: విజయ్తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే పరిస్థితి ఏంటి..? అనే కాన్సెప్ట్తో ఈ మూవీ వస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే కాస్త ఆసక్తిగా, సరికొత్త కథతో మేకర్స్ తెరకెక్కించారని తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలోనే ఒక పెద్దావిడ తన మనవరాలికి శీలం గురించి చెబుతుంది. పిగ్గీ బ్యాంక్లా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని తేలుతుంది. అయితే, ఆమెకు బాయ్ఫ్రెండ్ ఉండటం వల్ల ఇదంతా జరిగింది ఏమో అనుకుంటారు. కానీ, తమ మధ్య ఎలాంటి పొరపాటు జరగలేదని ఆ యువతి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అయితే, అసలు తప్పు డాక్టర్ దగ్గర జరిగిందని తర్వాత ఆమె తెలుస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఆ అమ్మాయికి డాక్టర్ పొరపాటును మరొకరి స్పెర్మ్ ఇన్సర్ట్ చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న మరో అమ్మాయికి అందించాల్సిన చికిత్స పొరపాటున తనకు చేసినట్లు డాక్టర్ చెప్పడంతో ఖంగుతింటుంది. అయితే, ఆ ప్రెగ్నెన్సీని ఆమె కొనసాగించాలని నిర్ణయించుకుంటుంది. అందుకు కారణాలు ఎంటి..? ఆ తర్వాత కథలో అనేక మలుపులు. చివరకు ఏం జరిగిందన్నది తెలియాలంటే ఫిబ్రవరి 20న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూసేయండి. -
ఓటీటీకి మోహన్ లాల్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్(Mohan Lal) నటించిన చిత్రం 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈనెల 22 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్లాల్ దర్శకత్వం వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించారు. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు.బరోజ్ 3డీ కథేంటంటే..ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. Step into the magical world of Barroz: The Guardian of Treasures, streaming from January 22nd on Disney+ Hotstar.@mohanlal @antonypbvr @aashirvadcine @santoshsivan @aaroxstudios#DisneyPlusHotstar #DisneyPlusHotstarMalayalam #Barroz #Mohanlal #TheCompleteActor #Fantasy… pic.twitter.com/azNNowsbSw— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) January 20, 2025 -
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది.ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్సింగిల్స్ ఇన్ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4- 14 జనవరివిత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరిబ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరిది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరిఅమెజాన్ ప్రైమ్ వీడియోఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరిడిస్నీ ప్లస్ హాట్స్టార్పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరిజీ5విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17 సోని లివ్పణి- మలయాళ సినిమా- 16 జనవరిఅమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15ఎపిక్ ఆన్గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16జియో సినిమాస్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి 17లయన్స్ గేట్ ప్లేహెల్ బాయ్- ది క్రూక్డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జనవరి 17మనోరమ మ్యాక్స్ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి 17 -
Vaazha Review : పిల్లలకో పాఠం.. పెద్దలకో గుణపాఠం
ఈ సినిమా తప్పనిసరిగా తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడవలసిన సినిమా. మనిషి జీవితంలో యవ్వన దశకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలకు మాత్రం బళ్ళో, ఊళ్ళో సరదాగా స్నేహితులతో గడిచిపోయే స్థితి అది. కాని తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల యవ్వన దశ అనేది కత్తి మీద సాములాంటిదే. పిల్లల భవిష్యత్తు పై ఆశతో అతి గారాబంగా తమ పిల్లలను చూసుకునే వారు కొందరైతే, తమ పిల్లలు దేనికీ పనికిరారని మరికొందరు వారి యవ్వన దశను వారిగనుణంగా అనుభవించనీయకుండా చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికే ఈ సినిమా వాఝా(Vaazha : Biopic of a Billion Boys). బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అన్నది దీని టాగ్ లైన్.ఈ టాగ్ లైన్ సినిమాకి సరిగ్గా సరిపోవడమే కాదు, నిజజీవితంలో యవ్వన దశ దాటిన ప్రతి ఒక్కరికీ రిలేట్ అవుతుంది. ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ మీనన్. ప్రముఖ నటుడు బసిల్ జోసెఫ్(Basil Joseph) ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే తమ కెరీర్ పరంగా నలుగురు ఓడిపోయిన స్నేహితుల కథ ఇది. ఈ నలుగురు తమ స్కూల్ నుండి కాలేజ్ వరకు చేసే ప్రయాణం చూసే ప్రతి ప్రేక్షకుడి యవ్వనాన్ని తప్పకుండా గుర్తు చేస్తుంది.ఈ నలుగురు స్కూలు, కాలేజ్ అన్నింటిలోనూ ఫెయిలవుతారు. కాని ఆ ఫెయిలయిన వాళ్ళు తమ తల్లిదండ్రులకు మాత్రం సినిమా ఆఖర్లో చక్కటి సందేశమిస్తూ అదే తల్లిదండ్రుల దృష్టిలో పాస్ అవుతారు. అసలు ఈ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతారు, పరీక్షలో కాక తల్లిదండ్రుల విషయంలో ఎలా పాస్ అవుతారన్నది మాత్రం మీరు ఈ సినిమాలోనే చూడాలి. తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు తమ పిల్లలు వాళ్ళ కెరీర్ ని ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకే వదిలేయాలి కాని తమ ఆలోచనలను వాళ్ళ మీద రుద్ద కూడదన్న అంశం మీద తీసిన ఈ సినిమా నిజంగా అభినందనీయం. సినిమాలో తీసుకున్న పాయింట్ సీరియస్ దే అయినా సినిమా మొత్తాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో మంచి కామెడీని మేళవించి కుటుంబమంతా కలిసి చూసే విధంగా రూపొందించాడు దర్శకుడు. మనం వినోదం కోసం ఎన్నో సినిమాలు చూస్తాం. కాని కొన్ని సినిమాలు మనకు మార్గదర్శకమవుతాయి. అటువంటి సినిమానే ఈ వాఝా... బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ హాట్ స్టార్లో అందుబాటులో ఉంది. మస్ట్ వాచ్. -
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.తాజాగా ఈ అవార్డ్ విన్నింగ్ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్గా 'హరి కథ'.. స్ట్రీమింగ్కు రెడీ
టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి మొదటిసారి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా రెండో ట్రైలర్ను విడుదల చేశారు.మిస్టరీ థ్రిల్లర్ జానర్గా 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ను దర్శకుడు మగ్గీ తెరకెక్కించారు. 3 రోజెస్ వెబ్ సిరీస్తో ఆయన గుర్తింపు పొందారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ వంటి వారితో పాటు బిగ్బాస్తో గుర్తింపు పొందిన దివి, అంబటి అర్జున్ తదితరులు నటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి 'హరికథ' వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. -
థియేటర్లలో పుష్పరాజ్ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి !
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. డిసెంబర్ నెల ఫస్ట్ వీక్లోనే రిలీజవుతోన్న పుష్ప-2 కోసమే అంతా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ వారమంతా పుష్ప మానియా కొనసాగనుంది. పుష్ప-2 రిలీజ్ అవుతున్నందున బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు విడుదల కావడం లేదు.అయితే ఓటీటీల్లో ఈ వారంలో సందడి చేసేందుకు చిత్రాలు సిద్ధమయ్యాయి. దీపావళికి రిలీజైన బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన అమరన్ ఓటీటీకి రానుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ మట్కా సైతం ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ అమరన్(తమిళ మూవీ)- డిసెంబర్ 05 చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబరు 04 దట్ క్రిస్మస్ (యానిమేషన్ చిత్రం)- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబరు 04 ది అల్టిమేటమ్ (వెబ్సిరీస్)- డిసెంబరు 04 బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 05 విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ సినిమా)- డిసెంబరు 06 ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 జిగ్రా (హిందీ సినిమా)- డిసెంబరు 06 మేరీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06అమెజాన్ ప్రైమ్ మట్కా(తెలుగు సినిమా)- డిసెంబర్ 05 జాక్ ఇన్టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 03 పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్సిరీస్) -డిసెంబరు 04 అగ్ని (హిందీ సినిమా)- డిసెంబరు 06 ది స్టిక్కీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06 జియో సినిమా క్రియేట్ కమాండోస్ (యానిమేషన్ మూవీ)- డిసెంబరు 06 లాంగింగ్ (హాలీవుడ్)- డిసెంబరు 07డిస్నీ ప్లస్ హాట్స్టార్ ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) -డిసెంబరు 03 లైట్ షాప్ (కొరియన్)- డిసెంబరు 04జీ5 మైరీ (హిందీ సినిమా)- డిసెంబరు 06సోనీలివ్ తానవ్2 (హిందీ/తెలుగు) -డిసెంబరు 06 బుక్ మై షో స్మైల్-2 (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 04 -
ఎమ్మీ అవార్డ్స్లో 'ది నైట్ మేనేజర్'కు నిరాశ
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ఉన్న ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ చివరి వరకు రేసులో ఉండి నిరాశ పరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్గా ఫ్రెంచ్ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ హోస్ట్గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.భారత్ నుంచి ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా 'లెస్ గౌట్స్ డి డైయు'(Les Gouttes De Dieu ) సిరీస్తో పోటీ పడి అవార్డ్ కోల్పోయింది. ‘ది నైట్ మేనేజర్’ చిత్రంలో అనిల్ కపూర్ , ఆదిత్యరాయ్ కపూర్ , శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ నటించారు. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్కు చెందిన పలు చిత్రాలతో పోటీ పడిన ‘ది నైట్ మేనేజర్’ చివరి వరకు గట్టిపోటి ఇచ్చింది.ఉత్తమ డ్రామా సిరీస్- లెస్ గౌట్స్ డి డైయుఉత్తమ నటుడు- తిమోతి స్పాల్ఉత్తమ కామెడీ సిరీస్- డివిజన్ పలెర్మోఉత్తమ యానిమేషన్- టాబీ మెక్టాట్ ఉత్తమ కిడ్స్ లైవ్ యాక్షన్ సిరీస్- ఎన్ అఫ్ డ్రెంగెన్ఉత్తమ షార్ట్ ఫామ్ సిరీస్- పాయింట్ ఆఫ్ నో రిటర్న్ -
OTT: యానిమేటడ్ ఫాంటసీ మూవీ ‘విష్’ రివ్యూ
మనకందరికీ విషెస్ ఉంటాయి. మన విష్ తీరాలని మనం ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాం. ఒకవేళ మన విష్ తీర్చే విజార్డ్ మనకు దొరికితే సూపర్ గా వుంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ఈ విష్. వాల్ట్ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన ఈ యానిమేటడ్ ఫాంటసీ మూవీ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో స్ట్రీం అవుతోంది. క్రిస్బక్, ఫాం అనే ఇద్దరు డైరెక్టర్స్ ఈ మూవీని కలిసి తీశారు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే మెడిటేరియన్ సీ లోని ఓ ఐలాండ్ లో కింగ్ డమ్ ఆఫ్ రోజాస్ అనే రాజ్యం వుంటుంది. ఆ రాజ్యానికి రాజు మాగ్నిఫికో, రాణి అమాయ. మాగ్నిఫికో రాజు తన మంత్రశక్తితో నెలకోసారి తన ప్రజలకు సంబంధించి ఒక్క విష్ ను తీరుస్తూవుంటాడు. అది కూడా ఓ పెద్ద ఉత్సవం లా చేసి ఎవరికైతే విష్ కావాలో వాళ్ళని మాగ్నిఫికో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటాడో వారి విష్ ను మాత్రం తీరుస్తాడు. అలాంటి టైంలో ఈ సినిమా హీరోయిన్ ఆషా తన తాత సబినో100th బర్త్ డే కి తాత విష్ కింగ్ గ్రాంట్ చేయాలని ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవుతుంది. అయితే రాజు మాగ్నిఫికోకి తన తాత విష్ ను గ్రాంట్ చేయమని కోరుతుంది. దానికి మాగ్నిఫికో ఒప్పుకోడు. ఆషా ఈ విషయంలో బాగా బాధ పడి ఆకాశం లో వున్న స్టార్ ను తన విష్ ను గ్రాంట్ చేయమని ప్రే చేస్తుంది. అనుకోకుండా ఆషా కోసం స్టార్ ఒక బాల్ రూపంలో వచ్చి మాజిక్ చూపిస్తుంది. ఇంక మిగతా స్టోరీ అంతా స్టార్ మాజిక్ తో కింగ్ మాగ్నిఫికో ని ఆషా ఎలా ఎదుర్కుంటుందనేదే ఈ విష్ మూవీ. స్టన్నింగ్ మాజిక్ ఎఫెక్ట్స్ తో సూపర్ గ్రాండ్ విజువల్స్ తో విష్ మూవీ మీకు ఈ వీక్ సూపర్ ఎంటర్ టైనర్. గో అండ్ వాచిట్. - ఇంటూరు హరికృష్ణ -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్డ్రాప్లో మిస్టరీ థ్రిల్లర్గా ఈ సిరీస్న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్ఫామ్లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
ఓటీటీలో పాన్ ఇండియా సినిమా స్ట్రీమింగ్
మలయాళ నటుడు టొవినో థామస్- కృతిశెట్టి జోడీగా నటించిన కొత్త సినిమా 'ఏఆర్ఎం' (అజయంతే రంధం మోషణమ్) (ARM). సెప్టెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. జితిన్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సురభి లక్ష్మి, ఐశ్వర్య రాజేష్, రోహిణి వంటి వారు నటించారు. మిన్నల్ మురళి, 2018 వంటి డబ్బింగ్ చిత్రాలతో టొవినో థామస్కు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది.టొవినో థామస్కు 50వ చిత్రంగా విడుదలైన 'ఏఆర్ఎం' భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంతటి విజయాన్ని దక్కించుకున్న ఈ చిత్రం నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానుందని డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలిపింది. మలయాళంతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.వేర్వేరు కాలాల్లో సాగే మూడు తరాల కథ ఇది. డైరెక్టర్ జితిన్లాల్కు ఇదే తొలి చిత్రమైనప్పటికీ తెరకెక్కించిన తీరు చాలా బాగుంటుంది. నిధి అన్వేషణతో కూడిన ఆసక్తికరమైన కాన్సెప్ట్ను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాడు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఇదే కావడం విశేషం. 90ల కాలం నాటి అమ్మాయిగా కృతిశెట్టి పాత్ర ఆకట్టుకుంటుంది. -
ఓటీటీకి భారీ యాక్షన్ చిత్రం.. తెలుగులో ఉచితంగా స్ట్రీమింగ్!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఎక్కడైనా సరే ఫ్యాన్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమానే ఇండియన్ ఫ్యాన్స్కు అందుబాటులోకి రానుంది. గత జూలై 26న బాక్సాఫీస్ వద్ద రిలీజైన డెడ్పూల్ అండ్ వాల్వరైన్ భారీగా వసూళ్లు రాబట్టింది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్లస్, వుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమా నవంబర్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇండియాలో ఇంగ్లష్తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తన వీడియోను షేర్ చేస్తూ వెల్లడించింది. ఈ సినిమాను ఉచితంగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి షాన్ లెవీ దర్శకత్వం వహించారు. -
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్స్టార్లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్స్టార్గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్కు ఎంపికైన డెవలపర్ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్స్టార్.కామ్ డొమైన్ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్స్టార్గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ప్రభాస్ సలార్ మూవీ.. ఏకంగా 250 రోజులుగా!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్బస్టర్ మూవీ 'సలార్ సీజ్ ఫైర్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.అయితే ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ హక్కులు మాత్రం మరో ఓటీటీ దక్కించుకుంది. సలార్ హిందీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో క్రేజీ రికార్డ్ సృష్టించింది. ఏకంగా 250 రోజులుగా హాట్స్టార్లో ట్రెండింగ్లో నిలిచిన సినిమాగా అవతరించింది. ఈ విషయాన్ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓటీటీ సంస్థ రివీల్ చేసింది. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ చిత్రాలను కాదని.. ప్రభాస్ చిత్రం రికార్డ్ క్రియేట్ చేయడం చూస్తుంటే నార్త్లో కూడా రెబల్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. -
బ్లాక్బస్టర్ గల్లీ క్రికెట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
కోలీవుడ్లో సెన్సేషనల్ హిట్గా నిలిచిన చిత్రం 'లబ్బర్ పందు'. సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్ గోట్ మూవీతో పోటీ పడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. పెద్దగా ఫేమ్ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించాడు.హరీష్ కళ్యాణ్- దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'లబ్బర్ పందు' సినిమాను తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించారు. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా డిస్నీ+ హాట్స్టార్లో విడుదల కానుంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.లబ్బర్ పందు చిత్రాన్ని కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కించారు. అయితే, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 18వ రోజు కలెక్షన్స్ విషయంలో విజయ్ గోట్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 4 కోట్లు కలెక్షన్స్ వస్తే.. లబ్బర్ పందు ఒక్క తమిళనాడులోనే రూ.2.75 కోట్లు రాబట్టింది. గల్లీ క్రికెట్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇద్దరు గ్రామీణ క్రీడాకారుల మధ్య మొదలైన గొడవకు లవ్ స్టోరీని కలుపుతూ ఈ మూవీని తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రం యూత్ను బాగా ఆకట్టుకుంది. -
హాట్స్టార్లో జియో సినిమా విలీనం!
రిలయన్స్, డిస్నీ విలీనం తర్వాత ఏర్పడిన జాయింట్ వెంచర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్స్టార్లో జియో సినిమాను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ను 'జియో హాట్స్టార్'గా పిలువనున్నట్లు సమాచారం.విలీనం పూర్తయితే.. ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్లు, స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను డిస్నీ+ హాట్స్టార్కి మార్చాలని యోచిస్తోంది. ఐపీఎల్ సహా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్లను జియో హాట్స్టార్లో చూడవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనం 2024 ఫిబ్రవరిలో జరిగింది. కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్లో 120 టీవీ ఛానెల్లు, జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్ అనే రెండు స్ట్రీమింగ్ సర్వీస్లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి మొదట హాట్స్టార్నే.. జియో సినిమాలో విలీనం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్స్టార్లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్లోడ్స్, డిస్నీ+ హాట్స్టార్కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోవడం చేత ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా అవతరించనుంది. -
Vaazhai Movie Review: ఈ అరటిపండు చాలా చేదు!!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘వాళై’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం తినే అరటిపండు నోటికి ఎంత తియ్యగా ఉంటుందో, అది మన నోటి దాకా రావడానికి ఎన్ని జీవితాలను చేదు చేస్తుందో చెప్పిన చిత్రం ‘వాళై’. ఈ సినిమా మాతృక తమిళమైనా తెలుగులో డబ్ అయి హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. 1999 ఫిబ్రవరి 22న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వాయుగుండం ప్రాంత పరిధిలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి అందించిన సమాచార రూపమే ఈ ‘వాళై’ సినిమా. ఈ విషయాన్ని సవివరంగా దర్శకుడు సినిమా ఆఖర్లో చెప్పారు. ఈ సినిమాకి మారీ సెల్వరాజ్ దర్శకుడు. ప్రముఖ వర్ధమాన తమిళ నటులు కలైరాసన్, నిఖిలా విమల్ ఈ సినిమా ముఖ్య తారాగణం. ఇక కథాంశానికొస్తే... శివానందన్, శేఖర్ మంచి స్నేహితులు. బాగా పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లలు. ఇద్దరూ ప్రభుత్వ బడిలో ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటారు. వారమంతా బడికి వెళ్ళి వారాంతంలో ఓ రూపాయి సంపాదించడం కోసం అరటి గెలలు కోసే పనికి ఊరితో పాటు వెళుతూ ఉంటారు. శివానందన్ చదువులో మంచి తెలివిగలవాడు, ఈ అరటిపండ్లు కోసే పని అస్సలు నచ్చదు తనకు. క్లాసులో సైన్సు పాఠాలు చెప్పే పూంగొడి టీచర్ అంటే శివానందన్కు చాలా ఇష్టం. ఇక అరటిపండ్లు కోయడానికి ఆ ఊరి తరఫున ఖని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడు. అరటి గెలల వ్యాపారికి, ఊరికి మధ్యలో బ్రోకర్గా ముత్తురాజ్ వ్యవహరిస్తుంటాడు. ముత్తురాజ్కు, ఖనికి కూలీ డబ్బుల మధ్య వైరం ఏర్పడి ఖని మీద ముత్తురాజ్ ద్వేషం పెంచుకుంటాడు. ఓ రోజు శివానందన్ అరటి గెలల పని నుండి తప్పించుకొని ఆకలితో ఓ అరటి తోటలోకి వెళ్ళి అరటిపండ్లు తినబోతాడు. అంతే... ఆ తోట యజమాని శివానందన్ను పట్టుకుని తీవ్రంగా కొట్టగా స్పృహ తప్పి ఓ కొలనులో పడిపోతాడు. తను లేచి కళ్ళు తెరిచేసరికి ఊరంతా ఏడుస్తుంటుంది. శివానందన్ తల్లితో పాటు అక్క, తోటి స్నేహితుడు శేఖర్, ఖనితోపాటు దాదాపు 19మంది ఊరువాళ్ళు చనిపోయి పడి ఉంటారు. అసలు వీళ్ళంతా ఎలా చనిపోయారు? ఆ తరువాత శివానందన్ పరిస్థితి ఏంటి అన్నది ‘వాళై’ సినిమాలోనే చూడాలి. రోజు వారీ కూలీ చేసుకుని బతికే జీవితాలు ఎలా ఉంటాయన్న స్థితిగతులను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు దర్శకుడు. ఈ సినిమాని మనం తెర మీద చూస్తున్నట్టుండదు... జీవితాలను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సినిమాలో కొంచెం ల్యాగ్ ఉన్నా మనసుకు హత్తుకుంటుంది. తినే పండు మనకు తియ్యగా ఉన్నా ఆ పండు మన దాకా రావడానికి ఎంతమంది జీవితాలను చేదు చేసిందో అని చెప్పేదే ఈ ‘వాళై’ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
రతన్ టాటాపై డాక్యుమెంటరీ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి పేరు గడించారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. ఆపై యువకులు స్థాపించే పలు స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అందుకే ఆయన్ను దేశ ప్రజలందరూ అభిమానిస్తారు.ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లడంతో రతన్ టాటా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆయన అభిమానులు అందరూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఆయనకు సంబంధించిన బయోపిక్, డాక్యుమెంటరీలు ఏమైనా ఉన్నాయా..? అంటూ పోస్టులు పెడుతున్నారు.ఆయన గురించి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఒక ఎపిసోడ్ను చేసింది. 'మెగా ఐకాన్స్' పేరుతో ఆ ఓటీటీ సంస్థ గతంలోనే పంచుకుంది. సీజన్2 నుంచి ఎపిసోడ్2లో రతన్ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అందులో అరుదైన ఫోటోలతో పాటు.. ఆయన గురించి పూర్తి విషయాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ వంటి భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. డాక్యుమెంటరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ వేదికపై ఉత్తమ డాక్యుమెంటరీగా టైటిల్ను అందుకుంది. అయితే, రతన్ టాటా బయోపిక్ను ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తీయనున్నట్లు రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్కు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్ఫ్లిక్స్, డిస్నీ–హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్లతో పాప్కార్న్ నుంచి ఐస్క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్లను ప్రవేశపెట్టేందుకు నెట్ఫ్లిక్స్తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్ఫామ్లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్క్యాట్ ప్యాక్లను విడుదల చేయడంతో పాటు నెట్ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్స్టార్తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో నేరుగా లింక్లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ‘కంటెంట్ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
ఓటీటీలో అక్షయ్ కుమార్ రీమేక్ సినిమా 'సర్ఫిరా'
అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా' ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్గా సర్ఫిరా బాలీవుడ్లో రిలీజ్ అయింది. ఇందులో రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో నటించారు. బాక్సాఫీస్ వద్ద 'సర్ఫిరా' చిత్రానికి నిరాశే మిగిలింది. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల అవుతుంది.సర్ఫిరా చిత్రాన్ని ఈ చిత్రాన్ని అబండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే.. రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు 'సర్ఫిరా' సినిమా వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అక్టోబర్ 11 నుంచి 'సర్ఫిరా' స్ట్రీమింగ్ అవుతుందని అక్షయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని సర్ఫిరా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, ఇదే సినిమాకు మాతృక సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' మాత్రం ఓటీటీలో భారీ విజయం సాధించింది.Apne sapnon ko poora karne ke liye, #Sarfira hona padta hai!Watch the dreams of a common man soar in Sarfira, streaming only on Disney+ Hotstar from October 11.@DisneyPlusHS pic.twitter.com/gLOZ2oXCtw— Akshay Kumar (@akshaykumar) September 26, 2024 -
తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ సినిమా
బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న 'కిల్' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, తెలుగు ప్రేక్షకులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. లక్ష్ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. మోస్ట్ వయోలెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతుంది. అయితే, హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా తెలుగు, తమిళ్ వర్షన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.'కిల్' చిత్రంలో ఎక్కువగా హింస ఉందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. సెప్టెంబర్ 6 నుంచి హిందీలో మాత్రమే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నేటి నుంచి (సెప్టెంబర్ 24) తెలుగు, తమిళ్ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో 'కిల్' సినిమా అభిమానులు సంతోషిస్తున్నారు.కథేంటి..?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ. -
పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్
భయపెట్టే సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. మరీ ముఖ్యంగా దెయ్యం కథలతో మూవీ తీయాలే గానీ ఏ మాత్రం బాగున్నా సరే హిట్ చేసేస్తారు. అలా రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న హిందీ సినిమా 'ముంజ్య'. పెద్దగా పేరున్న యాక్టర్స్ లేనప్పటికీ విజయం సాధించింది. రూ.25 కోట్లు పెడితే రూ.140 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ తెలుగులో)ఈ సినిమా ఆగస్టు 25న ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి వరకు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. హాట్స్టార్లో ఇది అందుబాటులో ఉంది.'ముంజ్య' విషయానికొస్తే.. 1952లో గోట్యా పిల్లాడు అనుకోకుండా చనిపోతాడు. ముంజ్య అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. కట్ చేస్తే ప్రస్తుతం పుణెలో బిట్టు అనే కుర్రాడు తల్లి, నానమ్మతో కలిసి జీవిస్తుంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. ముంజ్య ఉండే చోటుకు వెళ్తాడు. అనుకోకుండా ఈ దెయ్యం బయటకొచ్చేలా చేస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో పిల్ల దెయ్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ దెయ్యం బిట్టు వెనక పడటానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ) -
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న అవార్డ్ విన్నింగ్ సినిమా
రజత్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'సర్వైవర్'. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులను అందుకుని చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'సర్వైవర్' కావడం విశేషం. ఈ చిత్రం కూడా కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ట్రైలర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్ కూడా రజత్ రజనీకాంత్ కావడం విశేషం.ఈ చిత్రం కోసం రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా రజత్ పర్ఫామెన్స్ కి మూడు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. సినిమా మీద ఉన్న మక్కువతో విభిన్నమైన చిత్రాలను మాత్రమే ఆయన నిర్మిస్తున్నారు. 2018 నుంచి మూడు సినిమాలు మాత్రమే ఆయన చేశారు. చేసిన ప్రతి సినిమాకి అవార్డు అందుకుంటున్నారు. కానీ సర్వైవర్ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు రజత్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో ఓటీటీలలో ట్రెండ్ అవుతున్న 'సర్వైవర్' చిత్రాన్ని మీరూ చూసేయండి. -
GRRR Movie Review: మృగరాజుతో మత్తురాజు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘GRRR’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.నిద్రతో వచ్చే మత్తు నిమిషాల్లో వదులుతుంది. కానీ నిషాతో వచ్చే మత్తు నీళ్ళలో నానితేగాని వదలదు. ఇదే పాయింట్తో ఇటీవల ఓ కామెడీ సినిమా రిలీజైంది. సినిమా పేరు కూడా గమ్మత్తుగా వుంటుంది. అదే ‘GRRR’.. ఈ సినిమా టైటిల్ ఇది. సింహం గురక భావనగా దర్శకుడు సృజనాత్మకతతో పెట్టిన పేరు. సినిమా పేరులో ఎంత గురక ఉందో సినిమాలో కామెడీ సరుకు అంత కన్నా ఎక్కువే ఉంది. వాస్తవ అంశాలను చక్కటి కథనంతో అల్లుకుని సున్నితమైన సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించారు దర్శకుడు జేకే. కథాపరంగా రెజీమోన్ నాడార్ అనే వ్యక్తి మద్యం మత్తులో అనుకోకుండా జూలో ఉన్న సింహం గుహ దగ్గరకు చేరుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న జూ సూపర్వైజర్ హరిదాస్ నాయర్ కూడా అతని దగ్గరకు చేరుకుని అతన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక అక్కడ నుండి కథ మొదలు. జూ అధికారి అతన్ని సింహం నుండి కాపాడి తను కూడా బయటపడతాడా? లేదా అన్నది మాత్రం హాట్ స్టార్ వేదికగా ఓటీటీలోనే చూడాలి. ఇక్కడ నావెల్టీ పాయింట్ ఏంటంటే మత్తులో ఉన్న వ్యక్తి ఏమాత్రం భయపడకుండా సింహాన్ని తొడగొట్టి ఆహ్వానించడం... ఇంకా ఇలాంటివి ఎన్నో రసవత్తర సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా మొత్తం తెలుగులో డబ్ అయి ఉంది. అలాగే ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలు లేవు కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమా చూసేయొచ్చు. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న 'కిల్' సినిమా ఓటీటీలోకి రానుంది. లక్ష్ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. ఆ సమయంలో కల్కి 2898 ఏడీ సినిమాతో గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. అయితే, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచేస్తున్న ప్రేక్షకులకు హాట్స్టార్ గుడ్న్యూస్ చెప్పింది.ధర్మా ప్రొడక్షన్స్పై నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించిన కిల్ గతేడాదిలో నిర్వహించిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. యూకే, అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా డిస్నీ+హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 6న భారత్లో విడుదల కానున్నట్లు ప్రకటన వెలువడింది. ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుందని తెలిపారు. తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎప్పుడు విడుదలకానుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్కు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అంతలా ఆడియన్స్ను కట్టిపడేస్తాయి.కథేంటి..?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ. -
సడెన్గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన 'ముంజ్యా' హరర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్బస్టర్ హారర్ సినిమా 'ముంజ్యా' సడెన్గా ఓటీటీలో విడుదల అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ చిత్ర మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ముంజ్యా సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి డిస్నీ+ హాట్స్టార్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (ఆగష్టు 25) ఓటీటీలో విడుదలైంది. అయితే, కేవలం హిందీ వర్షన్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర ముంజ్యా సత్తా చాటింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. ఈ యూనివర్స్లో వచ్చిన స్త్రీ 2 ఐదో సినిమా. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. -
ఓటీటీకి సర్వైవల్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కుంచకో బోబన్, సూరజ్ వెంజరమూడు, శృతిరామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సర్వైవల్ కామెడీ చిత్రం గర్. ఈ సినిమాను జయ్ కె డైరెక్షన్లో తెరకెక్కించారు. జూన్ 14న థియేటర్లలో కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓ జూలో సింహాం ఉన్న డెన్లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఎలా బయటపడ్డారనే కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాజేశ్ మాధవన్, మంజుపిళ్లై, శోభితిలకన్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. -
ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్లు రిలీజ్
ఆగస్టులో భారీ సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకింకా వారం ఉంది. ఈ రెండో వారంలో చిన్నాచితకా చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అటు ఓటీటీలోనూ కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు 2వ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే మూవీస్..🎬 కమిటీ కుర్రోళ్లు - ఆగస్టు 9🎬 సింబా - ఆగస్టు 9🎬 భవనమ్ - ఆగస్టు 9🎬 తుఫాన్ - ఆగస్టు 9ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 - ఆగస్టు 8భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమామేఘ బర్సేంగే (వెబ్ సిరీస్) - ఆగస్టు 6గుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5భీమా: అధికార్ సే అధికార్ తక్ (హిందీ) ఆగస్టు 5అమర్ సంగి (సీరియల్) - ఆగస్టు 5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9హాట్స్టార్ఆర్ యు షోర్ (ట్రావెల్ సిరీస్) - ఆగస్టు 8లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ది జోన్: సర్వైవల్ మిషన్, మూడో సీజన్ (రియాలిటీ షో) ఆగస్టు 7ఆర్ యూ ష్యూర్ (కొరియన్) ఆగస్టు 8సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9 చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట! -
ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్బస్టర్ సినిమా
బాలీవుడ్ బ్లాక్బస్టర్ హారర్ సినిమా ముంజ్యా ఓటీటీ విడుదల కంటే బుల్లితెరపైకి రానుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది.నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ముంజ్యా సినిమా ఓటీటీ కంటే ముందే టీవీల్లోకి రానుందని ప్రకటన వచ్చేసింది. స్టార్ గోల్డ్ ఛానల్ మంజ్యా సినిమా టెలికాస్ట్ గురించి ప్రకటించింది. ఆగస్ట్ 24న రాత్రి ఎనిమిది గంటలకు బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేయండని పేర్కొంది.అయితే, ఇప్పటికే ముంజ్యా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఇప్పటికీ కూడా ప్రకటించలేదు. స్టార్ గోల్డ్ ఛానెల్ ముందుగా ప్రకటించి ప్రేక్షకులను తమపైపు తిప్పుకుంది. దీంతో హాట్స్టార్ కూడా అలెర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 9న ముంజ్యా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
డార్లింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి అనుకున్న తరుణంలో డార్లింగ్ సినిమా వచ్చింది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించగా నభా నటేష్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 19న విడుదలైంది.ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 13 నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది చూసిన ప్రియదర్శి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డార్లింగ్ కథేంటంటే?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యను హనీమూన్కు పారిస్ తీసుకోవాలని కలలు కంటూనే పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయి(అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఇంతలో ఆమె ప్రేమించినవాడితో పారిపోతుంది. తన పెళ్లి పెటాకులైందన్న బాధతో రాఘవ్ చనిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆనంది (నభా నటేష్) పరిచయమవుతుంది. తనతోనే ఇతడి పెళ్లి జరుగుతుంది. అసలు ఆనంది ఎవరు? అపరిచితురాలిగా ఒక్కో సమయంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది? తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఓటీటీలో డార్లింగ్ చూడాల్సిందే! Gear up for a MADMAX Marriage Entertainer 🔥💯#DarlingonHotstar Streaming from 13th August only on #DisneyPlusHotstar@PriyadarshiPN @NabhaNatesh @dir_aswin @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #VivekSagar @GNadikudikar @NareshRamadurai @PradeepERagav @seethu77in… pic.twitter.com/mYSJYVlH7Q— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 2, 2024 చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్ -
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్.. ప్రకటన వచ్చేసింది
హాలీవుడ్ స్టార్స్ ఓవెన్ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, పీటర్ మకాన్, విలియమ్ హెచ్. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’. వెస్ బాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మే 10న థియేటర్స్లో విడుదల అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది.ప్రపంచవ్యాప్తంగా 'కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' సినిమాకు మంచి ఆదరణ ఉంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. విడుదలైన రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఆగష్టు 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్, తెలుగు,హిందీ, తమిళ్లో ఈ చిత్రం విడుదల కానుంది.‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ రీ బూట్ సిరీస్లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2011)’, ‘డ్వాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (2014), ‘వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమా లిస్ట్లో ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఉండటం విశేషం.రూ. 1350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా మొత్తంగా రూ. 3,300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఎండీబీలో కూడా ఈ సినిమాకు 7.2 రేటింగ్ లభించడం విశేషం. ఆగష్టు 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉచితంగానే ఈ చిత్రాన్ని చూసేయండి. -
‘నాగేంద్రన్స్ హనీమూన్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: నాగేంద్రన్స్ హనీమూన్స్నటీనటులు: సూరజ్ వెంబరమూడు, శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ, నిరంజన, అనూప్ తదితరులునిర్మాత: నితిన్ రెంజీ పనికర్దర్శకత్వం: నితిన్ రెంజీ పనికర్ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్స్ సిరీస్ పేరు వినగానే ఇదేదో రొమాంటిక్ కథ అనుకుంటాం. కాని ఈ కథలో రొమాన్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉండడం విశేషం. మెల్ల మెల్లగా భారతీయ ఓటీటీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను కూడా ఆదరించడం హర్షణీయం. నాగేంద్రన్స్ హనీమూన్ సిరీస్ ఓ మంచి రొమాంటిక్ కామెడీ అని చెప్పవచ్చు. ఓ పెళ్ళి చేసుకోవడానికి వంద అబద్ధాలైనా ఆడవచ్చు అన్న నానుడి వినే ఉంటాం. కాని ఈ కథలోని కథానాయకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నాడు అన్నదే పాయింట్. వధువు ఇచ్చే కట్నకానుకలపై కన్నేసిన కథానాయకుడు ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడుతూ చివరికి ఏమయ్యాడన్నదే ఈ నాగేంద్రన్స్ హనీమూన్. విలక్షణ మళయాళ నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన ఈ సినిమాను నితిన్ రెంజి పానికర్ దర్శకత్వంలో రూపొందించారు. కథ సిరీస్ కాబట్టి స్క్రీన్ ప్లే సరదాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎక్కడా బోర్ ఫీలవకుండా ప్రేక్షకుడు ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూసేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అక్కడక్కడా కొంత లాగ్ ఉన్నా వెరైటీ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు మంచి వాచబుల్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్.-ఇంటూరు హరికృష్ణ -
2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే!
బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ను తీసుకువస్తున్నాయి. సినిమాలు, సిరీస్లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.2. హీరామండి (నెట్ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్స్టార్) -1.48 మంది చూశారు.6. షో టైమ్ (హాట్స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.9. కిల్లర్ సూప్ (నెట్ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.11. కర్మ కాలింగ్ (హాట్స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.13. మామ్లా లీగల్ హై (నెట్ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.14. లూటెర్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్స్టార్) - 80 లక్షల మంది చూశారు.చదవండి: సింగర్కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్జెండర్ అంటూ కామెంట్స్ -
నయనతార, త్రిష.. 'అమ్మోరు తల్లి'గా వచ్చేదెవరంటే..
'అమ్మోరు తల్లి' సినిమాలో నయనతార నటించిన విషయం తెలిసిందే. 2020లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో కూడా మళ్లీ నయనతార నటిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. తమిళంలో 'మూకుత్తి అమ్మన్'గా తెరకెక్కిన సినిమాను తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫాంటసీ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.డిస్నీ+హాట్స్టార్లో డైరెక్ట్గా విడుదల అయిన 'అమ్మోరు తల్లి' సినిమాలో ముక్కుపుడక అమ్మోరుగా నయన్ విజృంభించింది. అయితే, సీక్వెల్లో నటించేందుకు నయనతార నిరాకరించిందని, ఆ స్థానంలో త్రిష కథానాయికగా నటిస్తుందని అప్పట్లో ఒక వార్త నెట్టింట వైరల్ అయింది. నయనతార ఈ చిత్రంలో అద్భుతంగా నటించిందని ఆమెకు ప్రశంసలు కూడా దక్కాయి. అలాంటిది సీక్వెల్లో మరొకరిని తీసుకొస్తే ఇబ్బందులు ఎదురుకావచ్చని భావించిన మేకర్స్ ఫైనల్గా నయన్ను ఒప్పించినట్లు తెలుస్తోంది. తాజాగా అమ్మోరు తల్లి 2 చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను వారు విడుదల చేశారు. భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో పార్ట్ 1 తెరకెక్కించారు. మరీ సిక్వెల్లో వారు ఎలాంటి కథతతో వస్తారో చూడాల్సి ఉంది. -
OTT: ఐదుగురు భార్యలతో 'నాగేంద్రన్స్ హనీమూన్స్' ట్రైలర్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళం నటుడు సూరజ్ వెంజరమూడు తన కెరీర్లో మొదటిసారి వెబ్సిరీస్లో నటించారు. నాగేంద్రన్స్ హనీమూన్స్ పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సిరీస్లో సూరజ్ వెంజరమూడుతో పాటు శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ,నిరంజన అనూప్, కనికుశృతి, ఆల్ఫీ పంజికరన్ నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్ను హాట్స్టార్ విడుదల చేసింది. నితిన్ రెంజీ పనికర్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు రచన దర్శకత్వం వ్యవహరించారు. గతంలో ఆయన కేరళ ఫైల్స్ వెబ్ సిరీస్ను నిర్మించి గుర్తింపు పొందారు. ఈ సిరీస్లో ఐదుగురు భార్యలున్న భర్తగా సూరజ్ వెంజరమూడు కనిపించారు. గల్ఫ్కు వెళ్లాలి అనుకున్న నాగేంద్రన్ అనుకోకుండా ఐదు పెళ్లిలు చేసుకుంటాడు. వారందరిని ఆయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలతో మంచి ఎంటర్టైనర్గా ఈ సిరీస్ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఐదుగురు భార్యలు ఉన్న నాగేంద్రన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు..? అనేది తెలియాలంటే జులై 19 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్న 'నాగేంద్రన్స్ హనీమూన్స్' చూడాల్సిందే. తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ సిరీస్ విడుదల కానుంది. -
ఓటీటీ బాటలో శర్వానంద్ 'మనమే'
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది.శర్వానంద్, కృతీ శెట్టి జోడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి నటనే సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్కు ప్లస్ అయింది. మనమే కథా నేపథ్యం చాలా బాగుంటుంది. ఇందులో వినోదంతో పాటు భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే, ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. జూలై 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలపుతున్నాయి. కానీ, అధికారికంగా సమాచారం వెలువడలేదు.శర్వానంద్ ఇప్పుడో మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ అభిలాష్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 90స్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుందని సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి మరిన్నీ వివరాలు రానున్నాయి. -
ఓటీటీకి సలార్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. #GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024 -
అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
ఎండాకాలం అయిపోయింది. సమ్మర్లో బ్లాక్బస్టర్ కొట్టిన సినిమాలంటూ పెద్దగా ఏవీ లేవు. ఇంతలోనే వర్షాకాలం మొదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందూ చాంపియన్, ముంజా వంటి కొత్త సినిమాలు బాలీవుడ్లో రిలీజయ్యాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ముంజా. ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెడుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. రెండు వారాల్లోనే రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మ్యాడ్డాక్ సూపర్నేచురల్ యూనివర్స్లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ఇప్పుడు వచ్చిన ముంజా నాలుగవది. త్వరలోనే ఈ యూనివర్స్లో స్త్రీ 2 ఐదో సినిమాగా రాబోతోంది. ఇకపోతే ఈ యూనివర్స్లో వచ్చిన ముంజా సినిమాను చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడుతున్నారు. మౌత్టాక్తోనే వసూళ్లు పెరుగుతున్నాయి. ఆదిత్య సర్పోడర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మ్యాడ్డాక్ ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్న ఈ చిత్రం జూలైలో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.చదవండి: సినిమా ఫ్లాప్ అయితే పార్టీ చేసుకుంటా: రామ్ చరణ్ -
తెలుగు వెబ్సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్
పాకెట్ఎఫ్ఎం సంస్థ తన ఆడియో సిరీస్ కాపీరైట్ను డిస్నీ+ హాట్స్టార్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు వెంటనే స్పందించి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.పిటిషన్లోని వివరాల ప్రకారం..ఆన్లైన్ ఆడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ పాకెట్ఎఫ్ఎం తన ఆడియో సిరీస్ 'యక్షిణి'ని పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కాపీరైట్ హక్కులు సంస్థ కలిగి ఉంది. ఇటీవల వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ డిస్నీ+ హాట్స్టార్ ‘యక్షిణి’ని పోలిఉండే వెబ్సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది. పాకెట్ఎఫ్ఎం వెంటనే దాన్ని సదరు ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని కోరుతూ జూన్ 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఇదిలాఉండగా, జూన్ 14 నుంచి ఈ తెలుగు వెబ్సిరీస్ ప్రారంభం కాబోతుందని డిస్నీ+ హాట్స్టార్ ప్రకటించింది. దాంతో పాకెట్ఎఫ్ఎం డిస్నీ+ హాట్స్టార్ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్టైన్మెంట్పై కోర్టులో దావా వేసింది. వెబ్సిరీస్ ట్రైలర్ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్లు పంపాలా..?ఈ వ్యాజ్యం గురువారం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై డిస్నీ+ హాట్స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మే 2021 నుంచి పాకెట్ఎఫ్ఎం ప్లాట్ఫామ్లో ‘యక్షిణి’ ఆడియో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. -
ఓటీటీలో రూ. 100 కోట్ల హారర్ మూవీ.. అఫీషియల్ ఫ్రకటన
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'బాక్'. తమిళ్లో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. మే 3న విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తమిళ్లో 'అరణ్మనై 4' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'బాక్' టైటిల్తో విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమా త్వరలో హాట్స్టార్లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించకుండా త్వరలో రిలీజ్ చేస్తామని హాట్స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. விரைவில் 🔥Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024 కానీ, జూన్ 7న బాక్ విడుదల కానున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా, కార్తికేయ భజేవాయువేగం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. గతవారంలో అంతా చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ సారి మాత్రం కాస్తా ఇంట్రెస్టింగ్ పెంచేస్తున్నాయి.మరోవైపు ఓటీటీల్లోనూ సినిమాల సందడి చేయనున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు త్వరలోనే ముగియనున్నాయి. సమ్మర్ను క్యాష్ చేసుకునేందుకు రిలీజైన సినిమాలను కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. ఈ వీకెండ్లో మీరు ఓటీటీల్లో చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్ ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31 రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31 లంబర్జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01అమెజాన్ ప్రైమ్బుజ్జి అండ్ భైరవ(యానిమేటేడ్ సిరీస్)- మే 31హాట్స్టార్ జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31జియో సినిమా దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31 లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31 ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31 ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01జీ5 హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31సైనా ప్లే పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31ఆహాప్రాజెక్ట్- జెడ్- మే 31 -
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు కావడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఓటీటీల్లోనే సినిమాలు ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్తో సహా చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో సుహాస్ ప్రసన్నవదనం, పృథ్వీరాజ్ సుకుమార్ ఆడుజీవితం కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి మీరు ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్గారోడెన్న్ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్(యానిమేషన్)- మే 23ఇల్లూజన్స్ ఫర్ సేల్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23ఇన్ గుడ్ హ్యాండ్స్-2(ఇంగ్లీష్ సినిమా)- మే 23 ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్(ఇంగ్లీష్ సిరీస్)- మే 23అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24ముల్లిగన్ పార్ట్-2 (యానిమేషన్ సిట్కామ్)- మే 24మై ఓని గర్ల్(యానినేషన్ చిత్రం)- మే 26 అమెజాన్ ప్రైమ్ది వన్పర్సెంట్ క్లబ్ సీజన్-1- మే 23ది బ్లూ ఎంజెల్స్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23డీఓఎం సీజన్-2(వెబ్ సిరీస్)- మే 24బాంబ్సెల్- మే 25డిస్నీ ప్లస్ హాట్స్టార్డోరామ్యాన్ సీజన్-19 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20షిన్ చిన్ సీజన్-16 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20మార్వెల్ స్టూడియోస్:అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22పాలైన్-(జర్మన్ సినిమా)- మే 22ది కర్దాషియన్స్- సీజన్-5(ఇంగ్లీష్ సినిమా)- మే 23ది బీచ్ బాయ్స్(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24ఆడుజీవితం(ది గోట్ లైఫ్) (మలయాళ సినిమా)- మే 26(రూమర్ డేట్)రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ సినిమా)- మే 26ఆహాప్రసన్నవదనం(తెలుగు సినిమా) మే 24యాపిల్ టీవీ ప్లస్ట్రైయింగ్ సీజన్-4- మే 22 -
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
పృథ్వీరాజ్ సుకుమార్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). మార్చి 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. సర్వైవల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కేవల 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.అయితే ఈ సినిమా రిలీజై రెండు నెలల కావొస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. గతంలో చాలాసార్లు ఓటీటీ స్ట్రీమింగ్పై రానుందని వార్తలొచ్చాయి. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి ఓటీటీకి సంబంధించిన నెట్టింట వైరలవుతోంది. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సారైనా ఓటీటీకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అసలు కథేంటంటే..?కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
హారర్ సినిమాలకు ఓటీటీలో మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా? అని ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. వీరికోసమే ఈ గుడ్న్యూస్. 'ది ఫస్ట్ ఒమెన్' అనే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.ఒమెన్ ఫ్రాంచైజీలో ఆరో సినిమాఒమెన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఐదు సినిమాలు వచ్చాయి. ది ఒమెన్(1976), డామెయిన్- ఒమెన్ 2 (1978), ద ఫైనల్ కాన్ఫ్లిక్ట్(1981), ఒమెన్ 4- ద అవేక్నింగ్(1991), ది ఒమెన్(2006) కాగా ఇప్పుడు వచ్చిన ది ఫస్ట్ ఒమెన్(2024) ఆరవది! ఇది 2006లో వచ్చిన ది ఒమెన్ సినిమాకు ప్రీక్వెల్గా తెరకెక్కింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ఆర్కష స్టీవెన్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగ, నెల్ టైగర్ ఫ్రీ, బిల్ నైయ్, రాల్ఫ్ ఇనెసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 30 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది.From service to survival. Brace yourself for a chilling mystery.#TheFirstOmen streaming 30th May on #DisneyPlusHotstar pic.twitter.com/0GTsn66z9O— Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2024 చదవండి: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలి.. నటుడి సలహా -
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో థియేటర్ల వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపే చూస్తున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్తో వినోదం అందించేందుకు రెడీ అయ్యాయి.ఎప్పటిలాగే ఈ వీకెండ్లో అలరించేందుకు సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఆదాశర్మ నటించిన బస్తర్, రాజమౌళి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) ఆడియన్స్లో కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు సైతం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 10కి పైగా సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలునెట్ఫ్లిక్స్ పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17 ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17 థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ 99 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17డిస్నీ ప్లస్ హాట్స్టార్ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17జీ5 బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17 తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమా జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17ఆపిల్ ప్లస్ టీవీ ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ ఎల్లా (హిందీ సినిమా) - మే 17 -
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మలయాళీ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. శనివారం(మే 5) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది. థియేటర్స్లో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని చూడొచ్చు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు.ఇదీ మంజుమ్మల్ బాయ్స్ స్టోరీఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్కి వెళ్తారు.అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. -
సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్లు
ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జనం వణికిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సూరీడు అందరిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు వెళ్లడం లేదు. వారందరికీ వినోదాన్ని పంచేందుకు ఓటీటీలు బోలెడంత కంటెంట్తో రెడీ అయ్యాయి. సినిమాలు, సిరీస్లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నాయి. మరి మే నెలలో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్లు ఏంటో చూసేద్దాం..నెట్ఫ్లిక్స్👉హీరామండి: ద డైమండ్ బజార్ (వెబ్ సిరీస్)👉షైతాన్👉ద హాలీడే👉ఎ మాన్ ఇన్ ఫుల్ (వెబ్ సిరీస్)👉టి- పిబన్ (వెబ్ సిరీస్)👉అన్ఫ్రాస్టెడ్👉ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో (ఎపిసోడ్ 6)(పైవన్నీ మే నెల ప్రారంభంలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి)👉సూపర్ రిచ్ ఇన్ కొరియా (వెబ్ సిరీస్) - మే7👉ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ (వెబ్ సిరీస్) - మే 7👉ద ఫైనల్: అటాక్ ఆన్ వెంబ్లీ - మే 8👉క్రేజీ రిచ్ ఆసియన్స్ - మే 8👉మదర్ ఆఫ్ ద బ్రైడ్ - మే 9👉లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2)- మే 10👉ద గ్రేడ్ ఇండినయ్ కపిల్ షో (ఎపిసోడ్ 7) - మే 11👉బ్రిడ్జర్టన్ (మూడో సీజన్- ఎపిసోడ్ 1)👉మేడ్మి వెబ్ - మే 14👉తెల్మా ద యునికార్న్ - మే 17👉అట్లాస్ - మే 24లయన్స్ గేట్ ప్లే📽️ బ్లాక్ మాఫియా ఫ్యామిలీ (సీజన్ 3) - మే 3📽️ ద మార్ష్ కింగ్స్ డాటర్ - మే 10📽️ కాప్షాప్ - మే 17📽️ వాంటెడ్ మ్యాన్ - మే 24📽️ విజిల్ (సీజన్ 2) - మే 31హాట్స్టార్🎞️ బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్🎞️షార్డ్లేక్🎞️వెల్కమ్ టు వ్రెక్జామ్🎞️ప్రామ్ డేట్స్🎞️స్టార్ వార్స్: టేల్స్ ఆఫ్ ద ఎంపైర్(మే ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి)🎞️మాన్స్టర్స్ ఎట్ వర్క్ - మే 5🎞️మంజుమ్మెల్ బాయ్స్ - మే 5🎞️ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ - మే 8🎞️అండర్ ద బ్రిడ్జ్ - మే 8🎞️లెట్ ఇట్ బి - మే8🎞️డాక్టర్ హు - మే 11🎞️క్రాష్ - మే 13🎞️అంకుల్ సామ్సిక్ - మే 15🎞️క్వీన్ రాక్ మాంట్రియల్ - మే 15🎞️పాలైన్ - మే 22🎞️మార్వెల్ స్టూడియోస్ అసెంబ్ల్డ్: ద మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ 97 - మే 22🎞️ద కర్దాషియన్స్ - మే 23🎞️ద బీచ్ బాయ్స్ - మే 24🎞️కాండెన్ - మే 29🎞️జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ - మే 31అమెజాన్ ప్రైమ్📽️ అమెరికన్ ఫిక్షన్ - మే 14📽️ ద బ్లూ ఏంజెల్స్ - మే 23📽️ ద బాయ్స్ ఇన్ ద బోట్ - మే 28బుక్ మై షో స్ట్రీమ్👉 డేర్ డెవిల్ ముస్తఫా👉 ఆర్కెస్ట్రా మైసూరు👉 మిస్టర్ నట్వర్లాల్👉 కాంక్రీట్ ఉటోపియా👉 మాన్స్టర్👉 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ద న్యూ ఎంపైర్👉 ఎండేవర్ సీజన్ 1👉 ఎండేవర్ సీజన్2👉 ఎండేవర్ సీజన్ 3👉 ఎండేవర్ సీజన్ 4👉 ఎండేవర్ సీజన్ 9👉 ఎండేవర్ - పైలట్అల్ట్రాజకాస్🎞️ రంగీత్🎞️ యాసిడ్🎞️ అభ్యూహమ్🎞️ డోంట్ లుక్ అవే🎞️ టైగర్ రాబర్స్📺 ఫ్యామిలీ కట్టా (షో)📺 కుకరీ షో📺 మహారాష్ట్రచీ హస్యజాతర (షో)📺 అనైతిక్ (వెబ్ సిరీస్)📺 ఉదర్ బైకో (వెబ్ సిరీస్)📺 నజరబండి (వెబ్ సిరీస్)📺 లైసా (వెబ్ సిరీస్)యాపిల్ టీవీ👉 అకాపుల్కో (సీజన్ 3) - మే 1👉 డార్క్ మ్యాటర్ - మే 8👉 హాలీవుడ్ కాన్ క్వీన్ - మే 8👉 ద బిగ్ సిగర్ - మే 17👉 ట్రైయింగ్ (సీజన్ 4) - మే 22అమెజాన్ మినీ టీవీ📽️ ద రిటర్న్ ఆఫ్ రెబల్ - మే 2📽️ మగధీర - మే 2📽️ మిడిల్ క్లాస్ అబ్బాయి - మే 2📽️ యు ఆర్ మై డెస్టినీ - మే 8📽️ 96 - మే 9📽️ దేవ్ - మే 9📽️ ప్రేమమ్ - మే 9📽️ అమర్ అక్బర్ ఆంటోని - మే 9📽️ డేంజరస్ ఖిలాడీ 2 - మే 9📽️ టర్న్ బ్యాక్ - మే 13📽️ అండర్కవర్ కౌంటర్ అటాక్ - మే 14📽️ ఐ బిలాంగ్డ్ టు యువర్ వరల్డ్ - మే 15📽️ మర్డర్ ఇన్ ద ఫస్ట్ - మే 15మ్యాక్స్👉 స్టాప్ మేకింగ్ సెన్స్ - మే 3👉 ద ఐరన్ క్లా - మే 10👉 మూవీపాస్, మూవీ క్రాష్ - మే 29హుళు🎞️ ప్రామ్ డేట్స్ - మే 3🎞️ ఈలెన్ - మే 10🎞️ బయోస్పియర్ - మే 10🎞️ బర్త్/ రీబర్త్ - మే 17🎞️ ద స్వీట్ ఈస్ట్ - మే 17🎞️ ద వెంట్ దట్ వే - మే 17🎞️ ఫెరారీ - మే 24🎞️ ద ప్రామిస్డ్ ల్యాండ్ - మే 30🎞️ సింపతీ ఆఫ్ ద డెవిల్ - మే 31చదవండి: అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. మధ్యలో చై ఎందుకో! -
ఓటీటీలోకి 20 సినిమాలు.. హిట్ మూవీస్తో పాటు సిరీస్ కూడా!
బాక్సాఫీస్ దగ్గర కొన్నిసార్లు సీన్ డిఫరెంట్గా ఉంటుంది. టాక్ బాగున్నా పెద్దగా కలెక్షన్స్ ఉండవు. బాలీవుడ్లో మైదాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. వందల కోట్లు పెట్టి తీసిన అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ల బడే మియా చోటే మియా అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులేస్తోంది. భీమా, ఫ్యామిలీ స్టార్.. రెండూ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కంటే దిగువనే ఉన్నాయి.ఓటీటీ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్, భీమా వంటి పలు చిత్రాలు వెబ్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ గురు, శుక్రవారాల్లో ఇంకా ఏయే సినిమాలు, సిరీస్లు ఓటీటీలో సందడి చేయనున్నాయో చూసేద్దాం..నెట్ఫ్లిక్స్శిక్షనేరక (ఇండోనేషియన్ చిత్రం)- ఏప్రిల్ 25ఫేస్ టు ఫేస్ (ఈజిప్షియన్ చిత్రం) - ఏప్రిల్ 25సిటీ హంటర్ (జపనీస్ చిత్రం) - ఏప్రిల్ 25డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 25టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ) - ఏప్రిల్ 26గుడ్బై ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26అమెజాన్ ప్రైమ్దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 26హాట్స్టార్భీమా (తెలుగు సినిమా) - ఏప్రిల్ 25థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్ జోవి స్టోరీ (ఇంగ్లీష్ డాక్యు సిరీస్) - ఏప్రిల్ 26క్రాక్: జీతేగా తో జియేగా (హిందీ మూవీ) - ఏప్రిల్ 26 జియో సినిమాయారియాన్ 2 (హిందీ మూవీ) - ఏప్రిల్ 25రాన్నీతి: బాలకోట్ అండ్ బియాండ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ధక్ ధక్ - ఏప్రిల్ 25ఓ మై గాడ్ 2 (తెలుగు వర్షన్) - ఏప్రిల్ 25వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27బుక్ మై షోకుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26లయన్స్ గేట్ ప్లేద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26అమెజాన్ మినీ టీవీచాచా విధాయక్ హై మారే (సిరీస్, మూడో సీజన్) - ఏప్రిల్ 25చదవండి: నా పిల్లలు చూస్తే నా పరువేం కావాలి.. నటుడు ఎమోషనల్ -
ఓటీటీలో 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా..?
మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'ఆడు జీవితం'. ట్రైలర్తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో చేరిపోయిన ఆడు జీవితం ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది.ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సీ 'ఆడు జీవితం' చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మే 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. డిస్నీ+హాట్స్టార్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. అగ్రిమెంట్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, సినిమా విడుదలైన సమయం నుంచి 40 రోజుల తర్వాత OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో విడుదలచేయవచ్చు. దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం విడుదల కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది. కథ ఏంటి..?కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్ నిర్మించారు. నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేశ్ మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తమిళ హీరో జయం రవి, హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైరన్. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో మెరిసింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 19 నుంచి హాట్స్టార్లో సైరన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. కథేంటంటే? ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్ను, పోలీస్ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా? కీర్తి కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెలియాలంటే? ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.. #Siren OTT - Apr 19 - Hotstar. pic.twitter.com/Mr4KPtCHIe — Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2024 చదవండి: అమ్మ అంటే ఎంత ప్రేమో.. తనకోసం ఆలయాన్నే కట్టించిన హీరో -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ప్రేమలు' సినిమా
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చే విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ లవ్ స్టోరీస్ ఆధారంగా నస్లేన్ కె.గఫూర్, మాథ్యూ థామస్, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఎ.డి. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం రూ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రూ. 135 కోట్ల మార్క్ను చేరుకుంది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.17 కోట్లు రాబట్టింది. ఏప్రిల్ 12 నుంచి ఈ చిత్రం హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. -
'ప్రేమలు' సినిమా నుంచి క్రేజీ సాంగ్ విడుదల
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్షన్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీని ప్రకటించే పనిలో మేకర్స్ ఉన్నారు. కేవలం రూఏ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి నిర్మించాడు. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రూ. 130 కోట్ల మార్క్ను దాటింది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.15 కోట్లు రాబట్టింది. మార్చి 29న ఓటీటీలోకి వస్తుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా బెటర్గా ఉండటంతో ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని డిస్ట్రీబ్యూటర్స్ నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో చిత్ర మేకర్స్ కాస్త తగ్గారు. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల చేయాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. తాజాగా ప్రేమలు చిత్రం నుంచి మిని మహారాణి సాంగ్ను విడుదల చేశారు. ఈ పాట థియేటర్లో యమ క్రేజీగా క్లిక్ అయింది. మంచి మ్యూజిక్తో సాగే ఈ పాట ఇప్పటికి నెట్టింట ట్రెండ్లో ఉంది. ఈ సినిమాలో తన క్యూట్ యాక్టింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది మమితా బైజు. ప్రేమలుతో ఓవర్నైట్లోనే స్టార్గా మారిపోయింది. -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'బిగ్ బాస్' బ్యూటీ సినిమా.. అధికారిక ప్రకటన
బిగ్బాస్ ఫేం దివి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మించాడు. ఈ మూవీ ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం అయ్యాడు. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కానుంది. ఈమేరకు హాట్స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. హరిత అనే పాత్రలో హీరోయిన్ దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. అంతలా మెప్పించిన లంబసింగి చిత్రం ఏప్రిల్ 2 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ ద్వారా దివికి మంచి గుర్తింపు వచ్చింది.నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించిన దివి పలు వెబ్ సిరీస్లలో కూడా నటించిన విషయం తెలిసిందే. -
ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ ‘ట్రూ లవర్’ మూవీ
గుడ్నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవర్’. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్తా వెనుకపడినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఎమోషనల్ లవ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు, ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'హాట్స్టార్'లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తాజాగా విడుదలైంది. హాట్స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. 'ట్రూ లవర్' కథ విషయానికొస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరిప్రియ).. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడతారు. దివ్య సెటిల్ అయిపోగా, అరుణ్ మాత్రం అలానే ఉండిపోతాడు. ప్రతి విషయంలో దివ్యని అనుమానిస్తుంటాడు. మరొకరితో మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య.. బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అరుణ్ సారీ చెప్పగానే కరిగిపోతుంది. అలాంటి వీళ్లిద్దరి జీవితాల్లో ఓ టూర్ కలకలం రేపుతోంది. చివరకు ఏమైంది? అనేదే మూవీ. -
Save The Tigers 2 Review: సేవ్ ద టైగర్స్ 2.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ 2 నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు క్రియేటర్స్: మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం రైటర్స్ : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్ ఆనంద్ కార్తీక్ దర్శకత్వం : అరుణ్ కొత్తపల్లి క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం సంగీతం : అజయ్ అరసద ఎడిటర్ : శ్రవణ్ కటికనేని విడుదల తేది: మార్చి 15, 2024 (డిస్నీ ప్లస్ హాట్స్టార్) ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్సే కానీ కామెడీ జాడేది అనుకుంటున్న తరుణంలో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రిలీజైంది. గతేడాది హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. భార్యా బాధితులుగా హీరోలు పడే అగచాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. ఈ హిట్ సిరీస్కు సీక్వెల్గా తాజాగా సేవ్ ద టైగర్స్ 2 విడుదలైంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం... కథ హీరోయిన్ హంసలేఖ(సీరత్ కపూర్) మిస్ అవడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. తను ఏమైందన్న ఆందోళనతో రెండో సీజన్ కథ మొదలవుతుంది. హంసలేఖ ఎక్కడ? అని పోలీసులు విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. తమకు తెలియదు మహాప్రభో అని మొర పెట్టుకున్నా సరే.. పోలీసులు లెక్క చేయకుండా ముగ్గురికీ లాఠీదెబ్బల రుచి చూపిస్తారు. మరోవైపు మీడియాలో హంసలేఖను ఈ ముగ్గురూ పార్టీ నుంచి తీసుకెళ్లిన వీడియో చూపించి ఏకంగా ఆమెను హత్య చేశారంటూ కథనాలు ప్రసారం చేస్తారు. ఇంతలో హంసలేఖ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురినీ పోలీసులు వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పంద కౌన్సిలర్ (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకెళ్లారు? రాహుల్, అతడి భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య దూరిన మూడో వ్యక్తి హారిక (దర్శనా బానిక్) ఎవరు? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలన్న రవి భార్య హైమావతి(జోర్దార్ సుజాత) కల నెరవేరిందా? విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలనుకుంది? మూడు జంటల మధ్య మళ్లీ గొడవలు ముదరడానికి కారణమేంటి? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ మొదటి సీజన్లాగే ఈ సీజన్లోనూ కామెడీకి కొదవలేదు. కామెడీతో పాటు ఓ సందేశాన్ని జోడించారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని నొక్కి చెప్పారు. చూసిన ప్రతీది నిజమని గుడ్డిగా నమ్మేసి ఓ అభిప్రాయానికి రాకూడదని, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది మనమే తెలుసుకోవాలని మహి వి రాఘవ్ మెదడుకు ఎక్కేలా చెప్పాడు. ఈ విషయంలో మహిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! మహి క్రియషన్స్, అరుణ్ డైరెక్షన్ ఎక్కడా సింక్ మిస్ అయినట్లు అనిపించదు. సిరీస్ నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. కథకు తగ్గట్టుగా అజయ్ అరసద సంగీతం అందించాడు. ఎవరెలా చేశారంటే? ఈ సిరీస్లో ఎవరి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ప్రియదర్శి, అభినవ్, చైతన్య బాగా నటించారు. సుజాత, దేవయాని, పావని వారితో పోటీపడి నటించినట్లు అనిపించినా మగజాతి ఆణిముణ్యాలదే ఇక్కడ పైచేయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూతురు పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సీన్.. ఆ అమ్మాయి స్కూల్లో తన గురించి మాట్లాడేటప్పుడు అతడు భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో ప్రియదర్శి చింపేశాడు. గంగవ్వ, అవినాష్, , వేణు.. తమ పాత్రల పరిధిమేర నటించారు. పనిమనిషితో పెట్టుకుంటే మడతెడిపోద్ది అనే రీతిలో రోహిణి మరోసారి ఫుల్గా నవ్వించింది. ఫైనల్గా చెప్పాలంటే.. ఓపక్క నవ్విస్తూనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తుందీ సిరీస్. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఏడిపిస్తుంది. వీకెండ్లో హ్యాపీగా చూసేయొచ్చు. -
'ప్రేమలు' ఓటీటీ వివరాలు.. ఒకేసారి అన్ని భాషలలో రిలీజ్
మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'ప్రేమలు'. ఓటీటీ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్లో వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ప్రేమలు అనే పేరుతో తాజాగా ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ప్రేమలు యూత్కు బాగా కనెక్ట్ అయింది. ఈ హిట్ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. నస్లేన్ కె.గఫూర్, మమితా బైజు జంటగా నటించి మెప్పించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రేమలు మూవీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళంలో విడుదలై ఇప్పటికే 30రోజులు దాటింది. దీంతో ఈ సినిమాను మార్చి మొదటి వారంలోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిస్నీ హాట్స్టార్ ప్లాన్ చేసింది. కానీ ప్రేమలు చిత్రం నచ్చి ఎస్.ఎస్.కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. దీంతో తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ వెర్షన్ మార్చి 15న రిలీజ్ కానుంది. అందువల్లే ఓటీటీ రిలీజ్ కాస్త ఆలస్యం అయినట్లు చెబుతున్నారు. మార్చి 29 నుంచి హాట్స్టార్లో ప్రేమలు స్ట్రీమింగ్ కావడం దాదాపు ఖాయంగా కనిపస్తుంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్కు సీక్వెల్.. అప్పుడే స్ట్రీమింగ్!
ఓటీటీలో థ్రిల్లర్, క్రైమ్, హారర్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేదంటే కమర్షియల్ చిత్రాలు తారసపడుతుంటాయి. కామెడీ షోలు కనిపిస్తాయి కానీ సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తెలుగులో 'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ రిలీజైంది. ఇది గతేడాది హాట్స్టార్లో అందుబాటులోకి వచ్చింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించగా వీరి భార్యల పాత్రల్లో సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి నటించారు. తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఆ సిరీస్ చూసినంతసేపు జనాలు వారి టెన్షన్ పక్కనపెట్టి కడుపుబ్బా నవ్వారు. ఈ క్రమంలో ఈ సూపర్ హిట్ సిరీస్కు సీక్వెల్ ప్రకటించింది హాట్స్టార్. ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లుగా ఆ మధ్య పోస్టర్ వదిలింది. సీజన్ 2 గురించి బుధవారం ఆసక్తికర పోస్ట్ చేసింది హాట్స్టార్. మొదటి సీజన్ను మార్చి 10 వరకు ఫ్రీగా చూడొచ్చని ఆఫర్ ఇచ్చింది. ఇది చూసిన జనాలు.. మార్చి రెండో వారంలో మొదటి సీజన్ చూడమంటున్నావంటే తర్వాతి వారంలో సీక్వెల్ రిలీజ్ చేస్తావన్నమాట అంటూ ఎవరికి వారు డిసైడ్ అయిపోతున్నారు. Save The Tigers S2 is on its way! And now you can binge-watch the first season for FREE until March 10 🙌 Get going, Tigers 🐅 #SaveTheTigersAgain coming soon only on #DisneyPlusHotstar Link - https://t.co/alAtoK4Ycq@mahivraghav @PradeepAdvaitam @PriyadarshiPN… pic.twitter.com/3ZOAz1zls1 — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2024 చదవండి: Shriya Saran: నేను తల్లిని.. అయినా అలాగే చూస్తారు.. అది చూసి నా భర్త.. -
ఈగల్కు ఓటీటీ డేట్ దొరికినట్లేనా..?
రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. సినిమా విడుదల సమయంలో ఈగల్కు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో.. ఇప్పుడు ఓటీటీ విడుదల విషయంలో కూడా పలు సమస్యలు ఎదురు అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలు వచ్చాక సినిమాకు కొంత అదనపు బిజినెస్ ఉంటుంది. కానీ పలు కారణాల వల్ల ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు కూడా ఓటీటీలోకి అందుబాటులోకి రావు. ఉదాహారణకు 'ది కేరళ స్టోరీ' చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా విడుదలయైన పది నెలలకు ఓటీటీలో విడుదల అయింది. ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా అలాంటి కష్ఠాలు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 9న విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ భాగస్వామితో డీల్ కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లో ఈగల్ సందడి దాదాపు ముగిసిందని చెప్పవచ్చు. సినిమాపై మొదట డివైడ్ టాక్ వచ్చినా.. తర్వాత ఫర్వాలేదు అనే టాక్ రావడంతో మళ్లీ కలెక్షన్స్ పెరిగాయి. దీంతో రవితేజ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా ఓటీటీ డీల్ సెట్ కాలేదు అనేది రవితేజ ఫ్యాన్స్తో పాటు అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈగల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈగల్తో డిస్నీ ప్లస్ హాట్స్టార్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డీల్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అయితే అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్లకు సీక్వెల్స్.. ఆ ఓటీటీలోనే!
సినీ ప్రియులు సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్లకూ ఓటేస్తున్నారు. కొత్త కంటెంట్తో రిలీజయ్యే సిరీస్లను ఆదరిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సిరీస్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే అలా వచ్చినవాటిలో ఎన్నో హిట్టయ్యాయి కూడా! ఈ క్రమంలో కొన్ని సూపర్ హిట్ సిరీస్లకు సీక్వెల్స్ ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్స్టార్. అవేంటో చూసేద్దాం.. సేవ్ ది టైగర్స్ హాట్స్టార్లో గతేడాది వచ్చిన తెలుగు వెబ్ సిరీస్లలో సేవ్ ది టైగర్స్ ఒకటి. కడుపుబ్బా నవ్వించిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. తేజ కాకుమాను దర్శకత్వం వహించగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. వీరి భార్యల పాత్రల్లో సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి నటించారు. హీరోలు ముగ్గురూ ఒక్కో రంగానికి సంబంధించినవారు. కానీ ఈ ముగ్గురూ భార్యా బాధితులే. భార్యల నస వల్ల ఫ్రస్టేషన్కు గురవతుంటారు. ఈ క్రమంలో వారి కాపురాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి పరిస్థితుల్లో వీరు ఏం చేశారు? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది రెండో సీజన్లో చూపించనున్నారు. ఈ ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది హాట్స్టార్. త్వరలోనే రెండో సీజన్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. Can anyone save the tigers this time around?! #HotstarSpecials #SavetheTigers S2 coming soon. pic.twitter.com/Yb1rtpoZao — Disney+ Hotstar (@DisneyPlusHS) February 14, 2024 కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ఇది పూర్తిగా క్రైమ్ సిరీస్. గతేడాది కేరళ క్రైమ్ ఫైల్స్ రిలీజైంది. ఆషిఖ్ ఐమర్ అందించిన కథకు అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించాడు. ఒక లాడ్జిలో వేశ్య హత్యకు గురవుతుంది. తనను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతూ హంతకుడి కోసం వెతుకులాట మొదలుపెడతారు. ఒక ఫేక్ అడ్రస్ను పట్టుకుని వారు దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఈ మలయాళ సిరీస్లో అజు వర్గీస్, లాల్, షింజ్ షాన్, సంజు సనిచెన్, అశ్వతి మనోహర్, నవాస్ వల్లికున్ను, దేవకి తదితరులు నటించారు. ఓటీటీలో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హిట్ సిరీస్కు సీక్వెల్ ప్రకటించారు. త్వరలోనే కొత్త కేసుతో కేరళ క్రైమ్ ఫైల్స్ 2 రానున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) గూస్బంప్స్ ఇది ఒక హారర్ సిరీస్. ఆర్.ఎల్. స్టీన్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ అమెరికన్ సిరీస్ రూపొందించారు. ఇందులో జాక్ మారిస్, ఇసా బ్రియోన్స్, మైల్స్ మెకెన్నా, అనయి పుయిగ్, విల్ ప్రైస్, రాచెల్ హారిస్ ప్రధాన పాత్రలు పోషించారు. రాబ్ లాటెర్మాన్, నికోలర్ స్టోలర్ దర్శకత్వం వహించారు. పది ఎపిసోడ్లతో హాట్స్టార్లో అందుబాటులో ఉంది. కథేంటంటే.. హైస్కూల్ విద్యార్థులు ఓ రోజు పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ 30 ఏళ్ల క్రితం ఓ పిల్లవాడు చచ్చిపోతాడు. ఆ బంగ్లాకు వెళ్లినప్పటినుంచి విద్యార్థుల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఆ బంగ్లాలో ఎన్ని ఆత్మలున్నాయి? వాటితో వీళ్లు ఎలా పోరాడారు? ఎవరు విజయం సాధించారన్నదే గూస్బంప్స్ స్టోరీ. తాజాగా దీనికి కూడా సీక్వెల్ ప్రకటించారు.. త్వరలోనే రెండో సీజన్ రానున్నట్లు ప్రకటించింది హాట్స్టార్. ఇలా ఫన్, క్రైమ్, హారర్ సిరీస్లు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయని తెలిసి ఖుషీ అవుతున్నారు ఓటీటీ లవర్స్! Season 2 of #GoosebumpsSeries is coming. pic.twitter.com/M1WgMzijg5 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 12, 2024 చదవండి: విజయ్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నాకూ రాజకీయాల్లోకి.. -
ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్
మరో వారం వచ్చేసింది. రేపు (ఫిబ్రవరి 16) సందీప్ కిషన్ నటించిన భైరవకోన విడుదల కానుంది. గత వారంలో విడుదలైన రవితేజ ఈగల్, యాత్ర- 2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఓటీటీలోకి రాబోయే రెండు రోజుల్లో నా సామిరంగా, ది కేరళ స్టోరీ చిత్రాలు రానున్నాయి. దాదాపు 9 నెలల తర్వాత వివాదస్పద కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోవడంతో ఆ సినిమాపైనే అందరి గురి ఎక్కువగా ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్లు కూడా ఈ వారంలో అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. డంకీ, నా సామిరంగ, సబా నాయగన్, ది కేరళ స్టోరీ నాలుగు చిత్రాలు ప్రత్యేకం. నెట్ఫ్లిక్స్ • డంకీ (నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది) • హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్సిరీస్) - ఫిబ్రవరి 15 • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • లిటిల్ నికోలస్- హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఫిబ్రవరి 15 • రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15 • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15 • ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15 • క్రాస్ రోడ్స్( ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15 • ది అబిస్(మూవీ) - ఫిబ్రవరి 16 • కామెడీ చావోస్(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 • ఐన్స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం) - ఫిబ్రవరి 16 • ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ • నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17 • సబా నాయగన్ ( తమిళ్,తెలుగు,మలయాళం,హిందీ మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది • సలార్ (హిందీ వర్షన్) - ఫిబ్రవరి 16 • ది స్టోరీ ఆఫ్ అజ్ (వెబ్ సిరీస్- 1)- - ఫిబ్రవరి 16 అమెజాన్ ప్రైమ్ వీడియో • రూట్ నం.17 ( తమిళ్ మూవీ) - ఫిబ్రవరి 15 • అమవాస్ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16 • లవ్స్టోరీ యాన్ (హిందీ వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది జీ5 • ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16 • క్వీన్ ఎలిజిబెత్ (తమిళ్,మలయాళం మూవీ) - స్ట్రీమింగ్ అవుతుంది -
ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అఫీషియల్ ప్రకటన
'నా సామిరంగ' అంటూ సంక్రాంతి బరిలో దిగి అక్కినేని నాగార్జున హిట్ కొట్టారు. విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే అల్లరి నరేశ్, రాజ్తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ వంటి చిత్రాలకు గట్టి పోటీగా నా సామిరంగ చిత్రం నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి నాగ్ కెరియర్లో మరో హిట్ను అందుకున్నారు. నా సామిరంగ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా డిస్నీ+హాట్స్టార్ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అవుతుందని హాట్స్టార్ అఫీషియల్గా ప్రకటించింది. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 55 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఓపెనింగ్స్ తొలి మూడు రోజుల్లోనే రూ. 28 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024 -
ఓటీటీలోకి సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ప్రేమ కథలతో పాటు థ్రిల్లర్ చిత్రాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాంటిది ప్రేమికుల దినోత్సవం రోజున ఎలాంటి సినిమా ఉంటే బాగుంటుందో అలాంటి రొమాంటిక్ డ్రామా మూవీని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు హాట్స్టార్ తెలిపింది. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన 'సబా నాయగన్' స్ట్రీమింగ్కు రెడీగా ఉంది. ఇందులో కలర్ ఫొటో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న 'చాందిని చౌదరి' ప్రధాన పాత్రలో నటించింది. భద్రమ్, మన్మధ లీల, పిజ్జా 2 సినిమాలతో 'అశోక్ సెల్వన్' హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లో కూడా అశోక్ సెల్వన్కు గుర్తింపు ఉంది. చాందినీ చౌదరితో కలిసి నటించిన సబా నాయగన్ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఈ సినిమాతో సీఎస్ కార్తికేయ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం, విశ్వరూపం 2' చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. తమిళంలో భారీ హిట్ అందుకున్న 'సబా నాయగన్' చిత్రం ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హాట్స్టార్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో విడుదల చేసింది. ఒక టికెట్కు నాలుగు సినిమాలు అంటూ 'జో,ఫైట్ క్లబ్, పార్కింగ్' ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయని.. 'సబా నాయగన్' ఫిబ్రవరి 14న వాలంటైన్స్డే సందర్భంగా రానుందని హాట్స్టార్ తెలిపింది. ఈ చిత్రం కూడా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. 'సబా నాయగన్' సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డీస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఫిబ్రవరి 14 నుంచి సబా నాయగన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే ఇంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి సబా నాయగన్ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ చేస్తే మేకర్స్కు, ఓటీటీ సంస్థకు కలిసి వస్తుందని వాయిదా వేసి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు అక్కడ 3 స్టార్ రేటింగ్తో పాటు Imbd నుంచి 8.1 రేటింగ్ అందుకుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
ఓటీటీలోకి వచ్చేసిన 'లోకేష్ కనగరాజ్' యాక్షన్ థ్రిల్లర్ సినిమా
ఇప్పుడు అంతా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుండటంతో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతున్నాయి. ఇప్పటికే తమిళ చిత్రం అయిన 'జో' హాట్స్టార్లో మంచి టాక్తో స్ట్రీమింగ్ అవుతుంది.తాజాగా నేటి నుంచి (జనవరి 27) మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్గా విక్రమ్, లియో చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. జీ స్క్వాడ్ ప్రొడక్షన్ పేరుతో ఆయన నిర్మాతగా మారాడు. 'ఫైట్ క్లబ్' పేరుతో తమిళ్లో ఒక చిత్రాన్ని ఆయన నిర్మించారు. అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో విజయ్ కుమార్ నటించాడు. ఉరియాది మూవీతో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్.. ఈ 'ఫైట్ క్లబ్'లో మెయిన్ రోల్లో కనిపించాడు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో పాటురూ. 9 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ను అందుకుంది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. ఏదేమైనా నేటి నుంచి హాట్స్టార్లో 'ఫైట్ క్లబ్' స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇదొక రివేంజ్ డ్రామా కథ రివేంజ్ డ్రామాగా ఫైట్ క్లబ్ చిత్రం ఉంటుంది. కాలేజీలో ఉన్న హీరోపై ఎటాక్ చేసేందుకు విలన్ గ్యాంగ్ ప్రయత్నించే సీన్తో సినిమా మొదలవుతుంది. కథల భాగంగా సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ హాఫ్లో చాలా ప్రశ్నలు మనకు కలుగుతాయి. వాటంన్నిటికీ సెకండాఫ్లో డైరెక్టర్ రివీల్ చేస్తాడు. ఈ క్రమంలో ఆడియన్స్ను బాగా ఎంగేజ్ చేస్తాడు డైరెక్టర్. ఇందులోని సీన్స్ ఎక్కువగా రివేంజ్లాగే ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్కు ఎవరైనా ఫిదా అవుతారు. కథ పాతదే అయిన టేకింగ్ విధానం బాగుంటుందని టాక్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని తప్పక ఇష్టపడుతారని కామెంట్లు వస్తున్నాయి. -
విశాఖకు రానున్న లావణ్య త్రిపాఠి.. అందరికీ ఆహ్వానం అంటూ ప్రకటన
జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 28న విశాఖలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు 'మిస్ పర్ఫెక్ట్' టీమ్. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్నకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిశుభ్రం చేయనున్నారు. పరిశుభ్రత పట్ల నిబద్దత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్లో నటించారు. డిస్నీ హాట్ స్టార్లో ఫిబ్రవరి 2న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా లావణ్య త్రిపాఠి జనవరి 28న ఉదయం 6గంటలకు విశాఖలోని వైఎంసీఏ బీచ్ వద్దకు రానుంది. ఈ ప్రోగ్రామ్లో పాల్గొనాలని అనుకునే వారందరూ కూడా ఆ సమయంలో అక్కడికి రావచ్చని మేకర్స్ ప్రకటించారు. 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి పోషించిన పాత్ర అందరినీ మెప్పిస్తుంది. ఈ సిరీస్లో పరిశుభ్రతకు మారుపేరుగా లావణ్య జీవితం ఉంటుంది. అంతే కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆమె జీవితం ఊహించని మలుపు ఎలా తిరుగుతుంది అనేదే ఈ సిరీస్. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన పిల్లి- ఎలుక గేమ్లా ఉంటుంది. క్లీన్నెస్ డ్రైవ్ ఈవెంట్ జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా లావణ్య విశాఖకు రానుంది. ఈ వెబ్ సిరీస్ను ,అందరినీ ఆకట్టుకుంటుందని డిస్నీ+ హాట్స్టార్ పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, తెరకెక్కిన ఈ 'మిస్ పర్ఫెక్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. నవ్వులతో నిండిన ప్రపంచంలోకి మనోహరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. పరిశుభ్రతకు అంబాసిడర్గా, లావణ్య త్రిపాఠి కనిపిస్తోంది. పర్యావరణ నిర్వహణ గురించి అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆమె వైజాక్ రానుంది. దీంతో 28న విశాఖలో జరగనున్న బీచ్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొననుంది. లావణ్యతో పాటు అభిజిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. -
ఓటీటీలో మోహన్లాల్ సూపర్ హిట్ మూవీ.. నెలరోజులకే..
ఓటీటీలు వచ్చాక ఇక్కడి సినీప్రియులు తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలనూ ఆదరిస్తున్నారు. అటు సినిమా మేకర్స్ కూడా తమ చిత్రాన్ని ఓటీటీలో వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ సినిమాలు చూసేందుకు జనాలు గత కొంతకాలంగా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతున్నాయి. ఓటీటీలోకి నేరు తాజాగా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'నేరు' మూవీ ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్, శాంతి మాయాదేవి, సిద్దిఖి జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన నేరు గతేడాది డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. ఓటీటీలో రిలీజ్ ఇప్పటివరకుప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రిలీజైన నెలరోజులకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 23 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు
మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ సంక్రాంతి సందడి ఉండనుంది. ఇందుకు తగ్గట్లే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. ఆయా హీరోల ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్.. వీటి కోసం చాలా ఎదురుచూస్తున్నారు. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనే ఆత్రుత కూడా ప్రతిఒక్కరిలో ఉంది. ఇదే టైంలో ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్', 'కిల్లర్ సూప్', 'అజయ్ గాడు' చిత్రాలతో పాటు 'ద లెజెండ్ ఆఫ్ హనుమాన్' సిరీస్ మూడో సీజన్ మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అంటే థియేటర్లకి వెళ్లి కొత్త మూవీస్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే వీటిని ప్రిఫర్ చేయొచ్చనమాట. ఇంతకీ ఓటీటీల్లో ఏ సినిమా ఎప్పుడు రానుందనో తెలుసా? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ (జనవరి 08 నుంచి 14 వరకు) నెట్ఫ్లిక్స్ ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 08 డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) - జనవరి 09 పీట్ డేవిడ్సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09 క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 కింగ్డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) - జనవరి 10 ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) - జనవరి 11 కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) - జనవరి 11 మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) - జనవరి 11 సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) - జనవరి 12 అడిరే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12 లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 12 లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) - జనవరి 12 డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 13 అమెజాన్ ప్రైమ్ 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 11 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 11 రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 12 జీ5 అజయ్ గాడు (తెలుగు సినిమా) - జనవరి 12 హాట్స్టార్ ఎకో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 11 ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12 సోనీ లివ్ చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 12 జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12 ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 10 బుక్ మై షో జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 09 వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 09 -
ఫోటోతో పాటు గుడ్ న్యూస్ చెప్పిన 'మహాభారతం' సీరియల్ అర్జునుడు
భారత ఇతిహాసాల్లో ఒకటిగా చెప్పుకునే మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని 'మహాభారతం' అనే సీరియల్ తెరకెక్కింది. హాట్స్టార్లో అన్ని భాషల్లో ఇది అందుబాటులో ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోలలో మహాభారతం కూడా ఒకటి. 269 ఏపిసోడ్స్ ఉన్న ఈ సీరియల్కు IMDb రేటింగ్ 9.0 ఉంది. మహాభారతం సీరియల్లో అర్జునుడిగా నటించిన హిందీ సీరియల్ నటుడు షహీర్ షేక్ను ఎవరూ మరచిపోలేరు. ఆయన మరోసారి తండ్రి అయ్యాడు. 2020లో రుచికా కపూర్ను ఆయన పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జంటకు ఒక పాప ఉంది. ఇప్పుడు మరో ఆడ శిశువుకు రుచికా జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. భారతీయ వెండితెర ప్రముఖ నటులలో ఒకరైన షహీర్ షేక్ తన చిరకాల స్నేహితురాలు రుచికా కపూర్ను మార్చి 2020లో వివాహం చేసుకున్నాడు. వారి మొదటి కుమార్తె అనయను 2021లో స్వాగతించారు. తమ పర్సనల్ లైఫ్ను ఎక్కువగా కెమెరా కళ్లకు దూరంగా ఉంచిన ఈ జంట ఈసారి తన జీవితంలోకి వచ్చిన కొత్త అతిథి గురించి షహీర్ భార్య రుచిక ఇన్స్టాగ్రామ్లో రాసింది. సోదరిని కలిగి ఉండటానికి మించిన గొప్పదనం నిజంగా ఏమీ లేదని రుచికా కపూర్ డిసెంబర్ 31 న తన ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. అక్కడ తన ఇద్దరు పిల్లల ఫోటోలను పోస్ట్ చేసింది. పెద్ద పాప పేరు అనయ అయితే రెండో కుమార్తె పేరు కుద్రత్ అని ఆమె తెలిపింది. తన చెల్లెల్ని అనయ ఎంతో ముద్దుగా కౌగిలించుకోవడం ఆ ఫోటోలో చూడవచ్చు. షహీర్ షేక్ త్వరలో బాలీవుడ్ చిత్రం అయిన డు పట్టి (Do Patti ) సినిమాలో నటి కృతి సనన్ సరసన నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజోల్ కూడా ఓ పాత్ర పోషించింది. కన్నికా ధిల్లాన్ కథను అందించిన ఈ చిత్రానికి శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించారు. షహీర్ షేక్ కుచ్ రంగ్ ప్యార్ కే ఐసా బీ, మహాభారత్, నవ్య, బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ, క్యా మస్త్ హై లైఫ్ మొదలైన హిందీ సీరియల్స్లో కూడా ఆయన నటించారు. అతని భార్య రుచిక ఫిల్మ్ ప్రొడ్యూసర్గా, మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నారు. ఇది కాకుండా, ఆమె బాలాజీ మోషన్ పిక్చర్ డిప్యూటీ హెడ్గా కూడా పనిచేసింది. ఆమె ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ రిటర్న్, దొబారా వంటి చిత్రాలకు సహ దర్శకత్వం వహించింది. View this post on Instagram A post shared by Ruchikaa Kapoor Sheikh (@ruchikaakapoor) -
ఓటీటీలోకి 'మంగళవారం' థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'మంగళవారం'. మిస్టీరియస్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. 'ఆర్ఎక్స్ 100' లాంటి విజయం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్పూత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదల అయ్యేందకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న మంగళవారం రోజునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్పూత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'ఆర్ఎక్స్ 100' సినిమా మాదిరే ఇందులో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది పాయల్. ఇందులో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవుతారు.. అంతలా ఈ సినిమా కోసం ఆమె గ్రౌండ్ వర్క్ చేసిందని చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలో కథలో ట్విస్ట్లు ఇస్తూ వెళ్లిన దర్శకుడు సెకండాఫ్లో ఒక్కొక్కటి రవీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చివరి 45 నిమిషాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. 'కాంతార'కు అజనీష్ అందించిన మ్యూజిక్ మంగళవారం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా 'గణగణ మోగాలి' పాటకు ఆయన అందించిన మ్యూజిక్తో పూనకాలు వచ్చేస్తాయి. -
ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్లు
ఈ ఏడాది సినిమా డైరీ చివరి పేజీలకు చేరుకుంది. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కొత్త దర్శకులు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపారు. ఈ ఏడాదలో ఎక్కువగా చిన్న చిత్రాలే మెప్పించాయి. ఏడాది తెరపై తొలి సినిమాతోనే విజయం సాధించిన డైరెక్టర్లు ఉన్నారు. నేడు ఓటీటీలు యుగం నడుస్తోంది. దీంతో తెలుగు సినిమాలతో పాటు పర భాష చిత్రాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అలా సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో 2023లో పరిచయం అయిన కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం పదండి. మారుతున్న సినీప్రియుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో వినోదాలు వడ్డించడంలో కొత్త దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కొత్త ప్రతిభ తెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా వారి వైపు ఓ కన్నేస్తుంటారు. అలా ఈ ఏడాది మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు ఎవరో తెలుసుకోండి. దసరా- శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నాని- కీర్తి సురేష్ జోడిగా నటించిన చిత్రం దసరా... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్లోని హిట్ సినిమాల లిస్ట్లో చేరింది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు డైరెక్టర్ సుకుమార్ టీమ్లో శ్రీకాంత్ ఓదెల పనిచేశాడు. అదే సమయంలో దసరా కథను రెడీ చేసిన శ్రీకాంత్.. నిర్మాత సుధాకర్ చెరుకూరికి వినిపించడం ఆపై అది కాస్త నానికి నచ్చడం చకచక పనులు జరిగిపోయాయి. అలా మొదటి చిత్రంతోనే పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు శ్రీకాంత్. దసరా చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హాయ్ నాన్న- శౌర్యువ్ నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. ఇదే ఏడాది రెండోసారి కూడా కొత్త డైరెక్టర్ శౌర్యువ్కు నాని అవకాశాన్ని కల్పించాడు. అలా భారీ అంచనాలతో నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించగా శ్రుతి హాసన్ , బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ఫుల్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు చెందిన శౌర్యువ్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజమౌళి సినిమాలు చూస్తూనే డైరెక్షన్ విభాగంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. హాయ్ నాన్న కథ విషయానికొస్తే.. సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. శౌర్యువ్ వద్ద ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని. త్వరలో వాటి గురించి చెబుతానని ఆయన ప్రకటించాడు. రోమాంచమ్- జీతూ మాధవన్ (మలయాళం,తెలుగు) కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓటీటీల పుణ్యామాని భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే రోమాంచమ్ సినిమా కూడా హిట్ కొట్టింది. ఈ చిత్రం ద్వారానే జీతూ మాధవన్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన పేరు దేశ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఫిబ్రవరి 3న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. కామెడీ, హారర్.. రెండూ పూర్తి భిన్నమైన నేపథ్యాలతో మంచి వినోదాన్ని పండించాడు డైరెక్టర్ జీతూ.. ఓయిజా బోర్డుతో ఆట ఆడడం వల్ల 2007లో బెంగళూరులోని ఓ ఇంట్లో ఉన్న ఏడుగురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ఈ సినిమా సారాంశం. ప్రస్తుతం డిస్నీ+ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. దాదా- గణేష్ కె. బాబు (తమిళ్) కోలీవుడ్లో కెవిన్ హీరోగా నటించిన తమిళ మూవీ దాదా.. ఈ సినిమా బిగ్ హిట్గా నిలిచింది. దాదాపు మూడు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 22 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్ కె. బాబు డైరెక్టర్గా దాదా చిత్రం ద్వారానే పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని ఆపై వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో వారికి జన్మించిన బిడ్డ తండ్రి వద్దే ఉండిపోతాడు. సుమారు కొన్నేళ్ల తర్వాత ఆ బిడ్డ తల్లి వద్దకు ఎలా చేరిందనేది ఈ చిత్రం. తండ్రి గొప్పతనంతో రూపొందిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దీనికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాను డైరెక్టర్ గణేష్ కే బాబు చాలా చక్కగా తెరకెక్కించాడు. చిన్న సినిమా అయినా దాదా కథ నచ్చి తమిళంలో ఉధయనిధి స్టాలిన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అపర్ణ దాస్ హీరోయిన్గా నటించింది. అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్కు పా..పా అనే టైటిల్ను ఖరారు చేశారు మేకర్స్. త్వరలో విడుదల కానుంది. బాయ్స్ హాస్టల్- నితిన్ కృష్ణమూర్తి (కన్నడ,తెలుగు) కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడిగా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సరదాగా, అల్లరిచిల్లరగా గడిపే ఓ బాయ్స్ హాస్టల్లోని కుర్రాళ్లకు ఆ హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ చావును కుర్రాళ్లు యాక్సిడెంట్గా మార్చే క్రమంలో ఎదురైన సంఘటనలు ఎంతో సరదాగా ఉంటాయి. -
ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా: అవికా గోర్
‘‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ మొదలుకొని ఇప్పటివరకూ నేను ఆన్ స్క్రీన్పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించాను. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. నందు, అలీ రెజా, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ‘వధువు’ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘బెంగాలీ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకొస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు టీవీ సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్కు టైమ్ కోల్పోయినా... నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నాను. నిర్మాతగా ‘పాప్ కార్న్’ సినిమా తీయడం గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నా పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాను’’ అన్నారు. -
ఓటీటీలో 37 సినిమాలు/ సిరీస్లు.. ఓ పట్టు పట్టేయండి మరి!
ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. అటు థియేటర్లో రిలీజైన సినిమాలను, ఇటు సొంతంగా సినిమాలు, సిరీస్లు నిర్మిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్లుగా విభిన్న కంటెంట్తో సినీప్రియులను ఆకర్షిస్తున్నాయి. 2023కి ముగింపు పలకడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ ఏడాదికిగానూ ఎక్కువ పాపులర్ అయిన సిరీస్లు ఇవే అని ఐఎమ్డీబీ ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఫర్జి, గన్స్ అండ్ గులాబ్స్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లు టాప్ 3లో వరుసగా చోటు దక్కించుకున్నాయి. కోహ్రా, అసుర్ 2 నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. రానా నాయుడు ఆరో స్థానంలో ఉండగా దహాద్, సాస్, బహు ఔర్ ఫ్లెమింగో, స్కూప్, జూబ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటికి పోటీనిచ్చేందుకు కొత్త సినిమాలు, సిరీస్లు రిలీజ్కు రెడీ అయ్యాయి. మరి డిసెంబర్ నెలలో ఓటీటీలోకి వచ్చే చిత్రాలు, సిరీస్లేంటో చూసేద్దాం... అమెజాన్ ప్రైమ్ ► క్యాండీ కేన్ లేన్ - డిసెంబర్ 1 ► మేరీ లిటిల్ బ్యాట్మెన్ - డిసెంబర్ 8 ► యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ - డిసెంబర్ 8 ► రేచర్ 2 - డిసెంబర్ 15 హాట్స్టార్ ♦ ద షెఫర్డ్ - డిసెంబర్ 1 ♦ మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ - డిసెంబర్ 1 ♦ ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ - డిసెంబర్ 1 ♦ ద ఫ్రీలాన్సర్: ద కన్క్లూజన్ - డిసెంబర్ 15 ♦ బీటీఎస్ మోనమెంట్స్: బియాండ్ ద స్టార్స్ - డిసెంబర్ 20 ♦ పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలంపియన్స్ - డిసెంబర్ 20 నెట్ఫ్లిక్స్ ► మే డిసెంబర్ - డిసెంబర్ 1 ► మిషన్ రాణిగంజ్ - డిసెంబర్ 1 ► స్వీట్ హోమ్ 2 - డిసెంబర్ 1 ► ద ఆర్చీస్ - డిసెంబర్ 7 ► మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ - డిసెంబర్ 7 ► జిగర్తాండ డబుల్ ఎక్స్ - డిసెంబర్ 8 ► లీవ్ ద వరల్డ్ బిహైండ్ - డిసెంబర్ 8 ► ద క్రౌన్ సీజన్ 6, రెండో భాగం - డిసెంబర్ 14 ► చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ యానిమేట్ ఫిలిం - డిసెంబర్ 15 ► ట్రెవర్ నోవా: వేర్ వాస్ ఐ - డిసెంబర్ 19 ► మాస్ట్రో - డిసెంబర్ 20 ► రెబల్ మూన్: ద చైల్డ్ ఆఫ్ ఫైర్ - డిసెంబర్ 22 ► జియోంగ్సియోంగ్ క్రియేచర్ సీజన్ 1 పార్ట్ 1 - డిసెంబర్ 22 ► కర్రీ అండ్ సైనేడ్: ద జెల్లీ జోసెఫ్ కేస్ డాక్యుమెంటరీ - డిసెంబర్ 22 ► రిక్కీ జెర్వాయిస్: అర్మగెడాన్ - డిసెంబర్ 25 ► మనీ హెయిస్ట్ బెర్లిన్ - డిసెంబర్ 29 లయన్స్ గేట్ ప్లే ♦ డిటెక్టివ్ నైట్: రోగ్ - డిసెంబర్ 1 జియో సినిమా ► 800 (సినిమా) - డిసెంబర్ 2 ► జర హట్కే జర బచ్కే - డిసెంబర్ 2 ► స్మోదర్డ్ - డిసెంబర్ 8 ► స్కూబీ డూ అండ్ క్రిప్టో టూ - డిసెంబర్ 10 ► ద బ్లాకెనింగ్ - డిసెంబర్ 16 ► ఆస్టరాయిడ్ సిటీ - డిసెంబర్ 25 సోనీలివ్ ♦ చమక్ సిరీస్ - డిసెంబర్ 7 జీ5 ► కడక్ సింగ్ - డిసెంబర్ 8 ► కూసే మునిస్వామి వీరప్పన్ - డిసెంబర్ 8 యాపిల్ టీవీ ♦ ద ఫ్యామిలీ ప్లాన్ - డిసెంబర్ 15 చదవండి: ఆ కంటెస్టెంట్ చేతికి ఫినాలే అస్త్ర.. ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే టాప్ 5లోకి -
చిల్డ్రన్స్ డే స్పెషల్.. ఓటీటీలో పిల్లలకు ఇష్టమైన చిత్రాలు!
సినిమాలన్నీ అందరూ చూసేలా ఉండవు. ఈ మధ్య ఎన్ని ఎక్కువ బూతులు ఉంటే అంత మంచిది అన్నట్లుగా అసభ్య పదజాలాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఓటీటీలో అయితే మరీనూ.. ఓటీటీకి కఠిన నియమనిబంధనలంటూ ఏమీ లేకపోవడంతో వెబ్ సిరీస్లలో ఇష్టారీతిన డైలాగ్స్, సీన్లు వాడేస్తున్నారు. దీంతో ఓటీటీలు పెద్దలకు మాత్రమే, పిల్లలకు పనికి రాదు అనుకుంటారు చాలామంది! అయితే వెతికితే దొరకనిదంటూ ఏమీ ఉండదు.. చిన్నారుల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లోనూ ఎన్నో కామెడీ, యాక్షన్ చిత్రాలు, సిరీస్లు, కార్టూన్లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ఇష్టపడే కార్టూన్స్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.. నెట్ఫ్లిక్స్ ► లోకి ► స్ట్రేంజర్ థింగ్స్ ► నరుటో ► పవర్ రేంజర్స్ ► బెన్ & హోలీస్ లిటిల్ కింగ్డమ్ ► మైటీ లిటిల్ భీమ్ ► చిల్లర్ పార్టీ ► విష్ డ్రాగన్ హాట్స్టార్ ► బేమాక్స్ ► బ్లూయి ► ఫ్రోజెన్ ► ద జంగిల్ బుక్ అమెజాన్ ప్రైమ్ వీడియో ► మిస్టర్ బీన్ ► హ్యారీ పోటర్ -
థియేటర్లో అట్టర్ఫ్లాప్.. ఓటీటీలో బ్లాక్బస్టర్ హిట్
మాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. మాస్ డైలాగులైనా, యాక్షన్ సీన్లయినా తన ఎనర్జీతో ఇరగదీసే హీరో రామ్ పోతినేని. వీరి కాంబోలో బొమ్మ పడితే బాక్సాఫీస్ దద్దరిల్లుతుందనుకున్నారంతా! కానీ అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. రామ్ పోతినేని- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. దీంతో నెలలోపే ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 2న హాట్స్టార్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్కంద స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో స్కంద సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారట! ఈ ఏడాది హాట్స్టార్లో రిలీజైన మొదటి 24 గంటల్లో ఎక్కువమంది వీక్షించిన సినిమాగా స్కంద నిలిచిందని తెలుస్తోంది. అప్పట్లో బోయపాటి.. బెల్లంకొండ శ్రీనివాస్ను హీరోగా పెట్టి తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా యూట్యూబ్లో మాత్రం రికార్డులు తిరగరాసింది. జయజానకి నాయక చిత్రం హిందీ డబ్బింగ్కు యూట్యూబ్లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడదే ట్రెండ్ హాట్స్టార్లోనూ కనిపిస్తోంది. మరోపక్క స్కంద సినిమా ఎడిటింగ్లో కొన్ని లోపాలున్నాయని విమర్శలూ వస్తున్నాయి. ఓ పక్క ట్రోలింగ్ జరుగుతున్నా మరోపక్క ట్రెండింగ్లో ఉండటం బోయపాటి సినిమాకే సాధ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: భారతీయుడు 2 ఇంట్రో చూశారా? అదిరిపోయిందంతే! -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్పై రతికా ఫైర్! -
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్
నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'స్కంద' హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' నెట్ఫ్లిక్స్లో రన్ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేయవచ్చు. జవాన్- నెట్ఫ్లెక్స్ బాలీవుడ్ కలెక్షన్స్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్,విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెట్ఫ్లెక్స్లో చూడొచ్చు. స్కంద- హాట్స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తాజాగా హాట్స్టార్ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
Skanda OTT Release: ఓటీటీలోకి మరింత ఆలస్యంగా రానున్న స్కంద!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం స్కంద. జీ స్టూడియోస్తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తీరా థియేటర్లలో విడుదలయ్యాక ఈ చిత్రం బొక్కబోర్లా పడింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా పేలవంగా వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. అనుకున్నట్లుగానే ఆమేరకు ప్రకటన సైతం వెలువడింది. అయితే అంతలోనే స్కంద ఓటీటీ విడుదల వాయిదా పడింది. ఈరోజు ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం మరికొద్ది రోజుల తర్వాతే హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కొత్త డేట్ను ప్రకటించనున్నట్లు హాట్స్టార్ వెల్లడించింది. Bringing MASS like never experienced before🕺🏽 Announcement coming at 5pm today 🕔 @disneyplushstel #RapoRampageonHotstar @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad… pic.twitter.com/O5wcuBSE8R — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 27, 2023 చదవండి: హీరోయిన్తో ప్రేమలో ఉన్న హీరో.. ఇలా దొరికిపోతాననుకోలేదంటూ.. -
ఓటీటీలో 'స్కంద' స్ట్రీమింగ్
బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం స్కంద. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేయడానికి ఈ మాస్ సినిమా సిద్దమైంది. సినిమా విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్గా నిలిచాయి. సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మొదట స్కందతో ఒప్పందం కుదిరిందట. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు సమాచారం. స్కంద సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక స్కంద తర్వాత రామ్ పోతినేని- పూరి కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. -
సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!
సిద్దార్థ్.. తమిళ హీరోనే అయినా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యాడు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలతో బాక్సాఫీస్ హిట్లు కొట్టి ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అతడు ప్రేక్షకులకు కొంత దూరమయ్యాడనే చెప్పాలి. సరైన హిట్ కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఎమోషనల్ కథను సెలక్ట్ చేసుకుని నటించడమే కాక నిర్మాతగానూ మారాడు. ఇటీవల అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిత్తా'. ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28న రిలీజైంది. తమిళనాడులో హిట్ కొట్టిన ఈ మూవీ తెలుగులో చిన్నా పేరుతో అక్టోబర్ 6న రిలీజైంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఆశించినంత కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో చిన్నా చిత్రం ఓటీటీలోకి రానుంది. ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నిమిష సజయాన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ ముఖ్య పాత్రలు పోషించారు. చదవండి: రైతుబిడ్డ పేరు జపం చేసిన అశ్విని.. ఈ వారం నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
ఓటీటీలో దుల్కర్ సల్మాన్ యాక్షన్ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. దీన్ని యథాతథంగా తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేశారు. అభిలాష్ జోషి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఆయా భాషల్లో దుల్కరే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ప్రేమకథల్లో దుల్కర్ను చూసి అలవాటుపడిపోయిన అభిమానులు ఈ యాక్షన్ మూవీని ఆదరించలేదు. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ మినహా మిగతా అన్ని భాషల్లో హాట్స్టార్లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా హిందీ వర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్.. ఇతర భాషల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కింగ్ ఆఫ్ కొత్త హిందీ భాషలో అక్టోబర్ 20 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. 20 రోజులు ఆలస్యంగా హిందీ వర్షన్ ఓటీటీలోకి వస్తోంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ మొత్తానికి హిందీ వర్షన్ డేట్ ప్రకటించారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) చదవండి: హీరోయిన్తో లిప్లాక్.. నాని ఇంట్లో గొడవలు! -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
CWC 2023: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. తొలి ఓవర్లోనే రికార్డులు బద్దలు
చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న హైఓల్టేజీ సమరంలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరమైన స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు. పాకిస్తాన్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. తొలి ఓవర్లోనే రికార్డులు బద్దలు.. యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన భారత్-పాక్ మ్యాచ్ వ్యూయర్షిప్ పరంగా ప్రారంభంలోనే రికార్డులు బద్దలుకొట్టింది. తొలి ఓవర్లో రికార్డు స్థాయిలో కోటిన్నర మంది హాట్స్టార్లో మ్యాచ్ను వీక్షించారు. ఓటీటీ చరిత్రలో తొలి ఓవర్లో ఈస్థాయిలో మ్యాచ్ను వీక్షించడం ఇదే మొదటిసారి. ఇదే కొనసాగితే వ్యూయర్షిప్ పరంగా ఈ మ్యాచ్ ఆల్టైమ్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయం. ఇదిలా ఉంటే, టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. రోహిత్ శర్మ ఆశించినట్లు ఆరంభ ఓవర్లలో వికెట్లు దక్కనప్పటికీ.. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్లో బౌండరీ మినహాయించి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరో ఎండ్లో సిరాజ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను వేసిన తొలి ఓవర్లో ఇమామ్ ఉల్ హాక్ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. 6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 28/0గా ఉంది. ఇమామ్ ఉల్ హాక్ (14), అబ్దుల్లా షఫీక్ (13) క్రీజ్లో ఉన్నారు. సిరాజ్ 3 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా 3 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. -
IND Vs PAK: చలో చిరకాల సమరానికి.. నేడు భారత్,పాక్ల మధ్య వరల్డ్కప్ మ్యాచ్
ప్రపంచకప్లో 51 మ్యాచ్లు ఉన్నా, అందరూ ఎదురు చూసేది ‘ఈ’ మ్యాచ్ కోసమే... ఈ మ్యాచ్ కోసమే ప్రసారకర్తలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేస్తారు... ఈ మ్యాచ్ కోసమే ఫ్లయిట్ టికెట్లు, ప్రకటనల రేట్లు ఆకాశానికి అంటుతాయి... ఈ మ్యాచ్ కోసమే అభిమానులు ఎన్ని కష్టాలకోర్చి అయినా మైదానంలోకి అడుగు పెట్టాలని ఆశపడతారు... ఈ మ్యాచ్ కోసమే ఆస్పత్రి మంచాలు కూడా హోటల్ బెడ్లుగా మారిపోతాయి... ఈ మ్యాచ్ కోసమే సినీ తారలతో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఉంటుంది... ఈ మ్యాచ్ అంటే బీసీసీఐ, ఐసీసీ దృష్టిలో ‘నవరాత్రి’ సంబరం... చరిత్ర అంతా ఒక వైపే ఉండవచ్చు... వన్డే ప్రపంచకప్లో ఏడుసార్లు తలపడితే ప్రతీసారి భారత్నే విజయం వరించి ఉండవచ్చు... ప్రస్తుత బలాబలాలు, ఇటీవలి ప్రదర్శన చూస్తే మరో మాటకు తావు లేకుండా టీమిండియానే ఫేవరెట్ అనవచ్చు... అయినా సరే ఈ పోరుకు ఎక్కడ లేని ఆకర్షణ... సరిహద్దు ఉద్రిక్తతలు, రాజకీయాల కారణంగా ఇది ఆట మాత్రమే కాకుండా అంతకు మించిన భావోద్వేగ సమరం... ఆటగాళ్లు మాకు అన్ని మ్యాచ్లాగే ఇదీ ఒకటి అని పైకి చెప్పవచ్చు కానీ వారికీ తెలుసు... మైదానంలో దిగాక తమ గుండె చప్పుడు ఎలా ఉంటుందో... దాదాపు ఏడాది క్రితం అక్టోబర్ 23, 2022న టి20 ప్రపంచకప్లో రవూఫ్ బౌలింగ్లో కోహ్లి బాదిన రెండు వరుస సిక్సర్లు గుర్తుకొచ్చాయా... నాడు 90 వేల మంది సామర్థ్యం గల మెల్బోర్న్ స్టేడియం దద్దరిల్లింది. ఇప్పుడు 1,32,000 మంది ప్రేక్షకులతో నరేంద్ర మోదీ మైదానం మోతెక్కడం ఖాయం. ఈ రెండింటి మధ్య ఆసియా కప్లో తలపడినా వరల్డ్కప్ లెక్క వేరు... మన అభిమానులతో స్టాండ్లు ‘నీలి సముద్రం’గా మారబోతుండగా, ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై భారత్ను ఎదుర్కొంటూ తమకు మద్దతిచ్చే ఒక్క అభిమానీ లేని పాక్ తట్టుకోగలదా అనేది ఆసక్తికరం. అహ్మదాబాద్: వరల్డ్కప్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా సమరానికి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ, భారీ అంచనాల నడుమ నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తే పాక్పై వన్డే వరల్డ్కప్ మ్యాచ్లలో భారత్ ఆధిక్యం మరింత పెరుగుతుంది. మరోవైపు ఒక్కసారైనా టీమిండియాను ఓడించి పేలవ గణాంకాలకు ఫుల్స్టాప్ పెట్టాలని పాక్ భావిస్తోంది. టోర్నీలో తమ తొలి రెండు మ్యాచ్లలో ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్లపై భారత్ భారీ విజయం సాధించగా... నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించిన పాక్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో భారత్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఆడే పాక్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గిల్ బరిలో దిగుతాడా... భారత్ తుది జట్టు విషయంలో మామాలుగానైతే ఎలాంటి సమస్య లేదు. కానీ డెంగీ జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్లు ఆడని శుబ్మన్ గిల్ బరిలోకి దిగడంపైనే ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం నుంచి కోలుకున్న అతను గురువారం స్వల్ప సమయం పాటు సాధన చేసినా... శుక్రవారం మాత్రం సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోహిత్ ‘గిల్ 99 శాతం ఫిట్గా ఉన్నాడు’ అని చెప్పడం అతను ఆడే అవకాశాలను మెరుగుపర్చింది. ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉండటంతో పాటు ఐపీఎల్లో ఇది అతని సొంత మైదానం కావడం కూడా మరో కారణం. అయితే ఆ ఒక్క శాతం పూర్తిగా కోలుకోకపోతేనే సమస్య. గిల్ లేకపోతే ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్ల బ్యాటింగ్ ఫామ్ భారత్కు పెద్ద బలం. అఫ్గాన్పై సెంచరీతో రోహిత్ తన స్థాయిని చూపిస్తే కోహ్లి ప్రశాంతంగా రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2015లో కోహ్లి, 2019లో రోహిత్ పాక్పై సెంచరీలతో చెలరేగారు. రాహుల్ కూడా తన విలువను ప్రదర్శిస్తుండగా, మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పాండ్యా, జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనకు సిద్ధం కాగా, కుల్దీప్, సొంతగడ్డపై ఆడనున్న బుమ్రా బౌలింగ్ను పాక్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎనిమిదో స్థానంలో శార్దుల్ ఠాకూర్ను తప్పించి అశ్విన్కు మళ్లీ అవకాశం ఇవ్వవచ్చు. అయితే రెండు సీజన్లుగా ఈ మైదానంలో ఉత్తమ రికార్డు ఉన్న షమీ కూడా పరిశీలనలో ఉన్నాడు. జోరు కొనసాగేనా... శ్రీలంక బౌలింగ్ బలమైనది కాకపోయినా సరే వరల్డ్కప్ మ్యాచ్లో 345 పరుగుల లక్ష్యఛేదన అంత సులువు కాదు. కానీ దీనిని సాధించడం కచ్చితంగా పాకిస్తాన్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ మ్యాచ్కు ముందు నెదర్లాండ్స్తో తడబడిన తీరుతో పోలిస్తే ఆ జట్టు పరిస్థితి మారింది. హైదరాబాద్లో ఆడిన తుది జట్టునే పాక్ ఇక్కడా కొనసాగించవచ్చు. రిజ్వాన్ ఫామ్లో ఉండగా, అబ్దుల్లా షఫీక్ రూపంలో దూకుడైన ఓపెనర్ వెలుగులోకి రావడం సానుకూలాంశం. మిడిలార్డర్లో షకీల్, ఇఫ్తికార్ తమ వంతు పాత్ర పోషించగలరు. అయితే ఇమామ్ పేలవ ఆటతో పాటు జట్టు నంబర్వన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ విఫలం కావడమే టీమ్ను ఆందోళన పరుస్తోంది. గత ఐదు ఇన్నింగ్స్లలో కలిపి బాబర్ 71 పరుగులే చేశాడు. అతను తన స్థాయికి తగినట్లుగా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. బౌలింగ్లో ఇప్పటికీ ప్రధాన అస్త్రం షాహిన్ అఫ్రిదినే. తన పదునైన లెఫ్టార్మ్ పేస్తో ఆరంభ ఓవర్లలో అతను భారత బ్యాటర్లను నిలువరించాలని జట్టు కోరుకుంటోంది. ఆపై రవూఫ్ కూడా కీలకం కానున్నాడు. భారీగా పరుగులిచ్చే హసన్ అలీ స్థానంలో వసీమ్ ఆడే అవకాశం ఉంది. టీమ్లో ఒక ప్రధాన స్పిన్నర్ లేకపోవడం పాక్ జట్టు పెద్ద బలహీనత. షాదాబ్, నవాజ్లను భారత బ్యాటర్లు అలవోకగా ఎదుర్కోగలరు. పిచ్, వాతావరణం గత రెండేళ్లలో ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో 59.8 శాతం వికెట్లు తీసి పేసర్లు ఎక్కువ ప్రభావం చూపించారు. అయితే ఈ మ్యాచ్ కోసం నల్లరేగడి మట్టి ఉన్న పిచ్ను ఎంచుకున్నారు. అంటే పిచ్ నెమ్మదిగా మారిపోయి బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ప్రేక్షకుల కోణంలో పరుగుల వరద కోసమే నిర్వాహకులు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. వేడి వాతావరణం, వర్ష సూచన లేదు. మూడో స్పిన్నర్ను ఆడించే విషయంపై ఇప్పుడే చెప్పలేను. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. తుది జట్టులో అవసరమైతే ఒకటి రెండు మార్పులు చేస్తాం. గత నాలుగేళ్లలో నేనేమీ పెద్దగా మారలేదు. బ్యాటర్గా చూస్తే ప్రతీ మ్యాచ్కు ముందు నా లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. దాని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సన్నద్ధతలో లోటు ఉండదు. ప్రతీ రోజు కొత్త సవాలే. అన్నింటికీ సిద్ధంగా ఉంటా. నా ఆటేంటో, జట్టుకు నా అవసరం ఏమిటో బాగా తెలుసు. కెప్టెన్గా ఈ మ్యాచ్ కోసం సహచరులకు ప్రత్యేక సూచనలేమీ చేయను. వరల్డ్కప్లో అన్ని మ్యాచ్లలాగే ఇదీ ఒకటి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ సారథిగా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఒక్క మ్యాచ్ వల్ల నాకు కెప్టెన్సీ రాలేదు. ఈ ఒక్క మ్యాచ్ వల్ల అది పోదు. దేవుడు ఎంత ఇస్తే అంతే దక్కుతుంది. భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య గతంలో ఎన్నోసార్లు ఆడాం కాబట్టి ఇదేమీ కొత్త కాదు. పాక్ అభిమానులను అనుమతిస్తే బాగుండేది. కానీ మద్దతు లేకపోయినా మేం దీనికి సిద్ధమయ్యే ఉన్నాం. చరిత్ర గురించి నేను పట్టించుకోను. రికార్డులు ఏదో ఒక రోజు బద్దలవుతాయి. 2021 టి20 ప్రపంచకప్లో మేం భారత్ను ఓడించాం. అంతకుముందు అదీ లేదు కదా. కాబట్టి దేనికైనా ఎక్కడో ఒక చోట ముగింపు తప్పదు. –బాబర్ ఆజమ్, పాకిస్తాన్ కెప్టెన్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షఫీక్, ఇమా మ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్/వసీమ్, రవూఫ్. -
వరల్డ్ కప్ వీక్షకులకు వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లు!
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ వీక్షకుల కోసం వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టింది. ప్రపంచ కప్ సీజన్లో అదనపు డేటా, లాంగ్ వాలిడిటీ రీఛార్జ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్లు, మరిన్నింటితో సహా కొత్త ఆఫర్లను ప్రారంభించింది. ఇవి వొడాఫోన్ ఐడియా (Vi) యాప్లో అందుబాటులో ఉంటాయి . డిస్నీ+ హాట్స్టార్ సబ్స్కిప్షన్ రూ. 839 హీరో అన్లిమిటెడ్ ప్యాక్తోపాటు డిస్నీ+ హాట్స్టార్ సబ్స్కిప్షన్ను 3 నెలలపాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా, వీఐ రూ. 181 డేటా ప్యాక్పై డబుల్ డేటా ఆఫర్ను అందిస్తోంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ (1GB+1GB) డేటా లభిస్తుంది. ఇక రూ. 418 డేటా ప్యాక్పై రూ. 30 తగ్గింపును అందిస్తోంది. ఇందులో 56 రోజుల పాటు 100 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. వీఐ యాప్లో కూపన్ కోడ్ల ద్వారా, వెబ్ పోర్టల్లో ఫ్యాన్కోడ్ల ద్వారా దీర్ఘకాలిక వాలిడిటీ రీఛార్జ్లపై రూ. 75 వరకు తక్షణ తగ్గింపుతోపాటు రూ.999 ప్లాన్పై 30 శాతం తగ్గింపును కస్టమర్లకు అందిస్తోంది. కాగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా క్రికెట్ వరల్డ్ కప్ లక్ష్యంగా తమ కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్యాక్లు, ప్లాన్లను ప్రారంభించాయి. -
ఓటీటీలో ఒకేరోజు 25కు పైగా సినిమాలు, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మొబైల్ ఫోన్ వచ్చాక చాలావాటి అవసరం తగ్గిపోయింది. ఉత్తరాలు, ల్యాండ్ లైన్లు, రేడియో.. ఇలా చాలావాటి అవసరమే లేకుండా పోయింది. టీవీకి అతుక్కుపోయేవారిని సైతం తనవైపు తిప్పుకుంది. ఓటీటీల పుణ్యమా అని థియేటర్కు క్యూ కట్టేవాళ్లను సైతం తాపీగా ఇంట్లోనే కూర్చోబెట్టి పెద్దగా కష్టపడే పని లేకుండా బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. థియేటర్లో ఎక్కువరోజులు ఆడిన సినిమాతో పాటు, ఆడలేకపోయిన సినిమాలనూ అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేనా... కొత్త తరహా చిత్రాలు, వెబ్ సిరీస్లు, డాక్యు సిరీస్లు, రియాలిటీ షోలు.. ఇలా బోలెడంత కంటెంట్ ఇస్తున్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్స్. దీంతో అటు బాక్సాఫీస్లో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయని కన్నేసేవారంతా కూడా ఓటీటీలోనూ ఏయే చిత్రాలు, సిరీస్లు విడుదలవుతున్నాయని మరో కన్నేసి ఉంచుతున్నారు. మరి ఈ రెండు రోజుల్లో(అక్టోబర్ 5,6) ఏయే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయో చూసేద్దాం.. నెట్ఫ్లిక్స్ ► మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి- అక్టోబర్ 5 ► ఖుఫియా - అక్టోబర్ 5 ► లుపిన్, పార్ట్ 3(వెబ్ సిరీస్) - అక్టోబర్ 5 ► ఎవ్రీథింగ్ నౌ(వెబ్ సిరీస్) - అక్టోబర్ 5 ► బాలెరినా - అక్టోబర్ 6 ► ఫెయిర్ ప్లే - అక్టోబర్ 6 ► ఇన్సీడియస్: ద రెడ్ డోర్ - అక్టోబర్ 6 ► ఎ డెడ్లీ ఇన్విటేషన్ - అక్టోబర్ 6 హాట్స్టార్ ► లోకి సీజన్ 2 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 6 నుంచి ప్రారంభం (ప్రతివారం కొత్త ఎపిసోడ్ రిలీజ్) ► ఇంఫీరియర్ డెకొరేటర్ - అక్టోబర్ 6 ► క్యాంపింగ్ ఔట్ - అక్టోబర్ 6 ► చిప్స్ అహోయ్- అక్టోబర్ 6 ► ఓల్డ్ మెక్డొనాల్డ్ డక్ - అక్టోబర్ 6 ► వింకెన్, బ్లింకెన్ అండ్ నాడ్ - అక్టోబర్ 6 ► వెన్ ద క్యాట్స్ అవే - అక్టోబర్ 6 ► ఫిడ్లింగ్ అరౌండ్ - అక్టోబర్ 6 అమెజాన్ ప్రైమ్ వీడియో ► మిస్టర్ ప్రెగ్నెంట్ - అక్టోబర్ 6 ► ముంబై డైరీస్ (రెండో సీజన్) - అక్టోబర్ 6 ► టోటల్లీ కిల్లర్ - అక్టోబర్ 6 ► డిస్పరేట్లీ సీకింగ్ సోల్మేట్: ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ యూనివర్స్ - అక్టోబర్ 6 లయన్స్ గేట్ ప్లే ► జాయ్ రైడ్ - అక్టోబర్ 6 ► మింక్స్ ( రెండో సీజన్) - అక్టోబర్ 6 జీ5 ► గదర్ 2 - అక్టోబర్ 6 సినీ బజార్ ► నీ వెంటే నేను - అక్టోబర్ 6 బుక్ మై షో ► గ్రాన్ టరిష్మో - అక్టోబర్ 5 ► ఆస్టరాయిడ్ సిటీ - అక్టోబర్ 6 జియో సినిమా ► గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబర్ 6 చదవండి: త్వరలో మంగ్లీ పెళ్లి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సింగర్.. -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నటి వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. అవికా గోర్, సత్యరాజ్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్ను బుధవారం రిలీజ్ చేశారు. 'జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అన్న హెడ్లైన్తో ట్రైలర్ మొదలైంది. అయితే తాను దేశద్రోహి కూతుర్ని కాదని, నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని, దాన్ని నిరూపిస్తానంటూ సీన్లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్కుమార్. కనిపించకుండా పోయిన తండ్రి కోసం, అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తండ్రి కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో అతడి తండ్రి చివరిసారిగా ఓ కోటకు వెళ్లినట్లు తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రాలేదని అందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే, తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని పాడుబడ్డ మాన్షన్లోకి అడుగుపెడుతుంది. అక్కడ వరలక్ష్మికి ఎదురైన పరిణామాలేంటి? తన తండ్రి నిజాయితీపరుడా? దేశద్రోహా? వరలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటపడిందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానుంది. చదవండి: సీక్రెట్గా బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్? ఎవరా మిస్టరీ మ్యాన్? -
ఓటీటీలో 45కు పైగా సినిమాలు/సిరీస్లు, ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?
కరోనా చేసిన మేలు ఏదైనా ఉందా? అంటే అది ఓటీటీనే! కోవిడ్ సమయంలోనే లెక్కలేనన్ని ఓటీటీలు పుట్టుకొచ్చాయి. బోలెడంత కంటెంట్ను తీసుకొచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీని రాజ్యమేలాయి. థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీలే దిక్కయ్యాయి. కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా ఓటీటీల హవా మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాలు, కొత్త సిరీస్లు, షోలు.. ఇలా సగటు ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటాడో దాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. ఇంకేముంది, జనాలు అలవాటు పడ్డారు, అడిక్ట్ అయ్యారు. థియేటర్లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి వస్తుంటే ఎగబడి చూస్తున్నారు. కొత్తగా ఓటీటీలో తీసుకొస్తున్న వెబ్ సిరీస్లకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే, జనాలను ఇంట్రస్ట్ను క్యాష్ చేసుకుంటూనే వారికి ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని పంచుతున్నాయి. మరి అక్టోబర్ నెలలో ఓటీటీలలో సందడి చేసే సినిమాలు, సిరీస్లేంటో చూసేద్దాం.. నెట్ఫ్లిక్స్ ► ఖుషి - అక్టోబర్ 1 ► బెచ్కమ్ - అక్టోబర్ 4 ► రేస్ టు సమ్మిట్ - అక్టోబర్ 4 ► మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి- అక్టోబర్ 5 ► ఖుఫియా - అక్టోబర్ 5 ► లుపిన్, పార్ట్ 3 - అక్టోబర్ 5 ► బాలెరినా - అక్టోబర్ 6 ► సాండర్డ్ విత్ మై మదర్ ఇన్ లా (వెబ్ సిరీస్)- అక్టోబర్ 9 ► వన్స్ అపాన్ ఎ స్టార్ - అక్టోబర్ 11 ► బిగ్ వేప్: ద రైస్ అండ్ ఫాల్ ఆఫ్ జూల్ (డాక్యుమెంటరీ) - అక్టోబర్ 11 ► ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 12 ► గుడ్ నైట్ వరల్డ్ (యానిమేషన్) - అక్టోబర్ 12 ► ఫెయిర్ ప్లే - అక్టోబర్ 13 ► పాస్ట్ లైవ్స్ - అక్టోబర్ 13 ► ద కాన్ఫరెన్స్ - అక్టోబర్ 13 ► ఓగీ ఓగీ (3వ సీజన్) - అక్టోబర్ 16 ► ద డెవిల్ ఆన్ ట్రయల్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 17 ► కాలా పాని (వెబ్ సిరీస్) - అక్టోబర్ 18 ► బాడీస్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 19 ► క్రిప్టో బాయ్ - అక్టోబర్ 19 ► ఓల్డ్ డాడ్స్ - అక్టోబర్ 20 ► లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (డాక్యు సిరీస్) - అక్టోబర్ 25 ► బర్నింగ్ బీట్రేయల్ - అక్టోబర్ 25 ► ప్లూటో (యానిమేషన్) - అక్టోబర్ 26 ► ఎల్లో డోర్: 90's లో-ఫి ఫిలిం క్లబ్ (డాక్యుమెంటరీ) - అక్టోబర్ 27 ► పెయిన్ హస్లర్స్ - అక్టోబర్ 27 ► సిస్టర్ డెత్ - అక్టోబర్ 27 ► టోర్ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 27 ► కాస్తవే దివా - అక్టోబర్ 28 ► రాల్ఫ్ బార్బోసా: కోవాబుంగ - అక్టోబర్ 31 హాట్స్టార్ ► హాంటెడ్ మిషన్ - అక్టోబర్ 4 ► లోకి సీజన్ 2 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 6 నుంచి ప్రారంభం (ప్రతివారం కొత్త ఎపిసోడ్ రిలీజ్) ► ఇంఫీరియర్ డెకొరేటర్ - అక్టోబర్ 6 ► సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ (వెబ్ సిరీస్) - అక్టోబర్ 13 ► వన్స్ అపాన్ ఎ స్టూడియో (షార్ట్ ఫిలిం) - అక్టోబర్ 16 ► మాస్టర్పీస్ - అక్టోబర్ 25 జియో సినిమా ► బెబాక్ (హిందీ మూవీ) - అక్టోబర్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియో ► మిస్టర్ ప్రెగ్నెంట్ - అక్టోబర్ 6 ► ముంబై డైరీస్ (రెండో సీజన్) - అక్టోబర్ 6 ► టోటల్లీ కిల్లర్ - అక్టోబర్ 6 ► మిషన్ ఇంపాజిబుల్- డెడ్ రెకనింగ్ పార్ట్ 1 - అక్టోబర్ 11 ► అప్లోడ్ (మూడో సీజన్) - అక్టోబర్ 20 లయన్స్ గేట్ ప్లే ► జాయ్ రైడ్ - అక్టోబర్ 6 ► మింక్స్ ( రెండో సీజన్) - అక్టోబర్ 6 ► మ్యాగీ మూర్స్ - అక్టోబర్ 20 ► కబ్వెబ్ - అక్టోబర్ 27 చదవండి: హౌస్లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు కంటెస్టెంట్లు.. ఎవరెవరంటే? -
ఓటీటీలో నిత్యామీనన్ మాస్టర్పీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
సౌత్లో స్టార్ హీరోయిన్గా రాణించిన నిత్యామీనన్ ప్రస్తుత దృష్టంతా ఓటీటీల మీదే ఉన్నట్లు కనిపిస్తోంది. బ్రీత్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన నిత్య అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఈ హీరోయిన్ ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ శ్రీమతి కుమారి. ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు డిజిటల్ ప్లాట్ఫామ్లో మంచి స్పందన లభిస్తోంది. ఇంతలోనే తను ప్రధాన పాత్రలో నటించిన మరో వెబ్ సిరీస్ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన మలయాళ వెబ్ సిరీస్ మాస్టర్పీస్. ఈ సిరీస్ ట్రైలర్ను తాజాగా విడుదల చేయడంతోపాటు స్ట్రీమింగ్ డేట్ను సైతం ప్రకటించారు. మాస్టర్పీస్ హాట్స్టార్లో అక్టోబర్ 25 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో నిత్య.. రియా అనే పాత్ర పోషించింది. ఆద్యంతం కామెడీగా సాగిపోతున్న ట్రైలర్ చూస్తుంటే ఫన్ గ్యారెంటీ అని తెలుస్తోంది. అయితే నిత్యామీనన్కు డబ్బింగ్ చెప్పిన వాయిస్ తనకు పెద్దగా నప్పలేనట్లు కనిపిస్తోంది. ఎన్. శ్రీజిత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మలయాళం, తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో అందుబాటులోకి రానుంది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రముఖ తారలు వెబ్సిరీస్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గర కావచ్చు. ఈ క్రమంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ను కూడా అలాంటి లక్కీఛాన్స్కు ఓకే చెప్పింది. ఇంతకు ముందు పలు చిత్రాలలో కథానాయికగా నటించిన ఈమె ఆ తరువాత తెలుగులోనూ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. తాజాగా కాలా అనే వెబ్సిరీస్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అవినాష్ తివారీ కథానాయకుడిగా నటించిన ఇందులో రోహన్ వినోద్ మెహ్రా, నితిన్ గులాటి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ను భూషణ్ కుమార్, కిషణ్ కుమార్, బిజాయ్ నంబియార్ కలిసి నిర్మించారు. ఈ సిరీస్ ఈ నెల 15వ తేది నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మనీ లాండరింగ్, హవాలా కుంభకోణంతో సాగే క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని నటుడు అవినాష్ తివారీ పేర్కొన్నారు. తను ఐబీ ఆఫీసర్గా నటించినట్లు చెప్పారు. తాను కూడా ఐబి అధికారిణిగా నటించినట్లు నివేద పేతురాజ్ పేర్కొంది. తాను నటించిన తొలి వెబ్సిరీస్ ఇదేనని చెప్పింది. ఇందులో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. కాలా వెబ్సిరీస్లో పలు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సీన్లలో నటించేందుకు అవినాష్ తివారీ ఎంతగానో సహకరించారని తెలిపింది. ఈ వెబ్సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో పాటు తెలుగులో పరువు అనే మరో వెబ్సిరీస్లో నటిస్తున్నానంది. అదేవిధంగా తమిళంలోనూ చిత్రాలు చేయబోతున్నట్లు తెలిపింది. చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
ఆగిపోయిన తెలుగు 'బిగ్బాస్ 7'.. కారణం అదే?
తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే చాలామందికి 'బిగ్బాస్' గుర్తొస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో సీజన్ ప్రసారమవుతోంది. ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షోని ఇప్పుడు అర్ధాంతరంగా ఆపేశారు. అవును మీరు సరిగానే విన్నారు. అయితే ఇదంతా కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చేసిన పని అని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? తెలుగులో 'బిగ్బాస్' రియాలిటీ షో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పొచ్చు. తొలి రెండు సీజన్లు మంచి ఆసక్తి చూసిన ప్రేక్షకులకు ఆ తర్వాత కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పొచ్చు. కంటెస్టెంట్స్ పెద్దగా పేరున్న వాళ్లు లేకపోవడం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుత సీజన్లోనూ 14 మంది కంటెస్టెంట్స్ హౌసులోకి అడుగుపెట్టారు. ఆల్రెడీ గేమ్స్, టాస్కులు ఆడేస్తున్నారు. మధ్య మధ్యలో గొడవలూ జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్బాస్.. మరో కొత్త ట్విస్ట్!) అయితే టీవీల్లో రాత్రి 'బిగ్బాస్ 7' ఎపిసోడ్ ప్రసారమవుతుండగా.. మరోవైపు 24x7 హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు దాన్ని సడన్ గా ఆపేశారు. ఆదివారం రాత్రి 10:30 తర్వాత తిరిగి ప్రసారం చేస్తామని ప్రకటించారు. దీనికి కారణం ఉందని తెలుస్తోంది. 24 గంటలు ప్రసారం చేస్తుండటం వల్ల రాత్రి ఎపిసోడ్ టెలికాస్ట్ కావడానికి ముందే విజేతలు, టాస్క్ వివరాలు లాంటివి తెలిసిపోతున్నాయి. ఇక వీకెండ్(శని-ఆదివారం) అంటే నాగార్జున రావడంతో పాటు అందరినీ నిలబెట్టి మరీ వాయించేస్తాడు. అది కూడా ముందే తెలిసిపోతే ఎపిసోడ్ చూసేవాళ్లకు కిక్ పోతుంది. అందుకని ఈ రెండు రోజులు మాత్రం లైవ్ ఉండదు. గత సీజన్ల నుంచి ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. ఈసారి కూడా బిగ్బాస్ మేనేజ్మెంట్ వీకెండ్ వచ్చేసరికి 24 గంటల స్ట్రీమింగ్ ఆపేసింది. టీవీలో యథావిధిగా షో టెలికాస్ట్ అవుతుంది. (ఇదీ చదవండి: 'జవాన్'లో షారుక్కి డూప్.. ఎంత రెమ్యునరేషనో తెలుసా?) -
ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తెలుగు స్టార్ హీరో
సినిమాలు గొప్ప? ఓటీటీలు గొప్ప? అని అడిగితే సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే లాక్డౌన్ టైంలో ఓటీటీలు ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు వాటి హవా ఉన్నప్పటికీ థియేటర్లలో సినిమాలు కూడా కాస్త పుంజుకున్నాయి. దీంతో హీరోలు ఓటీటీల వైపు పెద్దగా చూడట్లేదు. మహా అయితే షోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరో ఓటీటీ వెబ్ సిరీస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు అస్సలు కొదవలేదు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో వస్తూనే ఉంటారు. అలా 20ల్లో హీరోగా ఆకట్టుకున్న వారిలో వేణు తొట్టెంపూడి కచ్చితంగా ఉంటాడు. హనుమాన్ జంక్షన్, స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్లాం ఊరెళితో తదితర సినిమాలతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు. అలాంటిది సడన్గా సినిమాలకు దూరమైపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) అప్పట్లో చిన్న బ్రేక్ తీసుకున్న వేణు.. చాన్నాళ్ల క్రితమే రీఎంట్రీ ఇచ్చారు. కాకపోతే సహాయ పాత్రలు చేస్తూ వచ్చారు. ఆ సినిమాలు హిట్ కాలేదు. ఈయనకు గుర్తింపు కూడా రాలేదు. చివరగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో పోలీస్ అధికారిగా నటించారు. అయితే ఇప్పుడు వేణు.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. 'అతిథి' అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. హాట్స్టార్ త్వరలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే హీరోగా ఎమోషనల్, కామెడీ తరహా సినిమాలు చేసిన వేణు.. ఇప్పుడు మాత్రం హారర్ కాన్సెప్ట్ స్టోరీతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. పోస్టర్లో అసలు విషయం రివీల్ చేయలేదు కాబట్టి టీజర్, ట్రైలర్ వస్తే మేటర్ ఏంటనేది తెలుస్తుంది. Not all GUESTS are welcome! 🚪🔥 Stay tuned for an exciting new series #ATHIDHI!#AthidhiOnHotstar coming soon… Only on #DisneyPlusHotstar. pic.twitter.com/MJB3kGPI1P — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 21, 2023 (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఎంటర్టైన్మెంట్ను అన్నివేళలా అందుబాటులోకి ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు.. ఇలా భిన్నరకాల కంటెంట్తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు థియేటర్లో రిలీజయ్యేవాటితో పాటు ఓటీటీ రిలీజెస్ మీద కూడా ఓ కన్నేస్తున్నారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఓటీటీలో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. నెట్ఫ్లిక్స్లో రంగబలి టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. జూలై 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. నేటి(ఆగస్టు 4) నుంచి రంగబలి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీలో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదలైంది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 4 నుంచి ఈ చిత్రం సోనీలివ్లో అందుబాటులోకి వచ్చింది. దయ సిరీస్ ఎందులో అంటే? ఇకపోతే అటు దయ అనే వెబ్ సిరీస్ హాట్స్టార్లో ప్రసారం అవుతోంది. ఇందులో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. అలాగే భాగ్సాలే అనే మూవీ సైతం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. చదవండి: రీఎంట్రీకి రెడీ అయిన నజ్రియా -
నెట్ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్స్టార్ - అదే జరిగితే..
Disney Hotstar Limit Account Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్ను ముగించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 'డిస్నీ+ హాట్స్టార్' (Disney+ Hotstar) కూడా ఇదే బాటలో పయనించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, డిస్నీ+ హాట్స్టార్ దాని ప్రీమియం వినియోగదారులలో పాస్వర్డ్ షేరింగ్ను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు కేవలం నాలుగు పరికరాల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలులోకి వస్తే స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ వినియోగదారులకు కష్టతరమవుతుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానానికి నెట్ఫ్లిక్స్ మంగళం పాడింది. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమలులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం డిస్నీ+ హాట్స్టార్ ద్వారా గరిష్టంగా 10 పరికరాలలో లాగిన్లను అనుమతిస్తుంది. కానీ దీనికి త్వరలోనే స్వస్తి చెప్పనుంది. కొత్త రూల్స్ ఈ ఏడాది చివరి నాటికి అమలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సొంత సభ్యత్వాన్ని పొందాల్సి ఉండవచ్చు. అయితే రానున్న కొత్త మార్పులు చౌకైన ప్లాన్లకు కూడా వర్తిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన డిస్నీ+ హాట్స్టార్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు 38 శాతం వీక్షకులను కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్కోవడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిందే. -
'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)
టైటిల్: గుడ్ నైట్ నటీనటులు: మణికందన్, మీరా రఘునాథ్, రమేశ్ తిలక్ తదితరులు నిర్మాణ సంస్థ: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్ఆర్పీ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: యువరాజ్ గణేశన్, మగేశ్ రాజ్, నజేరత్ పసిలియన్ దర్శకత్వం: వినాయక్ చంద్రశేఖరన్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: జయంత్ సేతు మాధవన్ ఎడిటర్: భరత్ విక్రమన్ విడుదల తేదీ: 2023 జూలై 03 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్స్టార్ సినిమా హిట్ అవ్వాలంటే భారీతనం, హంగులే అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా ఓ కథ-కథనం ఉంటే చాలు. కచ్చితంగా హిట్ అవుతుంది. భాషతో సంబంధం లేకుండా ఆదరణ సొంతం చేసుకుంటుంది. అలా మనందరికీ తెలిసిన 'గురక' అనే పాయింట్ తో తమిళంలో వచ్చిన సినిమా 'గుడ్ నైట్'. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. హాట్స్టార్లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే. కథేంటి? మోహన్ అలియాస్ మోటర్ మోహన్(మణికందన్)కు గురక సమస్య. నిద్రపోయాడంటే సౌండ్ రీసౌండ్ వస్తుంది. అమ్మ, అక్క-బావ, చెల్లితో కలిసుంటాడు. తన గురక గురించి అందరూ తిడుతున్నాసరే దానికి అలవాటు పడిపోతాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో అను (మీరా రఘునాత్) పరిచయమవుతుంది. మనుషుల్లో పెద్దగా కలవని ఈమె.. మోహన్ తో లవ్లో పడుతుంది. కొన్నిరోజులకే పెళ్లి చేసుకుంటుంది. ఫస్ట్ నైట్ రోజు.. భర్తకు గురక ప్రాబమ్ ఉందని ఈమెకు తెలుస్తుంది. మరి తర్వాత ఏమైంది? భార్యభర్తలు చివరకు ఒక్కటయ్యారా? లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? కొత్త ఫ్లాట్.. మోహన్-అనుకి ఫస్ట్ నైట్.. రాత్రంతా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. నిద్ర ముంచుకురావడంతో మోహన్ పడుకుంటాడు. తెలియకుండానే గట్టిగా గురక పెడతాడు. ఇబ్బందిపడుతూనే అను ఆ రాత్రి గడుపుతుంది. తన అసౌకర్యం గురించి భర్తకి చెప్పదు. ఉదయం లేచి, అతడు అడిగినా సరే పర్లేదు అని చెబుతుంది. ఇది ఓ సీన్. కాపురం మొదలైన కొన్నాళ్లకు భర్త గురక వల్ల అను ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒంటరిగా వేరే ఇంట్లోకి మారిపోతుంది. కానీ ఆమెకు నిద్ర పట్టదు. ఒంటరిగా ఉన్నాసరే రాత్రంతా భర్త గురించే ఆలోచనలు. దీంతో వాట్సాప్ ఓపెన్ చేసి, అందులో భర్త ఇంతకు ముందు తనకు సెండ్ చేసిన గురక రికార్డింగ్స్ని ఈయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ వింటుంది. ఇది మరో సీన్. మొదటి సీన్ చూస్తున్నప్పుడు మనకు నవ్వొస్తుంది. రెండో సీన్ చూస్తున్నప్పుడు అనుతో పాటు మనమూ ఎమోషనల్ అవుతాం. అదే ఈ సినిమాలో మ్యాజిక్. టైటిల్స్ పడకముందే మనకు గురక సౌండ్ వినిపిస్తుంది. కాసేపటికే మోహన్ ని చూపిస్తారు. ఇకు ఆలస్యం చేయకుండా నేరుగా స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటనేది డైరెక్టర్ చెప్పేశాడు. ఆ తర్వాత మోహన్ కుటుంబాన్ని, అతడు జీవితంలో ఉండే మనుషులు, వాతావారణాన్ని పరిచయం చేస్తూ వెళ్లాడు. గురక వల్లే తన ఆఫీసులోనే పనిచేస్తున్న ఓ అమ్మాయి మోహన్కి బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత అతడి ఇంటికొచ్చి ఏడవడం, అది చూస్తున్న మనకు నవ్వు రావడం లాంటి సీన్స్ వరసగా వస్తుంటాయి. మోహన్, అను.. ఇద్దరు జీవితాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. అలాంటిది ఓరోజు అనుకోకుండా వీళ్లిద్దరూ పరిచయవుతారు. స్నేహం.. ప్రేమ.. పెళ్లి.. ఇదంతా జరిగేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఫస్టాప్ మొత్తాన్ని ఎంటర్ టైనింగ్గా తీసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో ఎమోషన్స్ ని నమ్ముకున్నాడు. భర్తకు గురక సమస్య ఉందని తెలిసిన తర్వాత అను జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి? మోహన్ ఏం చేశాడు? ఫైనల్ గా ఏం జరిగిందనేది క్లైమాక్స్. ఈ సినిమాలోనే మోహన్ బావ-అక్క స్టోరీ కూడా ఉంటుంది. ఈ కాలం తల్లిదండ్రుల తీరుని క్వశ్చన్ చేసేలా అదంతా ఉంటుంది. దాదాపు రెండున్నర గంటలున్న ఈ సినిమాలో ఫస్టాప్ ని చకచకా నడిపించేసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో కాస్త నిదానమే ప్రదానం అనే ఫార్ములా పాటించాడు. గురక తగ్గించుకోవడానికి మోహన్ పడే పాట్లు లాంటి సీన్స్.. రిపీట్గా అనిపిస్తాయి. కొన్నిచోట్లు మెలోడ్రామా ఎక్కువైంది. మోహన్, అను పాత్రలు.. తమకు వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. కానీ కలిసి ఉంటేనే ఏ బంధమైనా నిలుస్తుందని చెబుతూ సాగే క్లైమాక్స్ సీన్స్ మనల్ని ఎమోషనల్ చేస్తాయి. ఎవరెలా చేశారు? మోహన్ పాత్రలో మణికందన్ అదరగొట్టేశాడు. ఏ పాయింట్ లో కూడా ఓ నటుడిని చూస్తున్నాం, ఇది సినిమా అనే ఫీలింగ్ అస్సలు అనిపించదు. గురక పెట్టే సీన్స్ నుంచి అను దూరమవుతుందనే భయంతో బాధపడే సన్నివేశాల వరకు చాలా నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అను పాత్రలో మీరా రఘునాథ్ ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇంటర్వెర్ట్, అమాయకురాలిగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆ పాత్రతో పాటు జర్నీ చేసేలా చేసింది. మోహన్ బావ పాత్రలో నటించిన రమేశ్ తిలక్.. కనిపించిన ప్రతి సీన్ లో నవ్వించాడు. చివర్లో మాత్రం ఏడిపించేశాడు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాల్లో సీన్ రొల్డన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. జయంత్ సేతు సినిమాటోగ్రఫీ నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ప్రతి సీన్ ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ భరత్ విక్రమన్.. సెకండాఫ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండాల్సింది. రైటర్ అండ్ డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్.. అందరికీ తెలిసిన గురక అనే సమస్యని తీసుకుని దాన్ని ఫన్నీ అండ్ ఎమోషనల్ వేలో భలే తీశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే.. కుటుంబంతో కూర్చొని, నీట్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్ చూద్దామనుకుంటే 'గుడ్ నైట్' సినిమా బెస్ట్ ఆప్షన్. - చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)) -
సైతాన్ ట్రైలర్.. పచ్చిబూతులు, అడల్ట్ సన్నివేశాలు!
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మహి వి. రాఘవ్ తొలి సిరీస్తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్లో సైతాన్ అనే మరో వెబ్ సిరీస్తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్ కాకుండా క్రైమ్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. తాజాగా సైతాన్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒంటరిగా చూడమని హెచ్చరిస్తూ ఓ నోట్ పెట్టారు. అంటే ఇదేదో భయంకరమైన సిరీస్ అనుకునేరు.. అంతా బూతులమయంతో ఉంది. 'ఈ సమాజం నేనొక నేరస్థుడిని అన్నా సరే నేను బాధితుడిని' అంటూ హత్యలకు పూనుకుంటాడో వ్యక్తి. 'మనలో ఒకరిని కాపాడుకోవడం కోసం ఎవరినైనా, ఎంతమందినైనా చంపాల్సిందే' అన్న మహిళా డైలాగ్తో ఇందులో రక్తపాతం ఎక్కువే ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చే బూతు డైలాగులకు ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకోవడం ఖాయం. రాజకీయ నాయకులకు, పోలీసులకు విశ్వాసం, కృతజ్ఞతల్లాంటివి ఉండవు అనే డైలాగులు మెరిసినప్పటికీ తర్వాత వరుసగా పచ్చిబూతులు, అడల్ట్ సన్నివేశాలే కనిపిస్తాయి. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ఇది రానా నాయుడుకు నెక్స్ట్ లెవల్లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఓటీటీలకు సెన్సార్ అనేది ఉండదా? మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటి? దీనికి బదులు అడల్ట్ సినిమాలు తీసుకోండి అని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సిరీస్ జూన్ 15 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్ -
ఈ ఫ్రైడే ఓటీటీలో 15 సినిమాలు.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఫ్రైడే.. సినిమా లవర్స్కు మాత్రం ఇది సినీ డే. ఎందుకంటే బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రత్యేకంగా శుక్రవారమే రిలీజవుతాయి. ప్రతి ఫ్రైడే పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతాయి. కొన్ని థియేటర్లలో సందడి చేస్తే మరికొన్ని మాత్రం ఓటీటీని షేక్ చేస్తుంటాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్లడం కష్టం అనుకుంటున్నవాళ్లకు ఓటీటీ కూర్చున్నచోటే కావాల్సినంత వినోదాన్ని ఇస్తోంది. మరి ఈ శుక్రవారం (జూన్ 2) ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లేంటో చూద్దామా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ► ఉగ్రం ► డెడ్ లాక్ - ఇంగ్లీష్ సిరీస్ జీ5 ► విశ్వక్ ► ఘర్ బందూక్ బిర్యానీ- మరాఠి చిత్రం ► హత్యాపురి - బెంగాలీ సినిమా ► తాజ్: రిజిన్ ఆఫ్ రివేంజ్ సీజన్ 2 (నాలుగు ఎపిసోడ్లు) హాట్స్టార్ ► స్కూల్ ఆఫ్ లైస్- హిందీ సిరీస్ నెట్ఫ్లిక్స్ ► మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ ► స్కూప్- హిందీ సిరీస్ ► వలరియా సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ జియో సినిమా ► ముంబైకర్ ► గోదావరి - మరాఠీ చిత్రం -జూన్ 3 బుక్ మై షో ► ఈవిల్ డెడ్ రైజ్ - ఇంగ్లీష్ సినిమా సైనా ప్లే ► మీ కల్పా- మలయాళ చిత్రం చదవండి: పెళ్లి పీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ -
ఓటీటీలో సందడి చేసే సినిమాలివే, ఆ హిట్ మూవీ కోసం అంతా వెయిటింగ్!
థియేటర్లో సినిమా రిలీజ్ కోసం ఎంత ఎదురుచూస్తున్నారో ఆ మూవీ ఓటీటీలోకి వచ్చే రోజు కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు. కరోనా సమయంలో చిన్నాపెద్దా సినిమాలన్నీ మరో దారి లేక ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యాయి. దీంతో అందరూ ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాక థియేటర్లకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కానీ ఇప్పటికీ ఓటీటీకి క్రేజ్ తగ్గలేదు. పైగా థియేటర్లో మెప్పించని కొన్ని సినిమాలు ఓటీటీలో బాగా క్లిక్ అవుతుండటం విశేషం. అలాగే బాక్సాఫీస్ దగ్గర జైత్రయాత్ర చేపట్టిన చిత్రాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా తెరకెక్కుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్లేంటో ఓసారి చూసేద్దాం.. నెట్ఫ్లిక్స్ ► అయాలవాషి(మలయాళం) - మే 19 ► కథల్: ఎ జాక్ఫ్రూట్ మిస్టరీ (హిందీ) - మే 19 ► బయూ అజైబి (ఇంగ్లీష్)- మే 19 ► సెల్లింగ్ సన్సెట్ (ఆరో సీజన్)- మే 19 ► మ్యూటెడ్ (ఇంగ్లీష్) - మే 19 ► విరూపాక్ష - మే 21 హాట్స్టార్ ► డెడ్ పిక్సెల్స్ - మే 19 సోనీలివ్ ► ఏజెంట్ - మే 19 ► కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) - మే 19 అమెజాన్ ప్రైమ్ వీడియో ► బ్యాక్డోర్- స్ట్రీమింగ్ అవుతోంది ► మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) - స్ట్రీమింగ్ అవుతోంది ► హే మేరీ ఫ్యామిలీ సీజన్ 2 (హిందీ) - మే 19 ఆహా ► ఏమి సేతురా లింగ - మే 19 ► మారుతి నగర్ పోలీస్ స్టేషన్ (తమిళ్) - మే 19 జియో సినిమా ► లవ్ యూ అభి (కన్నడ సిరీస్) - మే 19 ► కచ్చి లింబూ - మే 19 ► క్రాక్ డౌన్ సీజన్ 2 - మే 20 చదవండి: తనకంటే చిన్నవాడితో లవ్.. బ్రేకప్ చెప్పిన నటి -
జియో సినిమా దెబ్బకు హాట్స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు
కొత్తగా వచ్చిన స్ట్రీమింగ్ యాప్ జియోసినిమా (JioCinema) దెబ్బకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ (Disney+ Hotstar) విలవిలాడుతోంది. మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. జియోసినిమా మార్కెట్లో ప్రజాదరణ పెరుగుతున్న స్ట్రీమింగ్ యాప్గా మారింది. 2023 మొదటి త్రైమాసికంలో 10 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల వీక్షకుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందించడం. ఇదే డిస్నీ ప్లస్ హాట్స్టార్పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆసియాలో దాని సబ్స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఏకంగా 8.4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు హాట్స్టార్కు బై బై చెప్పేశారు. సబ్స్క్రైబర్లు బై..బై కంపెనీ ఆదాయ నివేదిక ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో డిస్నీ ప్లస్ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3.8 మిలియన్లు తగ్గి 57.5 మిలియన్లకు పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 4 మిలియన్లకుపైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. 2023 ఏప్రిల్ 1 నాటికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ 52.9 మిలియన్ల పెయిడ్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. క్యూ2లో, డిస్నీ ప్లస్ హాట్స్టార్కు ఒక్కో పెయిడ్ సబ్స్క్రైబర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం 0.74 నుంచి 0.59 డాలర్లు తగ్గింది. జియోసినిమాకు కలిసొచ్చిన ఐపీఎల్ జియో సినిమా విజయానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది జియో సినిమా ప్రతిఒక్కరికీ ఉచితం. ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఛార్జ్ లేదు. అదే డిస్నీ హాట్స్టార్ ను వీక్షించాలంటే సబ్స్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించాలి. జియో సినిమా విజయానికి అసలు కారణం ఐపీఎల్ ను ఉచితంగా చూసే అవకాశం. ఏదైనా ఉచితంగా వస్తున్నప్పుడు ఎవరైనా దాని కోసం ఎందుకు చెల్లించాలనుకుంటున్నారు? ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
'అందరిని సంతోషంగా ఉంచలేం.. ధోని నుంచి చాలా నేర్చుకున్నా'
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఐదు హాఫ్ సెంచరీలు బాదిన కోహ్లి మంచి ఫామ్ను కనబరుస్తున్నాడు. అదే సమయంలో గంభీర్తో గొడవ.. నవీన్ ఉల్ హక్తో వైరం కారణంగా కోహ్లి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. గంభీర్-కోహ్లి గొడవ జరిగి వారం కావొస్తున్నా.. నవీన్ ఉల్ హక్ మాత్రం కోహ్లిని గెలుకుతూనే ఉన్నాడు. అయితే కోహ్లి కూడా ధీటుగానే స్పందిస్తూ వస్తున్నాడు. ఈ విషయం పక్కనబెడితే.. గురువారం కోహ్లి డిస్నీ హాట్స్టార్ నిర్వహిస్తున్న 'Let There Be Sport' అనే కార్యక్రమానికి హాజరయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ జతిన్ సప్రూతో జరిగిన ఇంటర్య్వూను కోహ్లి స్వయంగా తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ధోని లాంటి క్రికెటర్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. కోహ్లి మాట్లాడుతూ..'' ఎంఎస్ ధోని సహా కొంతమంది క్రికెటర్ల నుంచి చాలా నేర్చుకున్నా. మనల్ని నడిపిస్తున్న వ్యక్తులను ప్రతీసారి సంతోషంగా ఉంచలేము. ఎందుకంటే నిజం అనేది కొన్నిసార్లు సంతోషాన్ని ఇస్తే.. కొన్నిసార్లు బాధను ఇస్తుంది. మన చుట్టు ఉన్న వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నప్పటికి పరిస్థితుల ప్రభావం దృశ్యా అది నెగటివిటీగా మారే అవకాశం ఉంటుంది. సౌకర్యవంతమైన మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు.వీటిని ఒక్కోసారి విస్మరించవలసి ఉంటుంది ఎందుకంటే మనం చూసే ధోరణి కీలకపాత్ర పోసిస్తుందన్నది నా నమ్మకం. ఇలాంటి జీవిత సత్యాలను ధోని లాంటి వ్యక్తుల నుంచి నేర్చుకున్నా అంటూ'' తెలిపాడు. It’s a long road to the top but the greatest lessons are learnt when you get knocked down and get back up. Let There Be Sport with @pumacricket, now streaming on @DisneyPlusHS. #LetThereBeSport #ad pic.twitter.com/dymvO8G4HK — Virat Kohli (@imVkohli) May 11, 2023 ఇక ధోని-కోహ్లిలు కలిసి చాలాకాలం టీమిండియా తరపున క్రికెట్ ఆడారు. తొలుత ధోని కెప్టెన్సీలో కోహ్లి ఆడితే.. ఆ తర్వాత కోహ్లి కెప్టెన్సీలో ధోని ఆడాడు. అయితే ధోని సలహాలకు కోహ్లి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. కెప్టెన్సీ నేర్చుకునే దశలో ధోని కోహ్లికి అండగా నిలబడ్డాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'Let There Be Sport' కార్యక్రమం ద్వారా సునీల్ ఛెత్రీ, యువరాజ్ సింగ్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి దిగ్గజాలను ఇంటర్య్వూ చేశారు. క్రీడాకారుల జీవితాలో జరిగిన పలు సంఘటనలను అడిగి తెలుసుకోవడం ఈ క్యార్యక్రమం ప్రత్యేకత. చదవండి: సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి! -
ఈ వారం రిలీజయ్యే సినిమాలు, సిరీస్లివే!
సమ్మర్లో వర్షాలు దంచికొడుతున్నాయి. సూరీడు బ్రేక్ తీసుకున్నాడా? అంటే అదీ లేదు. వర్షం కాస్త గ్యాప్ ఇవ్వగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండ, వర్షం దోబూచులాట మధ్య కొత్త సినిమాలు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. కొత్త సరుకుతో థియేటర్లు వెల్కమ్ చెప్తున్నాయి. మరి ప్రతివారంలాగే ఈ వారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్లేంటో చూసేద్దాం.. థియేటర్లో రిలీజయ్యే సినిమాలు.. ► కస్టడీ - మే 12 ► ఛత్రపతి - మే 12 ► భువన విజయమ్ - మే 12 ► ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ - మే 12 ► కళ్యాణమస్తు - మే 12 ► మ్యూజిక్ స్కూల్ - మే 12 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్లు.. ఆహా ► న్యూసెన్స్ - మే 12 అమెజాన్ ప్రైమ్ వీడియో ► దహాద్ - మే 12 ► ఎయిర్ - మే 12 హాట్స్టార్ ► ది మప్పెట్స్ మేహెమ్ (వెబ్ సిరీస్) - మే 10 ► స్వప్నసుందరి - మే 12 నెట్ఫ్లిక్స్ ► క్వీన్ క్లియోపాత్ర - మే 10 ► రాయల్ టీన్, ప్రిన్సెస్ మార్గరెట్ (హాలీవుడ్) - మే 11 ► ఎరినీ - మే 11 ► ది మదర్ - మే 12 ► క్రాటర్ - మే 12 ► బ్లాక్ నైట్ (వెబ్ సిరీస్) - మే 12 జీ5 ► తాజ్: ది రీన్ ఆఫ్ రివేంజ్ రెండో సీజన్ (వెబ్ సిరీస్) - మే 12 సోనీలివ్ ► ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్ - మే 12 జియో సినిమా ► విక్రమ్ వేద - మే 12 చదవండి: నాగచైతన్య ఫస్ట్ కిస్ సమంతకే.. మరి ఫస్ట్ డేట్ ఎవరితోనో తెలుసా? -
యాత్ర 2 ఉంటుంది.. జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై...
‘‘యాత్ర’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్రంలోని పాత్రలకు తగ్గ నటీనటులు కుదరడం లేదు. పూర్తి కథ, నటీనటులు ఫైనల్ అయ్యాక ‘యాత్ర 2’ ని సెట్స్పైకి తీసుకెళతాం’’ అని డైరెక్టర్ మహీ వి.రాఘవ్ అన్నారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, హర్షవర్ధన్ లీడ్ రోల్స్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్గా తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. మహీ వి.రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మహీ వి.రాఘవ్ పంచుకున్న విశేషాలు... ► మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘సేవ్ ది టైగర్స్’ నిరూపించింది. కుటుంబం అంతా కలిసి మా వెబ్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. దీంతో ఒక మంచి సిరీస్ తీశామనే తృప్తి ఉంది. ఇలాంటి చక్కని సిరీస్ని నిర్మించే అవకాశం మాకు కల్పించిన డిస్నీ హాట్స్టార్కి థ్యాంక్స్. త్వరలో ‘సేవ్ ది టైగర్స్’ రెండో సిరీస్ షూటింగ్ ప్రారంభిస్తాం. ► ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల సమయంలో ‘యాత్ర 2’ ని విడుదల చేయనున్నారని, ఆ సినిమా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నకి సపోర్ట్గా ఉంటుందని వినిపిస్తున్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే సినిమా వల్ల ఓట్లు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. అలా అనుకుంటే ఇతర పార్టీల వారు కూడా నాలుగైదు సినిమాలు తీసుకోవచ్చు కదా? ఓటర్లందరూ నా ‘యాత్ర’ సినిమాని చూసుంటే ‘బాహుబలి’లా పెద్ద సినిమా అయ్యేది. ఓటర్లందరూ సినిమాలు చూస్తారని అనుకోవడం లేదు. జగన్ అన్న పాదయాత్రతో... ‘యాత్ర 2’ సినిమా జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుంది. కథ మొత్తం పూర్తయ్యాక ఆ వివరాలు చెబుతాను. ప్రస్తుతం నేను దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సైతాన్’ అనే కొత్త వెబ్ సిరీస్తో జూన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. -
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్ సిరీస్లివే!
ప్రస్తుతం సినిమాలు చూసేందుకు ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లకు వెళ్లలేని కొత్త సినిమాలు ఎప్పుడొస్తాయా ఆసక్తిగా కనబరుస్తున్నారు. అలాంటి వారికి వినోదం అందించేందుకు ఈ వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. వేసవి సెలవుల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్న చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు'. ఈ చిత్రాన్ని కోనేరు కల్పన నిర్మించారు. సోహెల్, మృణాళిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. వర్జిన్ స్టోరి నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘వర్జిన్ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. సౌమిక పాండియన్ హీరోయిన్గా నటించింది. ప్రదీప్ బి. అట్లూరి దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం ఓటీటీకి వస్తోన్న చిత్రాలు/వెబ్సిరీస్లు జీ5 ఒరు కోడై మర్డర్ మిస్టరీ -తమిళ్- ఏప్రిల్ 21 అమెజాన్ ప్రైమ్ వీడియో డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ -హిందీ -డాక్యుమెంటరీ సిరీస్-ఏప్రిల్ 21 డెడ్ రింగర్స్- ఇంగ్లీష్- సిరీస్- సీజన్-1 నెట్ఫ్లిక్స్ చోటా భీమ్ -సీజన్-17- ఏప్రిల్ 20 టూత్పరి- హిందీ- ఏప్రిల్ 20 డిప్లొమాట్- ఇంగ్లీష్- ఏప్రిల్ 20 సత్య2 - తెలుగు ఏప్రిల్ 21 రెడీ - తెలుగు ఏప్రిల్ 21 ఇండియన్ మ్యాచ్ మేకింగ్- వెబ్సిరీస్- ఏప్రిల్ 21 ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్ -ఇంగ్లీష్- ఏప్రిల్ 21 రఫ్ డైమండ్స్ - బెల్జియం ఏప్రిల్ 21 వన్ మోర్ టైమ్ -స్వీడిష్- ఏప్రిల్ 21 చోక్హోల్డ్ -టర్కిష్-ఏప్రిల్ 21 సోనీలివ్ గర్మీ- సిరీస్ హాట్స్టార్ కన్నా కానుమ్ కాళంగల్- తమిళ్ -సీజన్-2 ఏప్రిల్ 21 సుగా- డాక్యుమెంటరీ స్పెషల్- ఏప్రిల్ 21 -
దిల్ రాజు చేతుల మీదుగా ఓ కల ట్రైలర్, ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
‘‘ఓ కల ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదల కాబోతోంది. తప్పకుండా అందరూ చూసి టీమ్ని ఆశీర్వదించండి’’ అని అన్నారు సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు. గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఓ కల. దీపక్ కొలిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను తాజాగా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకధీరుడు రాజమౌళిగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. ఆయన ఆశీస్సులు మాకు ఎంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడు సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజుగారు ట్రైలర్ విడుదల చేసి.. సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. మా టీమ్ తరపున ఆయనకు ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఒక మంచి కథని తెలుగు ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఏప్రిల్ 13 నుంచి హాట్ స్టార్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. తప్పకుండా అందరూ చూసి విజయవంతం చేస్తారని భావిస్తున్నాను’’ అని తెలిపారు. -
ఓటీటీలో ఒకేరోజు 15కు పైగా రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్లు
వినోదం కావాలంటే సినిమా ఉండాల్సిందే! వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్లేవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఏ మూవీకెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. థియేటర్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందనేదాని కన్నా కూడా ఏ మూవీ ఓటీటీలో వచ్చింది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది? కొత్తగా వెబ్ సిరీస్లు ఏమొచ్చాయి? ఏవి ట్రెండ్ అవుతున్నాయి? ఏయే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమేం బ్లాక్బస్టర్స్ ఉన్నాయని ఆరా తీస్తున్నారు. అందరూ కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. అలా అని థియేటర్కు వెళ్లడం మానేస్తున్నారని కాదు. ఓపక్క మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కు వెళ్లి దాన్ని ఆదరిస్తూనే మరోపక్క ఓటీటీలో నిరంతరం ఏదో ఒక సినిమా/సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మొత్తానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. సినీప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఓటీటీలో రేపు ఒక్కరోజే దాదాపు బోలెడన్ని సినిమాలు/ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం.. నెట్ఫ్లిక్స్ ► సార్/వాతి ► కాట్ అవుట్ ► కుత్తే ► ది మెజీషియన్స్ ఎలిఫెంట్ ► నాయిస్ ► స్కై హై: ది సిరీస్ ► ఇన్హిస్ షాడో ► మ్యాస్ట్రో ఇన్ బ్లూ ► డ్యాన్స్ 100 ► ఏజెంట్ ఏల్విస్ జీ5 ► రచయిత ► ఐయామ్ ఐ నెక్స్ట్ ఆహా ► సత్తిగాడి రెండు ఎకరాలు ► లాక్డ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ► గంధదగుడి సన్ నెక్స్ట్ ► వన్స్ అపాన్ ఎ టైమ్ జమాలిగూడ సోనీలివ్ ► రాకెట్ బాయ్స్ - రెండో సిరీస్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) ► ది వేల్ (ఈరోజు నుంచే స్ట్రీమింగ్) హాట్స్టార్ ► పాప్ కౌన్ -
డిస్నీ ప్లస్ హాట్స్టార్ యూజర్లకు షాక్: ఏప్రిల్ ఫూల్ కాదు నిజం!
సాక్షి, ముంబై: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్. డిస్నీ+హాట్స్టార్ హెచ్బీవోతో డీల్ను ముగించుకుంది. ఫలితంగా హెచ్బీవో కంటెంట్ డిస్నీ+ హాట్స్టార్లో ఇకపై అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ కంపెనీలో ఖర్చుల తగ్గింపు పునర్నిర్మాణాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజా నిర్ణయంతో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ,'ది సక్సెషన్' వంటి షోలను ఏప్రిల్ ఒకటి తరువాత అభిమానులు చూడలేరు. మార్చి 31 తరువాతనుంచి బడిస్నీ+ హాట్స్టార్లో హెచ్బీవో కంటెంట్ అందుబాటులో ఉండదు. కానీ ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలతోపాటు కంటెంట్ లైబ్రరీలో 100,000 గంటల టీవీ షోలు, సినిమాలను 10 భాషల్లో ఆస్వాదించవచ్చు అని ప్రకటించింది. మరోవైపు ఈ ప్రకటన తర్వాత డిస్నీ+ హాట్స్టార్ చందాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లేదు, ఎఫ్1 లేదు. ఇపుడు హెచ్బీవో లేదు. ఇక వార్షిక చందా కోసం ఎందుకు చెల్లించినట్టు అంటూ ఒక యూజర్ మండిపడ్డారు. Hi! Starting 31st March, HBO content will be unavailable on Disney+ Hotstar. You can continue enjoying Disney+ Hotstar’s vast library of content spanning over 100,000 hours of TV Shows and Movies in 10 languages and coverage of major global sporting events. — Disney+HS_helps (@hotstar_helps) March 7, 2023 ఏప్రిల్ 1 నుండి కనిపించని షోల జాబితా బాలర్స్ బ్రదర్స్ బ్యాండ్ క్యాచ్ అండ్ కిల్ కర్బ్ యువర్ ఎంత్ ఆంట్రేజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మార్ ఆఫ్ ఈస్ట్టౌన్ మైండ్ ఓవర్ మర్డర్ ఒబామా సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ షాక్ సక్సెషన్ ద బేబీ ది నెవర్స్ ది సోప్రానోస్ ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ అండర్ కరెంట్ వాచ్ మెన్ వీ వోన్ దిస్ సిటీ కాగాహెచ్బీవో పలు బ్లాక్బస్టర్ షోలను నిర్మించింది. దశాబ్దాల తర్వాత కూడా వాటికి ఆదరణ తగ్గలేదు. 'ది ఫ్లైట్ అటెండెంట్', 'ప్రెట్టీ లిటిల్ లియర్స్: ఒరిజినల్ సిన్'తో సహా అనేక హెచ్బీవో మాక్స్ ఒరిజినల్లు ఇప్పటికే అమెజాన్లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో హెచ్బీవో కంటెంట్ను ప్రసారం చేసే అవకాశం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 2015లోహెచ్బీవ కంటెంట్ కోసం స్టార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏప్రిల్, 2020లో, వాల్ట్ డిస్నీ కంపెనీ 20 సెంచరీ స్టూడియోస్ను కొనుగోలు అనంతరం దానిపేరును డిస్నీ+ హాట్స్టార్గా మార్చిన సంగతి తెలిసిందే. -
ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే.. ఎప్పుడంటే!
సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్. ప్రతి ఏటా అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రెటీలంతా అమెరికాకు క్యూ కడుతున్నారు. ఈసారి మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంత ఈ అవార్డు కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: కేజీయఫ్ వివాదంపై స్పందించిన డైరెక్టర్, సమర్థించుకుంటూనే క్షమాపణలు.. ఈ క్రమంలో వారందరిని సర్ప్రైజ్ చేసే ప్రకటన బయటకు వచ్చింది. ఈ ఏడాది జరిగే 95వ ఆస్కార్ అవార్డు ఈవెంట్ను లైవ్లో చూసే అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫ్లాం డిస్నిప్లస్ హాట్స్టార్ అస్కార్ అవార్డు ఈవెంట్ను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. నిన్న సోమవారం దీనిపై హాట్స్టార్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇది మార్చి 13న ఉదయం 5:30 గంటల నుంచి హాట్స్టార్ లైవ్లో స్ట్రీమింగ్ కానున్నట్టు ఈ సందర్భంగా తెలిపింది. కాగా ఆస్కార్స్ వేడుక వచ్చే ఆదివారం (మార్చి 12, భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున) జరగనుంది. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? ఈ సారి అకాడెమీ అవార్డులు ఇండియన్స్కు మరింత ఆసక్తి రేపుతోంది. దీనికి కారణం మన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కావడమే. ఈ పాటకు ఆస్కార్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు ఇదే వేదికపై ఈ పాట లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. దీనికితోడు ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకోనే అవార్డు ప్రజెంటర్లలో ఒకరిగా వ్యవహరించనుంది. ఈ వేడుకల్లో ఆమె ఓ అవార్డును ప్రజెంట్ చేయనుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా నిలవడం విశేషం. Movies are dreams you can never forget. Come celebrate the dream makers at the 95th Oscars🎥#Oscars95 Streaming on March 13, 5:30 AM. pic.twitter.com/UaZmse9Tif — Disney+ Hotstar (@DisneyPlusHS) March 6, 2023 -
ఈ వారం కొత్త కంటెంట్తో ఓటీటీలు రెడీ, ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్!
ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన సినిమాను ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే హాయిగా చూసేస్తున్నారు. థియేటర్లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. మరొపక్క ఓటీటీలు ప్రతివారం సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులకు వినోదం అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్చి మొదటి వారంలో కూడా పలు కొత్త సినిమాలు, హిట్ మూవీస్తో పలు ఒటీటీ ప్లాట్ఫాంస్ సిద్ధమయ్యాయి. రేపు ఒక్కరోజే ఓటీటీలోకి దాదాపు 10 సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో బుట్టబొమ్మ వంటి ఫీల్గుడ్ లవ్స్టోరీతో పాటు ‘ద గ్రేట్ ఇండియా కిచెన్’, ‘అలోన్’ లాంటి డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్: బుట్టబొమ్మ- తెలుగు సినిమా(మార్చి 4) ఇరట్టా – మలయాళ మూవీ లవ్ ఎట్ ఫస్ట్ కిస్ – హిందీ సినిమా తలైకూతల్ – తమిళ సినిమా డివోర్స్ అటార్నీ సిన్ – కొరియన్ సిరీస్ (మార్చి 4) డిస్నీ ప్లస్ హాట్స్టార్: అలోన్ – తెలుగు డబ్బింగ్ మూవీ గుల్ మోహర్ – హిందీ మూవీ జీ5: ద గ్రేట్ ఇండియా కిచెన్ – తెలుగు మూవీ ఆహా: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 – సింగింగ్ ప్రోగ్రాం సోనీ లివ్: ద క్రంచిరోల్ ఎనిమీ అవార్డ్స్ 2023 – ఇంగ్లీష్ మూవీ (మార్చి 4) -
ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలివే!
జనవరిలో పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజై బాక్సాఫీస్ను దున్నేశాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం అందుకు భిన్నంగా పెద్ద సినిమాల హడావుడి కొంత తగ్గిందనే చెప్పాలి. ఏదో ఒకటీరెండు మాత్రమే స్టార్ హీరోల చిత్రాలు రిలీవగా ఎక్కువగా చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేశాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి కూడా! ఫిబ్రవరి నెల ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మార్చికి స్వాగతం పలుకుతూ పలు చిత్రాలు రిలీజ్కు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వారం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. బలగం ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బలగం. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించారు షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు బిగ్బాస్ కంటెస్టెంట్ సోహైల్ హీరోగా, మృణాళిని హీరోయిన్గా రాజేంద్రప్రసాద్, మీనా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా మార్చి 3న విడుదలవుతోంది. రిచిగాడి పెళ్లి సత్య, చందన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రిచిగాడి పెళ్లి. కె.ఎస్ హేమరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కేఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ శుక్రవారం(మార్చి 3) రిచిగాడి పెళ్లి విడుదల కానుంది. సాచి బిందు అనే యువతి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సాచి. సంజన రెడ్డి, గీతిక రధన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ పోతగోని దర్శకత్వం వహించడంతో పాటు ఉపేన్ నడిపల్లితో కలిసి నిర్మించారు. ఈ సినిమా కూడా ఫ్రైడే రిలీజ్ అవుతోంది. గ్రంథాలయం విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి జంటగా నటించిన చిత్రం గ్రంథాలంయ. సాయి శివన్ జంపన దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైష్ణవి శ్రీ నిర్మించారు. ఈ మూవీ మార్చి 3న విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు.. హాట్స్టార్ ది మాండలోరిన్ (వెబ్ సిరీస్) - మార్చి 1 గుల్మొహర్ - మార్చి 3 ఎలోన్ - మార్చి 3 అమెజాన్ ప్రైమ్ వీడియో డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ (వెబ్ సిరీస్) - మార్చి 3 జీ5 తాజ్: డివైడెడ్ బై బ్లడ్ (వెబ్ సిరీస్) - మార్చి 3 నెట్ఫ్లిక్స్ హీట్ వేవ్ - మార్చి 1 సెక్స్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 2 థలైకూతల్ - మార్చి 3 -
ఓటీటీలోకి బాలయ్య 'వీరసింహారెడ్డి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా వీరసింహారెడ్డి ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీ+ హాట్ స్టార్ భారీగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో వీరిసింహారెడ్డి మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు. కాగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్,మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Seema Simham vetaa shuru🦁💥#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023 -
ఓటీటీలో రాజయోగం.. అప్పటినుంచే స్ట్రీమింగ్
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రాజయోగం. ఈ చిత్రంతో రామ్ గణపతి దర్శకుడిగా పరిచయమయ్యాడు. డిసెంబర్ 30న విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.ఈ సినిమాను శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణిలక్ష్మణ్ రావు నిర్మించారు. కథ విషయానికి వస్తే.. మధ్య తరగతి కుర్రాడు రిషి(సాయి రోనక్) మెకానిక్గా పని చేస్తుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఓసారి తను రిపేర్ చేసిన కారును ఓనర్కు ఇచ్చేందుకు స్టార్ హోటల్కు వెళ్తాడు. అక్కడ శ్రీ(అంకిత సాహా)తో లవ్లో పడతాడు. ఆమె మాత్రం రిషితో శారీరక సుఖాన్ని పొందుతూనే డేనియల్ దగ్గరున్న వజ్రాలను కొట్టేయాలని చూస్తున్న రాధా(అజయ్ ఘోష్) గ్యాంగ్తో వెళ్లిపోతుంది. రాధా, డేనియల్ మధ్య ఉన్న వజ్రాల గొడవ ఏంటి? అందుకు శ్రీ ఎలా ఉపయోగపడింది? అసలు రిషి, శ్రీ కలుసుకున్నారా? లేదా? అనేదే కథ. Brace yourselves for an ultimate cocktail of love, lust, fun, and action 🍹❤️🔥#Raajahyogam premieres Feb 9 only on #DisneyplusHotstar #RaajahyogamOnHotstar#SaiRonak #AnkitaSaha #Bismi#RamGanapathi #ManiLakshman #Shyam #Nandakishore #VaishnaviNatrajProduction pic.twitter.com/LN3wdvvIRG — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 2, 2023 చదవండి: మేకప్ రూమ్లో పేలుడు, నటి పరిస్థితి విషమం -
పెళ్లైన వ్యక్తితో హన్సిక ప్రేమ.. తల్లిని ఎలా ఒప్పించిందంటే..
దేశముదురు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. ఇటీవలె వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్లోని ముండోతా కోటలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది. అయితే వీరి ప్రేమ పెళ్లికి మొదట్లో కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక తన వెడ్డింగ్ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనికి సోహైల్కు ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకోవడం కారణమని తెలుస్తుంది. ఇక పెళ్లకి ముందు కూడా సోహైల్ గురించి వచ్చిన వార్తలు తనను ఇబ్బంది పెట్టినట్లు చెబుతూ హన్సిక బాగా ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంంది. మొత్తంగా హన్సిక కూడా సాధారణ అమ్మాయిలానే ప్రియుడితో పెళ్లికి ఒప్పించడానికి చాలానే కష్టపడినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. -
ఓటీటీలో కోవై సరళ చిత్రం, ఎప్పుడు? ఎక్కడంటే?
లేడీ కమెడియన్, సీనియర్ నటి కోవై సరళ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంబి. తంబిరామయ్య, అశ్విన్ కుమార్, బేబి నీలా, నాంజిల్ సంపత్, ఆండ్రూస్, పళ కరుప్పయ్య, ఆకాశ్, భారతీ కన్నన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 30న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్స్టార్లో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హాట్స్టార్ అధికారిక ప్రకటన చేసింది. కథేంటంటే.. అటవీ ప్రాంతంలో మనవరాలితో ఒంటరిగా జీవిస్తున్న భామ(కోవై సరళ) తేనె అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె మనవరాలిపై ఓ రాజకీయ నాయకుడి కొడుకు, తన స్నేహితులతో కలిసి సామూహిత అత్యాచారం చేస్తాడు. దీంతో ఆ బామ్మ తన మనవరాలికి న్యాయం కోసం పోరాడుతూ అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. இயற்கை! A Prabhu solomon's Touch Get ready to watch #Sembi #SembiOnHotstar #SembiFromFeb3 #Disneyplushotstar @APIfilms @tridentartsoffl @arentertainoffl @prabu_solomon #KovaiSarala @i_amak #ThambiRamaiah @nivaskprasanna @saregamasouth pic.twitter.com/hGaQvcD5Mu — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) January 28, 2023 చదవండి: పిల్లగాలి అల్లరి అంటూ తండ్రి పాటకు స్టెప్పులేసిన సితార -
ఓటీటీలో దూసుకెళ్తున్న ఐరావతం.. రికార్డ్ స్థాయిలో వ్యూయింగ్ మినిట్స్
ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన చిత్రం ఐరావతం. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఊహించని రీతిలో ఆదరణ దక్కించుకుంది. రీసెంట్గా వచ్చి సైలెంట్ హిట్గా నిలిచింది. నవంబర్ 17 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. నూజివీడు టాకీస్పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం ఒక్క నెలలోనే 100 మిలియన్స్కు పైగా వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. అసలు కథేంటంటే..: శ్లోక అనే బ్యూటీషియన్ బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియోలు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాలే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది. హీరో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి మరో ప్రేమికుడితో వెళ్లిపోతుంది. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. ఓటీటీలో చూసి ఈ సినిమా ఎంజాయ్ చేయండి. -
ఈ ఏడాది చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
2022.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బోలెడన్ని హిట్స్ ఇచ్చింది. ఈ విజయాల పరంపరలో 18 పేజెస్, ధమాకా కూడా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త సంవత్సరంలో రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు అగ్ర కథానాయకులు. సంక్రాంతి బరిలోకి దిగుతామంటూ షూటింగ్స్లో మునిగిపోయారు. కుర్ర హీరోలు మాత్రం ఈ ఏడాదికి మేము గ్రాండ్గా ముగింపు పలుకుతామంటూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి 2022 ఆఖరి వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్సిరీస్లేంటో చూసేద్దాం.. థియేర్లో రిలీజ్ కానున్న చిత్రాలు.. ► టాప్ గేర్ - డిసెంబర్ 30 ► లక్కీ లక్ష్మణ్ - డిసెంబర్ 30 ► డ్రైవర్ జమున - డిసెంబర్ 30 ► ఆ రోజే రాజయోగం - డిసెంబర్ 30 ► ఎస్5.. నో ఎగ్జిట్ - డిసెంబర్ 30 ► వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ దేవరకొండ- డిసెంబర్ 30 ► కొరమీను - డిసెంబర్ 31 ఓటీటీలో అలరించనున్న సినిమాలు, సిరీస్లు.. ఆహా ► అన్స్టాపబుల్ షో (ప్రభాస్ ఎపిసోడ్) - డిసెంబర్ 30 హాట్స్టార్ ► బటర్ఫ్లై - డిసెంబర్ 29 ► ఆర్ యా పార్ - డిసెంబర్ 30 ► ది ఎల్ వరల్డ్ - డిసెంబర్ 30 ► బ్యూటీ అండ్ ది బీస్ట్ - డిసెంబర్ 30 అమెజాన్ ప్రైమ్ ► టాప్ గన్ మేవరిక్ - డిసెండర్ 26 ► గోల్డ్ - డిసెంబర్ 29 నెట్ఫ్లిక్స్ ► 7 ఉమెన్ అండ్ మర్డర్ - డిసెంబర్ 28 ► డీఎస్పీ(తెలుగు డబ్బింగ్ చిత్రం) - డిసెంబర్ 30 ► వైట్ నాయిస్ - డిసెంబర్ 30 ► చోటా భీమ్ సీజన్ 15 - డిసెంబర్ 30 ► ద గ్లోరీ(కొరియన్ సిరీస్) - డిసెంబర్ 30 జీ5 ► ఉత్తవారన్ (బెంగాలీ చిత్రం)- డిసెంబర్ 30 చదవండి: అవతార్ 2 సెన్సేషన్.. ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే? కంగనాకు పద్మశ్రీ.. మాకు మాత్రం గుర్తింపే లేదు: సీనియర్ హీరోయిన్స్ -
‘అవతార్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్కు పండగే
విజువల్ వండర్ అవతార్-2 ప్రస్తుతం థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. ఇప్పటివరకు సుమారు 5వేల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 3D, 4DX టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అవతార్-2 సినిమా టికెట్ రేట్స్ కూడా భారీగానే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానులకు గుడ్న్యూస్. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ నుంచి 234 రోజుల తర్వాతే అవతార్ 2 ఓటీటీలోకి అందుబాటులో రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాని ఓటీటీ చూడాలనుకునే ప్రేక్షకులు అప్పటిదాకా వేచిచూడాల్సిందే. -
హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న అంజలి 'ఫాల్' వెబ్సిరీస్
తమిళసినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఫాల్. ఎస్పీబీ చరణ్, నటి సోనియాఅగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమిత కృష్ణమూర్తి, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సీరీస్ను డిస్నీ హాట్స్టార్ సంస్థ నిర్మించింది. దీని ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ్ రామస్వామి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో డిస్నీ హాట్స్టార్ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి అంజలి మాట్లాడుతూ తాను ఇందులో దివ్య అనే పాత్రలో నటించానని చెప్పారు. ఇది రొటీన్ పాత్రలకు భిన్నంగా, కాస్త చాలెంజింగ్గా ఉంటుందన్నారు. థ్రిల్లర్ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఇందులో నటించిన నటినటీలందరికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పూరి్ణమా భాగ్యరాజ్తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. ఆమె మంచి కథలను చెప్పేవారని, తన లవ్స్టోరీ కూడా దాచుకోకుండా చెప్పారన్నారు. డిస్నీ హాట్స్టార్ సంస్థలో తాను నటించిన రెండవ వెబ్ సిరీస్ ఇది అని చెప్పారు. చాలా కంఫర్టబుల్గా చూసుకునే సంస్థ ఇది అని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ రామస్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అని పేర్కొన్నారు. తనే చాయాగ్రాహకుడు కావడంతో సన్నివేశాల చిత్రీకరణలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారన్నారు. టెక్నికల్గా కూడా తమకు నటించడం చాలా ఈజీ అయ్యిందన్నారు. వన్ మోర్ టేక్ అన్నదే చేసేవారు కాదని చెప్పారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
ఓటీటీలో నవీన్ చంద్ర రిపీట్, ఎప్పటినుంచంటే?
డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాడు నవీన్చంద్ర. పరంపర, అమ్ము సినిమాలతో ఓటీటీ ఆడియన్స్ను అలరించిన ఆయన తాజాగా రిపీట్ చిత్రంతో రాబోతున్నాడు. నవీన్ చంద్ర హీరోగా నటించిన రిపీట్ మూవీ హాట్స్టార్లో డిసెంబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది తమిళ హిట్ మూవీ డెజావుకు రీమేక్గా తెరకెక్కింది. ఈ మూవీలో స్మృతి వెంకట్, మధుబాల, కాళీ వెంకట్ మిమే గోపి, అచ్యుత కుమార్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం అందించిన ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించాడు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు నిర్మించాడు. Prepare to watch this one on Repeat 🔁#RepeatOnHotstar, Premieres December 1.@Naveenc212 #AchuythKumar @madhoo69 @smruthi_venkat @mimegopi #SatyamRajesh #Pooja @NaveenaActress @kaaliactor @dirarvindh @MuthaiahG @GhibranOfficial pic.twitter.com/1rYHCSKb6d — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 24, 2022 చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్బాస్ అమెజాన్ ప్రైమ్లో ఆకట్టుకుంటున్న డెజావు -
ఓటీటీలో ప్రిన్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
హీరోహీరోయిన్లు శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుస్కూర్ రామ్మోహనరావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 25 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా కథేంటంటే.. శివకార్తికేయన్ ఓ స్కూలు టీచర్. అదే స్కూల్లోని ఇంగ్లీష్ టీచర్ మరియాను ప్రేమిస్తాడు. ఇతడు ఇండియన్ అబ్బాయి, అక్కడ ఆమె బ్రిటీష్ అమ్మాయి కావడంతో వీరి ప్రేమకు రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో ఇది ప్రేమ పోరాటంలా కాకుండా రెండు దేశాల మధ్య పోట్లాటగా మారుతుంది. మరి ఆనంద్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే అసలు కథ. ‘All Indians are my brothers and sisters’#PrinceOnHotstar from November 25, Only on @DisneyPlusHSTel. Here's the trailer ▶️ https://t.co/uGjmaidbTq@Siva_Kartikeyan @anudeepfilm @maria_ryab @SureshProdns @SVCLLP @ShanthiTalkies @manojdft @Cinemainmygenes #Sathyaraj pic.twitter.com/VuFtGeWLLz — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 15, 2022 చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఇటీవల ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం -
తెలుగులో మలయాళ హిట్ మూవీ, ఓటీటీలో ఎప్పుడంటే?
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ రోస్చాక్. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. హాట్స్టార్లో నవంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా రోస్చాక్ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేసింది హాట్స్టార్. ఇది చూసిన జనాలు ట్రైలర్ అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. కాగా నిశం బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించాడు. మిధున్ ముకుందన్ సంగీతం అందించగా కిరణ్ దాస్ ఎడిటర్గా పని చేశాడు. అసిఫ్ అలీ, షరఫ్ ఉధీన్, గ్రేస్ ఆంటోని ముఖ్యపాత్రల్లో నటించారు. చదవండి: ఇనయ కోసం సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసిన బిగ్బాస్ బాత్టబ్లో శవమై కనిపించిన సింగర్ -
ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!
థియేటర్లలో సినిమా ఆడిందంటే హిట్, లేదంటే ఫ్లాప్గా తేల్చేవారు. కానీ ఓటీటీలు వచ్చాక సీన్ మారింది. థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. ఆల్రెడీ హిట్ అయిన వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీల పుణ్యమా అని ఎప్పుడంటే అప్పుడు వాటిని ఎంచక్కా చూసుకునే వెసులుబాటు ఉంది. అందుకే ఓటీటీలు కూడా కొత్త కంటెంట్తో వస్తూనే అటు థియేటర్లలో రిలీజైన సినిమాలను సైతం విడుదల చేస్తున్నాయి. మరి ఈ శుక్రవారం(అక్టోబర్ 28) ఏమేం రిలీజవుతున్నాయో చూసేద్దాం.. ► ఆహా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ► జీ5 విండోసీట్ ► అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్లేమ్స్ (హిందీ వెబ్సిరీస్) ► నెట్ఫ్లిక్స్ వైల్డ్ ఈజ్ విండ్ (ఇంగ్లీష్) ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఎ కోర్ట్ రూమ్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్) ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రర్న్ ఫ్రంట్ (ఇంగ్లీష్ బిగ్ మౌత్ (ఇంగ్లీష్ సిరీస్) మై ఎన్కౌంటర్ విత్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్) ది బాస్టర్డ్ సన్ అండ్ ది డెవిల్ హిమ్ సెల్ఫ్ (ఇంగ్లీష్ సిరీస్) ► సోనీ లివ్ అప్పన్(మలయాళం) హాట్స్టార్లో ఝాన్సీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్లో నేనే వస్తున్నా సినిమాలు ఈరోజు(అక్టోబర్ 27) నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి. చదవండి: ఆటోలో సిటీ అంతా తిరిగిన నటుడు బిగ్బాస్: ఈ వారం కెప్టెన్ ఎవరంటే? -
అఫీషియల్: ఓటీటీలోకి బ్రహ్మాస్త్ర, ఎప్పటినుంచంటే?
స్టార్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజైంది. ఇందులో నాగిని నటి మౌనీరాయ్, కింగ్ నాగార్జున, బిగ్బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం హాట్స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ సినిమా నవంబర్ 4 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరింకే, థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే నెల 4వ తారీఖు నుంచి హాట్స్టార్లో ఎప్పుడైనా చూసేయండి! The World of Ancient Indian Astras is coming to Disney+ Hotstar on November 4. #BrahmastraOnHotstar pic.twitter.com/chmZBI6grk — Disney+ Hotstar (@DisneyPlusHS) October 23, 2022 చదవండి: ఉదయ్ కిరణ్తో ఐదు సినిమాలకు సంతకం చేశా: పింకీ పవిత్ర నరేశ్ బ్రేకప్ -
ఓటీటీలోకి వచ్చేసిన 'విక్రాంత్ రోణ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Vikrant Rona OTT : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ'. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. సిల్వర్స్ర్కీన్పై భారీ విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాం డిస్నీ+ హాట్ స్టార్లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. మరి బిగ్ స్ర్కీన్పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. The wait is over 🕛 Inspector #VikrantRona is here! Watch #VikrantRonaOnHotstar Streaming Now ▶️ https://t.co/ok2CxJAI9h@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @JackManjunath @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss pic.twitter.com/0pSL5HRcDR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 15, 2022 #VikrantRona is streaming now on #DisneyplusHotstar #VikrantRonaOnDisneyplusHotstar pic.twitter.com/Z2psTtmuBq — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) September 15, 2022 -
లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!.. ఎప్పుడంటే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.సినిమా రిలీజ్కు ముందే ఈ డీల్ కుదుర్చుకుంది.సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్ తొలివారంలో లైగర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ ఏం చేశాడో తెలుసా? -
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
థియేటర్లో ఈ వారం ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయి? అని ఆరా తీయడం మామూలే! కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అటు థియేటర్తో పాటు ఓటీటీని కూడా పట్టించుకుంటున్నారు సినీ లవర్స్. ఇంకా చెప్పాలంటే ఏరోజుకారోజు కొత్తగా ఏ సినిమాలు ఎక్కడ రిలీజవుతున్నాయి? మొన్నటిదాకా థియేటర్లో ఆడిన సినిమా ఇప్పుడు ఏ ఓటీటీలో ప్రసారం అవుతుందని తెగ సెర్చ్ చేసేస్తున్నారు. మరికొందరైతే థియేటర్లో ఒక్కసారే చూడగలం, అదే ఓటీటీ అయితే వీలైనన్ని సార్లు, ఎక్కడ పడితే అక్కడ ఎంచక్కా చూసేయొచ్చు అంటూ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లకు జై కొడుతున్నారు. మరి ఈ వారం ఓటీటీలో ఏయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో తెలుసా? అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్గన్ మార్వెరిక్ - ఆగస్టు 24 సమరిటన్ - ఆగస్టు 26 హాట్స్టార్ కట్పుట్లి - సెప్టెంబర్ 2 నెట్ఫ్లిక్స్ ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 - ఆగస్టు 26 సోనిలివ్ మహారాణి 2 - ఆగస్టు 25 హేయూ మేడ్ ఇన్ చెల్సియా- మాలోర్కా - ఆగస్టు 23 చదవండి: చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి పుష్ప-2 నుంచి బిగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న ఫోటోలు -
నేరుగా ఓటీటీలోకి నవీన్ చంద్ర కొత్త సినిమా!
థియేటర్, ఓటీటీ అని సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను అన్నింటినీ చేసుకుంటూ పోతున్నాడు నటుడు నవీన్ చంద్ర. ఇటీవలే పరంపర రెండో సీజన్లో సీరియస్ పాత్రలో అదరగొట్టిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాతో అలరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపీట్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్స్టార్లో ప్రసారం కాబోతోంది. ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హాట్స్టార్ అధికారికంగా ట్వీట్ చేసింది. అంతేకాదు సినిమా ట్రైలర్ను సైతం విడుదల చేసింది. గేమ్ మొదలుపెట్టిన ఫస్ట్ మూవ్లోనే ఒకడు మనకు చెక్ పెడితే ఎలా ఉంటుందో అలా ఎదురైందీ నాకీ కేస్.. ప్రతి స్టెప్లోనూ నాకు చెక్ పెడుతూనే వచ్చాడు అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. అలనాటి నటి మధు కీలకపాత్రలో నటించింది. ట్రైలర్ చూస్తుంటే మరో మంచి కథతో నవీన్ చంద్ర ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని ఇట్టే అర్థమవుతోంది. Get ready for a Mystical Crime Story! Here's the trailer of #RepeatOnHotstar ▶️ https://t.co/aKw0p1FH2x Watch all the action unfold, #Repeat on @DisneyPlusHSTel premieres Aug 25.#DisneyPlusHotstarMultiplex @Naveenc212 #AchuythKumar @madhoo69 @smruthi_venkat @mimegopi pic.twitter.com/DWvh04bllL — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 18, 2022 చదవండి: ‘లైగర్’కు సెన్సార్ బోర్డ్ భారీ షాక్.. అసలు సీన్స్కే ఎసరు పెట్టారుగా! ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి -
డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" స్ట్రీమింగ్..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "ది వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో రామ్ కి జోడీగా యంగ్, టాలెంటెడ్, మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తున్నారు. పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం సినిమాలు అందించిన దర్శకుడు లింగుస్వామి ఈ విభిన్నమైన కథకి కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపి ఒక పండగ భోజనంలా వడ్డించారు. డాక్టర్ నుంచి పోలీస్ గా మారడం అనే ఆలోచన తెలుగు ప్రేక్షకులకు కొత్త. దర్శకుడు లింగుసామి ఆ ప్రయత్నాన్ని కమర్షియల్ సక్సెస్ చేశారు. ఇక డీఎస్పీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎక్కడవిన్నా ఈ పాటలు మారుమోగిపోతున్నాయి. ప్రేక్షకులకు నచ్చే మరెన్నో విషయాలు వున్న ఈ మంచి ఫామిలీ ఎంటర్ టైనర్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిస్ కాకుండా చూడండి. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది. "వారియర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ వారం ఓటీటీలదే జోరు, బోలెడన్ని సినిమాలు రెడీ!
వేసవి ప్రతాపం చల్లారిపోయింది. సమ్మర్ తర్వాత రిలీజైన పలు సినిమాలు సైతం చప్పగా ఉంటూ సినీప్రియులను ఉసూరుమనిపించాయి. దీంతో జనాలు ఆగస్టు వైపు ఆశగా చూస్తున్నారు. కనీసం ఈ కొత్త నెలలోనైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలున్నాయా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో చూద్దాం.. బింబిసార నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్స్గా నటించారు. చరిత్రకు, వర్తమానానికీ ముడిపెడుతూ సాగే జానపద చిత్రమిది. ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదలవుతోంది. చాలాకాలం తర్వాత కల్యాణ్ బింబిసారతో పలకరించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సీతారామం దుల్కర్ సల్మాన్, మృణాలిని ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్లైన్. ఇందులో రష్మిక మందన్నా ముఖ్య పాత్ర పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 5న రిలీజవుతోంది. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు... ఆహా పక్కా కమర్షియల్ - ఆగస్టు 5 మహా - ఆగస్టు 5 అమెజాన్ ప్రైమ్ వీడియో కడువా - ఆగస్టు 4 ఆల్ ఆర్ నథింగ్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 4 క్రాష్ కోర్స్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 5 థర్టీన్ లైవ్స్ - ఆగస్టు 5 నెట్ఫ్లిక్స్ డార్లింగ్స్ - ఆగస్టు 5 కార్టర్ (కొరియన్ చిత్రం) - ఆగస్టు 5 ద సాండ్మ్యాన్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 5 హాట్స్టార్ లైట్ ఇయర్ - ఆగస్టు 3 వూట్ ద గ్రేట్ వెడ్డింగ్ ఆఫ్ మున్నీస్ - ఆగస్టు 4 చదవండి: నేనెప్పుడూ అలా ఫీల్ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా.. ఆమె సైకిల్ పట్టుకుంటే నేను తొక్కేవాడిని: చిరంజీవి -
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారియర్ మూవీ
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి జంటగా నటించిన మూవీ ది వారియర్. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా నటించాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. సినిమా రిలీజై నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది వారియర్. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్స్టార్ అధికారికంగా వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సినీప్రియులు అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారియర్ను థియేటర్లో చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే నెల 11 దాకా వెయిట్ చేసి ఎంచక్కా ఫోన్లోనే వీక్షించేయండి. He is ready! 😎#TheWarriorr arrives on @DisneyPlusHSTel this August 11.#TheWarriorrOnHotstar @ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @anbariv @DisneyPlusHS pic.twitter.com/HXzCxvz1Hl — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) July 31, 2022 చదవండి: సౌత్ హిట్స్తో బాలీవుడ్ బేజార్.. స్పందించిన బాలీవుడ్ నిర్మాత ఆహాలో పక్కా కమర్షియల్, ఎప్పటినుంచంటే? -
హాట్స్టార్లో ఆండ్రియా 'వట్టం', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి హీరో హీరోయిన్లుగా నటింన చిత్రం వట్టం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్ ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన తాజా చిత్రం ఇది. కమలకన్నన్ దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 29వ తేదీన నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ.. సిబిరాజ్, ఆండ్రియా, అతుల్య రవి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నారు. సిబిరాజ్ మాట్లాడుతూ.. ఓటీటీలో విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమికుల మధ్య సమస్యలు తలెత్తినా, ఆ తర్వాత అవి సమసిపోతాయని అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో హీరోగా ఎవరైతే బాగుంటుంది అన్న ఆలోచించినప్పుడు సిబిరాజ్ గుర్తొచ్చారని చెప్పారు. ఆండ్రియా, అతుల్య రవి పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ పదివారాల తర్వాతే ఓటీటీలో పెద్ద సినిమాలు -
సమంతను ఎత్తుకొచ్చిన అక్షయ్, ఊ అంటావా పాటకు డ్యాన్స్..
పుష్ప ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్ను షేక్ చేసిందీ మూవీ. సినిమానే కాదు పాటలు కూడా ప్రజలను ఓ ఊపు ఊపాయి. మరీ ముఖ్యంగా అందులో ఊ అంటావా మావా పాటకు సామాన్యులే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు. మొట్టమొదటిసారిగా ఐటం సాంగ్లో నటించిన సమంతకు ఎనలేని ప్రశంసలు దక్కాయి. తాజాగా సామ్ మరోసారి ఊ అంటావా సాంగ్కు స్టెప్పులేసింది. కాకపోతే ఈసారి అక్షయ్ కుమార్తో! కాఫీ విత్ కరణ్ 7వ సీజన్లో సామ్, అక్షయ్ కలిసి ఓ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో అక్షయ్.. సామ్ను ఎత్తుకుని స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా అంటూ సామ్, అక్షయ్ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీళ్ల జోడీ అదిరిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఏడ్చినట్లుంది, ముందు ఆమెను కిందకు దించు అని విసుక్కుంటున్నారు. ఏదేమైనా మా సామ్ మాత్రం ఎప్పటిలాగే తన క్యూట్నెస్తో అదిరిపోయిందని మురిసిపోతున్నారు సామ్ ఫ్యాన్స్. We can’t wait to see this quirky pair team up on the Koffee couch! ☕️ Get ready for episode 3 of #HotstarSpecials #KoffeeWithKaran#HotstarSpecials #KoffeeWithKaranS7 now streaming @karanjohar @akshaykumar @Samanthaprabhu2 @apoorvamehta18 @aneeshabaig @jahnvio @Dharmatic_ pic.twitter.com/phw0io4FYO — Disney+ Hotstar (@DisneyPlusHS) July 19, 2022 Akki-Sam rock ❤️🔥❤️🔥 pic.twitter.com/QnAiLhw1Jh — 𝑓𝑢𝑛𝑡𝑎𝑠𝑡𝑖𝑐_𝑎𝑘𝑘𝑖𝑤𝑜𝑟𝑙𝑑 (@Akkiworld1) July 20, 2022 చదవండి: లలిత్ మోదీతో డేటింగ్, సుష్మితా సేన్కు సెల్యూట్ చేయాల్సిందే! -
నేరుగా ఓటీటీ రిలీజ్ కానున్న తమన్నా కొత్త సినిమా!
ప్రేక్షకులను అలరించేందుకు ఏ మాధ్యమమైనా సరే అంటోంది హీరోయిన్ తమన్నా. వెండితెర, బుల్లితెర, డిజిటల్ తెర.. కాదేదీ వినోదాన్ని అందించే సాధనం అంటూ అన్నింటా దూసుకుపోతోంది. ఇటీవలే ఎఫ్ 3తో వినోదాన్ని పంచిన ఈ బ్యూటీ తాజాగా బబ్లీ బౌన్సర్ మూవీ చేస్తోంది. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో తమన్నా లేడీ బౌన్సర్గా నిల్చుంది. ఇక ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. హాట్స్టార్ సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు వెల్లడించారు. Oye bawale suna kya? Aa gaya hai Babli Bouncer ka time! Dilon ko yeh jodegi, ya khub haddiyaan todegi? Pata chalega jald hi! ❤️🔥 Here’s the first look of #BabliBouncer. Streaming from Sept 23 only on @DisneyPlusHS @imbhandarkar @starstudios_ #BikramDuggal @jungleepictures pic.twitter.com/cbC7nHFOKI — Tamannaah Bhatia (@tamannaahspeaks) July 20, 2022 చదవండి: హీరోయిన్తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు క్లిక్మనిపించినవారికి హీరో వార్నింగ్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ -
అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి నటిగా మారిన హీరో కూతురు
సమారా తిజోరీ.. బాలీవుడ్ ఒకప్పటి హీరో, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దీప్క్ తిజోరీ, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శివానీ తిజోరీల కూతురు. ‘డిష్యుం’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా బాలీవుడ్లో అడుగుపెట్టింది. తల్లిదండ్రుల కీర్తితో కాకుండా తన ఆసక్తి.. ప్రతిభతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తోంది. అనుకున్నట్టుగానే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సిరీస్ ‘మాసూమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ► పుట్టింది, పెరిగింది ముంబైలో. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణి కూడా. ► సమారాకు పదమూడేళ్లున్నప్పుడు.. స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ప్రీతేశ్ దోషి అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. సంఘటన రిపోర్ట్ అయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓ మూడు గంటల పాటు అనుమానాస్పద ప్రాంతాలను గాలించి.. కిడ్నాపర్ ఆ అమ్మాయిని మలాడ్లోని ఓ లాడ్జ్లో పెట్టినట్టు తెలుసుకుని అక్కడి నుంచి సమారాను రెస్క్యూ చేశారు. కిడ్నాప్కు కారణాలేంటో బయటకు రాలేదు కానీ డబ్బు కోసమే ప్రీతేశ్ అనే వ్యక్తి సమారాను కిడ్నాప్ చేసినట్టు బాలీవుడ్లో ఓ మాట. ► ‘డిష్యుం’ తర్వాత సమారా ‘గ్రాండ్ ప్లాన్’ అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. అందులోని ఆమె నటనే ఆమెకు వెండి తెర మీద అవకాశాన్నిచ్చింది. ‘బాబ్ బిస్వాస్ (2021)’ అనే సినిమాలో.. అభిషేక్ బచ్చన్కు కూతురిగా. ► జెఫ్ గోల్డ్బర్గ్ స్టూడియోలో చేరి నటనలో శిక్షణ పొందింది. డాన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకుంది. ► ఇప్పటివరకు సమారా చేసిన సినిమాలన్నీ ఆమెను పరిచయం చేసినవిగానే మిగిలిపోయాయి. తాజాగా స్ట్రీమింగ్లో ఉన్న ‘మాసూమ్’ సిరీస్ మాత్రం నటిగా ఆమె ఉనికిని చాటుతోంది. ► ‘మాసూమ్’కి వస్తున్న రెస్పాన్స్ను మాటల్లో చెప్పలేను. ‘మాసూమ్’ టీమ్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. నా మీద నమ్మకముంచి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. భవిష్యత్లోనూ ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నా.. అంటూ సోషల్ మీడియా ద్వారా ‘మాసూమ్’ విజయానందాన్ని పంచుకుంది సమారా తిజోరీ. చదవండి: పాన్లో విషం కలిపారు, సరిగ్గా తినే సమయంలో ఫోన్ రావడంతో.. నా దృష్టిలో లక్ అంటే అదే : తమన్నా -
పరంపర 2 టీజర్ చూశారా?
హాట్స్టార్లో హిట్ అయిన వెబ్ సిరీస్లో పరంపర ఒకటి. గతేడాది రిలీజైన ఈ సిరీస్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా దీనికి సీక్వెల్గా వస్తోంది పరంపర సీజన్ 2. జగపతి బాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్కు హరి యేలేటి కథ అందించాడు. హరి యేలేటితో పాటు కృష్ణ విజయ్, విశ్వనాథ్ ఆరిగెళ్ల దర్శకత్వం వహించారు. గురువారం ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజైంది. 'నా ఉద్దేశం నాయుడిని చంపడం కాదు సర్, వాడి అహాన్ని దెబ్బకొట్టాలి' అంటూ నవీన్ చంద్ర చెప్పే డైలాగ్తో టీజర్ మొదలైంది. జూలై 21న ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: మేజర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సైబర్ పోలీసులకు సీనియర్ నటి ఫిర్యాదు -
ఓటీటీలోకి విక్రమ్, రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
లోకనాయకుడు కమల్ హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్. లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరో సూర్య ప్రత్యేక పాత్రలో మెరిశారు. విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో తెలుగులో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ రిలీజ్ చేసిన ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. డిజిటల్, శాటిలైట్ హక్కులను అమ్మడం ద్వారా ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల మేర వెనకేసినట్లు తెలుస్తోంది. ఇక జూన్ 3న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని పలువురు ఆరా తీస్తున్నారు. కాగా విక్రమ్ సినిమా డిజిటల్ హక్కులను హాట్స్టార్ ఇదివరకే సొంతం చేసుకుంది. థియేటర్లలో కలెక్షన్ల వేట తగ్గిన తర్వాతే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇందుకు కనీసం నాలుగైదు వారాలైనా పడుతుంది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విక్రమ్ జూలై మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే! చదవండి: 'భారతీయుడు 2' సినిమాపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దివంగత సింగర్ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు -
ఓటీటీలో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Doctor Strange Multiverse of Madness: మార్వెల్ యూనివర్స్ తెరెక్కించే సూపర్ హీరో సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఆరేళ్ల తర్వాత దానికి సీక్వెల్గా వచ్చింది డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఈవిల్ డెడ్ డైరెక్టర్ సామ్ రైమీ రూ.1500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 6న విడుదలై వేల కోట్లు రాబట్టింది. బెనడిక్ట్ కుంబర్ బ్యాచ్, ఎలిజబెత్ ఓల్సన్, జోచిటి గోమెజ్, వాండా మ్యాక్సిమాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్తో అదరగొట్టింది. డాక్టర్ స్ట్రేంజ్ చూసినవారికి ఈ సీక్వెల్ బాగా అర్థమవుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్స్టార్ జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు హాట్స్టార్ ప్రకటించింది. మొత్తానికి మాస్టర్ పీస్ను తీసుకొస్తున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Marvel Studios’ Doctor Strange in the Multiverse of Madness streams from June 22 in Hindi, Tamil, Telugu, Malayalam, Kannada and English. pic.twitter.com/0655EjTUgI — Disney+ Hotstar (@DisneyPlusHS) June 2, 2022 చదవండి:Major Review: మేజర్ మూవీ రివ్యూ బిగ్బాస్ 6లోకి సిరి బాయ్ఫ్రెండ్ శ్రీహాన్ !.. -
ముగ్గురు ఖైదీలు, మూడు దొంగతనాలు.. '9 అవర్స్' రివ్యూ
టైటిల్: 9 అవర్స్ (వెబ్ సిరీస్) నటీనటులు: తారక రత్న, మధుశాలిని, అజయ్, రవిప్రకాశ్, వినోద్ కుమార్, బెనర్జీ, సమీర్ తదితరులు మూల కథ: మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల సమర్పణ, స్క్రీన్ప్లే: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి విడుదల తేది: జూన్ 2, 2022 (డిస్లీ ప్లస్ హాట్స్టార్) ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ '9 అవర్స్'. ఈ వెబ్ సిరీస్కు క్రిష్ స్క్రీన్ప్లే అందించగా, నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత తారక రత్న ఈ వెబ్ సిరీస్తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ను క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. హాట్స్టార్లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ '9 అవర్స్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఈ వెబ్ సిరీస్ కథ 1985 కాలంలో జరుగుతుంది. ముగ్గురు చొప్పున తొమ్మిది మంది మూడు బ్యాంక్లను దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ మూడు దొంగతనాలకు రాజమండ్రి సెంట్రల్ జైలులోని ముగ్గురు ఖైదీలు ఒక్కో బ్రాంచ్కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాటిలో రెండు దొంగతనాలు విజయవంతగా పూర్తి చేస్తారు. కానీ కోఠి బ్రాంచ్లో రాబరీ జరుగుతున్నట్లు పోలీసులకు తెలియడంతో దొంగలు చిక్కుల్లో పడతారు. మరీ ఆ దొంగలు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డారు ? బంధీలుగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు, కస్టమర్లు తప్పించుకోడానికి ఏం చేశారు ? ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: 1985లో జరుగుతున్న దొంగతనం బ్యాక్డ్రాప్కు తగినట్లుగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకేసారి మూడు చోట్ల మూడు దొంగతనాలు జరగడం అనే అంశం ఆసక్తిగా ఉంటుంది. జైలు నుంచి వెళ్లిన ఖైదీలు 9 గంటల్లో మూడు రాబరీలు చేసుకుని మళ్లీ జైలుకు రావాలి. అయితే ఈ 9 గంటలను 9 ఎపిసోడ్స్గా మలిచారు. ఒకేసారి మూడు రాబరీలు చేయాలన్న కాన్సెప్ట్ బాగున్నా సిరీస్ ప్రారంభం ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్గా ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు, దొంగతనానికి వచ్చిన వారి జీవిత కథలు ఒక్కో ఎపిసోడ్లో చూపించారు. అవి అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తాయి. భర్త చనిపోతే వితంతు పరిస్థితి ఎలా ఉంటుంది ? భార్యభర్తల బంధం తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. అప్పడప్పుడు వచ్చే ట్విస్ట్లు చాలా ఆకట్టుకుంటాయి. బంధీలుగా ఉన్న ఉద్యోగులు బయటపడే మార్గాలు, పోలీసుల అంచనాలను పటాపంచలు చేసే దొంగల తెలివి చాలా బాగా చూపించారు. ఈ సీన్లు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు కావాలని జొప్పించినట్లే ఉంటాయి. సిరీస్లో అనేక అంశాలను టచ్ చేశారు. అందుకే కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. టైటిల్ 9 అవర్స్ కాబట్టి ఎపిసోడ్లను కూడా 9గా చేశారు. అదే మైనస్ అయింది. అలా కాకుండా 5 ఎపిసోడ్స్లో సిరీస్ ముగిస్తే సూపర్ థ్రిల్లింగ్గా ఉండేది. ఎవరెలా చేశారంటే? చాలా కాలం తర్వాత తారక రత్నకు మంచి పాత్రే దొరికందని చెప్పవచ్చు. కానీ ఆ పాత్ర హైలెట్గా నిలిచే సన్నివేశాలు ఎక్కడా లేవు. జర్నలిస్ట్గా మధుశాలిని పాత్ర కూడా అంతంతమాత్రమే. కానీ రాబరీలో బంధీలుగా ఉన్న పాత్రధారులు ఆకట్టుకున్నారు. దొంగతనంలో కూడా తన కామవాంఛ తీర్చుకునే సహోద్యోగి పాత్రలో గిరిధర్ మెప్పించాడు. అజయ్, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రానీ, సమీర్, అంకిత్ కొయ్య, రవివర్మ, జ్వాల కోటి, రవిప్రకాష్ వారి నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని, జీవిత కథలను చెప్పే కథనం స్లోగా సాగిన మలుపులు, రాబరీ ప్లానింగ్ ఆశ్చర్యపరుస్తాయి. ఓపికతో చూస్తే మంచి డీసెంట్ వెబ్ సిరీస్ ఇది. అయితే ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనే తదితర విషయాలపై ముగింపు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్కు సెకండ్ సీజన్ రానున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలో సామ్, నయన్ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
Kaathuvaakula Rendu Kaadhal OTT Release Date: విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కాతువాక్కుల రెండు కాదల్'. కామెడీ ట్రయాంగిల్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కణ్మని రాంబో ఖతీజాగా రిలీజైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై విఘ్నేశ్, నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇద్దరమ్మాయిలు కణ్మని, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడన్నేదే సినిమా కథ. థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలో వస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. హాట్స్టార్లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది హాట్స్టార్. థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు మరికొద్ది రోజులు వెయిట్ చేసి ఓటీటీలో మూవీ చూసి ఎంజాయ్ చేయండి. Get the red carpet rolling, Kanmani and Khatija are here! #KaathuvaakulaRenduKaadhal starts streaming from 27th May#LoveyouTwo #KaathuvaakulaRenduKaadhal @VijaySethuOffl @VigneshShivN @Samanthaprabhu2 #Nayanthara @anirudhofficial @7screenstudio @Rowdy_Pictures #KRK pic.twitter.com/VBh9jplWD0 — Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2022 చదవండి 👇 'మహేశ్బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' అంటున్నారు కాస్మొటిక్ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్ కేర్! -
హాట్స్టార్లో మరో కొత్త వెబ్సిరీస్, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
వినోదాన్ని అందించేందుకు ఓటీటీలు సై అంటున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే అందించకుండా ఒరిజినల్ కంటెంట్తో ముందుకు వస్తున్నాయి. సరికొత్త కథలు, వెబ్సిరీస్తో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయి. దేశంలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ తాజాగా 9 హవర్స్ అనే మరో కొత్త వెబ్సిరీస్ను రిలీజ్ చేయనుంది. అందులో భాగంగా శనివారం నాడు 9 అవర్స్ టీజర్ విడుదలయింది. 'మర్చిపోకండి.. మళ్లీ హాజరు సమయానికి మీకు మధ్య 9 గంటలు మాత్రమే!' అన్న సింగిల్ డైలాగ్తో టీజర్ ముగుస్తుంది. ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ఒక్క ప్లానే 9 అవర్స్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ వెబ్సిరీస్లో తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుషాలిని, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రీతి, అంకిత, జ్వాల, మోనిక ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 2 నుంచి అన్ని ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. చదవండి: జాన్ అబ్రహం, రకుల్ మూవీ 'యాక్షన్', ఎప్పటినుంచంటే?