Rachin Ravindra
-
Pak vs NZ: జట్టు నిండా ఆల్రౌండర్లే.. విజయం వారిదే!
న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే కివీస్ ఆటగాళ్లు ప్రాధాన్యం ఇస్తారని.. అన్నింటికంటే వాళ్లకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నాడు. వారికి ఆట పట్ల నిబద్ధత ఎక్కువని.. అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికల విషయంలోనూ వారికి స్పష్టమైన అవగాహన ఉంటుందన్నాడు.ఐకమత్యమే మహాబలంకాగా పాకిస్తాన్- న్యూజిలాండ్(Pakistan vs New Zealand) మధ్య మ్యాచ్తో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్కు బుధవారం(ఫిబ్రవరి 19) తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టు బలాల గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఐకమత్యంగా ఉండటమే న్యూజిలాండ్ జట్టుకు ఉన్న ప్రధాన బలం. ఆ జట్టులో సూపర్స్టార్లు లేకపోవచ్చు.. కానీ అంతా కలిసి సూపర్స్టార్ టీమ్ను తయారుచేయగలరు.టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ దాకా.. ప్రతి ఒక్క సభ్యుడికి తమ పాత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. అంతేకాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వారు ఒక్కోసారి త్యాగాలకు కూడా వెనుకాడరు. ప్రణాళికలు, వ్యూహాల విషయంలో వారు రాజీపడరు. అందుకే వారిని చోకర్స్ అనేందుకు నేను ఇష్టపడను.వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే వారు ప్రాధాన్యం ఇస్తారు. జట్టు ప్రయోజనాలే పరమావధిగా మైదానంలోకి దిగుతారు. వ్యక్తిగతంగా ప్రకాశించడం కంటే కూడా.. జట్టుగా సత్తా చాటాడమే వారికిష్టం. ప్రస్తుత టీమ్ మొత్తం ఆల్రౌండర్లతో నిండిపోయింది. ముగ్గురు లేదంటే నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు.జట్టు నిండా ఆల్రౌండర్లేఆఫ్ స్పిన్నర్లు, లెఫ్టార్మ్ స్పిన్నర్లు జట్టుతో పాటే ఉన్నారు. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్వెల్... వీరంతా బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరు. ఇటీవలే న్యూజిలాండ్ త్రైపాక్షిక సిరీస్ గెలిచింది. పాకిస్తాన్ గడ్డపై పాక్తో పాటు సౌతాఫ్రికాను ఓడించింది.వరుస విజయాలుఅంతకు ముందు భారత్లో టీమిండియాపై అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం కివీస్ జట్టు సూపర్ ఫామ్లో ఉంది. పాక్ పిచ్ పరిస్థితులపై వారికి స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పాక్తో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి. ఈ వన్డే ఫార్మాట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుంది.ఫెర్గూసన్ స్థానంలో జెమీసన్ చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన పేసర్ లాకీ ఫెర్గూసన్ స్థానంలో మరో పేస్ బౌలర్ కైల్ జెమీసన్ జట్టులోకి వచ్చాడు. ఈ మార్పునకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. 30 ఏళ్ల జేమీసన్ న్యూజిలాండ్ తరఫున 13 వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. జేమీసన్ చివరి వన్డే 2023లో బంగ్లాదేశ్పై ఆడాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టుడెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్వెల్, కైల్ జెమీసన్.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
Champions Trophy: న్యూజిలాండ్కు ఊహించని షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముగింట న్యూజిలాండ్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర గాయాల బారిన పడగా.. తాజాగా యువ పేసర్ బెన్ సియర్స్ ఈ జాబితాలోకి చేరాడు. సియర్స్ తొడ కండరాల గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అతడి స్ధానాన్ని మరో పేసర్ జాకబ్ డఫీతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. సియర్స్ ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ట్రైసిరీస్లో కివీస్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో సియర్స్ తొడ కండరాలు పట్టేశాయి.అనంతరం అతడిని స్కానింగ్కు తరలించగా.. గ్రేడ్-3 గాయంగా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ యువ ఆటగాడు రెండు నుంచి మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే కివీస్ సెలక్టర్లు అతడి స్ధానాన్ని జాకబ్ డఫీతో భర్తీ చేశారు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్కు ముందు న్యూజిలాండ్ అద్బుతమైన ఫామ్లో ఉంది.ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కు ఆర్హత సాధించింది. శుక్రవారం కరాచీ వేదికగా పాక్తో జరగనున్న ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని కివీస్ భావిస్తోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు కివీ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సైతం దూరమయ్యాడు.పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో రవీంద్ర తలకు గాయమైంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని బ్లాక్క్యాప్స్ హెడ్కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు. ఇక ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ మొదటి మ్యాచ్లో ఫిబ్రవరి 19న పాక్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర,జేకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
'అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు.. త్వరలోనే జట్టులోకి వస్తాడు'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్-దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ట్రైసిరీస్ తుది అంకానికి చేరుకుంది. కరాచీ వేదికగా శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో కివీస్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.అయితే ఈ మ్యాచ్కు ముందు కివీస్కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర గాయం కారణంగా ఫైనల్ పోరుకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. లహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో రవీంద్ర తలకు గాయమైంది. బంతి అతడి నుదిటికి తాకడంతో రక్తస్రావమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్కు రవీంద్ర దూరమయ్యాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి రచిన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రచిన్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడికి హెడ్ ఇంజ్యూరీ అసెస్మెంట్(HIA) సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించాము. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి కాస్త తలనొప్పితో బాధపడుతున్నాడు. గాయం తర్వాత రచిన్ తొలిసారి నెట్ ప్రాక్టీస్లో పాల్గోనున్నాడు. అతడు మరి కొన్ని రోజుల్లో తన ఫిట్నెస్ సాధిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మా తొలి మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడని నేను భావిస్తున్నాను అని స్టెడ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న పాకిస్తాన్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీచదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం -
రచిన్ రవీంద్రకు తీవ్ర గాయం.. మైదానంలో కుప్పకూలిన కివీ స్టార్! వీడియో
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా టోర్నీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా మరో కీలక ఆటగాడు ఈ జాబితాలో చేరాడు.ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ రవీంద్ర నుదిటికి బంతికి బలంగా తాకింది. వెంటనే రచిన్ కింద పడిపోయాడు. అతడికి తీవ్ర రక్త స్రావం జరిగింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు రక్త స్రావం ఆపే ప్రయత్నం చేశారు. ఫిజియోలు సాయంతో రచిన్ మైదానాన్ని వీడాడు.అసలేం జరిగిందంటే?పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన స్పిన్నర్ మైఖేల్ బ్రేస్వెల్ బౌలింగ్లో మూడో బంతిని పాక్ బ్యాటర్ కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ బంతిని అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయడంలో రచిన్ విఫలమం కావడంతో.. ఆ బంతి నేరుగా వెళ్లి అతడి నుదిటికి తాకింది.దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు వల్ల బంతి సరిగా కనిపించకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక గాయపడిన రచిన్ను వెంటనే అస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా రచిన్ గాయంపై న్యూజిలాండ్ క్రికెట్ అప్డేట్ ఇచ్చింది."పాక్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంతో బంతి రచిన్ నుదిటికి బలంగా తాకింది. అతడికి రక్తస్రావమైంది. దీంతో అతడిని మా ఫిజియోలు మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతడి నుదిటిపై గాయం ఉంది. రచిన్ను వెంటనే అస్పత్రికి తరలించి చికిత్స అందించాము.అతడి గాయం మరీ అంత తీవ్రమైనది కాదు. రవీంద్ర ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడికి హెడ్ ఇంజ్యూరీ అసెస్మెంట్(HIA ) పరీక్షలు నిర్వహించాము. అందులో అంతా క్లియర్గా ఉంది. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.పాకిస్తాన్ చిత్తు..కాగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (74 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు శతకంతో విజృంభించగా... సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 58; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (84 బంతుల్లో 81; 2 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంరీలతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా... అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (69 బంతుల్లో 84; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకంతో మెరవగా... సల్మాన్ ఆఘా (40), తయ్యబ్ తాహిర్ (30) రాణించారు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫిలిప్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్ How did @ICC allowed Pakistan's ground to host international matches??ICC should ensure players safety and if Pakistan can't provide shift CHAMPIONS TROPHY to Dubai.Prayers for Rachin Ravindra 🙏🏻#PAKvNZ pic.twitter.com/77bvA7uqjv— KohliForever (@KohliForever0) February 8, 2025 -
తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే!.. టీమిండియా నుంచి ఎవరంటే?
క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.సెంచరీల మెషీన్వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్గా భారత్కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అద్భుతమైన గణాంకాలుమరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.టెస్టుల్లో తనకు తానే సాటి ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడుఇదిలా ఉంటే.. న్యూజిలాండ్కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరేఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.నా దృష్టిలో ఆ నలుగురే..యశస్వి జైస్వాల్తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.సూపర్ ఫామ్లో ఆ ఆరుగురుకాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. -
NZ Vs SL: తీక్షణ హ్యాట్రిక్ వృధా.. రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు.తీక్షణ హ్యాట్రిక్ఈ మ్యాచ్లో లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 35 ఓవర్లో ఆఖరి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసిన తీక్షణ.. ఆ తర్వాత 37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో తన తొలి హ్యాట్రిక్ను నమోదు చేశాడు. మిచెల్ సాంట్నర్ను తొలుత ఔట్ చేసిన తీక్షణ.. ఆ తర్వాత వరుసగా నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 8 ఓవర్లు వేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తీక్షణతో పాటు హసరంగ (2), ఎషాన్ మలింగ (1), అశిత ఫెర్నాండో (1) వికెట్లు తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను కమిందు మెండిస్ (64), జనిత్ లియనాగే (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. లియనాగే 16వ ఓవర్ ఆఖరి బంతికి ఔట్ కావడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. చమిందు విక్రమసింఘే (17) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంక 1, అవిష్క ఫెర్నాండో 10, కుసాల్ మెండిస్ 2, అసలంక 4, హసరంగ 1, తీక్షణ 6, మలింగ 4 పరుగులు చేసి ఔటయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ కీలకమైన కమిందు మెండిస్ వికెట్ పడగొట్టడంతో పాటు ఇద్దరు చివరి వరుస ఆటగాళ్లను పెవిలియన్కు పంపాడు. జేకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ తొలి వన్డేలోనూ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే జనవరి 11న ఆక్లాండ్లో జరుగనుంది. -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడికి చోటు
స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్లకు రెండు వేర్వేరు జట్లను కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన బెవాన్ జాకబ్స్కు ఈ జట్టులో చోటు దక్కింది.న్యూజిలాండ్ దేశీవాళీ క్రికెట్లో జాకబ్స్ గత కొంత కాలంగా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాక్క్యాప్స్ సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇచ్చారు.ఈ రెండు సిరీస్లలో న్యూజిలాండ్ కెప్టెన్గా మిచెల్ శాంట్నర్ వ్యవహరించనున్నాడు. ఇటీవలే తమ వైట్ బాల్ జట్టు ఫుల్టైమ్ కెప్టెన్ శాంట్నర్ను కివీ క్రికెట్ బోర్డు నియమించింది. ఇక ఈ సిరీస్లకు కోసం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మాట్ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు గత నెలలో శ్రీలంకతో వైట్బాల్ సిరీస్లకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై పునరగామనం చేయననున్నారు. ఈ వైట్బాల్ సిరీస్లలో భాగంగా పర్యాటక శ్రీలంకతో న్యూజిలాండ్ మూడు టీ20లు ,మూడు వన్డేలు ఆడనుంది.టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్వన్డే జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, మిచ్ హే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్చదవండి: సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!.. వీడియో -
Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్వాడినే.. కానీ
ముంబై: భారత్తో టెస్టు సిరీస్ విజయంలో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన బెంగళూరులో అద్భుత సెంచరీ సాధించి జట్టును తొలి టెస్టులో గెలిపించిన అతను సిరీస్ విజయానికి పునాది వేశాడు. అయితే ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది సిరీస్ విజయం తర్వాత తన తండ్రి అభినందిస్తూ మెసేజ్ పంపించడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని రచిన్ చెప్పాడు. నేను వంద శాతం న్యూజిలాండ్వాడినేచిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి రవి కృష్ణమూర్తి సమక్షంలోనే రచిన్ శతకంతో సత్తా చాటాడు. ‘నేను వంద శాతం న్యూజిలాండ్వాడినే. అక్కడే పుట్టి పెరిగాను. కానీ మా అమ్మా నాన్న సొంత ఊరిలో నేను బాగా ఆడటం మరచిపోలేని క్షణం. అది ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇన్నేళ్లలో ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించడం ఎప్పుడూ చూడలేదు. కానీ ముంబై టెస్టు తర్వాత నిన్ను చూసి గర్విస్తున్నా అని నాన్న మెసేజ్ పంపించారు. అందుకే ఈ సిరీస్ విజయానందం రెట్టింపైంది. గెలిచాక మైదానంలో కూడా మా పరిస్థితి అంతా కొత్తగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనుఎజాజ్ చివరి వికెట్ తీయగానే ప్రతీ ఒక్కరూ ఆనందంతో సహచరుల వైపు పరుగెడుతున్నారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అందరం ఒక్కచోట చేరి ఆనందం పంచుకున్న అనుభూతిని నిజంగా మాటల్లో వర్ణించలేను. కానీ ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పగలను’ అని రచిన్ వివరించాడు. చదవండి: Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా -
వావ్! సుందర్ స్పిన్ మ్యాజిక్.. దెబ్బకు రవీంద్ర మైండ్ బ్లాంక్( వీడియో)
పుణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్లో కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించిన సుందర్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా అదే తీరులో ఔట్ చేశాడు.సుందర్ సంధించిన డెలివరీకి రవీంద్ర దగ్గర సమాధానమే లేకుండా పోయింది. సంచలన బంతితో వాషింగ్టన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 22 ఓవర్ వేసిన వాషీ ఐదో బంతిని కొంచెం వేగంతో లెంగ్త్ డెలివరీగా రచిన్కు సంధించాడు. అయితే ఆ డెలివరీని రచిన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం అతడి బ్యాట్కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. దీంతో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రచిన్ మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో కివీస్ పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో 35 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.ప్రస్తుతం బ్లాక్ క్యాప్స్ 250 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. కివీ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. pic.twitter.com/A4ogHu0XbW— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) October 25, 2024 -
వారెవ్వా వాషింగ్టన్.. దెబ్బకు కివీస్ ప్లేయర్ల ఫ్యూజ్లు ఔట్! వీడియో
పుణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, డార్లీ మిచెల్ను అద్బుతమైన బంతులతో సుందర్ బోల్తా కొట్టించాడు.ముఖ్యంగా రవీంద్ర, బ్లండెల్ను వాషీ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ స్ధానంలో జట్టులోకి వచ్చిన సుందర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు.తొలి స్పెల్లో అద్బుతంగా బౌలింగ్ చేసిన సుందర్ను కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ 59 ఓవర్ల తర్వాత ఎటాక్లో తీసుకువచ్చాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రచిన్ రవీంద్రను పెవిలియన్కు పంపేందుకు హిట్మ్యాన్ సుందర్కు బంతి ఇచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని సుందర్ వమ్ము చేయలేదు.రచిన్ షాక్..కివీస్ ఇన్నింగ్స్ 60వ ఓవర్ వేసిన వాషింగ్టన్ తొలి బంతిని రచిన్కు రౌండ్ ది వికెట్ నుంచి మిడిల్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే ఆ డెలివరీని రచిన్ ఫ్రంట్ ఫుట్ మీద డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ మిడిల్ స్టంప్ దిశగా పడిన బంతి ఎవరూ ఊహించని విధంగా టర్న్ అవుతూ ఆఫ్ స్టంప్ను గిరాటేసింది.ఇది చూసిన రచిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. చేసేదేమి లేక 65 పరుగులతో రచిన్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు బ్లండెల్ను కూడా సుందర్ ఈ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.62 ఓవర్లో ఆఖరి బంతిని సుందర్ బ్లండెల్కు ఔట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. కానీ బంతి మాత్రం ఒక్క సారిగా లోపలకు టర్న్ అవుతూ స్టంప్స్ను తాకింది. దెబ్బకు 3 పరుగులు చేసిన బ్లండెల్ బిత్తర పోయాడు. 76 ఓవర్ల ముగిసే సరికి న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్లో సుందర్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ఇప్పటివరకు 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్లో సుందర్కు ఇదే తొలి ఫైవ్ వికెట్ల హాల్ కావడం విశేషం.T. I. M. B. E. R! 🎯Cracker of a ball! 👌 👌Washington Sundar with a breakthrough 🙌 🙌Live ▶️ https://t.co/YVjSnKCtlI #TeamIndia | #INDvNZ | @Sundarwashi5 | @IDFCFIRSTBank pic.twitter.com/OC8VS7fnwT— BCCI (@BCCI) October 24, 2024చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్ -
Ind vs NZ: ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే: సచిన్
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు బాగా హైలైట్ అయ్యారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. మరొకరు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. బెంగళూరు టెస్టులో వీరిద్దరు సెంచరీలతో చెలరేగారు.టీమిండియా పరువు నిలబెట్టిన సర్ఫరాజ్కాగా ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సర్ఫరాజ్ సాధించిన పరుగులు సున్నా. అయితే, భారత్ రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులు చేయగలిగిందంటే మాత్రం అందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖానే!అద్భుత ఆట తీరుతో కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ మెరుపు సెంచరీ సాధించిన ఈ ముంబైకర్.. 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్న వేళ అంతర్జాతీయ కెరీర్లో తొలి శతకం సాధించి ఆటగాడిగా తన విలువను చాటుకున్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) తండ్రి సొంతూరిలో కివీస్ తరఫున రచిన్ శతకంమరోవైపు.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో శుభారంభం అందించగా.. నాలుగో స్థానంలో వచ్చిన రచిన్ రవీంద్ర శతక్కొట్టి జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరు వేదికగా టెస్టుల్లో రెండో సెంచరీ(157 బంతుల్లో 134) నమోదు చేశాడు. అతడికి తోడుగా టిమ్ సౌథీ(65) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్లో కివీస్ 402 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.ఎవరిది పైచేయి అవునో?!ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కివీస్కు 107 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. మరొక్కరోజు(ఆదివారం) మాత్రమే ఆట మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ బ్యాటర్లు, భారత బౌలర్ల మధ్య పోటీలో ఎవరు నెగ్గుతారోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. బెంగళూరు సెంచరీ హీరోలు సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవీంద్రల గురించి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.ఈ ఇద్దరూ అద్భుతం.. భవిష్యత్ వీరిదే‘‘మన మూలాలను అనుసంధానం చేసే మార్గం క్రికెట్కు ఉంది. రచిన్ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడి కుటుంబం అక్కడి నుంచే వలస వెళ్లింది. అక్కడే అతడు శతకం బాదాడు.ఇక సర్ఫరాజ్ ఖాన్... తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?! టీమిండియాకు అత్యవసరమైన వేళ అతడు శతకం బాదాడు. ప్రతిభావంతులైన ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’’ అని సచిన్ టెండుల్కర్ రచిన్, సర్ఫరాజ్లపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!Cricket has a way of connecting us to our roots. Rachin Ravindra seems to have a special connection with Bengaluru, where his family hails from! Another century to his name.And Sarfaraz Khan, what an occasion to score your first Test century, when India needed it most!… pic.twitter.com/ER8IN5xFA5— Sachin Tendulkar (@sachin_rt) October 19, 2024 -
ఎదురీత!
అనూహ్య తడబాటు నుంచి కోలుకున్న టీమిండియా... న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఎదురీదుతోంది. బ్యాటింగ్కు అనువుగా మారిన బెంగళూరు పిచ్పై ప్రత్యర్థి భారీ స్కోరు చేయగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిస్తున్నారు. రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ, టిమ్ సౌతీ సమయోచిత ఇన్నింగ్స్తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత టాపార్డర్ రాణించింది. రోహిత్, కోహ్లి, సర్ఫరాజ్ అర్ధ శతకాలతో టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది. మూడో రోజు ఇన్నింగ్స్ చివరి బంతికి విరాట్ కోహ్లిను అవుట్ చేసి న్యూజిలాండ్ పైచేయి సాధించగా... కోహ్లి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్లో భారత్ గట్టెక్కాలంటే మిగిలిన బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. బెంగళూరు: తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్లో మాత్రం గట్టిగానే పోరాడుతోంది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కిన ఈ మ్యాచ్లో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. 356 పరుగులతో వెనుకబడి శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (70; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 బ్యాటింగ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... యశస్వి జైస్వాల్ (35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 125 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న సర్ఫరాజ్తోపాటు ఇంకా రావాల్సిన కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ కోలుకోవచ్చు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 180/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 91.3 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో రెండో సెంచరీ సాధించాడు. మాజీ కెపె్టన్ టిమ్ సౌతీ (73 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో రచిన్కు అండగా నిలిచాడు. చివరి బంతికి కోహ్లి అవుట్... తొలి ఇన్నింగ్స్లో తడబడ్డ భారత టాపార్డర్ రెండో ఇన్నింగ్స్లో మెరుగ్గా ఆడింది. యశస్వి, రోహిత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడంతో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్కు 72 పరుగులు జోడించాక జైస్వాల్ అవుట్ కాగా... కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఎజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి. మరోసారి వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్తో కలిసి చకచకా పరుగులు చేస్తూ... ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కోహ్లి 70 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో చివరి బంతికి కోహ్లి అవుటవ్వడంతో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. ఆ భాగస్వామ్యం లేకుంటే... భారత సంతతి ఆటగాడు రచిన్... కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయగలిగింది. మిచెల్ (18), బ్లండెల్ (5), ఫిలిప్స్ (14), హెన్రీ (8) విఫలమవడంతో కివీస్ జట్టు 233/7తో నిలిచింది. కాసేపట్లో కివీస్ ఆలౌట్ కావడం ఖాయమే అనుకుంటే... సౌతీ సహకారంతో రచిన్ రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్కు 137 పరుగులు జోడించి చివరి వికెట్గా వెనుదిరిగాడు. 4 టెస్టు క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్గా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్గా ఈ మైలురాయి దాటిన 18వ ప్లేయర్గా కోహ్లి ఘనత సాధించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 15; కాన్వే (బి) అశి్వన్ 91; యంగ్ (సి) కుల్దీప్ (బి) జడేజా 33; రచిన్ (సి) (సబ్) జురేల్ (బి) కుల్దీప్ 134; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 18; బ్లండెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 5; ఫిలిప్స్ (బి) జడేజా 14; హెన్రీ (బి) జడేజా 8; సౌతీ (సి) జడేజా (బి) సిరాజ్ 65; ఎజాజ్ (ఎల్బీ) కుల్దీప్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154, 4–193, 5–204, 6–223, 7–233, 8–370, 9–384, 10–402. బౌలింగ్: బుమ్రా 19–7–41–1, సిరాజ్ 18–2–84–2, అశ్విన్ 16–1–94–1, కుల్దీప్ 18.3–1–99–3, జడేజా 20–1–72–3.భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) ఎజాజ్ 35; రోహిత్ (బి) ఎజాజ్ 52; కోహ్లి (సి) బ్లండెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (బ్యాటింగ్) 70; ఎక్స్ ట్రాలు 4; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231. బౌలింగ్: సౌతీ 7–1–22–0; హెన్రీ 11–1–52–0; రూర్కే 11–1–48–0; ఎజాజ్ 12–2–70–2; ఫిలిప్స్ 8–1–36–1. -
IND vs NZ: కివీస్ 402 ఆలౌట్.. భారీ ఆధిక్యం
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా 180/3 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టింది కివీస్.రచిన్ రవీంద్ర సెంచరీమిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. టెయిలెండర్ టిమ్ సౌతీ అతడికి సహకారం అందించాడు. రచిన్ 157 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇది రెండో టెస్టు సెంచరీ. మరోవైపు.. సౌతీ 73 బంతుల్లో 65 రన్స్తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లలో మూడో రోజు గ్లెన్ ఫిలిప్స్(14) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు.ఇక గురువారం ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఫలితంగా న్యూజిలాండ్కు 356 పరుగుల ఆధిక్యం లభించింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉తొలి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు పడిన టాస్👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్.చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
రవీంద్ర సూపర్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్లో కివీస్ స్కోరంతంటే?
Update: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్కు మొదటి ఇన్నింగ్స్లో 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత బౌలింగ్లో భారత్ను కట్టడి చేసిన కివీస్.. ఇప్పుడు బ్యాటింగ్లో కూడా అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా బ్యాక్ క్యాప్స్ జట్టు అడుగులు వేస్తోంది. మూడో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 299 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.క్రీజులో రచిన్ రవీంద్ర(104), టిమ్ సౌథీ(49) పరుగులతో ఉన్నారు. అయితే 180/3 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ డార్లీ మిచెల్ను సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్లాండెల్ను బుమ్రా ఔట్ చేయగా, గ్లెన్ ఫిలిప్స్ జడేజా బోల్తా కొట్టించాడు.కేవలం 40 పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ తిరిగి గేమ్లోకి వచ్చిందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న రచిన్ రవీంద్ర మాత్రం అందరి అంచనాలను తారుమారు చేశాడు.రవీంద్ర సూపర్ సెంచరీ..వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటకి రవీంద్ర మాత్రం భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. వెటరన్ ప్లేయర్ టిమ్ సౌథీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 124 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీ మార్క్ను రవీంద్ర అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 11 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. మరోవైపు టిమ్ సౌథీ కూడా భారత బౌలర్లను ఓ ఆట ఆడేసికుంటున్నాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో సౌథీ ఉన్నాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 112 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. -
IND vs NZ: కొరకరాని కొయ్య.. శతక్కొట్టిన రచిన్ రవీంద్ర
టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర శతకంతో మెరిశాడు. భారత బౌలర్లకు కొరకరానికి కొయ్యగా మారి.. వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆద్యంతం అద్భుత బ్యాటింగ్తో 124 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటేశాడు.అతడి తర్వాత.. కివీస్ తొలి బ్యాటర్గాకాగా టెస్టుల్లో రచిన్కు ఇది రెండో శతకం. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరులో సెంచరీ సాధించడం అతడి కెరీర్లో మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతేకాదు.. రచిన్ సాధించిన ఈ శతకానికి మరో ప్రత్యేకత కూడా ఉందండీ! న్యూజిలాండ్ తరఫున బెంగళూరులో 2012 తర్వాత సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రచిన్ రవీంద్ర కావడం విశేషం. నాడు రాస్ టేలర్ ఇదే వేదికపైన టీమిండియాపై 113 పరుగులు సాధించాడు.భారీ ఆధిక్యంలో కివీస్ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ భారత్కు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షం వల్ల గురువారం మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, పిచ్ను తప్పుగా వేయడం వల్ల భారీ మూల్యం చెల్లించింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక రోహిత్ సేన 46 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ.. ఇదే వేదికపై న్యూజిలాండ్ బ్యాటర్లను మాత్రం కట్టడి చేయలేకపోయింది. గురువారం ఆట ముగిసే సరికి 180/3 స్కోరు చేసిన కివీస్.. శుక్రవారం ఆరంభం నుంచి నిలకడగా ఆడింది.భోజన విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. భారత్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 299 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లంచ్ బ్రేక్నకు ముందు రచిన్ రవీంద్ర 104, టిమ్ సౌతీ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తకరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 68 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక గెలుపుకు కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. మరో రోజు ఆట మిగిలి ఉంది. ప్రస్తుతమున్న అవకాశాల ప్రకారం.. శ్రీలంకకే విజయావకాశాలు అధికంగా ఉన్నా.. కివీస్ను కూడా విస్మరించడానికి వీలు లేని పరిస్థితి ఉంది. కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర (91 నాటౌట్) క్రీజ్లో పాతుకుపోయి ఉన్నాడు. అజాజ్ పటేల్ (0 నాటౌట్), విలియమ్ ఓరూర్కీ సాయంతో అతను న్యూజిలాండ్ను గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రచిన్కు లోయర్ ఆర్డర్లో ఏ ఒక్కరి నుంచి సహకారం లభించినా పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న గ్లెన్ ఫిలిప్స్ (4), మిచెల్ సాంట్నర్ (2), టిమ్ సౌథీ (2) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. టాపార్డార్లో డెవాన్ కాన్వే (4), డారిల్ మిచెల్ (8) సైతం తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. టామ లాథమ్ (28), కేన్ విలియమ్సన్ (30), టామ్ బ్లండెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అశిత ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ చెరో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన కరుణరత్నే, చండీమల్, మాథ్యూస్అంతకుముందు శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే (83), చండీమల్ (61), ఏంజెలో మాథ్యూస్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. అజాజ్ పటేల్ ఆరు వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్ను దెబ్బకొట్టాడు. విలియమ్ ఓరూర్కీ 3, సాంట్నర్ ఓ వికెట్ పడగొట్టారు.లాథమ్, విలియమ్సన్, మిచెల్ ఫిఫ్టీలున్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో టామ్ లాథమ్ (70), కేన్ విలియమ్సన్ (55), డారిల్ మిచెల్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా ఆ జట్టు 340 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్), రచిన్ రవీంద్ర (39), టామ్ బ్లండెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4, రమేశ్ మెండిస్ 3, ధనంజయ డిసిల్వ 2 వికెట్లు పడగొట్టారు.కమిందు సెంచరీఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులు చేసి ఆలౌటైంది. కమిందు మెండిస్ (114) సెంచరీ.. కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీ చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, అజాజ్ పటేల్ తలో 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ -
రచిన్ రవీంద్రకు బంపరాఫర్
న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్రకు బంపరాఫర్ దక్కింది. కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తొలిసారి అతడు చోటు దక్కించుకున్నాడు.గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రచిన్కు బోర్డు ఈ మేరకు సముచిత స్థానం కల్పించింది. 2024- 25 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రతిపాదిత జాబితాలోని 20 మంది ఆటగాళ్లలో 24 ఏళ్ల రచిన్కు చోటు ఇచ్చింది.బెంగళూరు మూలాలుభారత్లోని బెంగళూరు మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. గతేడాది కివీస్ తరఫున అతడు 578 పరుగులు సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ఆట తీరుతో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.అంతేకాదు.. ఈ ఏడాది మార్చిలో.. ప్రతిష్టాత్మక సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్ అందుకున్నాడు. తద్వారా ఈ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా రచిన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని.. ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్లాక్క్యాప్స్ తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. ఇప్పుడిలా కాంట్రాక్టు దక్కించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. రూ. 1.8 కోట్లుకాగా రచిన్ రవీంద్రతో పాటు బెన్ సియర్స్, విల్ ఓ రూర్కే, జాకోబ్ డఫీలు కూడా తొలిసారి న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించారు.న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన రచిన్ రవీంద్ర 519 పరుగులు చేశాడు. ఇక 25 వన్డేలు ఆడిన అతడి ఖాతాలో 820 పరుగులు ఉన్నాయి. ఇందులో మూడు సెంచరీలు. కాగా ఐపీఎల్లో రచిన్ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది వేలంలో రూ. 1.8 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు.ఇక 23 టీ20 ఆడిన రచిన్ 231 పరుగులు చేయగలిగాడు. అదే విధంగా.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా 10, 18, 13 వికెట్లు పడగొట్టాడు. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది సంబంధిత క్రికెట్ బోర్డు, క్రికెటర్ల మధ్య కుదిరే వార్షిక ఒప్పందం. అందుకు అనుగుణంగానే ప్లేయర్ల పారితోషికం, సదుపాయాలు ఉంటాయి.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 25గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ! -
T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఇవాల్టి (జూన్ 1) నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి సారి రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గతంలో ఈ టోర్నీ 12 జట్లతో సాగేది. క్రికెట్ పసికూనలకు ప్రోత్సహించడంలో భాగంగా ఐసీసీ ఈ ఎడిషన్ నుంచి 20 జట్లకు అవకాశం కల్పిస్తుంది.ఈ ఎడిషన్ ప్రపంచకప్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి ఒక్కరు.. యూఎస్ఏ నుంచి ఆరుగురు.. కెనడా నుంచి నలుగురు.. సౌతాఫ్రికా, ఒమన్ల నుంచి ఒక్కొక్కరు.. ఉగాండ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎడిషన్లో పాల్గొంటున్నారు.గతంలో ఎన్నడూ ఈ సీజన్లో పాల్గొంటున్నంత మంది భారత సంతతి ఆటగాళ్లు పాల్గొనలేదు. ఈ ఎడిషన్ ప్రపంచకప్లో అందరి కళ్లు న్యూజిలాండ్కు చెందిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రపై ఉన్నాయి. అలాగే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రదర్శనల కోసం కూడా భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొంటున్న భారత సంతతి ఆటగాళ్లు..రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా)కశ్యప్ ప్రజాపతి (ఒమన్)అల్పేశ్ రాంజనీ (ఉగాండ)రోనక్ పటేల్ (ఉగాండ)రవీందర్ పాల్ సింగ్ (కెనడా)నిఖిల్ దత్తా (కెనడా)పర్గత్ సింగ్ (కెనడా)శ్రేయస్ మొవ్వ (కెనడా)మోనాంక్ పటేల్ (యూఎస్ఏ)హార్మీత్ సింగ్ (యూఎస్ఏ)మిలింద్ కుమార్ (యూఎస్ఏ)నిసర్గ్ పటేల్ (యూఎస్ఏ)నితీశ్ కుమార్ (యూఎస్ఏ)సౌరభ్ నేత్రావాల్కర్ (యూఎస్ఏ) -
#CSK: మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే!
కెప్టెన్గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు.‘‘ఢిల్లీ ఇన్నింగ్స్లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్కు కట్టడి చేయగలిగారు.తొలి ఇన్నింగ్స్లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది.తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా ఢిల్లీతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. -
మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే: రుతు
కెప్టెన్గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు. ‘‘ఢిల్లీ ఇన్నింగ్స్లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్కు కట్టడి చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది. తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. Vintage Dhoni 👌#TATAIPL fans were treated to some strong hitting by MS Dhoni Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/eF4JsOwmsa — IndianPremierLeague (@IPL) March 31, 2024 అజింక్య రహానే(45), డారిల్ మిచెల్(34).. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని(37 నాటౌట్) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. ఈ మ్యాచ్లో అద్భుత స్పెల్(2/21) వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: #Dhoni: స్ట్రైక్రేటు 231.25.. సీఎస్కే ఓడిందా?!.. అట్లుంటది మనతోని Season’s 1️⃣st Win 🙌@DelhiCapitals get off the mark in #TATAIPL 2024 with a collective team effort in Visakhapatnam 🙌 Scorecard ▶️ https://t.co/8ZttBSkfE8#DCvCSK pic.twitter.com/PB9tLAD13i — IndianPremierLeague (@IPL) March 31, 2024 These maximums 🤩 Some clean hitting tonight 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/4ps9IcmCbl — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సీఎస్కే ఫీల్డింగ్ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ను పెవిలియన్కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్ కూడా అద్భుతం: రుతురాజ్
ఐపీఎల్-2024లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టి కృషితో గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట జట్టును ఓడించామని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రతి ఒక్క సీఎస్కే ఆటగాడూ రాణించాడని ప్రశంసలు కురిపించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే.. తాజాగా గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. సొంతమైదానం చెపాక్లో మంగళవారం నాటి మ్యాచ్లో 63 పరుగుల తేడాతో శుబ్మన్ గిల్ సేనపై జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ పరిపూర్ణమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మా వాళ్లు అదరగొట్టారు. సాధారణంగా చెన్నైలో వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేం. అందుకే తొలుత బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా రాణించడం మాత్రం ముఖ్యం. అయితే, వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే ఆఖర్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈరోజు రచిన్ పవర్ ప్లేలో అత్యద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేశాడు. అదే విధంగా.. దూబే.. అతడికి ఆత్మవిశ్వాసం మెండు. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా వ్యక్తిగతంగా అతడిని మెటివేట్ చేశాడు. జట్టులో తన పాత్ర ఏమిటో అతడికి బాగా తెలుసు. దూబే జట్టుతో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈరోజు నేను మా వాళ్ల ఫీల్డింగ్కు కూడా ఫిదా అయ్యాను’’ అని పేర్కొన్నాడు. గుజరాత్తో మ్యాచ్లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. Jubilant Chepauk 🏟️ witnessed @ChennaiIPL's consecutive win as they beat @gujarat_titans by a resounding 63 runs 💪 Recap of the #CSKvGT clash 🎥 👇 #TATAIPL pic.twitter.com/reeLzs1IEh — IndianPremierLeague (@IPL) March 27, 2024 చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46) రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే(23 బంతుల్లో 51) ధనాధన్ ఇన్నింగ్స్తో మెరుపు అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్(24- నాటౌట్) సైతం తన వంతు పరుగులు జతచేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ గుజరాత్ 143 పరుగుల వద్దే నిలిచిపోవడంతో సీఎస్కే చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్పాండే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. డారిల్ మిచెల్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: #WHAT A CATCH: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో -
CSK Vs GT: చెన్నై ధనాధన్ గెలుపు
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ ఆల్రౌండ్ షోకు నిరుటి రన్నరప్ గుజరాత్ టైటాన్స్ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్లు), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్లో గుజరాత్కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు. ముందు రచిన్... తర్వాత దూబే... చెన్నై ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్గా సాగింది. తొలి దశను ఓపెనర్ రచిన్ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్ రెండో బంతికి రషీద్ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్వే కావడం విశేషం. తర్వాత రహానే (12), కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే రహానే అవుట్కాగా... శివమ్ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్ ఏ బౌలర్కు తలొగ్గకుండా దూబే బ్యాట్ దంచేసింది. మిచెల్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది. టైటాన్స్ వల్ల కాలేదు! కొండంత లక్ష్యం చూసే గుజరాత్ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్ప్లేలోనే కెపె్టన్ శుబ్మన్ గిల్ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్కు వెళ్లిపోయారు. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ టాప్స్కోరర్గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్ శంకర్ (12), మిల్లర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్కు వికెట్లు అప్పగించేశారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46; రచిన్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 46; రహానే (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 12; దూబే (సి) శంకర్ (బి) రషీద్ ఖాన్ 51; మిచెల్ (నాటౌట్) 24; సమీర్ రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14; జడేజా (రనౌట్) 7; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–49–2, సాయికిషోర్ 3–0–28–1, జాన్సన్ 4–0–35–1, మోహిత్ శర్మ 4–0–36–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) తుషార్ (బి) దీపక్ 21; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ 8; సాయి సుదర్శన్ (సి) సమీర్ (బి) పతిరణ 37; విజయ్ శంకర్ (సి) ధోని (బి) మిచెల్ 12; మిల్లర్ (సి) రహానే (బి) తుషార్ 21; అజ్మతుల్లా (సి) రచిన్ (బి) తుషార్ 11; తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 6; రషీద్ ఖాన్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఉమేశ్ (నాటౌట్) 10; జాన్సన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–28–2, ముస్తఫిజుర్ 4–0–30–2, తుషార్ దేశ్పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్ 2–0–18–1, పతిరణ 4–0–29–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X ముంబై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: రచిన్ రవీంద్ర విధ్వంసం.. కేవలం 20 బంతుల్లోనే! వీడియో వైరల్
కివీస్ యవ సంచలనం, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో అదరగొట్టిన రవీంద్ర.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లను రవీంద్ర ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రవీంద్ర బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సీఎస్కేకు మరో సూపర్ స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు విధ్వంసం సష్టించారు. రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు. Rachin Ravindra is a superstar!!! ⭐pic.twitter.com/FUYcUekI9Y — Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024 -
#Kohli: అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?
Virat Kohli Reaction To Rachin Ravindra Dismissal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్కు చెందిన ఈ ఆల్రౌండర్ ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం నాటి మ్యాచ్లో ఈ భారత సంతతి ఆటగాడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న రచిన్ ఏకంగా 37(3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు రాబట్టి చెన్నై ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. తద్వారా విజయంలో తానూ భాగమై సత్తా చాటాడు రచిన్ రవీంద్ర. కాగా ఆర్సీబీతో మ్యాచ్లో జోరు మీదున్న సమయంలో రచిన్ను కర్ణ్ శర్మ అవుట్ చేశాడు. కర్ణ్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రచిన్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న రజత్ పాటిదార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6⃣.5⃣ - SIX 6⃣.6⃣ - OUT That was an interesting passage of play! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB pic.twitter.com/JjiIclkEoj — IndianPremierLeague (@IPL) March 22, 2024 ఫలితంగా ఆర్సీబీ శిబిరంలో సంబరాలు షురూ కాగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. రచిన్ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ.. వెళ్లిపో అన్నట్లు కోహ్లి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. pic.twitter.com/HUcInu5yTz — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 22, 2024 దీంతో.. ‘‘అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి, వయసుకు ఇది తగదు చీకూ’’ అంటూ కోహ్లి అభిమానులు సైతం అతడి తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ చెన్నై చేతిలో ఓడి పరాజయంతో సీజన్ను ఆరంభించింది. ఇక ఆర్సీబీ ఓపెనర్ కోహ్లి చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అదీ సంగతి!! అందుకే ఆ వైల్డ్ సెలబ్రేషన్! Fielder ki kamaal ki lapak aur khatam hua Kohli ka luck! 🤯 Lijiye mazaa #IPLonJioCinema ka Bhojpuri mein ek dum FREE!#TATAIPL #JioCinemaSports pic.twitter.com/3tCrsyTGBo — JioCinema (@JioCinema) March 22, 2024 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్లు: ►వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై ►టాస్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. బ్యాటింగ్ ►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు: 173/6 (20) ►చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు: 176/4 (18.4) ►విజేత: ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముస్తాఫిజుర్ రహ్మాన్ (4/29). చదవండి: IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు.. ఆర్సీబీ కొంపముంచాడు! ఎవరంటే? -
అరంగేట్రంలోనే సిక్సర్ల వర్షం.. అస్సలు తగ్గేదేలే!
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర.. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రవీంద్ర ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను ఈ కివీ స్టార్ టార్గెట్ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో సీఎస్కే అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఇన్నింగ్స్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎస్కేకు మరో స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సీఎస్కే నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఫీల్డింగ్లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. -
రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ను రవీంద్ర పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్ నాలుగో బంతిని డుప్లెసిస్కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డుప్లెసిస్ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో డుప్లెసిస్(35) పరుగులు చేశాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో రచిన్ 10 మ్యాచ్లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్తో కొయెట్జీ గత వన్డే వరల్డ్కప్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. గత ఏడాది రన్నరప్గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్కు ఆల్రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్కప్లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్గా
ప్రపంచ క్రికెట్లో ఇటీవల సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఆ దేశపు బోర్డు నుంచి సముచిత గుర్తింపు దక్కింది. కివీస్ వార్షిక అవార్డుల్లో రచిన్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘సర్ రిచర్డ్ హ్యడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అటు టెస్టు, ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్లో గత ఏడాది కాలంలో 24 ఏళ్ల రచిన్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. వన్డే వరల్డ్కప్లో 3 సెంచరీలు సహా 578 పరుగులు సాధించిన రచిన్... ఇటీవల దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. అతి పిన్న వయసులో ‘హ్యాడ్లీ అవార్డు’ గెలుచుకున్న ప్లేయర్గా రచిన్ నిలిచాడు. న్యూజిలాండ్ ’టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కేన్ విలియమ్సన్కు దక్కింది. -
IPL 2024: కాన్వే ఔట్.. రుతురాజ్కు జోడీ ఎవరు..?
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాన్వే వైదొలగడంతో రుతురాజ్ గైక్వాడ్తో పాటు సీఎస్కే ఇన్నింగ్స్ను ఎవరు ఆరంభిస్తారనే అంశంపై ప్రస్తుతం నెట్టింట భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సీఎస్కేకు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను ఓపెనర్గా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వారిలో కొత్తగా జట్టులో చేరిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రచిన్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో ఓపెనర్గా సక్సెస్ సాధించాడు కాబట్టి అతన్నే రుతురాజ్కు జోడీగా పంపాలని మెజార్టీ శాతం సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీఎస్కే యాజమాన్యం ముందు రచిన్తో పాటు మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వెటరన్లు అజింక్య రహానే, మొయిన్ అలీల్లో ఎవరో ఒకరికి ఓపెనర్గా ప్రమోషన్ ఇవ్వాలని ధోని యోచిస్తున్నట్లు సమాచారం. రహానేకు గతంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా ఆడిన అనుభవం ఉండటం అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రహానేకు గత సీజన్లో పేసర్లపై విరుచుకుపడిన ట్రాక్ రికార్డు కూడా ఉండటం సెకెండ్ అప్షన్ ఓపెనర్గా అతని పేరునే పరిశీలించే అవకాశం ఉంది. రచిన్, రహానేలతో పాటు మొయిన్ అలీ పేరును సైతం సీఎస్కే మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాటర్గా మొయిన్ అలీకి పెద్ద సక్సెస్ రేట్ లేకపోవడం, వయసు పైబడటం వంటి కారణాలు అతన్ని ఓపెనర్ రేసులో వెనకపడేలా చేయవచ్చు. సీజన్ ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సీఎస్కే యాజమాన్యం అతి త్వరలో ఓపెనింగ్ స్థానాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 22న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు.. ఎంఎస్ ధోని వికెట్కీపర్బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్) డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు తుషార్ దేశ్పాండే బౌలర్ 20 లక్షలు ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు సిమ్రన్జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు -
NZ vs Aus: 5 వికెట్లతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. రచిన్ ఫిఫ్టీ!
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్లు), హాజల్వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆసీస్కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369.. మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
NZ Vs Aus: న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ
Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కాన్వే స్థానంలో అతడు జట్టులోకి ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్పై కన్నేసింది. రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు న్యూజిలాండ్ టెస్టు జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్. చదవండి: Ind vs Eng: లండన్కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే! -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 32 రన్స్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్లు ఉన్నాయి. కాగా రచిన్కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024 -
న్యూజిలాండ్కు షాకిచ్చిన సౌతాఫ్రికా ‘అనుభలేమి జట్టు’!
న్యూజిలాండ్తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్యంగా సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం నాటి ఆటను 220/6తో ముగించిన సౌతాఫ్రికా.. బుధవారం తమ స్కోరుకు మరో 22 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. 242 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. హామిల్టన్ టెస్టులో కివీస్ బౌలర్లలో విలియం రూర్కీ 4 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర 3 వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ టిమ్ సౌతీతో పాటు మ్యాట్ హెన్రీ, వాగ్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్కు సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 40 పరుగులు రాబట్టాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 43 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా వాళ్లలో విల్ యంగ్(36), నీల్ వాగ్నర్(33) మాత్రమే ముప్పై పరుగుల మార్కు అందుకున్నారు. ఫలితంగా.. బుధవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి 77.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా కంటే.. 31 పరుగులు వెనుకబడి ఉంది. ప్రొటిస్ స్పిన్నర్ డేన్ పీడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ డేన్ పీటర్సన్ 3 వికెట్లు కూల్చాడు. మరో పేసర్ మొరేకికి ఒక వికెట్ దక్కింది. కాగా తొలి టెస్టులో ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర(240) వ్యక్తిగత స్కోరు కంటే కూడా ఈసారి కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు తక్కువ కావడం గమనార్హం. ఇక మొదటి టెస్టులో రచిన్ డబుల్ సెంచరీ, విలియమ్సన్ వరుస సెంచరీల కారణంగా 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది న్యూజిలాండ్. అనుభలేమి సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్తో బిజీగా ఉన్న కారణంగా కీలకమైన కివీస్ పర్యటనకు అనుభవలేమి జట్టును పంపి విమర్శుల మూటగట్టుకుంది సౌతాఫ్రికా. న్యూజిలాండ్తో మౌంట్ మాంగనుయ్లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఆరుగురు ప్రొటిస్ ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. చదవండి: అరంగేట్ర జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి! -
ఈసారి బంతితో మ్యాజిక్ చేసిన రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ఫార్మాట్లకతీతంగా ఇరగదీస్తున్నాడు. వన్డే వరల్డ్కప్ 2023లో సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన రచిన్.. తాజాగా టెస్ట్ ఫార్మాట్లోనూ సత్తా చాటుతున్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో బ్యాట్తో (డబుల్ సెంచరీ) చెలరేగిన రచిన్.. ఇవాళ (ఫిబ్రవరి 13) మొదలైన రెండో టెస్ట్లో బంతితో మ్యాజిక్ చేశాడు. రచిన్ 3 వికెట్లతో రాణించడంతో పర్యాటక సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రచిన్తో పాటు మ్యాట్ హెన్రీ (1/48), విలియమ్ రూర్కీ (1/47), నీల్ వాగ్నర్ (1/28) వికెట్లు తీశారు. 150 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాను రుయాన్ డి స్వార్డ్ట్ (55), షాన్ వాన్ బెర్గ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజ్లోనే ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో నీల్ బ్రాండ్ 25, క్లైడ్ ఫోర్టిన్ 0, రేనార్డ్ వార్ టోండర్ 32, జుబేర్ హంజా 20, డేవిడ్ బెడింగ్హమ్ 39, కీగన్ పీటర్సన్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ సిరీస్లోని జరిగిన తొలి మ్యాచ్లో కివీస్ 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. కేన్ విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్ట్లో రచిన్ బంతితోనూ (2 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును పంపించి చేతులుకాల్చుకుంది. -
‘అరంగేట్ర’ జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!
New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024తో బిజీ కావడంతో నీల్ బ్రాండ్ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్ బ్రాండ్ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం. రచిన్ డబుల్ సెంచరీ ఈ క్రమంలో మౌంట్ మౌంగనుయ్ వేదికగా కివీస్తో ఆదివారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ విలియమ్సన్(118) సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ(240)తో చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్ బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్ (3/34), జేమీసన్ (2/35), రచిన్ రవీంద్ర (2/16) రాణించారు. విలియమ్సన్ వరుస శతకాలతో ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109; 12 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్ క్రికెటర్గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా చిత్తు ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టార్గెట్ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్ ఆటగాళ్లు: 1.ఎడ్వర్డ్ మూరే(ఓపెనర్) 2.నీల్ బ్రాండ్(ఓపెనర్, కెప్టెన్) 3.వాన్ టాండర్(వన్డౌన్ బ్యాటర్) 4.రువాన్ డి స్వార్డ్(బౌలింగ్ ఆల్రౌండర్) 5.క్లైడ్ ఫార్చూన్(వికెట్ కీపర్ బ్యాటర్) 6. షోపో మొరేకి(పేస్ బౌలర్). చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో
మౌంట్ మాంగనుయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్తో డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా రవీంద్ర తన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చాడు. ప్రస్తుతం రవీంద్ర 222 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 437 పరుగలు చేసింది. క్రీజులో రవీంద్రతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అదే విధంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేన్ మామ(118) పరుగులు చేశాడు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ రచిన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. What an incredible moment! After over 8 hours at the wicket, Rachin Ravindra has passed 200 runs - a historic double hundred 🔥👏@BLACKCAPS v South Africa: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/00Xlbjoirl — TVNZ+ (@TVNZ) February 5, 2024 -
సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రచిన్ రీఎంట్రీ..?
సౌతాఫ్రికా స్వదేశంలో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ సిరీస్లో టిమ్ సౌథీ న్యూజిలాండ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ విల్ ఓ రూర్కీకు తొలి సారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్ర ఈ సిరీస్తో టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రచిన్ వన్డేల్లోలా ఓపెనర్గా కాకుండా మిడిలార్డర్లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ప్లేయర్ హెన్రీ నికోల్స్కు అవకాశం లభించలేదు కాదు కాబట్టి రచిన్కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. 2021 భారత పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేసిన రచిన్.. ఆ పర్యటనలో రెండు టెస్ట్లు, ఆతర్వాత 2022లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్లో మాత్రమే ఆడాడు. ఆతర్వాత రచిన్కు టెస్ట్ జట్టులో అవకాశం దొరకలేదు. తిరిగి ఇన్నాళ్లకు రచిన్కు టెస్ట్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. వన్డే వరల్డ్కప్ 2023 అద్భుత ప్రదర్శనకు గానూ రచిన్ గతేడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ మౌంట్ మాంగనూయ్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు.. రెండో మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 తేదీల మధ్యలో జరుగుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ (రెండో టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్ -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్లు ఆడి 155.95 స్ట్రయిక్రేట్తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్కప్లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్కప్నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్గరవ, అర్ష్దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
న్యూజిలాండ్ తరఫున సెంచరీ బాదిన విజయవాడ కుర్రాడు
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్కప్లో తెలుగు కుర్రాడు స్నేహిత్ రెడ్డి సెంచరీ బాదాడు. నేపాల్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. పేరు, విజయవాడను చూసి స్నేహిత్ భారత్ తరఫున సెంచరీ బాదాడని అనుకుంటే పొరబడినట్టే. స్నేహిత్ సెంచరీ చేసింది న్యూజిలాండ్ తరఫున. 17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. స్నేహిత్లా న్యూజిలాండ్కు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. భారత్ వేదికగా ఇటీవల జరిగిన వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసిన రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది కూడా ఇండియానే. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో స్నేహిత్తో పాటు భారతీయ మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒలివర్ తెవాతియా న్యూఢిల్లీలో పుట్టి, ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్నేహిత్ విషయానికొస్తే.. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లారు. స్నేహిత్ విద్యాభ్యాసం, క్రికెట్ సాధన అంతా న్యూజిలాండ్లో జరిగింది. కుడి చేతి బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన స్నేహిత్ న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లు బీజే వాట్లింగ్, క్రెయిగ్ కుగ్గెలిన్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. అండర్ 15, అండర్ 17 టోర్నీల్లో పరుగుల వరద పారించిన స్నేహిత్ పేరు ప్రస్తుతం న్యూజిలాండ్లో సెన్సేషన్గా మారింది. స్నేహిత్ ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్లను అమితంగా ఇష్టపడతాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అండర్ 19 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ నేపాల్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. స్నేహిత్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్నేహిత్తో పాటు కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (75) రాణించాడు. భారత్లో పుట్టిన మరో కివీస్ క్రికెటర్ తెవాతియా డకౌటయ్యాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. 6 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. -
గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు
He’s a super talent: టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ప్రశంసలు కురిపించాడు. మెన్స్ క్రికెట్లో అతడు దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడని అంచనా వేశాడు. ఈ ఏడాది గిల్ అత్యుత్తమంగా రాణించాడంటూ అతడిని ‘‘సూపర్ టాలెంట్’’గా అభివర్ణించాడు. అత్యధిక పరుగుల వీరుడు కాగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2023లో మొత్తంగా 29 వన్డేలు ఆడిన 24 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. సగటు 63.36తో 1584 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో గిల్.. 149 బంతుల్లోనే 208 పరుగులు రాబట్టి సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. అంతేకాదు.. టీ20, టెస్టు ఫార్మాట్లోనూ ఒక్కో శతకం బాది సత్తా చాటాడు. అద్భుత నైపుణ్యాలు... తనకు తానే సాటి ఈ నేపథ్యంలో రాబోయే తరం క్రికెట్ సూపర్స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ నాసిర్ హుసేన్.. శుబ్మన్ గిల్ పేరును ప్రస్తావించాడు. ‘‘మెన్స్ క్రికెట్ నెక్ట్స్ సూపర్స్టార్ ఎవరంటే నేను శుబ్మన్ గిల్ పేరు చెబుతాను. 2023లో అతడు అత్యుత్తమంగా ఆడాడు. మరో ఎండ్ నుంచి తనకు సహకారం అందించే రోహిత్ శర్మ వంటి సీనియర్ల నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. గిల్ అద్భుత నైపుణ్యాలు కలిగిన ఆటగాడు. టీమిండియా తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన ప్రదర్శనలు ఇవ్వగలడు. 2024లోనూ అతడి ఫామ్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని నాసిర్ హుసేన్ శుబ్మన్ గిల్ను కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్స్టా వేదికగా పంచుకుంది. రచిన్ రవీంద్ర జోరు కొనసాగాలి ఇక ఈ ఏడాది గిల్తో పాటు న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తనను బాగా ఆకట్టుకున్నాడని నాసిర్ హుసేన్ తెలిపాడు. అతడి జోరు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. కాగా రచిన్ రవీంద్ర వన్డే వరల్డ్కప్-2023లో ఏకంగా మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే. పది ఇన్నింగ్స్లో కలిపి 578 పరుగులు రాబట్టాడు రచిన్. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరిని ఎంపిక చేయకుండా పెద్ద తప్పు చేశారు: భజ్జీ View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2024: ధోని అభిమానులకు శుభవార్త! కీలక అప్డేట్
CSK CEO Kasi Viswanathan On MS Dhoni IPL future: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఐపీఎల్ సీజన్ ఆడతాడా? గతేడాది నుంచి తలైవా అభిమానులను వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్కు ఐదోసారి ట్రోఫీ అందించాడు ధోని. నిజానికి.. ఐపీఎల్-2022లోనే తన వారసుడిగా టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ప్రకటించి.. పగ్గాలు అప్పగిస్తే ఫలితం శూన్యం కావడంతో మళ్లీ తనే సారథిగా బాధ్యతలు చేపట్టాడీ ఈ ‘జార్ఖండ్ డైనమైట్’. తనదైన మార్కుతో ఈ ఏడాది మరోసారి సీఎస్కేను చాంపియన్గా నిలిపాడు. వేధిస్తున్న మోకాలి నొప్పి మరి ఐపీఎల్-2024లోనూ ధోని ఇదే దూకుడును కొనసాగించగలడా? మోకాలి నొప్పి నుంచి కోలుకుని జట్టును మరోసారి ముందుండి నడిపిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో జరిగిన జూనియర్ సూపర్ కింగ్స్ ఈవెంట్ లాంచ్ సందర్భంగా ధోని ఐపీఎల్ భవితవ్యంపై ప్రశ్న ఎదురుకాగా.. ‘‘నాకు ఆ విషయం గురించి తెలియదు. కెప్టెన్గా ఆయన తనంతట తానే ఈ విషయాన్ని నేరుగా అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాడు. పది రోజుల్లో నెట్స్లో ప్రాక్టీస్ తను ఆడతాడా లేదా అన్న విషయం గురించి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. తను ఏం అనుకుంటే అదే చేస్తాడు. ప్రస్తుతం ధోని ఫిట్గానే ఉన్నాడు. రిహాబిలిటేషన్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. జిమ్లో వర్కౌట్లు చేస్తున్నాడు. ఇంకో పది రోజుల్లో ధోని నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది’’ అని కాశీ విశ్వనాథ్.. తలైవా అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాగా ఐపీఎల్-2024 వేలం సందర్భంగా సీఎస్కే కొత్తగా ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024 వేలంలో సీఎస్కే కొన్న ఆటగాళ్లు వీరే 1. రచిన్ రవీంద్ర (రూ.1.8 కోట్లు) 2. శార్దూల్ ఠాకూర్ (రూ.4 కోట్లు) 3. డారిల్ మిచెల్ (రూ.14 కోట్లు) 4. సమీర్ రిజ్వీ (రూ.8.4 కోట్లు) 5. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ.2 కోట్లు) 6. అవనీష్ రావు అరవెల్లి (రూ.20 లక్షలు). రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్పాండే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, మిచెల్ శాంట్నర్, మతీషా పతిరణా, సుబ్రాన్షు సేనాపతి. రిలీజ్ చేసిన ప్లేయర్లు డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, ఎన్. జగదీశన్, సి.హరి నిశాంత్, కె.భగత్ వర్మ, కె.ఎం.ఆసిఫ్, అంబటి రాయుడు(రిటైర్డ్), రాబిన్ ఊతప్ప (రిటైర్డ్). చదవండి: IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్! -
IPL 2024 Auction: సీఎస్కేపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం
చెన్నై సూపర్ కింగ్స్పై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం భారీగా ఉన్నట్లు ఇవాళ జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కోచ్ అయిన ఫ్లెమింగ్ సీఎస్కే కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుపై తన మార్కు ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పటికే డెవాన్ కాన్వే (కోటి), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు) లాంటి కివీస్ ఆటగాళ్లను పంచన చేర్చుకున్న ఫ్లెమింగ్.. ఇవాళ జరిగిన వేలంలో మరో ఇద్దరు కివీస్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుని సీఎస్కేపై బ్లాక్ క్యాప్స్ మార్కు స్పష్టంగా కనిపించేలా చేశాడు. ఇవాళ జరిగిన వేలంలో సీఎస్కే మేనేజ్మెంట్ డారిల్ మిచెల్ను 14 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. వన్డే వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరితో పాటు సీఎస్కే ఇవాల్టి వేలంలో మరో భారీ కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం శార్దూల్ ఠాకూర్ను 4 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ఐపీఎల్ 2024 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (14 కోట్లు), రచిన రవీంద్ర (1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు) -
పంజాబ్ కింగ్స్లోకి వరల్డ్కప్ హీరో.. టీమిండియా మాజీ ఓపెనర్ జోస్యం
ఐపీఎల్-2024 సీజన్కు సంబంధించిన మినీ వేలం దుబాయ్ వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడేందుకు మొత్తం 10 ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది కేవలం 77 మంది మాత్రమే. ఇక వన్డే వరల్డ్కప్లో దుమ్మురేపిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రపై కాసుల వర్షం కురిపించే అవకాశముంది. ఈ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అభినవ్ ముకుంద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. వేలంలో రవీంద్రను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుందని ముకుంద్ జోస్యం చెప్పాడు. జియో సినిమాతో ముకుంద్ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ స్ధాయిలో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్ల కోసం పంజాబ్ కింగ్ భారీగా ఖర్చుచేస్తుంది. ఈ సారి కొత్త కూడా ఆటగాళ్ల కోసం పంజాబ్ భారీ మొత్తం వెచ్చించే ఛాన్స్ ఉంది. ప్రపంచకప్లో అదరగొట్టన కివీ స్టార్ రచిన్ రవీంద్రను దక్కించుకోనేకుందు పంజాబ్ ప్రయత్నం చేస్తుంది. టీ20ల్లో గణాంకాలు పెద్దగా బాగోలేకపోయినప్పటికి.. భారత్ పిచ్లపై ఏమి చేశాడో మనమందరం చూశం. టోర్నీలో 3 సెంచరీలతో ఏకంగా 578 పరుగులు చేశాడు. అదే విధంగా వచ్చే ఐపీఎల్ సీజన్ ప్లేఆఫ్స్కు బెయిర్ స్టో కూడా అందుబాటులో ఉండడు. ఈ నేపథ్యంలో పంజాబ్ రవీంద్ర కోసం కచ్చితంగా ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు. వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న రవీంద్రకు టీ20ల్లో మాత్రం పెద్దగా రికార్డులు లేవు. 18 మ్యాచ్లు ఆడిన రవీంద్ర కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
ఐపీఎల్ వేలం కాసేపట్లో.. అందలం ఎక్కేదెవరు?
విశ్వవ్యాప్త క్రికెట్ అభిమానాన్ని యేటికేడు పెంచుకుంటున్న ఐపీఎల్లో ఆటకు ముందు వేలం పాట జరగబోతోంది. దుబాయ్లో నేడు నిర్వహించే మినీ వేలానికి 333 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది 77 మంది కాగా... ఇటీవల ప్రపంచకప్తో పాటు పరిమిత ఓవర్ల ఆటలో మెరిపిస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్రపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలన్నీ సై అంటున్నాయి. దుబాయ్: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్కు నేడు దుబాయ్లో ఆటగాళ్ల మినీ వేలం పాట నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ విదేశీ గడ్డపై జరగనుంది. ఒక రోజు ముందు సోమవారం ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాక్ వేలం కూడా నిర్వహించారు. ఇక కోట్ల పందేరం, ఆటగాళ్లకు అందలం పలికేందుకు ఒకటోసారి, రెండోసారి అని సుత్తి బద్దలు కొట్టే ప్రక్రియే తరువాయి. 1,166 మంది నమోదు చేసుకుంటే... ఈ మినీ వేలం కోసం ఐసీసీ సభ్య, అనుబంధ దేశాలు, దేశవాళ్లీ ఆటగాళ్లు ఆసక్తి చూపారు. ఏకంగా 1,166 మంది ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకుంటే... ఫ్రాంచైజీ జట్లతో సంప్రదింపుల అనంతరం లీగ్ పాలకమండలి 333 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే 10 ఫ్రాంచైజీలకు కావాల్సింది మాత్రం 77 మంది ఆటగాళ్లు. ఇందులో 30 ఖాళీలను విదేశీ ఆటగాళ్లతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంది. అత్యధికంగా 12 ఖాళీలు కోల్కతా నైట్రైడర్స్లో ఉన్నాయి. నలుగురు విదేశీ ఆటగాళ్లు సహా 12 మందిని కొనేందుకు కోల్కతా వద్ద రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. హాట్ కేక్... రచిన్? భారత్లో ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో డాషింగ్ బ్యాటర్గా రచిన్ రవీంద్ర అందరికంటా పడ్డాడు. ఆరంభంలో ఎదురుదాడికి దిగి న్యూజిలాండ్ విజయాలకు గట్టి పునాది వేసిన రచిన్ ఈ మినీ వేలంలో హాట్కేక్ కానున్నాడు. రూ.50 లక్షల కనీస ధరతో ఫ్రాంచైజీల్ని ఆకర్షిస్తున్నాడు. ఆసీస్ స్పీడ్స్టర్స్ స్టార్క్, కమిన్స్, బ్యాటర్ ట్రావి హెడ్, దక్షిణాఫ్రికా సంచలనం కొయెట్జీ, హసరంగ (శ్రీలంక) తదితర స్టార్ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఎగబడే అవకాశాలు న్నాయి. భారత్ నుంచి శార్దుల్ ఠాకూర్, హర్షల్ పటేల్, అన్క్యాప్డ్ ఆల్రౌండర్ల సెట్ నుంచి షారుఖ్ ఖాన్లపై రూ.కోట్లు కురిసే అవకాశముంది. వేలం కోసం ప్లేయర్ల ప్రత్యేకతను బట్టి 19 సెట్లుగా విభజించారు. అంటే బ్యాటర్, ఆల్రౌండర్, పేసర్, స్పిన్నర్, వికెట్ కీపర్, క్యాప్డ్, అన్క్యాప్డ్ ఇలా సెట్ల వారీగా వేలం ప్రక్రియ జరుగుతుంది. -
IPL 2024 Auction: ఫ్రాంఛైజీల కళ్లన్నీ అతడిపైనే! హాట్కేకుల్లా ఆ ఇద్దరు!
IPL 2024 Auction: ఐపీఎల్–2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 19న దుబాయ్లో వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో సోమవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీల కళ్లన్నీ అతడిపైనే ఇక వన్డే వరల్డ్కప్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్పై ఫ్రాంచైజీలన్నీ కన్నేశాయి. కమిన్స్, మిచెల్ స్టార్క్లు కూడా ఆసీస్ తరఫున హాట్ కేక్లు కానున్నారు. ప్రపంచకప్లో సెమీఫైనలిస్టుగా నిలిచిన న్యూజిలాండ్ తరఫున మెరిసిన రచిన్ రవీంద్రపై కూడా కోట్లు కురిసే అవకాశాలున్నాయి. 77 స్థానాలు.. కేకేఆర్కు అత్యధికంగా అదే విధంగా.. ఫ్రాంచైజీల విషయానికొస్తే మొత్తం 10 జట్లకు కావాల్సింది 77 మంది ఆటగాళ్లయితే ఇందులో 30 విదేశీ బెర్తులున్నాయి. ఇందుకోసం రూ. 262.95 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఖాళీల పరంగా చూస్తే అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ 12 మందిని కొనుక్కోవాల్సి ఉండగా... ఆ జట్టు చేతిలో రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. టైటాన్స్ వద్ద రూ.38.15 కోట్లు ఇక అత్యధిక మొత్తం రూ.38.15 కోట్లు గుజరాత్ వద్ద ఉంటే వారికి 8 మంది ఆటగాళ్లు కావాలి. కనిష్ట మొత్తం రూ. 13.15 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉండగా... వారు ఆరు బెర్తుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే! మరోవైపు.. ధోని టీమ్ చెన్నై ఖాతాలో రూ. 31.40 కోట్లు, కోహ్లి జట్టు బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు అందుబాటులో ఉండగా ఇరుజట్లకు ఆరుగురు చొప్పున ఖాళీలున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అభిషేక్ మురుగన్, రాహుల్ బుద్ధి, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, అరవెల్లి అవినాశ్రావు, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి... ఆంధ్ర నుంచి కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్, హనుమ విహారి, పృథ్వీరాజ్ వేలంలో ఉన్నారు. జట్టు- ఖాళీల సంఖ్య - మిగిలిన మొత్తం ►చెన్నై- 6- రూ. 31.4 కోట్లు ►ఢిల్లీ- 9 - రూ. 28.95 కోట్లు ►గుజరాత్- 8- రూ. 38.15 కోట్లు ►కోల్కతా - 12- రూ. 32.7 కోట్లు ►లక్నో- 6 - రూ. 13.15 కోట్లు ►ముంబై - 8 - రూ. 17.75 కోట్లు ►పంజాబ్- 8- రూ. 29.1 కోట్లు ►బెంగళూరు- 6 - రూ. 23.25 కోట్లు ►రాజస్తాన్ - 8- రూ. 14.5 కోట్లు ►హైదరాబాద్- 6- రూ. 34 కోట్లు ►మొత్తం- 77- రూ. 262.95 కోట్లు -
IPL Auction: 'అతడి కోసం ఎస్ఆర్హెచ్ రికార్డులు బ్రేక్ చేస్తోంది'
ఐపీఎల్-2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఈ క్యాష్రిచ్ లీగ్ వేలం జరగనుంది. వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడంతో.. ఈసారి వేలం మరింత రసవత్తరంగా జరగనుంది. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ వంటి వరల్డ్కప్ హీరోలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో వేలంలో అనుసరల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు కసరత్తలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశించి భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో రచిన్ రవీంద్ర కోసం సన్రైజర్స్ హైదరాబాద్ భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్దంగా ఉందని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా వన్డే ప్రపంచకప్లో రచిన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో రవీంద్ర 578 పరుగులు చేసి న్యూజిలాండ్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ పరంగా ఈ యువ ఆల్రౌండర్ పర్వాలేదన్పించాడు. "ప్రస్తుతం సన్రైజర్స్ జట్టులో వికెట్లు తీయగల సత్తా ఉన్న సరైన స్పిన్నర్ లేడు. గత సీజన్లో ఆదిల్ రషీద్ జట్టులో ఉండేవాడు. కానీ ఈసారి అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. దీంతో జట్టులో ఇప్పుడు మయాంక్ మార్కండే ఒక్కడే రెగ్యూలర్ స్పిన్నర్ ఉన్నాడు. కానీ అతడి కంటే మెరుగ్గా బౌలింగ్ చేయగలిగే బౌలర్ అవసరం. వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్ వంటి ఆల్రౌండర్ల ఉన్నప్పటికీ రచిన్ను తీసుకుంటే ఆ విభాగం మరింత బలోపేతం అవుతుంది. వరల్డ్కప్లో రచిన్ ఓపెనర్గా కూడా అద్భుతంగా రాణించాడు. గత రెండు మూడు సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్కు ఓపెనింగ్ సమస్య కూడా ఉంది. కాబట్టి ఈసారి వేలంలో రచిన్ రవీంద్ర కోసం ఎస్ఆర్హెచ్ తీవ్రంగా పోటీ పడుతుంది" అని స్టార్స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ పర్స్లో రూ. 34 కోట్లు మిగిలి ఉన్నాయి. చదవండి: T20 WC 2024: టీ20 వరల్డ్కప్కు కోహ్లి దూరం.. విధ్వంసకర ఆటగాడికి ఛాన్స్!? -
వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్రకు షాక్
వన్డే వరల్డ్కప్ 2023లో నాలుగో లీడింగ్ రన్ స్కోరర్గా (10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 578 పరుగులు) నిలిచిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో ఇవాల్టి నుంచి (నవంబర్ 28) ప్రారంభమైన తొలి టెస్ట్లో రచిన్కు న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కలేదు. రచిన్ భీకర ఫామ్లో ఉన్నప్పటికీ న్యూజిలాండ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కకు పెట్టడం విశేషం. బ్యాటర్గానే కాకుండా బౌలింగ్లోనూ (స్పిన్నర్గా) రాణించే సత్తా ఉన్న రచిన్ను న్యూజిలాండ్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియలేదు. న్యూజిలాండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్లో ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అజాజ్ పటేల్, ఐష్ సోధి, పార్ట్ టైమ్ స్పిన్నర్గా గ్లెన్ ఫిలిప్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టిమ్ సౌథీ నేతృత్వంలో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్సన్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), గ్లెన్ ఫిలిప్స్, కైల్ జేమీసన్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టును నజ్ముల్ హసన్ షాంటో ముందుండి నడిపిస్తున్నాడు. మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాహదత్ హుస్సేన్, నూరుల్ హసన్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, షోరీఫుల్ ఇస్లాం సభ్యులుగా ఉన్నారు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. కాగా, ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. జకీర్ హసన్ (12), షాంటో (37) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (42), మోమినుల్ హక్ (3) క్రీజ్లో ఉన్నారు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్కు తలో వికెట్ దక్కింది. -
IPL 2024 Auction: ఆ ఇద్దరి కోసం క్యూ కట్టనున్న ఫ్రాంచైజీలు
ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ 2024 వేలంలో వరల్డ్కప్-2023 హీరోలకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది కాదనలేని సత్యం. దుబాయ్ వేదికగా జరిగే ఈ మెగా ఆక్షన్లో న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారత్ వేదికగా కొద్ది రోజుల క్రితం జరిగిన వరల్డ్కప్లో రచిన్ బ్యాట్తో చెలరేగిపోయిన విషయం తెలిసిందే. భారత్ మూలాలున్న రచిన్ తన పెద్దల సొంతగడ్డపై పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీలో రచిన్ 10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీల సాయంతో 578 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో విరాట్, రోహిత్, డికాక్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ట్రవిస్ హెడ్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ బ్యాటర్ ప్రపంచకప్లోకి లేట్గా ఎంట్రీ ఇచ్చినా టోర్నీని ఘనంగా ముగించాడు. భారత్తో జరిగిన ఫైనల్లో చిరస్మరణీయ శతకం (137) సాధించిన హెడ్ తన జట్టును ఆరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఒక్క ప్రదర్శనతో హెడ్ ఐపీఎల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరిపోయాడు. రచిన్, హెడ్ ఇద్దరు బ్యాట్తో పాటు బంతితోనూ మాయ చేయగల సమర్దులు కావడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వీరి కోసం ఎగబడే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు వరల్డ్కప్ బౌలింగ్ హీరోలు దిల్షన్ మధుషంక (శ్రీలంక), గెరాల్డ్ కొయెట్జీ (సౌతాఫ్రికా) కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు. ప్రస్తుతం ఆయా ఫ్రాంచైజీల వద్ద మిగులు బడ్జెట్ ప్రకారం చూస్తే.. రచిన్, మధుషంక కోసం ఆర్సీబీ.. హెడ్ కోసం ఢిల్లీ.. కొయెట్జీ కోసం సీఎస్కే పోటీపడవచ్చని తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్ల జాబితా చూసినా వారికి ఈ రోల్స్లో ఆటగాళ్ల అవసరం ఉంది. మిగులు బడ్జెట్ గుజరాత్ వద్ద అధికంగా (38.15 కోట్లు) ఉండగా, ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కోల్కతా నైట్రైడర్స్కు (12 మందిని) ఉంది. పైన పేర్కొన్న ఆటగాళ్ల కోసం పోటీపడే ఫ్రాంచైజీల్లో ఢిల్లీ వద్ద 28.95 కోట్లు, సీఎస్కే వద్ద 31.4 కోట్లు, ఆర్సీబీ వద్ద 23.25 కోట్ల పర్స్ వ్యాల్యూ మిగిలి ఉంది. -
సచిన్ రికార్డు బద్దలు.. సెంచరీ తర్వాత కోహ్లి ఏం చేశాడంటే? వీడియో వైరల్
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లి రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్కప్-2023 సెమీఫైనల్లో న్యూజిలాండ్పై తన 50వ సెంచరీ మార్క్ను అందుకున్న కోహ్లి.. ఈ అరుదైన ఘనతన తన పేరిటి లిఖించుకున్నాడు. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ను వీక్షించేందుకు సచిన్ స్టేడియం వచ్చాడు. ఈ అరుదైన ఘనతను సచిన్ సమక్షంలోనే కోహ్లి సాధించాడు. ఇక విరాట్ సెంచరీ మార్క్ను అందుకోగానే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అంతా కోహ్లికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. విరాట్ మాత్రం ఈ ఘనతను అందుకోగానే.. గాల్లోకి జంప్ చేస్తూ సచిన్ వైపుగా చూస్తూ బొడౌన్ చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఎన్ని ఘనతలు అందుకున్నా నీ తర్వాతే నేను అన్నట్టుగా కోహ్లి రియాక్షన్ ఇచ్చాడు. సచిన్ కూడా నిలుచుని చప్పట్లు కొడుతూ కోహ్లిని అభినందించాడు. అదేవిధంగా గ్యాలరీలో వున్న తన సతీమణి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో ఓవరాల్గా 113 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 9 ఫోర్లు, 2 సిక్స్లతో 117 పరుగులు చేశాడు. చదవండి: World Cup 2023: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. వరల్డ్కప్ నాకౌట్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి...
సాక్షి, బెంగళూరు: వన్డే ప్రపంచకప్లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన వాడని తెలిసిందే. రచిన్ కన్నడిగుడు. ఇప్పటికీ అతని మూలాలు బెంగళూరుతో ముడిపడే ఉన్నాయి. అందుకే శ్రీలంకతో మ్యాచ్ ముగియగానే రచిన్ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తన మనవడు పుట్టింది విదేశంలో అయినా స్వదేశీ అలవాట్లు, సంప్రదాయాలు బాగా తెలిసిన పెద్దావిడ (అమ్మమ్మ) తన ఇంటికి రాగానే రచిన్ను సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కివీస్లో స్థిరపడిన రచిన్ తల్లిదండ్రులు దీప, రవి కృష్ణమూర్తి బెంగళూరు వాసులు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన రవి వృత్తిరీత్యా 1990లో కివీస్కు వలస వెళ్లగా... 1999లో వెల్లింగ్టన్లో రచిన్ జన్మించాడు. రవి కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఇష్టం. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్లంటే అభిమానం. అందువల్లే తన కుమారుడికి వారిద్దరి పేర్లు కలిపి పెట్టారు. తనకిష్టమైన క్రికెట్లో బ్యాటర్ను చేశాడు. రచిన్కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు దుబాయ్: రచిన్ రవీంద్ర ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత వరల్డ్కప్లో రచిన్ అత్యధిక పరుగులు (565) చేసిన రెండో బ్యాటర్గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్లాడిన ఈ కివీస్ ఓపెనర్ 3 శతకాలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్ సెమీస్ చేరడంలో కీలక భూమిక పోషించాడు. ఈ నిలకడైన ప్రదర్శనే అతనికి ఐసీసీ అవార్డుకు ఎంపిక చేసింది. రేసులో ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ (591), భారత సీమర్ బుమ్రా (15 వికెట్లు) ఉన్నప్పటికీ అవార్డు మాత్రం రచిన్నే వరించింది. 2021 జనవరి నుంచి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులు ఇస్తోంది. రచిన్కంటే ముందు న్యూజిలాండ్ నుంచి డెవాన్ కాన్వే (2021–జూన్), ఎజాజ్ పటేల్ (2021–డిసెంబర్) ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులు గెల్చుకున్నారు. -
ఆర్సీబీలోకి రచిన్ రవీంద్ర.. హింట్ ఇచ్చిన యువ సంచలనం!
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరంగేట్ర వరల్డ్కప్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ రికార్డులకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డే వరల్డ్కప్-2023లో మూడు సెంచరీలతో చెలరేగిన రవీంద్ర.. ప్రస్తుతం టోర్నీ టాప్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన రచిన్.. 565 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లోనూ రవీంద్ర అదరగొట్టాడు. తొలుత బౌలింగ్లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర.. అనంతరం బ్యాటింగ్లో 42 పరుగులు చేశాడు. కాగా రవీంద్ర భారత సంతతికి చెందిన క్రికెటర్ అనే విషయం తెలిసిందే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు. రవీంద్ర కూడా అక్కడే పుట్టాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్తో రవీంద్ర న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆర్సీబీలోకి రవీంద్ర..! కాగా వరల్డ్కప్లో అదరగొడుతున్న రవీంద్ర ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలని భావిస్తున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్తో అనంతరం రవీంద్ర మాట్లాడుతూ.. "బెంగళూరు, చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రెండు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాయి. భవిష్యత్తులో నేను ఇక్కడ మరింత క్రికెట్ ఆడతానని ఆశిస్తున్నాను’’ అని నవ్వుతూ అన్నాడు. కాగా ఇప్పటికే చాలా మంది యువ సంచలనాలకు అవకాశమిచ్చిన ఆర్సీబీ .. రచిన్ను కూడా తన అక్కున చేర్చుకుంటుందో లేదో చూడాలి మరి. కాగా ఐపీఎల్-2024 సీజన్కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు.. అలా కాకుండా: బాబర్ ఆజం -
CWC 2023: డికాక్, బుమ్రాలను కాదని రచిన్కే దక్కింది..!
2023 అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), జస్ప్రీత్ బుమ్రా (భారత్) పోటీపడినప్పటికీ చివరికి రచిన్నే వరించింది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను రచిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్లో భీకర ఫామ్లో ఉన్న రచిన్ బ్యాట్తో పాటు బంతిలోనూ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అలాగే 7 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన రచిన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ వరల్డ్కప్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ (565).. సచిన్ రికార్డును (523) తుడిచిపెట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్లో రచిన్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొత్తానికి ఈ వరల్డ్కప్ రచిన్కు కలగా మిగిలిపోనుంది. కాగా, శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప కివీస్ సెమీస్ చేరుకుండా ఉండదు. ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. -
కివీస్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్రకు వింత అనుభవం
భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ రైజింగ్ క్రికెట్ స్టార్ రచిన్ రవీంద్రకు వింత అనుభవం ఎదురైంది. శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన అనంతరం బెంగళూరులోని తన తాతయ్య ఇంటికి వెళ్లిన రచిన్కు అతని బామ్మ దిష్టి తీసి వింత అనుభూతిని కలిగించింది. 25 ఏళ్ల రచిన్ భారత సంతతికి చెందినవాడే అయినప్పటికీ న్యూజిలాండ్లోనే పుట్టి పెరిగడంతో ఈ తంతు మొత్తం కొత్తగా అనిపించింది. ఇది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను బట్టి చూస్తే రచిన్ గ్రాండ్ పేరెంట్స్ సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తుంది. Every ajji I have ever known ❤️ Brings back memories 🥰😢 https://t.co/BA217vC1rd — Smita Prakash (@smitaprakash) November 10, 2023 కాగా, వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా నిన్న బెంగళూరులోనే జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్.. శ్రీలంకను ఓడించి సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో రచిన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రస్తుత వరల్డ్కప్లో భీకర ఫామ్లో ఉన్న రచిన్.. తన మొట్టమొదటి వరల్డ్కప్ ఎడిషన్లోనే పలు రికార్డులు బద్దలు కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో రచిన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉన్న ఓ వరల్డ్కప్ రికార్డును అధిగమించాడు. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ (565).. సచిన్ రికార్డును (523) బద్దలు కొట్టాడు. ప్రస్తుత వరల్డ్కప్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన రచిన్ 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్లో రచిన్ 7 వికెట్లు కూడా పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. సచిన్ రికార్డు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో 25 ఏళ్ల వయస్సులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో రవీంద్ర ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో రవీంద్ర 42 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. సచిన్ రికార్డు బద్దలు.. ఈ మెగా టోర్నీలో రవీంద్ర ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో 565 పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరట ఉండేది. 1996 వరల్డ్కప్ ఎడిషన్లో సచిన్ 523 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో సచిన్ 27 ఏళ్ల రికార్డును రచిన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది వరల్డ్కప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రవీంద్రనే ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి. -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో వరల్డ్కప్ హీరోలు
ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో వన్డే వరల్డ్కప్ 2023 హీరోలు పోటీపడుతున్నారు. అక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్గా క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా (భారత్) ప్రకటించబడ్డారు. ఈ ముగ్గురి ఆటగాళ్ల హవా అక్టోబర్ నెలతో పాటు ప్రస్తుత మాసంలోనూ (నవంబర్) కొనసాగుతుంది. ప్రపంచకప్లో ఈ ఆటగాళ్లు ఆయా విభాగాల్లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు. అక్టోబర్ 5న మొదలైన వరల్డ్కప్ 2023లో డికాక్ ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్ల్లో 4 సెంచరీల సాయంతో 550 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. రచిన్ రవీంద్ర సైతం ఎనిమిది మ్యాచ్లు ఆడి 3 సెంచరీల సాయంతో 523 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. Here are the Men's and Women's 'ICC Player of the Month nominees for October 2023. pic.twitter.com/0tK6mbq1s0 — CricTracker (@Cricketracker) November 7, 2023 బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టి, వరల్డ్కప్ అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ అక్టోబర్ నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలతో పాటు మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్ హేలీ మాథ్యూస్, బంగ్లాదేశ్ నహీద అక్తర్, న్యూజిలాండ్ అమేలయా కెర్ ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న పురుషుల వన్డే ప్రపంచకప్లో భారత్, సౌతాఫ్రికా జట్లు ఇదివరకే సెమీస్కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు బెర్త్ల కోసం ఆసీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఘోర పరాజయాలను మూటగట్టుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఎలిమినేషన్కు గురయ్యాయి. నెదర్లాండ్స్ అధికారికంగా ఎలిమినేట్ కానప్పటికీ, సెమీస్ అవకాశాలు దాదాపుగా లేనట్లే. -
పాపం న్యూజిలాండ్.. మరీ ఇంత దురదృష్టమా.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి జట్టుగా..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో దురదృష్టవంతమైన జట్లు ఏవైనా ఉన్నాయంటే, అవి న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లే అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా ఈ రెండు జట్లను దురదృష్టం అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది. మెగా టోర్నీల్లో వీరి బ్యాడ్లక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవేదికపై పోటీపడుతున్నప్పుడు వీరి దురదృష్టం తారాస్థాయిలో ఉంటుంది. నోటి దాకా వచ్చిన విజయాలు, ఆస్వాదించకుండానే చేజారిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఈ రెండు జట్లలో ఓ జట్టైన న్యూజిలాండ్కు ఇలాంటి సందర్భం మరోసారి ఎదురైంది. 2023 వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 400కు పైగా స్కోర్ చేసినప్పటికీ, వరుణుడు అడ్డుపడటంతో ఓటమిపాలైంది. ఈ ఓటమి కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. ఇది ఏకంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ఓటమి. తప్పక గెలిచి తీరుతామనుకున్న మ్యాచ్లో ఓటమితో పాటు ఒక్కసారిగా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కావడంతో న్యూజిలాండ్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ప్రపంచకప్ చరిత్రలో 400కు పైగా స్కోర్ చేసి ఓటమి చవిచూసిన తొలి జట్టు కివీసే కావడం విశేషం. హాట్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ టీమ్ వరుసగా నాలుగు పరాజయాలు మూటగట్టుకుని సెమీస్కు చేరకుండానే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దిశగా సాగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్ సెమీస్కు చేరాలంటే తాము తదుపరి ఆడబోయే మ్యాచ్లో భారీ విజయం సాధించడంతో పాటు సెమీస్ రేసులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రత్యర్ధి శ్రీలంక కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక పేలవ ఫామ్లో ఉండటం కివీస్కు కలిరావచ్చు. ఒకవేళ ఈ జట్టును ఇక్కడ కూడా దురదృష్టం వెంటాడితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మరోవైపు న్యూజిలాండ్తో పాటు సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్ ఇంగ్లండ్ను, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, పాక్తో నిన్న జరిగిన మ్యాచ్లో కివీస్ 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (95), గ్లెన్ ఫిలిప్స్ (41) విరుచుకుపడటంతో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పాక్ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వర్షం పలు మార్లు అడ్డుపడి న్యూజిలాండ్ ఓటమికి పరోక్ష కారణమైంది. 25.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన పాక్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి పాక్ వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. డీఎల్ఎస్ ప్రకారం ఈ స్కోర్ న్యూజిలాండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉండటంతో పాక్ విజేతగా నిలిచింది. ఫకర్ జమాన్ (81 బంతుల్లో 126; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) అజేయమైన మెరుపు శతకంతో పాక్కు జీవం పోశాడు. అతనికి కెప్టెన్ బాబార్ ఆజమ్ (66 నాటౌట్) సహకరించాడు. -
పాకిస్తాన్ బౌలింగ్ను చిత్తు చేసి.. భారీ స్కోరుతో రికార్డులు సృష్టించిన న్యూజిలాండ్
వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్తో మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. పాక్ పేసర్ల బౌలింగ్ను ఓ ఆటాడుకున్న కివీస్ బ్యాటర్లు జట్టుకు రికార్డు స్థాయి స్కోరు అందించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో హసన్ అలీ కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేను 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల కోసం ప్రయత్నించిన పాక్ బౌలింగ్ విభాగానికి.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) రచిన్ 108, కేన్ విలియమ్సన్ 95 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీని ఇఫ్తికార్ అహ్మద్ విడదీసినా అప్పటికే భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. ఇక మిగిలిన వాళ్లలో డారిల్ మిచెల్ 29, మార్క్ చాప్మన్ 39, గ్లెన్ ఫిలిప్స్ 41, మిచెల్ శాంట్నర్ 26 పరుగులు(నాటౌట్) సాధించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 401 పరుగులు స్కోరు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అదే విధంగా.. వరల్డ్కప్ ఈవెంట్లో సౌతాఫ్రికా(3 సార్లు) తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో కలిసి 400+ స్కోరు నమోదు చేసిన నాలుగో జట్టుగా అవతరించింది. అంతేకాదు.. వన్డేల్లో పాకిస్తాన్పై అత్యధిక స్కోరు సాధించిన రెండో జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఇంగ్లండ్ పాక్తో 2016 నాటి మ్యాచ్లో 444/3 స్కోరు నమోదు చేసింది. వీటితో పాటు మరో అరుదైన ఘనతను కూడా న్యూజిలాండ్ జట్టు తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్కప్ చరిత్రలో పాకిస్తాన్ మీద అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
సెంచరీతో చెలరేగిన రచిన్.. సచిన్ రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
ICC ODI WC 2023- Pak Vs NZ: వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్తో మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సెంచరీతో దుమ్ములేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్ల వర్షం కురిపించాడు. పాక్ బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ.. సంపూర్ణ ఆధిపత్యం కనబరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ‘సొంత ప్రేక్షకులకు’ కావాల్సినంత వినోదం పంచుతూ .. ఏకంగా 15 బౌండరీలు బాదాడీ భారత మూలాలున్న కివీస్ క్రికెటర్. ఇక పాక్తో మ్యాచ్లో మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న రచిన్ రవీంద్ర 108 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా తద్వారా భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో మూడో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాతికేళ్ల వయసులోపే వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు బాదిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. కాగా రచిన్ 23 ఏళ్ల 351 రోజుల వయసులో ఈ ఫీట్(3 శతకాలు) సాధించగా.. సచిన్ టెండుల్కర్ 22 ఏళ్ల 313 రోజుల వయసులో ప్రపంచకప్లో రెండు సెంచరీలు చేశాడు. కివీస్ తరఫున తొలి బ్యాటర్గా సచిన్ రికార్డు బ్రేక్ చేయడంతో న్యూజిలాండ్ తరఫున అరుదైన ఘనత కూడా సాధించాడు రచిన్ రవీంద్ర. సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక శతకాలు(3) బాదిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో గ్లెన్ టర్నర్ 1975 వరల్డ్కప్లో రెండు, మార్టిన్ గప్టిల్ 2015లో రెండు, 2019లో కేన్ విలిమయ్సన్ రెండు శతకాలు సాధించారు. కాగా ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్లో రచిన్ రవీంద్ర తొలుత ఇంగ్లండ్.. తర్వాత ఆస్ట్రేలియా.. తాజాగా పాకిస్తాన్పై సెంచరీలు నమోదు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
రచిన్ అరుదైన రికార్డు.. ప్రపంచకప్ చరిత్రలో సచిన్ తర్వాత అతడొక్కడే
‘‘ఇంతకుముందు చాలా సార్లు నన్ను ఈ ప్రశ్న అడిగారు. నేనేతై వందకు వంద శాతం కివీనే. అయితే, భారత సంతతి మూలాలు ఉండటం పట్ల కూడా గర్విస్తున్నా’’ అని న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర అన్నాడు. ఇండియాలో ఆడటం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడి పడటం లేదని పేర్కొన్నాడు. కాగా బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి దంపతుల కుమారుడే రచిన్ రవీంద్ర. తనకు ఇష్టమైన భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కలిసి వచ్చేలా రవి తన కుమారుడికి రచిన్ రవీంద్రగా నామకరణంగా చేశాడు. ఇక న్యూజిలాండ్లో పుట్టిపెరిగిన రచిన్ అనంతపురంలో క్రికెట్ మెళకువలు నేర్చుకున్నాడు. టీమిండియాతో 2012లో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తొలిసారి వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా మెగా టోర్నీ ఆడుతున్న రచిన్ ఆరంభ మ్యాచ్లో ఇంగ్లండ్కు చుక్కలు చూపించాడు. 123 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెండింగ్ చాంపియన్ ఓటమిని శాసించాడు. ఆ తర్వాత కూడా కివీస్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ ఆల్రౌండర్ శనివారం మ్యాచ్లోనూ బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ రచిన్ ఆట అభిమానులను ఆకట్టుకుంది. ఆసీస్తో మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన రచిన్ 89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రచిన్ రవీంద్రకు ఇండియాలో మ్యాచ్ ఆడటం ఒత్తిడి కలిగిస్తోందా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘ఇక్కడ నేను కివీ(న్యూజిలాండ్ పౌరుడు అన్న ఉద్దేశం)గా అడుగుపెట్టాను. అయితే, నా తల్లిదండ్రులు పుట్టిపెరిగిన దేశం ఇది. మా కుటుంబ సభ్యుల్లో చాలా మంది ఇక్కడే ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ఇక ఇండియాలో పిచ్ కండిషన్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయన్న రచిన్.. తన నైపుణ్యాలను రోజురోజుకీ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టానని తెలిపాడు. సచిన్ తర్వాత రచినే కాగా వన్డే వరల్డ్కప్-2023లో ఇప్పటి వరకు 406 పరుగులు సాధించిన రచిన్ రవీంద్ర.. 23 ఏళ్ల వయసులో ప్రపంచకప్ చరిత్రలో 400+ పరుగులు రాబట్టిన రెండో ప్లేయర్గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. -
ధర్మశాలలో ధమాకా
ఆ్రస్టేలియాతో మ్యాచ్లో న్యూజిలాండ్ విజయలక్ష్యం 389... ఇంత భారీ స్కోరు చూడగానే సాధారణంగా ఛేదన చేసే జట్టు మానసికంగా ముందే ఓటమికి సిద్ధమవుతుంది. కానీ న్యూజిలాండ్ తలవంచకుండా చివరి వరకు పోరాడింది... ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో వైపు జోరు తగ్గించలేదు. చివరకు ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన స్థితి వరకు మ్యాచ్ను తీసుకొచ్చింది. ఇక్కడా అవకాశం ఉన్నా... ఆ్రస్టేలియా అద్భుత ఫీల్డింగ్తో కివీస్ను నిలువరించడంలో సఫలమైంది. బౌండరీని దాటగలిగే రెండు బంతులను మెరుపు వేగంతో దూసుకెళ్లి ఆపడంతో పాటు రెండో పరుగు కోసం చేసిన ప్రయత్నాన్ని రనౌట్తో పడగొట్టింది! దాంతో ఆఖరికి 5 పరుగుల తేడాతో గెలిచి ఆ్రస్టేలియా ఊపిరి పీల్చుకుంది. రచిన్, నీషమ్ల పోరాటం చివరకు వృథా అయింది. అంతకు ముందు తన తొలి ప్రపంచకప్ మ్యాచ్లో హెడ్ మెరుపు సెంచరీ, వార్నర్ దూకుడు వెరసి ఆసీస్కు భారీ స్కోరును అందించాయి. వరల్డ్ కప్లో వరుసగా రెండో రోజు అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూసే అవకాశం దక్కగా... ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన 771 పరుగులు ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మొత్తం కావడం విశేషం. ధర్మశాల: మ్యాచ్ మ్యాచ్కూ మరింత పదునెక్కుతున్న ఆ్రస్టేలియా ప్రపంచకప్లో మరో కీలక విజయాన్ని అందుకుంది. ఐదు సార్లు విజేత అయిన ఆసీస్కు ఈ టోర్నీలో ఇది వరుసగా నాలుగో విజయం కాగా, వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు 350 పరుగుల స్కోరు దాటగలిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్స్లు) వన్డేల్లో నాలుగో శతకం సాధించగా, డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 4 సిక్స్లు) వరుసగా మూడో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్కు 115 బంతుల్లోనే 175 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు సాధించింది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్స్లు) టోర్నీ రెండో సెంచరీ సాధించగా... జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్స్లు), డరైల్ మిచెల్ (51 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వరల్డ్ కప్ కోసం ఆసీస్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ట్రవిస్ హెడ్ ఉన్నాడు. అయితే అనూహ్యంగా అతని చేతికి గాయమైంది. అయినా సరే అతని స్థానంలో మరొకరిని తీసుకోకుండా 14 మందితోనే ఆసీస్ జట్టును కొనసాగించింది. తొలి ఐదు మ్యాచ్లకు దూరమైన అతను తనపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చీ రాగానే తన విలువేంటో చూపించాడు. హెడ్, వార్నర్ కలిసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో తొలి 10 ఓవర్లలోనే ఆసీస్ ఏకంగా 118 పరుగులు చేసింది. ఈ క్రమంలో వార్నర్ 28 బంతుల్లో, హెడ్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 19 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోరు 175/0 కాగా, ఈ స్కోరు వద్ద జోడీని విడదీయడంలో కివీస్ సఫలమైంది. అనంతరం 59 బంతుల్లోనే హెడ్ శతకాన్ని అందుకున్నాడు. ఈ దశలో ఆసీస్ మిడిలార్డర్ తడబాటుకు లోనై తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ఇన్గ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఛేదనను కివీస్ దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్లు యంగ్ (28), కాన్వే (28) సరైన ఆరంభాన్ని ఇవ్వగా, రచిన్ ఆ జోరును కొనసాగించాడు. రచిన్, మిచెల్ కలిసి 96 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపించారు. 77 బంతుల్లోనే రచిన్ సెంచరీ పూర్తయింది. 59 బంతుల్లో 96 పరుగులు చేయాల్సిన దశలో రచిన్ వెనుదిరగ్గా... ఆ తర్వాత నీషమ్ బాధ్యతను తీసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతని రనౌట్ జట్టు ఓటమిని ఖాయం చేసింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) అండ్ (బి) ఫిలిప్స్ 81; హెడ్ (బి) ఫిలిప్స్ 109; మార్ష్ (బి) సాన్ట్నర్ 36; స్మిత్ (సి) బౌల్ట్ (బి) ఫిలిప్స్ 18; లబుషేన్ (సి) రవీంద్ర (బి) సాన్ట్నర్ 18; మ్యాక్స్వెల్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 41; ఇన్గ్లిస్ (సి) ఫిలిప్స్ (బి) బౌల్ట్ 38; కమిన్స్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 37; స్టార్క్ (సి) నీషమ్ (బి) హెన్రీ 1; జంపా (బి) బౌల్ట్ 0; హాజల్వుడ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 388. వికెట్ల పతనం: 1–175, 2–200, 3–228, 4–264, 5–274, 6–325, 7–387, 8–388, 9–388, 10–388. బౌలింగ్: హెన్రీ 6.2–0–67–1, బౌల్ట్ 10–0–77–3, ఫెర్గూసన్ 3–0–38–0, సాన్ట్నర్ 10–0–80–2, ఫిలిప్స్ 10–0–37–3, రచిన్ 8–0–56–0, నీషమ్ 2–0–32–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) స్టార్క్ (బి) హాజల్వుడ్ 28; యంగ్ (సి) స్టార్క్ (బి) హాజల్వుడ్ 32; రచిన్ (సి) లబుషేన్ (బి) కమిన్స్ 116; మిచెల్ (సి) స్టార్క్ (బి) జంపా 54; లాథమ్ (సి) హాజల్వుడ్ (బి) జంపా 21; ఫిలిప్స్ (సి)లబుషేన్ (బి) మ్యాక్స్వెల్ 12; నీషమ్ (రనౌట్) 58; సాన్ట్నర్ (సి) మ్యాక్స్వెల్ (బి) జంపా 17; హెన్రీ (సి) హాజల్వుడ్ (బి) కమిన్స్ 9; బౌల్ట్ (నాటౌట్) 10; ఫెర్గూసన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 383. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–168, 4–222, 5–265, 6–293, 7–320, 8–346, 9–383. బౌలింగ్: స్టార్క్ 9–0–89–0, హాజల్వుడ్ 9–0–70–2, కమిన్స్ 10–0–66–2, మ్యాక్స్వెల్ 10–0–62–1, జంపా 10–0–74–3, మార్ష్ 2–0–18–0. -
CWC 2023 AUS VS NZ: విరాట్ కోహ్లిని దాటేసిన రచిన్ రవీంద్ర
ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ భవిష్యత్తు తార రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకం (ఇంగ్లండ్పై 82 బంతుల్లో శతకం) బాదిన రచిన్.. ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో మరో విధ్వంసకర శతకం బాది పరుగుల వరద పారిస్తున్నాడు. ఆసీస్తో మ్యాచ్లో కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టిన రచిన్.. 116 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీ రచిన్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 406 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రచిన్ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ (5 మ్యాచ్ల్లో 354 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. రచిన్ ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో కోహ్లిని వెనక్కునెట్టాడు (ఐదో స్థానానికి). ఈ జాబితాలో క్వింటన్ డికాక్ (6 మ్యాచ్ల్లో 431 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. వార్నర్ (6 మ్యాచ్ల్లో 413) రెండు, మార్క్రమ్ (6 మ్యాచ్ల్లో 356) నాలుగో స్థానంలో నిలిచారు. కాగా, ఈ మ్యాచ్లో ఆసీస్ నిర్ధేశించిన 389 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పోరాడుతుంది. ఈ జట్టు 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి లక్ష్యానికి 75 పరుగుల దూరంలో (42 బంతుల్లో) ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. -
రచిన్ రవీంద్ర మరో విధ్వంసకర శతకం.. ఆసీస్కు ముచ్చెమటలు
ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ భవిష్యత్తు తార రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ శతకం (ఇంగ్లండ్పై 82 బంతుల్లో శతకం) సాధించిన రచిన్.. ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న మ్యాచ్లో మరో విధ్వంసకర శతకం బాదాడు. ఈ మ్యాచ్లో రచిన్ కేవలం 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. రచిన్ శతకాన్ని సిక్సర్ బాది చేరుకోవడం విశేషం. ఆసీస్ నిర్ధేశించిన 389 పరుగుల లక్ష్య ఛేదనలో సహచరులంతా వెనుదిరుగుతున్నా రచిన్ ఒక్కడే ఒంటిపోరాటం చేస్తూ ఆసీస్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. 38 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి లక్ష్యానికి 116 పరుగుల దూరంలో ఉంది. రచిన్తో పాటు నీషమ్ క్రీజ్లో ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డారు. -
కివీస్ గెలుపు జోరు...
ప్రపంచకప్లో మరో ఏకపక్ష విజయం... గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సమష్టి ప్రదర్శన ముందు అసోసియేట్ టీమ్ నెదర్లాండ్స్ నిలవలేకపోయింది... బ్యాటింగ్ పిచ్పై ముందుగా భారీ స్కోరు నమోదు చేసిన న్యూజిలాండ్ విసిరిన సవాల్కు పసికూన నెదర్లాండ్స్ వద్ద జవాబు లేకపోయింది... ఫలితంగా కివీస్ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా... హైదరాబాద్ వేదికగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ డచ్ బృందానికి ఓటమే ఎదురైంది. బ్యాటింగ్లో విల్ యంగ్, లాథమ్, రచిన్ రవీంద్ర, బౌలింగ్లో సాన్ట్నర్ న్యూజిలాండ్ విజయసారథులుగా నిలిచారు. సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ జట్టు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మళ్లీ సత్తా చాటింది. విడిగా చూస్తే విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రతీ ఒక్కరూ రాణించడంతో క్వాలిఫయర్ జట్టు నెదర్లాండ్స్పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (80 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్లు), టామ్ లాథమ్ (46 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (51 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... డరైల్ మిచెల్ (47 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కొలిన్ అకెర్మన్ (73 బంతుల్లో 69; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాన్ట్నర్ (5/59) ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. సమష్టి బ్యాటింగ్తో... ఆశ్చర్యకర రీతిలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లూ ఒక్క పరుగు లేకుండా మెయిడిన్లుగా ముగియడం విశేషం. అయితే ఆ తర్వాత జట్టు ధాటిని పెంచింది. కాన్వే (40 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), యంగ్ చక్కటి బ్యాటింగ్తో తర్వాతి 7 ఓవర్లలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు రాబట్టారు. ఈ జోడీ విడిపోయిన తర్వాత వచ్చిన రచిన్ తన ఫామ్ను కొనసాగించాడు. 59 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, రచిన్కు హాఫ్ సెంచరీ కోసం 50 బంతులే సరిపోయాయి. మరో ఎండ్లో మిచెల్ కూడా జోరు ప్రదర్శించాడు. కానీ ఈ దశలో డచ్ బౌలర్లు ప్రత్యర్థిని కొద్దిసేపు నిలువరించారు. 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. అయితే మరోవైపు లాథమ్ దూకుడు కివీస్ స్కోరును 300 వందలు దాటించింది. సాన్ట్నర్ (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా చెలరేగడంతో చివర్లో భారీ స్కోరు చేయడంలో న్యూజిలాండ్ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో 84 పరుగులు సాధించిన న్యూజిలాండ్ వీటిలో చివరి 3 ఓవర్లలోనే 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50 పరుగులు రాబట్టడం విశేషం. అకెర్మన్ మినహా... భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. పాక్తో మ్యాచ్తో పోలిస్తే జట్టు బ్యాటింగ్ ఈ సారి పేలవంగా కనిపించింది. ఓపెనర్లు విక్రమ్జిత్ (12), డౌడ్ (16) విఫలం కాగా, అకెర్మన్ ఒక్కడే పోరాడగలిగాడు. అకెర్మన్, తేజ నిడమనూరు (26 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మధ్య నమోదైన 50 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్లో పెద్దది. క్రీజ్లో నిలదొక్కుకొని చక్కటి షాట్లతో జోరుపెంచిన దశలో తేజ లేని రెండో పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించాడు. అకెర్మన్తో సమన్వయ లోపంతో అతను రనౌటయ్యాడు. 55 బంతుల్లో అకెర్మన్ అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో స్కాట్ ఎడ్వర్డ్స్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), సైబ్రాండ్ (34 బంతుల్లో 29; 3 ఫోర్లు) కొంత వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) డి లీడ్ (బి) వాండర్ మెర్వ్ 32; యంగ్ (సి) డి లీడ్ (బి) మీకెరెన్ 70; రచిన్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాండర్ మెర్వ్ 51; మిచెల్ (బి) మీకెరెన్ 48; లాథమ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) దత్ 53; ఫిలిప్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 4; చాప్మన్ (సి) వాండర్ మెర్వ్ (బి) దత్ 5; సాన్ట్నర్ (నాటౌట్) 36; హెన్రీ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–67, 2–144, 3–185, 4–238, 5–247, 6–254, 7–293. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–2–62–2, ర్యాన్ క్లీన్ 7–1–41–0, మీకెరెన్ 9–0–59–2, వాండర్ మెర్వ్ 9–0–56–2, అకెర్మన్ 4–0–28–0, డి లీడ్ 10–0–64–1, విక్రమ్జిత్ 1–0–9–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్జిత్ (బి) హెన్రీ 12; డౌడ్ (ఎల్బీ) (బి) సాన్ట్నర్ 16; అకెర్మన్ (సి) హెన్రీ (బి) సాన్ట్నర్ 69; డి లీడ్ (సి) బౌల్ట్ (బి) రచిన్ 18; తేజ (రనౌట్) 21; ఎడ్వర్డ్స్ (సి అండ్ బి) సాన్ట్నర్ 30; సైబ్రాండ్ (సి) కాన్వే (బి) హెన్రీ 29; వాండర్మెర్వ్ (సి) హెన్రీ (బి) సాన్ట్నర్ 1; క్లీన్ (ఎల్బీ) (బి) సాన్ట్నర్ 8; ఆర్యన్ దత్ (బి) హెన్రీ 11; మీకెరెన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 4; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–21, 2–43, 3–67, 4–117, 5–157, 6–174, 7–180, 8–198, 9–218, 10–223. బౌలింగ్: బౌల్ట్ 8–0–34–0, హెన్రీ 8.3–0–40–3, సాన్ట్నర్ 10–0–59–5, ఫెర్గూసన్ 8–0–32–0, రచిన్ రవీంద్ర 10–0–46–1, ఫిలిప్స్ 2–0–11–0. ప్రపంచకప్లో నేడు ఇంగ్లండ్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి పాకిస్తాన్ X శ్రీలంక వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: రచిన్ రవీంద్ర.. మొన్న సెంచరీ.. ఇప్పుడేమో!
ICC Cricket World Cup 2023 - New Zealand vs Netherlands: వన్డే వరల్డ్కప్-2023లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ అర్ధ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. కాగా ఉప్పల్లో సోమవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మూడు హాఫ్ సెంచరీలు ఈ క్రమంలో స్కాట్ ఎడ్వర్డ్ బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే(32), విల్ యంగ్ శుభారంభం అందించారు. గత మ్యాచ్ సెంచరీ హీరో, వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ 48, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో అదరగొట్టారు. సాంట్నర్ మెరపులు అయితే, ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక.. తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్ చేసిన మ్యాట్ హెన్రీ 10 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్కు కష్టమే! నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మెకెరెన్, ఆర్యన్ దత్ రెండేసి వికెట్లు తీయగా.. ఆల్రౌండర్ బాస్ డి లిడేకు ఒక వికెట్ దక్కింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కివీస్ విధించిన 323 పరుగుల లక్ష్యాన్ని డచ్ టీమ్ ఛేదించడం కష్టంగానే కనిపిస్తోంది! ఇదిలా ఉంటే.. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్.. ఉప్పల్లో పాకిస్తాన్తో మ్యాచ్లో 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మరి ఇదే వేదికపై మరోసారి పటిష్ట కివీస్తో తలపడుతున్న డచ్ జట్టు పరిస్థితి ఎలా ఉండబోతుందో!? చదవండి: CWC 2023: ఓవరాక్షన్కు తప్పదు భారీ మూల్యం.. షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇంగ్లండ్కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్తో సంబంధం ఏంటి?
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య వరల్డ్కప్ తొలి మ్యాచ్.. హాట్ ఫేవరేట్గా ఇంగ్లీష్ జట్టు. కివీస్ ముందు 283 పరుగుల భారీ లక్ష్యం.. రెండో ఓవర్లోనే న్యూజిలాండ్ వికెట్ డౌన్. దీంతో కివీస్ పతనం మొదలైందని అనుకున్నారంతా. ఈ సమయంలో తొలిసారి వరల్డ్కప్ ఆడుతున్న 23 ఏళ్ల కుర్రాడు క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లీష్ పేస్ బౌలర్లను ఇతడేం ఆడుతాడు? ఒకట్రెండు ఓవర్లలో ఔటైపోతాడని అంతా భావించారు. కానీ విలియమ్సన్ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ యువ సంచలనం అందరి అంచనాలను తలకిందలూ చేస్తూ విధ్వంసం సృష్టించాడు. అతడే కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర. మొదటి వరల్డ్కప్ మ్యాచ్లోనే సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు. అతడి పేరు ప్రస్తుతం మారుమ్రోగిపోతుంది. తొలి మ్యాచ్లోనే అద్భుత సెంచరీ.. రచిన్ రవీంద్రకు ఇదే తొలి వరల్డ్కప్. ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్లోనే తన అద్భుత ఇన్నింగ్స్తో అందరని అకట్టుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్లు వోక్స్, మార్క్ వుడ్కు రవీంద్ర చుక్కలు చూపించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 96 బంతులు ఎదుర్కొన్న రవీంద్కర 1 ఫోర్లు, 5 సిక్స్లతో 123 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి రెండో వికెట్కు 273 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని రవీంద్ర నెలకొల్పాడు. బౌలింగ్లో కూడా ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ అద్బుత ప్రదర్శనకు గానూ రవీంద్రకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్కే చుక్కలు చూపించిన రవీంద్ర గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఎవరీ రచిన్ రవీంద్ర..? 23 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు. రవీంద్ర కూడా అక్కడే పుట్టాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్తో రవీంద్ర న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా రవీంద్ర న్యూజిలాండ్లో ఉన్నప్పటికీ.. క్రికెట్లో మెళకువలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే నేర్చుకున్నాడు. ప్రతీ ఏడాది అనంతపురంకు వచ్చి రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్లో ట్రైనింగ్ పొందేవాడు. అంతేకాకుండా స్ధానికంగా క్రికెట్ టోర్నీలు కూడా రచిన్ ఆడేవాడు. కాగా అతడి తండ్రికి న్యూజిలాండ్ లో హాట్ హాక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ఉంది. దీంతో కొంతమంది న్యూజిలాండ్ ఆటగాళ్లతో రవీంద్ర అనంతపురంకు వచ్చి క్రికెట్ ఆడేవాడట. ఆ పేరు ఎలా వచ్చిందంటే? రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తికి భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో తన ఆరాధ్య క్రికెటర్ల పేర్లు వచ్చేలా రచిన్ రవీంద్రకు కృష్ణమూర్తి పేరు పెట్టాడు. రాహుల్ ద్రవిడ్ పేరు నుంచి 'రా'.. సచిన్ పేరు నుంచి 'చిన్' తీసుకుని రచిన్అనే పేరు తన కొడుకుకు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు రచిన్ రవీంద్ర 3 టెస్ట్లు, 12 వన్డేలు, 18 టీ20లు న్యూజిలాండ్ తరపున ఆడాడు. కాగా ఇదే అతడికి తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. చదవండి: Asian games 2023: అదరగొట్టిన తిలక్ వర్మ..సెమీఫైనల్లో బంగ్లా చిత్తు! ఫైనల్కు భారత్ -
World Cup 2023, England vs. New Zealand: ప్రపంచకప్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపు (ఫోటోలు)
-
కాన్వేతో కలిసి... గెలుపు ‘రచిన్’చాడు
గత ప్రపంచకప్ ఫైనల్కు ప్రతీకారమా అంటే సరిగ్గా ఈ మ్యాచ్కు ఆ విలువ లేకపోవచ్చు. కానీ ఇంగ్లండ్ను తాము చిత్తు చేసిన తీరు న్యూజిలాండ్కు మాత్రం పూర్తి సంతృప్తినిచ్చి ఉంటుంది. దుర్బేధ్యమైన జట్టు, ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు పేలవ బ్యాటింగ్ ఆపై పసలేని బౌలింగ్తో తమ స్థాయిపై సందేహాలు రేకెత్తించింది. కివీస్ మాత్రం అద్భుత ఆటతో తమపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని పడగొట్టి ఆపై సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచకప్లో తాము ఆడిన తొలి మ్యాచ్ల్లోనే అజేయ మెరుపు సెంచరీలు సాధించి కాన్వే, రచిన్ రవీంద్ర మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు పేరిట గెలుపును లిఖించారు. రాహుల్+సచిన్ పేర్లను తన పేరులో ఉంచుకున్న రచిన్ అటు క్లాస్, ఇటు మాస్ ఆటను కూడా చూపించడం విశేషం. అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్ తొలి పోరు ఏకపక్షంగా ముగిసింది. 2019 ఫైనలిస్ట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ (86 బంతుల్లో 77; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, జోస్ బట్లర్ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం కివీస్ 36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్కు అభేద్యంగా 273 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో రెండో వికెట్కు న్యూజిలాండ్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గప్టిల్ –విల్ యంగ్ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కాన్వే–రచిన్ సవరించారు. కీలక భాగస్వామ్యం... బలమైన లైనప్, చివరి ఆటగాడి వరకు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఇంగ్లండ్ను చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్ రెండో బంతినే బెయిర్స్టో (35 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్గా మలిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ‘సిక్స్’తో స్కోరు మొదలు కావడం ఇదే తొలిసారి. అయితే ప్రత్యరి్థని కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. మలాన్ (14) విఫలం కాగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలో కివీస్ మరో 3 వికెట్లు పడగొట్టింది. రవీంద్ర ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన బ్రూక్ (25) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఈ దశలో రూట్, బట్లర్ ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 72 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని హెన్రీ విడదీశాక ఇంగ్లండ్ వేగంగా వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్లో ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు కనీసం 300 పరుగులకు చేరువగా కూడా రాలేదు. వన్డే చరిత్రలో ఆడిన 11 మందీ కనీసం రెండంకెల స్కోరు చేయడం ఇదే మొదటిసారి కాగా... ప్రతీ ఒక్కరు అంతంతమాత్రంగానే ఆడటంతో ఇంగ్లండ్కు ఫలితం దక్కలేదు. ఆడుతూ పాడుతూ... స్యామ్ కరన్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే యంగ్ (0) అవుట్! దాంతో కివీస్ ఎలా లక్ష్యాన్ని ఛేదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ కాన్వే, రవీంద్ర అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెరీర్లో 13వ వన్డే ఆడుతూ తొలిసారి ఓపెనర్గా బరిలోకి దిగిన రవీంద్ర పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడగా, ఐపీఎల్ అనుభవాన్ని కాన్వే అద్భుతంగా వాడుకున్నాడు. వీరిద్దరు ప్రత్యర్థిపై బౌలర్లందరిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. 10 ఓవర్లలోనే స్కోరు 81 పరుగులకు చేరగా, చెరో 36 బంతుల్లోనే రవీంద్ర, కాన్వే అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిని కట్టడి చేయడంలో ఇంగ్లండ్ విఫలం కావడంతో 20 ఓవర్లకే స్కోరు 150 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఈ జోడి ఎదురులేకుండా దూసుకుపోయింది. ముందుగా కాన్వే 83 బంతుల్లో, ఆ తర్వాత రవీంద్ర 82 బంతుల్లో శతకాలను అందుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోగా... కివీస్ సునాయాసంగా లక్ష్యం చేరింది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో లాథమ్ కెప్టెన్గా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (సి) మిచెల్ (బి) సాన్ట్నర్ 33; మలాన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; రూట్ (బి) ఫిలిప్స్ 77; బ్రూక్ (సి) కాన్వే (బి) రవీంద్ర 25; మొయిన్ అలీ (బి) ఫిలిప్స్ 11; బట్లర్ (సి) లాథమ్ (బి) హెన్రీ 43; లివింగ్స్టోన్ (సి) హెన్రీ (బి) బౌల్ట్ 20; కరన్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; వోక్స్ (సి) యంగ్ (బి) సాన్ట్నర్ 11; ఆదిల్ రషీద్ (నాటౌట్) 15; వుడ్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–40, 2–64, 3–94, 4–118, 5–188, 6–221, 7–229, 8–250, 9–252. బౌలింగ్: బౌల్ట్ 10–1–48–1, హెన్రీ 10–1–48–3, సాన్ట్నర్ 10–0–37–2, నీషమ్ 7–0–56–0, రవీంద్ర 10–0–76–1, ఫిలిప్స్ 3–0–17–2. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (నాటౌట్) 152; యంగ్ (సి) బట్లర్ (బి) కరన్ 0; రచిన్ రవీంద్ర (నాటౌట్) 123; ఎక్స్ట్రాలు 8; మొత్తం (36.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–10. బౌలింగ్: వోక్స్ 6–0–45–0, స్యామ్ కరన్ 6–2–47–1, వుడ్ 5–0–55–0, అలీ 9.2–0–60–0, రషీద్ 7–0–47–0, లివింగ్స్టోన్ 3–0–24–0. ప్రపంచకప్లో నేడు పాకిస్తాన్ X నెదర్లాండ్స్ వేదిక: హైదరాబాద్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
CWC 2023 ENG VS NZ: జగజ్జేతలకు షాక్.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
2023 వన్డే వరల్డ్కప్కు అదిరిపోయే ఆరంభం లభించింది. గత ఎడిషన్ ఫైనలిస్ట్లు ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు పలు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గత వరల్డ్కప్ (2019) ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన అపజయానికి న్యూజిలాండ్ టీమ్ ఈ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ టీమ్.. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ను 9 వికెట్ల భారీ తేడాతో మట్టికరిపించి, మెగా టోర్నీలో బోణీ విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించిన న్యూజిలాండ్, వరల్డ్కప్ చరిత్రలో అత్యంత వేగంగా 280 అంతకంటే ఎక్కువ స్కోర్ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో నమోదైన మరిన్ని రికార్డులు.. ఈ మ్యాచ్లో బెయిర్స్టో ఇంగ్లండ్ పరుగుల ఖాతాను సిక్సర్తో తెరిచి ఆల్టైమ్ వరల్డ్కప్ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచకప్ చరిత్రలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్ చేశారు. 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇది ప్రపంచ రికార్డు. వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్కైనా అత్యుత్తమ భాగస్వామ్యం- డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర (అజేయమైన 273 పరుగులు) డెవాన్ కాన్వే న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (22 ఇన్నింగ్స్లు) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు వరల్డ్కప్ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల, 321 రోజులు) రచిన్ రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. వరల్డ్కప్ అరంగేట్రంలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా (32 ఏళ్ల 89 రోజులు) కాన్వే రికార్డుల్లోకెక్కాడు. -
CWC 2023 ENG VS NZ: కాన్వే, రచిన్ మెరుపు శతకాలు.. రికార్డు భాగస్వామ్యం నమోదు
వన్డే వరల్డ్కప్ 2023కి అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్లోనే రెండు శతకాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వారు ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్కైనా అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో కాన్వే, రచిన్ జోడి రెండో వికెట్కు అజేయమైన 273 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 1996 వరల్డ్కప్లో లీ జెర్మాన్-క్రిస్ హారిస్ జోడి నమోదు చేసిన 168 పరుగుల భాగస్వామ్యామే ఈ మ్యాచ్కు ముందు వరకు ప్రపంచకప్ల్లో న్యూజిలాండ్ బెస్ట్ పార్ట్నర్షిప్గా ఉండింది. తాజాగా కాన్వే-రచిన్ జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్ సెంచరీకి చేరుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. కాన్వే 83 బంతుల్లో శతక్కొడితే.. రచిన్ 81 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. వన్డేల్లో కాన్వేకు ఇది ఐదో సెంచరీ కాగా.. రచిన్కు తన కెరీర్ మొత్తంలోనే ఇది తొలి సెంచరీ. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే, రచిన్ శతక్కొట్టడంతో న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్ను కూడా ఆతిథ్య కివీస్కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్ను గెలుపుబాట పట్టించాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
NZ Vs SL: పాపం రచిన్ రవీంద్ర! షిప్లే విశ్వరూపం.. 10 ఓవర్లలోనే లంక..
New Zealand vs Sri Lanka, 1st ODI: శ్రీలంకతో తొలి వన్డేలో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. ఆక్లాండ్ వేదికగా శనివారం నాటి మ్యాచ్లో 274 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ఫిన్ అలెన్ అర్ధ శతకంతో రాణించగా.. అరంగేట్ర ఆటగాడు రచిన్ రవీంద్ర తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. కాగా సొంతగడ్డపై లంకతో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది. ఈ క్రమంలో ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో ఇరు జట్ల మధ్య మొదటి వన్డేలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే అరంగేట్ర ఓపెనర్ చాడ్ బౌస్(14 పరుగులు) వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్(26)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. పాపం రచిన్ రవీంద్ర ఇక నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 47 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ టామ్ లాథమ్(5)విఫలమయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులు సాధించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 49 పరుగులు చేసిన అతడు.. ఒక్క పరుగు తేడాతో అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. కసున్ రజిత బౌలింగ్లో షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. షిప్లే విశ్వరూపం ఈ క్రమంలో 49.3 ఓవర్లలో కివీస్ 274 పరుగులు చేయగలిగింది. లంక బౌలర్లలో చమిక కరుణరత్నె అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. కసున్ రజిత రెండు, లాహిరు కుమార రెండు, కెప్టెన్ దసున్ షనక ఒకటి, దిల్షాన్ మధుషంక ఒక్కో వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనకు దిగిన లంకను కివీస్ పేసర్ షిప్లే అల్లాడిస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి షిప్లే నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్ నవనీడు ఫెర్నాండో రనౌట్ రూపంలో వెనుదిరగడంతో లంక మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. చదవండి: Ben Stokes: అడుగుపెట్టిన కాసేపటికే బరిలోకి.. బ్యాట్తో విధ్వంసం IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే సాధ్యం! A big finish to the over from Rachin Ravindra! Watch play LIVE on @sparknzsport or TVNZ Duke LIVE scoring https://t.co/nudAdDPipf #CricketNation #NZvSL pic.twitter.com/AgC0GDAUoO — BLACKCAPS (@BLACKCAPS) March 25, 2023 -
Ind Vs Nz: అక్షర్.. పటేల్.. రవీంద్ర.. జడేజా.. ఇదేదో సర్ఫ్ యాడ్లా ఉందే!
Ind Vs Nz: Axar Azaz Rachin Ravindra Jadeja BCCI Shared Pic Viral India Won: అజాజ్ పటేల్.. రచిన్ రవీంద్ర... టీమిండియా- న్యూజిలాండ్ టెస్టు సిరీస్ సందర్భంగా ఈ రెండు పేర్లు భారత అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఇద్దరూ భారత మూలాలున్న క్రికెటర్లే.. ఇద్దరి కుటుంబాలు న్యూజిలాండ్కు వలస వెళ్లగా.. అక్కడి అంతర్జాతీయ క్రికెట్ జట్టులో ఈ ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. ఇక తొలి టెస్టులో భారత్తో దోబూచూలాడిన విజయాన్ని దక్కకుండా అడ్డుకున్నదీ వీరిద్దరేనన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అజాజ్, రచిన్ అడ్డుగోడగా నిలబడటంతో టీమిండియా ఆఖరి వికెట్ తీయలేకపోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఇక ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో... పుట్టిన గడ్డ మీద అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా పది వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా చరిత్రకెక్కాడు. మరోవైపు.. టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా టెస్టు సిరీస్లో తమదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో.. రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న తర్వాత ఈ నలుగురు స్పిన్నర్లు కలిసి దిగిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. PC: BCCI నలుగురూ తమ జెర్సీ నంబర్లు, పేర్లు కనబడేలా వెనుకకు నిల్చుని ఫొటోలు దిగారు. అక్షర్(అక్షర్ పటేల్).. పటేల్(అజాజ్ పటేల్)... రవీంద్ర(రచిన్ రవీంద్ర)... జడేజా(రవీంద్ర జడేజా) వరుసగా నిలబడి... అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా పూర్తి పేర్లు వచ్చేలా పోజులిచ్చారు. ఇక రచిన్, జడేజా జెర్సీ నెంబర్లు కూడా ఒకటే(నంబర్ 8) కావడం విశేషం. ఈ ఫొటోను షేర్ చేసిన బీసీసీఐ.. ‘‘ఆ నలుగురు ఎలా ఉన్నారు’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఈ క్రమంలో.. ‘‘వావ్ ఈ సీన్ అదిరింది. నలుగురు స్పిన్నర్లు.. సూపర్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు... ‘‘తెలుపు.. పూర్తి తెలుపు.. ఇదేదో సర్ఫ్ యాడ్లా ఉందే’’ అని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే.. Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్తో ఏంటి సంబంధం? In Sync! ☺️ How's that for a quartet! 🇮🇳 🇳🇿#INDvNZ #TeamIndia @Paytm pic.twitter.com/eKqDIIlx7m — BCCI (@BCCI) December 6, 2021 -
Ind Vs Nz 2nd Test: రెండో టెస్ట్లో కివీస్పై భారత్ భారీ విజయం
India Vs Nz 2nd Test Day 4 2021 Highlights & Updates.. సమయం 10:20Am ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 540 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు సాధించగా, కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా టెస్ట్లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సాధించాడు. సమయం 9:50Am: న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగుల చేసిన రచిన్ రవీంద్ర, జయంత్ యాదవ్ బౌలింగ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోరు కంటే న్యూజిలాండ్ ఇంకా 377 పరుగులు వెనుకబడి ఉంది. కాగా టీమిండియా విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. 53 ఓవర్లకు కివీస్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోలస్,కైల్ జామీసన్ ఉన్నారు. సమయం 9:30Am: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్లు నష్టానికి 140 పరుగులు చేసింది. కాగా భారత్ విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర, హెన్రీ నికోలస్ ఉన్నారు. భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్. న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్విల్లే, అజాజ్ పటేల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: BAN Vs PAkK: నీటిలో ఫీల్డింగ్ చేసిన షకీబ్ అల్ హసన్.. వీడియో వైరల్.. -
Virat Kohli: అయ్యో కోహ్లి.. ఏడ్వలేక నవ్వటం అంటే ఇదేనేమో!
IND vs NZ 2nd Test: Virat Kohli Stunned Reaction After Rachin Ravindra Bowl Him Out: న్యూజిలాండ్తో రెండో టెస్టులో భాగంగా జట్టుతో చేరాడు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి. దీంతో కోహ్లి స్టైల్ ఇన్నింగ్స్... పరుగుల వరద ఖాయమని అభిమానులు భావించారు. అయితే... తొలి ఇన్నింగ్స్లో కోహ్లి డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అజాజ్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ స్కోరే చేసినప్పటికీ అవుటైన విధానం నిరాశపరిచింది. ముంబై టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా 84 బంతులు ఎదుర్కొన్న కోహ్లి... 36 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. రచిన్ రవీంద్ర అద్భుత బంతితో బోల్తా కొట్టించడంతో.. ఏడ్వలేక అన్నట్లు ఓ నవ్వు నవ్వి నిరాశగా పెవిలియన్ చేరాడు. కివీస్ మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ..‘‘సెంచరీ కొడతావు అనుకున్నాం. కానీ అవుట్ అయ్యావు కదా భయ్యా! ఏడ్వలేక నవ్వడం అంటే ఇదేనేమో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్లు పడగొట్టి మరింత పట్టు బిగించింది. మరో ఐదు వికెట్లు తీస్తే చాలు సిరీస్ భారత్ కైవసమవుతుంది. స్కోర్లు: టీమిండియా తొలి ఇన్నింగ్స్: 325-10 (109.5 ఓవర్లలో) రెండో ఇన్నింగ్స్: 276-7 d (70 ఓవర్లలో). న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62-10 (28.1 ఓవర్లలో) రెండో ఇన్నింగ్స్: 140-5 (45 ఓవర్లలో- మూడో రోజు ఆట ముగిసే సమయానికి). చదవండి: Ravichandran Ashwin: అశ్విన్ సరికొత్త రికార్డు.. కుంబ్లేను అధిగమించి.. Make that 2 for Ravindra! This time it's the Indian captain Virat Kohli who drags on for 36. India 5 down now for 217, lead of 480. Follow play live in NZ on @skysportnz & @SENZ_Radio. Live scoring | https://t.co/tKeqyLOL9D #INDvNZ pic.twitter.com/jCWSm5YhNe — BLACKCAPS (@BLACKCAPS) December 5, 2021 Waiting for 71st hundred ♾️ got out again still waiting 😔#ViratKohli #MayankAgarwal #AjazPatel #RachinRavindra #INDvzNZ #testcricket #Ashes #Hundred #71stHundred pic.twitter.com/YMDYu5f0Ly — Ritindra☮︎ (@be_ritindra) December 5, 2021 Stumps on Day 3 of the 2nd Test.#TeamIndia 5 wickets away from victory. Scorecard - https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/C7luRRTwNk — BCCI (@BCCI) December 5, 2021 -
రచిన్, ఎజాజ్ పటేల్.. భారత్తో బంధం
Intresting Facts About Rachin Ravindra And Ajaz Patel.. కివీస్ను ఓటమి నుంచి రక్షించిన ఇద్దరు ఆటగాళ్లకు మన దేశపు నేపథ్యం ఉండటం విశేషం. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన రచిన్ రవీంద్ర వెల్లింగ్టన్లో పుట్టినా... అతని తండ్రి రవి కృష్ణమూర్తి భారత్కు చెందినవాడు. స్వస్థలం బెంగళూరు కాగా... సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కృష్ణమూర్తి వేర్వేరు దేశాల్లో ఉద్యోగం చేస్తూ చివరకు న్యూజిలాండ్లో స్థిరపడ్డాడు. క్లబ్ స్థాయి క్రికెట్లో తనతో కలిసి ఆడిన జవగల్ శ్రీనాథ్తో అతనికి మంచి స్నేహం ఉంది. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్ల కలయికతో తన కొడుకుకు ‘రచిన్’ పేరు పెట్టిన కృష్ణమూర్తి సరైన సాధన, పోటీ కోసం భారత్లోనే వేర్వేరు నగరాలకు తరచుగా అతడిని పంపించి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయిస్తూ వచ్చాడు. 33 ఏళ్ల ఎజాజ్ పటేల్ ముంబైలోనే పుట్టాడు. 1996లో అతని కుటుంబం న్యూజిలాండ్కు వలస వెళ్లింది. భారత్లో భారత జట్టుపై నాలుగో ఇన్నింగ్స్లో 95 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఆడి టెస్టు మ్యాచ్ను ‘డ్రా’గా ముగించడం న్యూజిలాండ్ జట్టుకిది ఐదోసారి. గతంలో న్యూజిలాండ్ జట్టు కాన్పూర్ (1976), మొహాలీ (1999), అహ్మదాబాద్ (1999), అహ్మదాబాద్ (2003) టెస్టుల్లో కూడా ఇలాగే ‘డ్రా’ చేసుకుంది. చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్తో ఏంటి సంబంధం? పేర్లలో కన్ఫ్యూజన్.. ఈసారి జడేజాదే పైచేయి -
IND vs NZ 1st Test: 52 బంతుల పాటు అడ్డుగోడలా
52... తొలి టెస్టును రక్షించుకునేందుకు న్యూజిలాండ్ చివరి జోడీ ఆడిన బంతులివి... ముగ్గురు భారత స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తమ అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించారు... కానీ రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్ కనబర్చిన పట్టుదల ముందు అవన్నీ పనికిరాకుండా పోయాయి. ఒక్క మంచి బంతి చాలు ప్రత్యర్థి ఆటకట్టించేందుకు అన్నట్లుగా కనిపించినా... కివీస్ జోడీ ప్రతీ బంతిని సమర్థంగా ఎదుర్కొని మ్యాచ్ను ‘డ్రా’గా ముగించగలిగింది. చివర్లో కాస్త వెలుతురులేమి వారికి కలిసొచ్చినా... భారత గడ్డపై, చివరి రోజు పిచ్పై తీవ్ర ఒత్తిడి మధ్య వీరిద్దరు కనబర్చిన పోరాటపటిమ అసమానం. ‘ప్రపంచ చాంపియన్’ను చిత్తు చేసి ఇటీవలి పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భారత్కు మాత్రం చివరకు నిరాశే ఎదురైంది. కాన్పూర్: ఒక్క వికెట్... భారత్కు, విజయానికి మధ్యలో నిలిచింది! బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై తొలి టెస్టు చివరి రోజు మిగిలిన తొమ్మది న్యూజిలాండ్ వికెట్లు తీసి సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్న భారత్ చివరకు ‘డ్రా’తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆట ముగిసే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (146 బంతుల్లో 52; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే రచిన్ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), ఎజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్) కలిసి భారత్కు చివరి వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయంకంటే 12 నిమిషాల ముందే (కనీసం మరో 3 ఓవర్లు పడేవి) అంపైర్లు ఆటను నిలిపివేశారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... రెండో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో జరుగుతుంది. చదవండి: Ind Vs Nz Test Series: డ్రా.. అంపైర్ల నిర్ణయం సరైందే; మరి రెండో టెస్టులో రహానేపై వేటు?! కీలక భాగస్వామ్యం... తొలి టెస్టులో న్యూజిలాండ్ చివరకు ‘డ్రా’తో బయటపడగలిగిందంటే తొలి సెషన్లో ఆ జట్టు బ్యాటర్లు కనబర్చిన పట్టుదలే ప్రధాన కారణం. తొమ్మిది వికెట్లు తీయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన భారత్ 31 ఓవర్ల సెషన్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. లాథమ్తో పాటు నైట్వాచ్మన్ సోమర్విలే (110 బంతుల్లో 36; 5 ఫోర్లు) కూడా మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ గట్టిగా నిలబడ్డాడు. లాథమ్ ఎల్బీ కోసం అప్పీల్ చేసినా రివ్యూలో ఫలితం ప్రతికూలంగానే వచ్చిం ది. తొలి ఇన్నింగ్స్లో చెలరేగిన అక్షర్కు 21 ఓవర్ల పాటు బౌలింగ్ ఇవ్వకపోవడం కూడా ఒక వ్యూహాత్మక తప్పిదం. ఎట్టకేలకు లంచ్ తర్వాత సుదీర్ఘ రెండో వికెట్ భాగస్వామ్యానికి (194 బంతుల్లో 76 పరుగులు) తెర పడింది. ఉమేశ్ వేసిన తొలి బంతికే గిల్ అద్భుత క్యాచ్తో సోమర్విలే వెనుదిరిగాడు. ఆ తర్వాతి నుంచి గెలుపు ఆలోచన మాని కివీస్ ‘డ్రా’ కోసం బంతులు వృథా చేయడంపైనే దృష్టి పెట్టింది. అయితే రెండో సెషన్లో 7 పరుగుల వ్యవధిలోనే లాథమ్, టేలర్ (2)లను అవుట్ చేసిన భారత్... ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. ఆశలు రేగినా... చివరి సెషన్లో ఉత్కంఠ పెరిగిపోయింది. భారత్ లక్ష్యం 6 వికెట్లు కాగా... కివీస్ కనీసం 31.5 ఓవర్లు జాగ్రత్తగా ఆడాల్సిన స్థితిలో నిలిచింది. అయితే ముందుగా నికోల్స్ (1), ఆపై కెప్టెన్ విలియమ్సన్ (112 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఆరో వికెట్గా వెనుదిరగడంతో భారత్ గెలుపుపై ఆశలు పెరిగాయి. తర్వాతి 3 వికెట్లు తీసేందుకు కూడా భారత్కు ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే చివరి వికెట్కు రచిన్, ఎజాజ్ చేసిన పోరాటం ప్రపంచ చాంపియన్ను గట్టెక్కించింది. ఆఖరి సెషన్లో ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి పెరిగిపోయింది. ఈ సెషన్లో ఐదు ఫలితాలు కూడా అంపైర్ ‘రివ్యూ’ కోరాల్సి వచ్చింది. మూడుసార్లు సమీక్ష కోరిన న్యూజిలాండ్ ఒకసారి సానుకూల ఫలితం పొందగా, భారత్ కోరిన రెండు రివ్యూలు వృథా అయ్యాయి. చదవండి: Ind Vs Nz 1st Test Draw: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇవీ! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 345; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296; భారత్ రెండో ఇన్నింగ్స్: 234/7 డిక్లేర్డ్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బి) అశ్విన్ 52; యంగ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 2; సోమర్విలే (సి) గిల్ (బి) ఉమేశ్ 36; విలియమ్సన్ (ఎల్బీ) (బి) జడేజా 24; టేలర్ (ఎల్బీ) (బి) జడేజా 2; నికోల్స్ (ఎల్బీ) (బి) అక్షర్ 1; బ్లన్డెల్ (బి) అశ్విన్ 2; రచిన్ రవీంద్ర (నాటౌట్) 18; జేమీసన్ (ఎల్బీ) (బి) జడేజా 5; సౌతీ (ఎల్బీ) (బి) జడేజా 4; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 17; మొత్తం (98 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–3, 2–79, 3–118, 4–125, 5–126, 6–128, 7–138, 8–147, 9–155. బౌలింగ్: అశ్విన్ 30–12–35–3, అక్షర్ పటేల్ 21–12–23–1, ఉమేశ్ 12–2–34–1, ఇషాంత్ 7–1–20–0, జడేజా 28–10–40–4. -
పేర్లలో కన్ఫ్యూజన్.. ఈసారి జడేజాదే పైచేయి
Ravindra Jadeja Vs Rachin Ravindra.. రచిన్ రవీంద్ర.. రవీంద్ర జడేజా.. ఇద్దరి పేర్లలో రవీంద్ర కామన్గా కనిపిస్తుంది. ఒకరు టీమిండియాకు ఆడితే.. మరొకరు న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరినొకరు పెద్దగా పరిచయం లేనప్పటికి.. అభిమానులు మాత్రం ఈ ఇద్దరిని రైవల్స్(ప్రత్యర్థులు)గానే చూస్తున్నారు. వీరిద్దరి పోటీలో ఈసారి జడేజా పైచేయి సాధించాడు. టీమిండియా బ్యాటింగ్ సమయంలో రచిన్ రవీంద్ర.. జడేజా వికెట్ తీయలేకపోయాడు. చదవండి: Axar Patel: వారెవ్వా అక్షర్ పటేల్.. టెస్టు క్రికెట్ చరిత్రలో మూడో బౌలర్గా కానీ జడేజా మాత్రం రచిన్ వికెట్ తీశాడు. కివీస్ ఇన్నింగ్స్లో రచిన్ 23 బంతుల్లో 13 పరుగులు చేశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 111వ ఓవర్ నాలుగో బంతికి రచిన్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. జడేజా వేసిన బంతి లెగ్స్టంప్ దిశగా వెళ్లి అనూహ్య టర్న్ తీసుకొని రచిన్ ప్యాడ్ల వెనుక నుంచి వికెట్లను గిరాటేసింది. దీంతో రచిన్ షాక్తో జడేజాను చూస్తూ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. pic.twitter.com/Gkj9k0ope9 — Simran (@CowCorner9) November 27, 2021 -
టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర...
Rachin Ravindra Become Youngest New Zealand Test Debutant Since Ish Sodhi: భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్లో న్యూజిలాండ్ తరుపున అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు సృష్టించాడు. కీవిస్ తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రవీంద్ర నిలిచాడు. అంతకముందు 2013లో బంగ్లాదేశ్పై అరంగేట్రం చేసిన ఇష్ సోధి అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. కాగా 22 ఏళ్ల రచిన్ రవీంద్రకు తన సహచర ఆటగాడు టామ్ బ్లండెల్ టెస్ట్ క్యాప్(282)ను అందించాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి బరిలోకి దిగింది. ఇక అజాజ్ పటేల్,రచిన్ రవీంద్ర, ఇష్ సోధి భారతీయ మూలాలు కలిగి ఉన్న వాళ్లన్న సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2021-2023) లో న్యూజిలాండ్కు ఇదే తొలి మ్యాచ్. ఇక తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో -
ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్తో ఏంటి సంబంధం?
Interesting Facts About New Zeland Cricketer Rachin Ravindra.. క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అని చాలామంది అంటుంటారు. అది సహజమే.. కానీ ఇంగ్లండ్ కంటే భారత్లోనే క్రికెట్కు ఆదరణ ఎక్కువ. ముఖ్యంగా 90వ దశకం నుంచి ఈ అభిమానం తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే వారింట్లో చిన్నపిల్లలకు తమ అభిమాన క్రికెటర్ల పేర్లు కలిసేలా నామకరణం చేసేవారు. ఇక సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ బేస్ వేరుగా ఉండేది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నారనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. - సాక్షి, వెబ్డెస్క్ న్యూజిలాండ్తో బుధవారం జరిగిన తొలి టి20లో రచిన్ రవీంద్ర అనే పేరు ఆసక్తికరంగా కనిపించింది. నవంబర్ 18న పుట్టినరోజు జరుపుకుంటున్న రచిన్ 22వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇక న్యూజిలాండ్ తరపున 6 టి20 మ్యాచ్లు ఆడిన రచిన్ రవీంద్ర 54 పరుగులు చేశాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఎదుగుతున్న అతను భారత మూలాలున్న కుటుంబానికి చెందినవాడు.1990ల కాలంలోనే రచిన్ రవీంద్ర కుటుంబం న్యూజిలాండ్లో స్థిరపడింది. తండ్రి రవి కృష్ణమూర్తి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్గా పనిచేసేవాడు. చదవండి: IND vs NZ: కివీస్తో మ్యాచ్లో విజయం.. రోహిత్ 9 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్ సచిన్, ద్రవిడ్ పేర్లు కలిసివచ్చేలా.. రచిన్ రవీంద్ర పుట్టకముందు బెంగళూరులో ఉన్న కృష్ణమూర్తి కుటుంబం తర్వాత న్యూజిలాండ్కు వెళ్లి స్థిరపడింది. అక్కడ హట్ హాక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ను ఆరంభించాడు. ఆ తర్వాత కూడా రవి కృష్ణమూర్తి చాలాసార్లు బెంగళూరుకు వచ్చి క్రికెట్ ఆడడం చేసేవాడు. ఇక తండ్రి నుంచి వారసత్వంగా క్రికెట్ లక్షణాలను పుచ్చుకున్న రచిన్ రవీంద్ర నవంబర్ 18, 1999న జన్మించాడు. తండ్రి కృష్ణమూర్తికి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్లంటే విపరీతమైన అభిమానం ఉండడంతో వారిపేర్లు కలిసి వచ్చేలా రచిన్ రవీంద్ర అనే పేరు పెట్టాడు. చదవండి: Rohit Sharma: నా వీక్నెస్ బౌల్ట్కు బాగా తెలుసు.. ట్రాప్లో పడిపోయా బ్యాటింగ్ ఐడల్గా సచిన్ టెండూల్కర్ను అభిమానిస్తూ.. కాగా రచిన్ రవీంద్ర తొలిసారి న్యూజిలాండ్ తరపున 2016 అండర్-19 ప్రపంచకప్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత 2018 అండర్-19 ప్రపంచకప్లో ఆడిన రచిన్.. 2021 సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా కివీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అంతేకాదు ఐసీసీ తొలిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్టెస్టు చాంపియన్షిప్కు న్యూజిలాండ్ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక బ్యాటింగ్ ఐడల్గా సచిన్ టెండూల్కర్ను పేర్కొన్న రచిన్ రవీంద్ర అతని ఆటను చూస్తూ పెరిగానని.. నా పెరుగుదలతో పాటు అతనిపై ఉన్న అభిమానం కూడా ఎక్కువ స్థాయిలో పెరిగిపోయిందంటూ ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ఇక అంతర్జాతీయంగా ఆరు మ్యాచ్లాడిన రచిన్ 54 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 6 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్ కెరీర్లో 26 మ్యాచ్ల్లో 1470 పరుగులతో పాటు 22 వికెట్లు తీశాడు. ఇక రచిన్ రవీంద్ర కంటే ముందు న్యూజిలాండ్కు ఇష్ సోథీ, జీతన్ పటేల్, జీత్ రావల్ లాంటి భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. Pinch yourself moments for 21-year-old Rachin Ravindra on his first trip to the @HomeOfCricket #ENGvNZ pic.twitter.com/3XZ5T4GFdA — BLACKCAPS (@BLACKCAPS) May 30, 2021