సచిన్‌ రి​కార్డు బద్దలు.. సెంచరీ తర్వాత కోహ్లి ఏం చేశాడంటే? వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

World cup 2023: సచిన్‌ రి​కార్డు బద్దలు.. సెంచరీ తర్వాత కోహ్లి ఏం చేశాడంటే? వీడియో వైరల్‌

Published Wed, Nov 15 2023 7:07 PM

IND vs NZ: Virat Kohli bows to Sachin Tendulkar - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కింగ్‌ కోహ్లి రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై తన 50వ సెంచరీ మార్క్‌ను అందుకున్న కోహ్లి.. ఈ అరుదైన ఘనతన తన పేరిటి లిఖించుకున్నాడు.

వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సచిన్‌ స్టేడియం వచ్చాడు. ఈ అరుదైన ఘనతను  సచిన్‌ సమక్షంలోనే కోహ్లి సాధించాడు. ఇక విరాట్‌ సెంచరీ మార్క్‌ను అందుకోగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అంతా కోహ్లికి స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు.

విరాట్‌ మాత్రం ఈ ఘనతను అందుకోగానే.. గాల్లోకి జంప్‌ చేస్తూ సచిన్ వైపుగా చూస్తూ బొడౌన్ చేస్తూ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు. ఎన్ని ఘనతలు అందుకున్నా నీ తర్వాతే నేను అన్నట్టుగా కోహ్లి రియాక్షన్‌ ఇచ్చాడు. సచిన్‌ కూడా నిలుచుని చప్పట్లు కొడుతూ కోహ్లిని అభినందించాడు.

అదేవిధంగా గ్యాలరీలో వున్న తన సతీమణి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 113 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.
చదవండి: World Cup 2023: శ్రేయస్‌ అయ్యర్‌ సరికొత్త చరిత్ర.. వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ

Advertisement
Advertisement