ICC ODI World Cup 2023
-
ఆ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)ని టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్ దశలో మూడింటికి మూడూ గెలిచిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పరిపూర్ణ విజయంతో చాంపియన్గా నిలిచింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఒకే వేదికపై ఆడిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ వన్డే టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికపైన తమ మ్యాచ్లు ఆడింది. దుబాయ్(Dubai)లోనే ఈ ఐదు మ్యాచ్లలో ప్రత్యర్థులతో తలపడింది.అదనపు ప్రయోజనం అంటూ విమర్శలుమరోవైపు.. రోహిత్ సేనతో మ్యాచ్లు ఆడేందుకు ఆయా జట్లు పాకిస్తాన్- దుబాయ్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే మైదానంలో ఆడటం భారత్కు అదనపు ప్రయోజనాలను చేకూర్చిందని ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలను విమర్శించారు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ అవతరించిన అనంతరం.. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాలను ఉటంకిస్తూ.. ‘‘కేవలం ఐసీసీ టైటిళ్ల విషయంలోనే కాదు.. టీమిండియా ఎన్ని ఐసీసీ మ్యాచ్లు గెలిచిందో కూడా చూడాలి. చెంపపెట్టు లాంటి సమాధానంగత ఆరేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్కు అద్బుత రికార్డు ఉంది. మరొక్క మాట.. ఈ మ్యాచ్లన్నీ దుబాయ్లో మాత్రం ఆడినవి కాదండోయ్!’’ అంటూ విమర్శకులను ఉద్దేశించి మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అంటూ అభిమానులు మంజ్రేకర్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు.కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2024లో అన్ని మ్యాచ్లు గెలిచి చాంపియన్గా నిలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లోనూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి ట్రోఫీని ముద్దాడింది. అరుదైన రికార్డులుఈ మూడు ఈవెంట్లలో రోహిత్ సేన మొత్తంగా 24 మ్యాచ్లు ఆడగా.. ఏకంగా 23 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను కూడా భారత్ సాధించింది. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటి వరకు మొత్తంగా 34 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఇరవై మూడింట గెలిచి.. ఎనిమిది ఓడింది. మూడింట ఫలితాలు రాలేదు. ఇక ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టూ కూడా ఈ టోర్నీలో పదిహేను కంటే ఎక్కువ విజయాలు సాధించకపోవడం గమనార్హం.అంతేకాదు.. ఒక వేదికపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగానూ భారత్.. న్యూజిలాండ్ రికార్డును సమం చేసింది. దుబాయ్లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడి పదింట గెలిచింది. న్యూజిలాండ్ గతంలో డునెడిన్లో పదింటికి పది మ్యాచ్లలో విజయం సాధించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 👉కివీస్ స్కోరు: 251/7 (50)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచి చాంపియన్గా భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76)చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
SA vs NZ: రచిన్ రవీంద్ర సరికొత్త చరిత్ర.. కివీస్ తొలి ప్లేయర్గా రికార్డు
ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) జోరు కొనసాగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సెమీ ఫైనల్లో భాగంగా సౌతాఫ్రికా(New Zealand vs South Africa)తో మ్యాచ్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మళ్లీ శతక్కొట్టాడు. తద్వారా కివీస్ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.అంతేకాదు.. తక్కువ ఇన్నింగ్స్లోనే అధిక సెంచరీలు కొట్టిన కివీస్ బ్యాటర్గానూ రచిన్ రవీంద్ర చరిత్రకెక్కాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్కు లాహోర్ వేదిక.గడాఫీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ విల్ యంగ్(23 బంతుల్లో 21) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రం అదరగొట్టాడు. 93 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రచిన్.. కేన్ విలియమ్సన్తో కలిసి రెండో వికెట్కు 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.ఇదిలా ఉంటే.. రచిన్ రవీంద్రకు వన్డేల్లో ఇది ఐదో శతకం కావడం గమనార్హం. అయితే, ఇప్పటి వరకు అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో సాధించిన ఈ ఐదు సెంచరీలు ఐసీసీ టోర్నమెంట్లలోనే సాధించడం విశేషం. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో రచిన్ రవీంద్ర ఏకంగా మూడు శతకాలు బాదాడు.తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఈవెంట్లో గాయం కారణంగా పాకిస్తాన్తో మ్యాచ్కు దూరమైనప్పటికీ.. ఆ తర్వాత బంగ్లాదేశ్(112)తో మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చి శతక్కొట్టాడు. తద్వారా ఐసీసీ వన్డే టోర్నీల్లో నాలుగో శతకం అందుకున్న 25 ఏళ్ల రచిన్.. తాజాగా పటిష్ట సౌతాఫ్రికాపై సెంచరీ కొట్టి ఈ సంఖ్యను ఐదుకు పెంచుకున్నాడు. తద్వారా రచిన్ రవీంద్ర పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్లో కివీస్ తరఫున వన్డేల్లో అధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానం దక్కించుకోవడంతో పాటు.. పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ఆటగాడిగా నిలిచాడు.ఇదిలా ఉంటే సౌతాఫ్రికాతో మ్యాచ్లో రచిన్(101 బంతుల్లో 108, 13 ఫోర్లు, ఒక సిక్సర్)తో పాటు కేన్ విలియమ్సన్ కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరికి తోడు డారిల్ మిచెల్(37 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్(27 బంతుల్లో 49 నాటౌట్) దుమ్ములేపారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్.. రికార్డు స్థాయిలో 362 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున తక్కువ ఇన్నింగ్స్లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉డెవాన్ కాన్వే- 22 ఇన్నింగ్స్లోరచిన్ రవీంద్ర- 28 ఇన్నింగ్స్లోడారిల్ మిచెల్- 30 ఇన్నింగ్స్లోకేన్ విలియమ్సన్- 56 ఇన్నింగ్స్లోనాథన్ ఆస్ట్లే- 64 ఇన్నింగ్స్లోపిన్న వయసులో వన్డేల్లో ఐదు శతకాలు బాదిన ఆటగాళ్లు24 ఏళ్ల 165 రోజుల వయసులో కేన్ విలియమ్సన్25 ఏళ్ల 107 రోజుల వయసులో రచిన్ రవీంద్ర.చదవండి: కోహ్లి పైపైకి.. -
Ind vs Aus: ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా టైటిల్ రేసులో ముందుకు దూసుకుపోతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి.. మూడింట మూడు విజయాలతో టాపర్గా నిలిచింది. ఇదే జోరులో సెమీ ఫైనల్లోనూ గెలుపొంది టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.నాకౌట్ మ్యాచ్లలో..అయితే, సెమీస్లో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా(India vs Australia) రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి జట్టు రోహిత్ సేనకు సవాలుగా మారింది. ద్వైపాక్షిక సిరీస్ల సంగతి పక్కనపెడితే.. 2011 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్లలో కంగారూ జట్టు చేతిలో టీమిండియాకు పరాభవాలు తప్పడం లేదు. సొంతగడ్డపై లక్షలకు పైగా ప్రేక్షకుల నడుమ వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ కమిన్స్ బృందం చేతిలో ఓడిన తీరును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో మంగళవారం దుబాయ్లో ఆసీస్తో జరిగే సెమీస్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం గత చేదు అనుభవాలను మరిపించేలా రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..‘‘ఆసీస్ పటిష్ట జట్టు. మాకు గొప్ప ప్రత్యర్థి. అయితే, సెమీస్తో మ్యాచ్లో మా విధానం మారదు. గత మూడు మ్యాచ్ల మాదిరే మా ప్రణాళికలు ఉంటాయి. అయితే, ఆసీస్ జట్టును బట్టి వ్యూహాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.ఇక సెమీ ఫైనల్ అంటే మా మీద మాత్రమే ఒత్తిడి ఉంటుందని అనుకోకూడదు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే, జట్టుగా ఎలా రాణించాలన్న అంశం మీదే మేము ఎక్కువగా దృష్టి సారించాం. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగే ఉండదు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా గొప్ప జట్టుగా కొనసాగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచే రకం కాదు.ఇరుజట్లకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యమైంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే.. అనుకున్న ఫలితం అదే వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్పై విజయం తర్వాత పీటీఐతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియా జట్టుజేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: ఇదేం పని జడ్డూ? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్ -
వన్డే ప్రపంచకప్తో భారత్కు రూ.11, 637 కోట్ల ఆదాయం..
దుబాయ్: గతేడాది నిర్వహించిన వన్డే ప్రపంచకప్ భారత దేశానికి గణనీయమైన ఆర్ధిక లబ్ధిని చేకూర్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మెగా ఈవెంట్ ఆర్థికంగా పెద్ద ప్రభావమే చూపిందని, విదేశీ పర్యాటకులతో భారత్లోని ఆతిథ్య రంగం పెద్ద ఎత్తున లాభపడిందని అందులో వివరించింది.గత అక్టోబర్, నవంబర్లో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ రన్నరప్గా నిలిచింది. ‘ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ క్రికెట్కు ఉన్న ఆర్ధిక శక్తి ఎలాంటిదో నిరూపించింది. ఆతిథ్య భారత్ 1.39 బిలియన్ అమెరికా డాలర్ల (రూ.11, 637 కోట్లు) ఆదాయం ఆర్జించేలా చేసింది.ఈ వరల్డ్కప్ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత్కు పోటెత్తారు. ఇలా పర్యాటకుల రాకతో ఆతిథ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటల్స్, భోజనం, వసతి, రవాణ, ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది’ అని ఐసీసీ ఆ నివేదికలో పేర్కొంది. టోర్నీ జరిగింత కాలం కొనుగోలు శక్తి పెరిగిందని, టికెట్ల రూపంలోనూ భారీ ఆదాయం వచి్చందని, ఏకంగా 12.50 లక్షల మంది ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్ల్ని చూసేందుకు ఎగబడ్డారని అందులో తెలిపింది.ఐసీసీ ప్రపంచకప్ల చరిత్రలోనే ఇది ఘననీయమైన వృద్ధని, సగటున 75 శాతం ప్రేక్షకుల హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది. పర్యాటకులు, దేశీ ప్రేక్షకులకు సేవలందించడం ద్వారా 48 వేల మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో ఉపాధి పొందారని ఐసీసీ వివరించింది.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్ -
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. మొదటి బ్యాచ్తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్మెషీన్.. ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్ను కూడా స్వీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై సూపర్ స్టేజ్లో సాధించిన 122(నాటౌట్) కూడా హైలైట్గా నిలిచిపోయింది.ఇక వన్డే వరల్డ్కప్-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్ స్కోరర్గా నిలవడమే గాకుండా.. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్తో జరిగిన టీమిండియా వార్మప్ మ్యాచ్కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్లో తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
షమీపై మరోసారి సంచలన ఆరోపణలు.. ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా స్టార్ పేసర్గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్ షమీ కెరీర్లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన ఘనత అతడి సొంతం. అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్. ఇదిలా ఉంటే.. కెరీర్పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది. కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్ జహాన్ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్ జహాన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్ జహాన్ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
అప్పటికే ఫిట్గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే!
ఐపీఎల్-2024లో బౌలింగ్ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పేస్ దళంలో తన వంతు పాత్ర పోషించడానికి సమాయత్తంగా ఉన్నానని తెలిపాడు. కాగా గతేడాది నవంబరులో ముగిసిన వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా ఈ టీమిండియా ఆల్రౌండర్ గాయపడిన విషయం తెలిసిందే. పుణెలో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా తన బౌలింగ్లో బౌండరీ ఆపే క్రమంలో అదుపుతప్పి పడిపోయాడు పాండ్యా. ఈ క్రమంలో అతడి చీలమండ(కుడికాలి)కు గాయం కాగా.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకుని ఐపీఎల్ తాజా ఎడిషన్కు అందుబాటులోకి వచ్చాడు. ఇక గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ట్రేడింగ్లో తిరిగి సొంత గూటికి చేరాడు. ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానంలో పగ్గాలు చేపట్టాడు. అయితే, పాండ్యా గాయం గురించి విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సాధించినప్పటికీ.. ఐపీఎల్కు సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే అతడు టీమిండియా తరఫున పలు ద్వైపాక్షిక సిరీస్లకు దూరంగా ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై తాజాగా స్పందించిన హార్దిక పాండ్యా.. తాను జనవరిలోనే ఫిట్నెస్ సాధించినట్లు వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హోదాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ ఈవెంట్ సమయంలో దురదృష్టవశాత్తూ గాయపడ్డాను. పాత గాయాలేమీ తిరగబెట్టలేదు కానీ నొప్పి మాత్రం తీవ్రంగా ఉండేది. నా చీలమండ ట్విస్ట్ కావడంతో భరించలేని నొప్పి వచ్చేది. త్వరగానే కోలుకుంటాననుకున్నా. కానీ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వరల్డ్కప్ మొత్తానికి దూరమయ్యాను. ఇండియాకు ఆడటం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. కానీ అప్పుడలా జరిగిపోయింది. అయితే, అఫ్గనిస్తాన్తో సిరీస్ నాటికి నేను ఫిట్నెస్ సాధించాను. కానీ అప్పటికి నేను ఆడాల్సిన మ్యాచ్లు ఏవీ మిగిలిలేవు’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్గా ఉన్నానని.. ఐపీఎల్లో తప్పక బౌలింగ్ చేస్తానని ఈ పేస్ ఆల్రౌండర్ పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్లో తలపడనుంది. ఇక గాయం కారణంగా హార్దిక్ పాండ్యా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో పాటు సౌతాఫ్రికా పర్యటన, సొంతగడ్డపై అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. "It's very good to be back." 💙 Hardik Pandya shares his joy on reuniting with #MumbaiIndians, the team where his incredible journey started 🫶#OneFamily @hardikpandya7 pic.twitter.com/0SymPUikDY — Mumbai Indians (@mipaltan) March 18, 2024 -
ఐపీఎల్ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! ఫొటో వైరల్
వన్డే వరల్డ్కప్-2023 సమయంలోనే మడిమ నొప్పి వేధించినా పంటి బిగువన భరించి జట్టు కోసం తపించాడు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ. మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల(24) వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ వరకు చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఈ టోర్నీ ముగిసిన తర్వాత షమీ మళ్లీ ఇంత వరకు మైదానంలో దిగలేదు. మడిమ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ రైటార్మ్ పేసర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘అందరికీ హెలో! నేను క్రమక్రమంగా కోలుకుంటున్నాను. నాకు సర్జరీ జరిగి 15 రోజులు అవుతోంది. ఇటీవలే సర్జరీ సమయంలో వేసిన కుట్లు విప్పారు. కోలుకునే ప్రయాణంలో తదుపరి దశకు చేరుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని షమీ తన ఫొటోలు పంచుకున్నాడు. ఇందుకు బదులిస్తూ ఓ నెటిజన్.. ‘‘వరల్డ్కప్ సమయంలో నొప్పిని భరిస్తూనే షమీ భాయ్... వంద శాతం ఎఫర్ట్ పెట్టాడు. కానీ ఓ ఆటగాడు ఉన్నాడు.. గాయపడకపోయినా.. గాయపడినట్లు నమ్మించి.. ఐపీఎల్ కోసం మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించినట్లుగా ఉన్న ఈ పోస్టుకు షమీ లైక్ కొట్టడంతో నెట్టింట వైరల్గా మారింది. కాగా వరల్డ్కప్-2023 సమయంలో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన పాండ్యా.. తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్-2024కు మాత్రం అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ను వీడిన పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరి కెప్టెన్గా ఎంపికైన విషయం విదితమే!.. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. చదవండి: అతడు టీమిండియా కెప్టెన్.. వేటు వేస్తారా?: యువరాజ్ సింగ్ Hello everyone! I wanted to provide an update on my recovery progress. It has been 15 days since my surgery, and I recently had my stitches removed. I am thankful for the advancements I have achieved and looking forward to the next stage of my healing journey. 🙌 pic.twitter.com/wiuY4ul3pT — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) March 13, 2024 -
IPL 2024: గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్..
IPL 2024- Blow To Gujarat Titans: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్కు పెద్ద ఎదురుదెబ్బ! ఆ జట్టు ప్రధాన బౌలర్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. షమీ మడిమ నొప్పి తీవ్రతరమైన నేపథ్యంలో అతడు సర్జరీ కోసం యూకే వెళ్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత భారత రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్కప్లో ఇరగదీసి సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సి వచ్చినా.. తనకు అవకాశం రాగానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు షమీ. ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. మొత్తంగా 24 వికెట్లు తీశాడు. తద్వారా వరల్డ్కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవార్డు అందుకున్నాడు. కాగా ఎడమకాలి మడిమ నొప్పి వేధిస్తున్నా బాధను పంటిబిగువన భరిస్తూ షమీ తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఇంగ్లండ్తో తాజా టెస్టు సిరీస్కూ దూరమయ్యాడు. అయితే, మార్చిలో ఆరంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా.. బీసీసీఐ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఇది అసాధ్యమేనని తెలుస్తోంది. లండన్లో చికిత్స? మడిమ నొప్పి చికిత్సకై షమీ లండన్ వెళ్లనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. అరంగేట్రంలోనే జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో 17 మ్యాచ్లలో కలిపి 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ను వీడి ముంబై ఇండియన్స్ సారథిగా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా నయా సూపర్స్టార్, యువ క్రికెటర్ శుబ్మన్ గిల్ టైటాన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనుండగా.. షమీ రూపంలో ప్రధాన బౌలర్ జట్టుకు దూరం కావడం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Yashasvi Jaiswal: టెంట్లలో నివాసం నుంచి.. బాంద్రా ఫ్లాట్ దాకా! కోట్లు పెట్టి కొన్నాడు -
మీ భార్యను ప్రేమిస్తున్నా.. సర్లే ఆమెకు చెప్తా!
Pat Cummins's response Goes Viral: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ది ప్రేమ వివాహం. ఈ స్టార్ బౌలర్కు 2013లో బెకీ బోస్టన్ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. మనసులు కలవడంతో ప్రేమపక్షుల్లా విహరిస్తూ పరస్పరం అభిరుచులు పంచుకున్న ఈ జంట.. 2020లో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటికే సహజీవనం చేస్తున్న కమిన్స్- బెకీ 2021లో తాము తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుమారుడు ఆల్బీతో కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్న ఈ జంట ఎప్పుటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్ ఇక వాలంటైన్స్ డే సందర్భంగా భార్య బెకీతో కలిసి ఉన్న ఫొటోను ప్యాట్ కమిన్స్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ‘‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు బెకీ’’ అంటూ సతీమణిపై ప్రేమను కురిపించాడు. మీ భార్యను ప్రేమిస్తున్నా ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నేను భారతీయుడిని.. మీ భార్యను ప్రేమిస్తున్నా’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే, ప్యాట్ కమిన్స్ ఇందుకు హుందాగా బదులిస్తూ... ‘‘సరే.. ఈ సందేశాన్ని ఆమెకు చేరవేస్తాను’’ అని పేర్కొనడం వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) కాగా గతేడాది ప్యాట్ కమిన్స్ కెరీర్లో అద్భుతంగా గడిచింది. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23, వన్డే వరల్డ్కప్-2023 టైటిల్స్ గెలిచింది. ప్రస్తుతం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న కమిన్స్ కుటుంబానికి సమయం కేటాయించాడు. rఇక ఐపీఎల్ తాజా సీజన్లో అతడు సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలో దిగనున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్రైజర్స్ కెప్టెన్గా అతడే! Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు: టీమిండియా దిగ్గజం
IPL 2024- KKR: ఐపీఎల్ వేలం-2024లో కోల్కతా నైట్ రైడర్స్ అవలంబించిన వ్యూహాన్ని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా 24 కోట్లు వెచ్చించడం అతిశయోక్తిగా అనిపించిందన్నాడు. ఏ క్రికెటర్ కూడా అంత మొత్తం అందుకునేందుకు అర్హుడు కాదని తాను భావిస్తున్నట్లు గావస్కర్ పేర్కొన్నాడు. కాగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్టార్క్ క్యాష్ రిచ్ లీగ్లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా రూ. 24.75 కోట్లు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటిన ఈ పేస్ బౌలర్ కోసం మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్.. ఏకంగా రూ. 24.75 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ పాత రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఈ విషయం గురించి సునిల్ గావస్కర్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు. ‘‘నాకైతే నిజంగా ఇది అతిశయోక్తి అనిపించింది. అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు నాకు తెలిసి ఏ క్రికెటర్కు కూడా అంత భారీ మొత్తం అందుకోగల అర్హత లేదు. ఒకవేళ తాను ఆడే 14 మ్యాచ్లలో స్టార్క్ కనీసం నాలుగింటిలోనైనా ప్రభావం చూపితే.. ఆ డబ్బుకు కాస్తైనా న్యాయం చేసినట్లు అవుతుంది. మిగతా మ్యాచ్లలోనూ రాణించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లలో మేటి బ్యాటర్లు ఉన్నారు. ఈ జట్లపై స్టార్క్ బంతితో ప్రభావం చూపితే మాత్రం ఫ్రాంఛైజీ తన కోసం వెచ్చించిన మొత్తానికి న్యాయం చేసినవాడవుతాడు’’ అని సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. తొలుత ఆర్సీబీకి ఆడాడు కాగా 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన స్టార్క్.. 2018లో కేకేఆర్కు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడి కోసం రూ. 9.40 కోట్లు ఖర్చు చేయగా.. గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023లో మిచెల్ స్టార్క్ మొత్తంగా ఆడిన 10 మ్యాచ్లలో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్ ఆరోసారి ప్రపంచ చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
అశ్విన్కు జట్టులో ఉండే అర్హతే లేదు: యువీ సంచలన వ్యాఖ్యలు
Ravichandran Ashwin Doesn't Deserve Place: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఉద్దేశించి భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెన్నై బౌలర్కు పరిమిత ఓవర్ల జట్టులో స్థానం పొందే అర్హతే లేదన్నాడు. ఆధునికతరం భారత మేటి స్పిన్నర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు అశ్విన్. టెస్టుల్లో బంతి, బ్యాట్తో రాణిస్తూ ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 500 వికెట్ల మైలురాయికి చేరువగా ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుందంటే అశూ జట్టులో ఉండాల్సిందే. ఇప్పటికే సంప్రదాయ క్రికెట్లో 490 వికెట్లు తీసిన అశూ.. ఇంగ్లండ్తో జనవరి 25 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరే దిశగా పయనిస్తున్నాడు. 5 శతకాలతో సత్తా చాటి బ్యాటర్గానూ ఇప్పటిదాకా 95 టెస్టుల్లో అశూ 3193 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇలా ఆల్రౌండర్గా భారత టెస్టు జట్టులో పాతుకుపోయిన అశూకు.. వన్డే, టీ20 జట్టులో మాత్రం ఉండే అర్హత లేదంటున్నాడు యువీ. అశూకు ఆ అర్హత లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘అశ్విన్ గొప్ప బౌలరే... కానీ వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదు. టెస్టుల్లో ఆల్రౌండర్గా అతడు బెస్ట్.. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్గా, ఫీల్డర్గా తను ఏం చేయగలడు? అందుకే టెస్టుల్లో తను కచ్చితంగా ఉండాలి. కానీ వైట్బాల్ క్రికెట్ జట్టులో అతడికి చోటు అవసరం లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు. 37 ఏళ్ల అశూ వైట్బాల్ జట్టులో అనవసరం! కాగా ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో అశ్విన్ 116 వన్డేల్లో 156.. అదే విధంగా 65 టీ20లలో 72 వికెట్లు తీశాడు. అయితే, వన్డే, టీ20లలో యువ బౌలర్లు ప్రతిభ నిరూపించుకుంటున్నప్పటికీ 2011 మొదలు తాజాగా ముగిసిన 2023 వరల్డ్కప్ జట్లలో 37 ఏళ్ల అశూకు స్థానం లభించింది. ఈ నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ.. -
అదొక్కటి తప్ప.. అన్నీ పూర్తి చేశానని గర్వంగా చెప్పగలను: గిల్
Shubman Gill About 2023: 2023.. తనకు మరుపురాని అనుభవాలు మిగల్చడంతో పాటు ఎన్నో పాఠాలు నేర్పిందని టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ అన్నాడు. అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు తాను శాయశక్తులా కృషి చేశానని.. కొత్త సంవత్సరంలో మరిన్ని కఠిన సవాళ్లకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఒకటీ రెండు చేదు అనుభవాలు మినహా.. 2023 గొప్పగా గడిచిందని ఈ యువ ఓపెనర్ హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లో ద్విశతకం కాగా గతేడాది శుబ్మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదడంతో పాటు.. టెస్టు, టీ20 ఫార్మాట్లోనూ సెంచరీలతో మెరిశాడు. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి వరల్డ్కప్ కూడా ఆడాడు. మొత్తంగా 2023లో 29 వన్డేలు ఆడి 1584 పరుగులు చేసిన గిల్.. టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో దుమ్ములేపాడు అంతేగాకుండా ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ గొప్పగా రాణించాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ తరఫున 17 ఇన్నింగ్స్ ఆడి 890 పరుగులు సాధించాడు గిల్. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇలా సీజన్ ఆసాంతం బ్యాట్ ఝులిపించిన ఈ పంజాబీ బ్యాటర్.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అదే విధంగా హార్దిక్ పాండ్యా టైటాన్స్ను వీడటంతో ఐపీఎల్-2024 ఎడిషన్కు గానూ అతడి స్థానంలో కెప్టెన్గా నియమితుడయ్యాడు. అందుకు గర్విస్తున్నా ఈ క్రమంలో.. 2023కు వీడ్కోలు పలుకుతూ శుబ్మన్ గిల్ ఇన్స్టాలో పోస్ట్ షేర్ చేశాడు. ‘‘గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాల్లో.. భారత్ తరఫున అత్యధిక శతకాలు బాదడం.. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచటం.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం.. వరల్డ్కప్ గెలవడం.. వంటివి ఉన్నాయి. వీటిలో ఒక్కటి మినహా దాదాపుగా అన్నీ సాధించాను. 2023 ఎన్నో అనుభవాలు మిగిల్చింది. సరదాలు, సంతోషాలతో పాటు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. అయితే, అనుకున్నట్లుగా ఏడాదిని పూర్తి చేయలేకపోయా(టీమిండియా వరల్డ్కప్ ఓటమి). అయితే, లక్ష్యాలకు చేరువగా వచ్చామని గర్వంగా చెప్పగలను. వచ్చే ఏడాదిలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగి.. 2024లో గోల్స్ సాధిస్తామని ఆశిస్తున్నా’’ అని గిల్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2023లో తను సాధించిన విజయాల తాలుకు ఫొటోలతో పాటు.. తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను శుబ్మన్ గిల్ ఇందుకు జతచేశాడు. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) -
మంచి జట్టే! కానీ టీమిండియా ఏదీ గెలవలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటు విమర్శలు చేశాడు. గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించిందని ప్రశ్నించాడు. పటిష్ట జట్టు అని చెప్పుకోవడమే తప్ప.. జట్టులోని వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దాఖలాలే లేవని విమర్శించాడు. టీ20 వరల్డ్కప్-2022 సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓడినప్పటి నుంచి మైకేల్ వాన్.. రోహిత్ సేనపై కఠిన విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాడు. అంచనాలు అందుకోలేని ఓ అండర్అచీవ్ టీమ్ అంటూ ఎద్దేవా చేస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో మరోసారి తన వ్యాఖ్యలకు పదును పెట్టాడు వాన్. ఫాక్స్ స్పోర్ట్స్ షోలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వాతో కలిసి పాల్గొన్న మైకేల్ వాన్.. అతడిని ఉద్దేశించి.. ‘‘క్రికెట్ ప్రపంచంలో ఎంతో గొప్ప జట్టు అనుకునే టీమిండియా అండర్అచీవ్ టీమ్ అని భావిస్తున్నారా?’’ అని అడిగాడు. ఇందుకు స్పందించిన మార్క్ వా తిరిగి అదే ప్రశ్న వేయడంతో మైకేల్ వాన్ బదులిచ్చాడు. ఈ మేరకు.. ‘‘ఇటీవలి కాలంలో టీమిండియా చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించలేదు. వాళ్లపై అంచనాలు పెట్టుకున్న ప్రతిసారి వమ్ము చేస్తూనే ఉంటారు. వాళ్లు చివరిసారిగా అతి గొప్ప విజయం ఎప్పుడు సాధించారో గుర్తుందా? నిజానికి వాళ్ల దగ్గర ప్రతిభ, నైపుణ్యాలు గల ఆటగాళ్లకు కొదువలేదు. కానీ వారి సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారా? అప్పుడెప్పుడో ఆస్ట్రేలియాలో రెండుసార్లు టెస్టులు గెలిచారు. కానీ వరల్డ్కప్ టోర్నీల సంగతేంటి? గత కొన్నేళ్లుగా వాళ్లు ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. నిజానికి ఇండియా మంచి టీమ్. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయినా ఏం లాభం? వాళ్లు ఇక ముందు కూడా గెలుస్తారనే నమ్మకం లేదు’’ అని మైకేల్ వాన్ టీమిండియా ఆట తీరును తక్కువ చేసే విధంగా మాట్లాడాడు. కాగా మహేంద్ర సింగ్ సారథ్యంలో 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. టీ20 వరల్డ్కప్-2021, టీ20 వరల్డ్కప్-2022లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన టీమిండియా.. ఇటీవల సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లోనూ విజయలాంఛనం పూర్తి చేయలేకపోయింది. ఫైనల్ వరకు చేరినా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో రెండు పర్యాయాలు ఫైనల్లో అడుగుపెట్టినా ఆఖరి గండాన్ని దాటలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టెస్టు గెలిచి సిరీస్ను డ్రా చేసుకోవాలని పట్టుదలగా ఉంది. చదవండి: Ind vs SA: రోహిత్ ప్రాక్టీస్.. టీమిండియా పేసర్కు గాయం.. రెండో టెస్టుకు డౌటే! -
గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు
He’s a super talent: టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ప్రశంసలు కురిపించాడు. మెన్స్ క్రికెట్లో అతడు దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడని అంచనా వేశాడు. ఈ ఏడాది గిల్ అత్యుత్తమంగా రాణించాడంటూ అతడిని ‘‘సూపర్ టాలెంట్’’గా అభివర్ణించాడు. అత్యధిక పరుగుల వీరుడు కాగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2023లో మొత్తంగా 29 వన్డేలు ఆడిన 24 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. సగటు 63.36తో 1584 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో గిల్.. 149 బంతుల్లోనే 208 పరుగులు రాబట్టి సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. అంతేకాదు.. టీ20, టెస్టు ఫార్మాట్లోనూ ఒక్కో శతకం బాది సత్తా చాటాడు. అద్భుత నైపుణ్యాలు... తనకు తానే సాటి ఈ నేపథ్యంలో రాబోయే తరం క్రికెట్ సూపర్స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ నాసిర్ హుసేన్.. శుబ్మన్ గిల్ పేరును ప్రస్తావించాడు. ‘‘మెన్స్ క్రికెట్ నెక్ట్స్ సూపర్స్టార్ ఎవరంటే నేను శుబ్మన్ గిల్ పేరు చెబుతాను. 2023లో అతడు అత్యుత్తమంగా ఆడాడు. మరో ఎండ్ నుంచి తనకు సహకారం అందించే రోహిత్ శర్మ వంటి సీనియర్ల నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. గిల్ అద్భుత నైపుణ్యాలు కలిగిన ఆటగాడు. టీమిండియా తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన ప్రదర్శనలు ఇవ్వగలడు. 2024లోనూ అతడి ఫామ్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని నాసిర్ హుసేన్ శుబ్మన్ గిల్ను కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్స్టా వేదికగా పంచుకుంది. రచిన్ రవీంద్ర జోరు కొనసాగాలి ఇక ఈ ఏడాది గిల్తో పాటు న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తనను బాగా ఆకట్టుకున్నాడని నాసిర్ హుసేన్ తెలిపాడు. అతడి జోరు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. కాగా రచిన్ రవీంద్ర వన్డే వరల్డ్కప్-2023లో ఏకంగా మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే. పది ఇన్నింగ్స్లో కలిపి 578 పరుగులు రాబట్టాడు రచిన్. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరిని ఎంపిక చేయకుండా పెద్ద తప్పు చేశారు: భజ్జీ View this post on Instagram A post shared by ICC (@icc) -
అప్పుడు చాలా బాధపడ్డాను.. కానీ చాలా మంది సపోర్ట్గా నిలిచారు: రోహిత్
వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టును రోహిత్ నడిపించనున్నాడు. సఫారీ గడ్డపై ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ను.. ఈ సారి సొంతం చేసుకుని తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలని హిట్మ్యాన్ పట్టుదలతో ఉన్నాడు. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రీమ్యాచ్ కాన్ఫెరెన్స్లో రోహిత్ పాల్గొన్నాడు. ప్రపంచ కప్ ఓటమి గురించి రోహిత్ శర్మను మరోసారి విలేకరులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. 'ప్రపంచకప్లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ట్రోఫీ కోసం చాలా చాలా కష్టపడ్డాము. ఫైనల్ మ్యాచ్లో మేము కొన్ని విభాగాల్లో రాణించలేకపోయాం. ఆఖరిపోరులో ఓడిపోవడం చాలా బాధ కల్గించింది. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు పోవడానికి కొత్త దారులు వెతకాలి. ఓటమి తర్వాత చాలా మంది మాకు మద్దతుగా నిలిచారు. అది వ్యక్తిగతంగా నన్ను ఓటమి బాధ నుంచి కోలుకునేలా ప్రేరేపించింది. ప్రస్తుతం నా దృష్టి సౌతాఫ్రికా సిరీస్ పైనే ఉంది. పరిస్ధితులు ఎలా ఉన్న నేను బాగా బ్యాటింగ్ చేయడానికి 100 శాతం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రోటీస్ సిరీస్లో రోహిత్తో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా కూడా భాగమయ్యారు. చదవండి: IND vs AUS: ఆసీస్తో వన్డే, టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! యువ క్రికెటర్కు ఛాన్స్ -
నా ఆటకు పునాది.. సర్వస్వం.. సంతృప్తి ఇక్కడే: కోహ్లి భావోద్వేగం
Virat Kohli Comments: ‘‘నా ఆటకు టెస్టు క్రికెట్ పునాది. ఇదొక చరిత్ర. ఒక సంస్కృతి. వారసత్వం. సర్వస్వం ఇదే. ప్రత్యర్థి జట్టుతో నాలుగు- ఐదు రోజుల పాటు పోటీపడటం అన్నింటికంటే భిన్న అనుభవాన్ని ఇస్తుంది. బ్యాటర్గా.. జట్టుగా ఈ ఫార్మాట్లో ఆడటం వల్లే పూర్తి సంతృప్తి లభిస్తుంది. క్రీజులో గంటల తరబడి నిలబడి.. జట్టును గెలిపించే అవకాశం దక్కడం అన్నిటికంటే ప్రత్యేకమైన భావన. నేను సంప్రదాయ క్రికెట్ను ఎక్కువగా ఇష్టపడేవాడిని. అందుకే నాకు టెస్టులంటే అమితమైన ఇష్టం. టీమిండియా తరఫున వంద కంటే ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. టెస్టు క్రికెటర్ కావాలన్న నా చిరకాల కల నెరవేరడమే గాకుండా ఇక్కడిదాకా వచ్చినందుకు గర్వంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. మూడు ఫార్మాట్లలో తనకు టెస్టులు ఆడటమే అత్యంత సంతృప్తినిస్తుందని పేర్కొన్నాడు. వరల్డ్కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో విరాట్ కోహ్లి సత్తా చాటిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ రన్మెషీన్.. ఐసీసీ ఈవెంట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ప్రపంచకప్ టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు సఫారీ గడ్డపై భారత జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపవాదు చెరిపివేసేందుకు తన వంతు ప్రయత్నం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి స్టార్ స్పోర్ట్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చిన కోహ్లి.. తన కెరీర్లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడు ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా నుంచి అనూహ్యంగా స్వదేశానికి తిరిగి బయల్దేరిన విషయం తెలిసిందే. ‘వ్యక్తిగత కారణాలతో’ కోహ్లి వెనక్కి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లి ఇంటికి వెళ్లడంపై స్పష్టమైన కారణం ఏమిటో తెలియకపోయినా... ఈ విషయంపై అతను ముందే బీసీసీఐ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ‘‘గురువారమే కోహ్లి భారత్కు బయల్దేరాడు. ఇది ముందే నిర్ణయించుకున్నది. అందుకే అతను భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా ఆడలేదు’ అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఈ నెల 26 నుంచి జరిగే తొలి టెస్టు సమయానికి అతను మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుంటాడని, మ్యాచ్ కూడా ఆడతాడని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలి గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్కు పిలుపునిచ్చారు సెలక్టర్లు. చదవండి: ఆర్సీబీకి ఆడాలనేది నా కల.. ఇప్పుడిలా: కేఎల్ రాహుల్ Test cricket is the toughest & most demanding but the best form of cricket! It's pure, rich in history & heritage, say legends @ImRo45 & @imVkohli ahead of the Final Frontier vs #SouthAfrica. Tune-in the 1st #SAvIND Test TUE, DEC 26, 12:30 PM | Star Sports Network pic.twitter.com/wZDFGlVAVC — Star Sports (@StarSportsIndia) December 23, 2023 -
అది గతం.. ఇప్పుడు రోహిత్ మునుపటిలా లేడు: మంజ్రేకర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లలో హిట్మ్యాన్ అత్యుత్తమ టెస్టు బ్యాటర్గా ఎదిగాడని కొనియాడాడు. లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్లో సమర్థవంతంగా ఆడలేడన్న అపవాదును చెరిపివేసుకున్నాడని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్తో హిట్మ్యాన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపఖ్యాతిని పోగొట్టడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్లో రోహిత్ శర్మ బాగా ఆడలేడు అనేది గతం. గత రెండు మూడేళ్లలో అతడు తన బలహీనతలను అధిగమించాడు. మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం తను అత్యుత్తమ టెస్టు ప్లేయర్గా కనిపిస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా ఆడాడు. టెస్టు ఓపెనర్గా రాణిస్తూ ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ చేయడంతో పాటు టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. గంటల కొద్దీ క్రీజులో నిలబడి ఓపికగా ఆడాడు. ఇక ముందు లెఫ్టార్మ్ పేసర్లను అతడు విజయవంతంగా ఎదుర్కోవడం మనం చూస్తాం’’ అని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ తప్పక రాణిస్తాడని సంజయ్ మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిసెంబరు 26న సౌతాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్టు మొదలుకానుంది. చదవండి: పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం -
విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే
2023.. టీమిండియా స్టార్ బ్యాటర్, రన్మిషన్ విరాట్ కోహ్లికి చాలా ప్రత్యేకం. ఈ ఏడాది విరాట్కు తన జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన ఏడాది ఇది. ఎవరికి సాధ్యం కాదనుకున్న వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లి.. తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన విరాట్.. వరల్డ్క్రికెట్లో తానే కింగ్ అనే మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో విరాట్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డుతో పాటు మరిన్నో అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాదిలో కోహ్లి సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లి సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో విరాట్ రెండు అద్భుతమైన సెంచరీలతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు ఈ క్యాష్రిచ్ లీగ్లో 7 సెంచరీలు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(6) పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్తో గేల్ ఆల్టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. తొలి ఆటగాడిగా.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 7000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు 229 ఐపీఎల్ ఇన్నింగ్స్లలో 7263 పరుగులు కోహ్లి చేశాడు. సచిన్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్కప్లో-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కుపైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్(7) ఆల్టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. 765 పరుగులతో.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023 విరాట్ కోహ్లి దుమ్మురేపాడు. 11 మ్యాచ్లు ఆడి 765 పరుగులతో టోర్నీ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. తద్వారా వన్డే వరల్డ్కప్ ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(674)ను అధిగమించాడు. పాకిస్తాన్పై వరల్డ్ రికార్డు.. వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఆసియాకప్-2023లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ను బ్రేక్ చేశాడు. సచిన్ 321 ఇన్నింగ్స్లలో ఈ మైలు రాయిని అందుకోగా.. కోహ్లి కేవలం 267 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి 3.O.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. 2019-2022 ఏడాది మధ్య గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నాడు. ఒకనొక దశలో జట్టులో కోహ్లి అవసరమా అన్న స్ధితికి దిగజారిపోయాడు. ఇటువంటి సమయంలో దెబ్బతిన్న సింహంలా కోహ్లి అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్లో ఆసియాకప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో మెరుపు సెంచరీ చేసిన విరాట్.. తన 1000 రోజుల నిరీక్షణకు తెరదించాడు. ఇక అప్పటినుంచి కోహ్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ఏడాదిని సెంచరీతో ఆరంభించిన కోహ్లి పరుగులు వరుద పారించాడు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 27 వన్డేలు, 7 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. వరుసగా 1377, 557 పరుగులు చేశాడు. ఓవరాల్ ఈ ఏడాదిలో 8 సెంచరీలు విరాట్ సాధించాడు. కాగా గతేడాది టీ20 వరల్డ్కప్ నుంచి ఇప్పటివరకు భారత తరపున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అదొక్కటే.. ఈ ఏడాదిలో ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లికి ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్ ట్రోఫిని ముద్దాడాలన్న కోహ్లి కల మాత్రం నెరవేరలేదు. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా ఆఖరి మొట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తా పడింది. ఓటమి అనంతరం కోహ్లి కన్నీరు పెట్టుకున్నది అభిమానులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. -
నేనొక భారత ముస్లింని గర్వంగా చెబుతా.. నన్ను ఎవరు ఆపుతారు: షమీ
వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా మైదానంలో నమాజ్ చేశాడని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన షమీ.. తనపై విమర్శల చేసిన వారికి గట్టి కౌంటరిచ్చాడు. తాను గర్వించదగిన భారత ముస్లింనని, నమాజ్ చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరని సీరియస్ అయ్యాడు. అసలేం ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్లో మహ్మద్ షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. కాగా ఈ మెగా టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో తన ఐదు వికెట్ల హాల్ను అందుకోగానే షమీ మెకాలిపై కూర్చోని రెండు చేతులతో నేలను తాకుతూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే షమీ సెలబ్రేషన్స్ను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడని ఆరోపిస్తూ అతడిని ట్రోలు చేశారు. నన్ను ఆపేవారు ఎవరు? "నేను నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను ప్రార్థన చేయాలనుకుంటే చేస్తా. ఇందులో ఉన్న సమస్య ఏంటి? నేను ఒక భారతీయ ముస్లింనని గర్వంగా చెబుతాను. నమాజ్ చేయడానికి ఎవరో అనుమతి తీసుకోవాలంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉంటాను? ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు 5 వికెట్లు సాధించాను. అప్పుడు ఎప్పుడైన నేను నమాజ్ చేయడం మీరు చూశారా? ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. నేను ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్లి నమాజ్ చేస్తాను. శ్రీలంకతో మ్యాచ్లో వికెట్ల కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశాను. దీంతో కాస్త అలసటకు గురై మోకాళ్లపై కూర్చున్నాని ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పేర్కొన్నాడు. కాగా షమీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు సిద్దమవుతున్నాడు. -
#Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్గా మార్చి మరీ!
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించి చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఇటలీలోని టస్కనీ వేదికగా ‘విరుష్క’ వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్- అనుష్క ఒక్కటయ్యారు. షాంపూ యాడ్ ద్వారా 2013లో పరిచయమైన వీరిద్దరు చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విషయం తెలిసిందే. అయితే, చాలా మంది సెలబ్రిటీల లాగే వీరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ వదంతులు వ్యాప్తి చేసిన వారి మాటలను నీటి మూటలు చేస్తూ విరుష్క వెడ్లాక్తో ముడిపడిపోయారు. కాగా విరాట్- అనుష్క జోడీ పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా .. రహస్యంగా పెళ్లి తంతు ముగించేశారు. విరాట్ కాదు రాహుల్! ఈ విషయం గురించి అనుష్క శర్మ గతంలో వోగ్తో మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో విరాట్- తాను ఒక్కటయ్యామని తెలిపింది. అంతేకాదు విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా తమ పెళ్లి వార్త లీక్ కాకుండా నకిలీ పేరు వాడినట్లు వెల్లడించింది. ‘‘మేము నిరాడంబరంగా.. హోమ్ స్టైల్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మొత్తం ఆరోజు 42 మంది ఉన్నారు. అదొక సెలబ్రిటీ జంట పెళ్లిగా కాకుండా.. కేవలం విరాట్- అనుష్కల పెళ్లిలా ఉండాలని కోరుకున్నాం. అంతేకాదు కేటరర్ విషయంలో విరాట్ పేరు బయటికి రాకుండా అతడికి ‘రాహుల్’ అనే నకిలీ పేరును వాడాం. ప్రేమతో రెండు మనసులు ఏకమయ్యే వేడుకకు పబ్లిసిటీ అవసరం లేదని భావించాం. అందుకే హంగూఆర్భాటాలు లేకుండా పవిత్రత, శాంతితో కూడిన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం’’ అని అనుష్క శర్మ తెలిపింది. అప్పటికే టీమిండియా కెప్టెన్గా విరాట్ పెళ్లినాటికి టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి- నటిగా అనుష్క శర్మ తమ కెరీర్లో తారస్థాయిలో ఉన్నారు. అయితే, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే తలంపుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీడియాకు దూరంగా వామిక ఇక ఈ జంటకు 2021, జనవరి 11న కూతురు జన్మించింది. పాపకు వామికా కోహ్లిగా నామకరణం చేసిన విరుష్క... ఇంతవరకు ఆమె ఫేస్ను మాత్రం రివీల్ చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా.. స్టార్ కిడ్గా కాకుండా సాధారణ అమ్మాయిలా తమ కుమార్తెను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు ఇప్పటికే విరుష్క జోడీ వెల్లడించింది. రికార్డుల రారాజు.. వరల్డ్కప్ ఓటమితో కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వన్డే వరల్డ్కప్-2023 టాప్ రన్ స్కోరర్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో కోహ్లి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో సెలవులు తీసుకున్న కోహ్లి భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి లండన్ టూర్కు వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ రన్మెషీన్ డిసెంబరు 26న మైదానంలో దిగే అవకాశం ఉంది. చదవండి: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది........ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!.. -
వన్డే వరల్డ్కప్ ఫైనల్ పిచ్కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే?
వన్డే ప్రపంచకప్-2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో భారత్ను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా ఆసీస్ నిలిచింది. ఈ మెగా టోర్నీలో వరుసగా పది మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మొట్టుపై బోల్తా పడింది. ఇక ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ఫైనల్, సెమీఫైనల్ కు మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు రేటింగ్ ఇచ్చింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా పిచ్ కు యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది. పిచ్ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. కాగా ఫైనల్ మ్యాచ్ పిచ్పై టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండడంతో ఆసీస్కు బ్యాటింగ్ సులభమైంది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ పిచ్ కు గుడ్ రేటింగ్ దక్కింది. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ ఈ రేటింగ్ ఇచ్చారు. అయితే రెండో సెమీఫైనల్కు వేదికైన ఈడెన్ గార్డెన్స్ పిచ్కు కూడా ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. లో స్కోరింగ్ థ్రిల్లర్లో ఆసీస్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఆడిన 11 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ల పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ వచ్చింది. చదవండి: IPL 2024-Mohammed Shami: గుజరాత్ టైటాన్స్కు షమీ గుడ్బై..? -
చెన్నైపై మిచౌంగ్ తుపాను దెబ్బ.. స్పందించిన వార్నర్! పోస్ట్ వైరల్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు ఐపీఎల్ ద్వారా భారత్తో అనుబంధం ఏర్పడింది. చాలా కాలం పాటు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఆడిన ఈ వెటరన్ ఓపెనర్.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్తో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు భారత్ పట్ల అభిమానం చాటుకుంటూ టీమిండియా ఫ్యాన్స్కు కూడా చేరువయ్యాడు. తాజాగా చెన్నై వరదల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి ప్రత్యేకతను చాటుకున్నాడు వార్నర్. మిచౌంగ్ తుపాను ప్రభావం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరద ముంచెత్తడంతో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్లు, చెన్నైకి చెందిన దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్ ప్రజలంతా ఇంటికే పరిమితమై సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా.. సహాయక బృందాలు అవసరమైన వాళ్లకు తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక యువ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీశ పతిరణ సైతం ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సైతం చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు. విపత్కర పరిస్థితుల నుంచి నగరం తొందరగా బయటపడాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘చెన్నైలోని చాలా వరకు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లను చూస్తుంటే బాధ కలుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్లు అవసరమైన వాళ్లకు తప్పక సాయపడండి. ఎక్కడున్నా ఒకరికొకరం మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది’’అని తన అభిమానులను ఉద్దేశించి వార్నర్ పోస్ట్ చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్లో ఫైనల్లో గెలిచి ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో టీమిండియా ఆసీస్ను ఓడిస్తే.. తుదిపోరులో కంగారూ జట్టు రోహిత్ సేనపై గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్లలోనూ వార్నర్ ఆడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
భారత్కు తిరిగి వచ్చిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Sharma returns to India after vacation: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. భార్య రతికా సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి సోమవారం ముంబైలో అడుగుపెట్టాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీ గెలవాలని రోహిత్ సేన ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు వరుసగా పది మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై మాత్రం బోల్తా పడింది. అహ్మదాబాద్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రిక్తహస్తాలతో మిగిలిపోయింది. మరోవైపు.. భారత గడ్డపై టీమిండియాను ఓడించిన కంగారూ జట్టు ఆరోసారి జగజ్జేతగా అవతరించి సంబరాలు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నాడు. టీమిండియాకు వరల్డ్కప్ అందించిన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని సరసన నిలవాలనుకున్న కల చెదిరిపోయినందుకు కన్నీటి పర్యంతమయ్యాడు. హాలిడే ట్రిప్నకు లండన్ వెళ్లిన రోహిత్ శర్మ ఈ క్రమంలో నవంబరు 19 నాటి ఫైనల్ తర్వాత సెలవులు తీసుకున్నాడు రోహిత్ శర్మ. కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్నకు లండన్కు వెళ్లాడు. కొద్దిరోజుల పాటు కుటుంబంతో గడిపిన రోహిత్ సోమవారం భారత్కు తిరిగి వచ్చాడు. భార్య రితికాతో పాటు ముంబై ఎయిర్పోర్టు నుంచి రోహిత్ ఇంటికి పయనమైన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో రోహిత్ తన గారాలపట్టి సమైరా శర్మను ఎత్తుకుని నడుస్తూ.. కార్లో కూర్చోపెట్టిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘కెప్టెన్ సాబ్ బెస్ట్ డాడీ’’ రోహిత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వరల్డ్కప్ తర్వాత.. స్వదేశంలో ఆస్ట్రేలియా టీ20 సిరీస్కు దూరంగా ఉన్న రోహిత్.. సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదు. అతడి గైర్హాజరీలో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును ముందుకు నడిపించనున్నారు. టెస్టు సిరీస్ నాటికి మాత్రం రోహిత్ శర్మ జట్టుతో చేరతాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం అప్పుడే పునరాగమనం చేస్తాడు. చదవండి: IND vs SA: మిషన్ సౌతాఫ్రికా.. మరో టీ20 సిరీస్పై కన్నేసిన టీమిండియా View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
టీమిండియాను భారతీయుడు, పాక్ను పాకిస్తానీయే నడిపించాలి: గంభీర్
టీమిండియా, పాకిస్తాన్ కోచింగ్ సిబ్బందిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్ల సేవల కోసం తాపత్రయ పడకుండా.. స్వదేశీ క్రికెటర్లను మార్గ నిర్దేశకులుగా నియమించుకుంటే సత్ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు భారత జట్టు చక్కని ఉదాహరణ అంటూ పరోక్షంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు. కాగా గత కొన్నేళ్లుగా టీమిండియాకు భారత మాజీ క్రికెటర్లు హెడ్కోచ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలాకాలం వరకు రవిశాస్త్రి, అతడి తర్వాత ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా సేవలు అందిస్తున్నాడు. అయితే, పాకిస్తాన్ మాత్రం ఎక్కువగా విదేశీ కోచ్లనే నియమించుకుంటోంది. అయితే, వరల్డ్కప్-2023లో ఘోర పరాభవం తర్వాత మాత్రం పూర్తి ప్రక్షాళనకు సిద్ధమై.. మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఆడిన విధానం చూసిన తర్వాత.. మనకు బయటి వ్యక్తులు కోచ్లుగా అవసరం లేదనే విషయం నిరూపితమైంది. విదేశీ కోచ్ల కంటే మన కోచ్లు ఏమాత్రం తక్కువకాదు. అయితే, మనవాళ్లకున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. విదేశీ కోచ్లలా.. ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవడం.. ఆ ల్యాప్టాప్లు పట్టుకుని హల్చల్ చేయడం.. అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడం వంటివన్న మాట! ఎందుకంటే మనది కార్పొరేట్ సంస్కృతి కాదు. అయితే, క్షేత్రస్థాయి నుంచే మన ఆటగాళ్లను మెరికల్లా ఎలా తీర్చిదిద్దాలో మనవాళ్లకు బాగా తెలుసు’’ అని గంభీర్ స్పోర్ట్స్కీడాతో వ్యాఖ్యానించాడు. ఇదే షోలో పాల్గొన్న పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రంతో చర్చిస్తూ.. ‘‘మనవి ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడుతున్న దేశాలు కాదు. వరల్డ్కప్ గెలిచిన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. టీమిండియాను భారత కోచ్, పాకిస్తాన్ టీమ్ను పాకిస్తానీ ముందుకు నడిపించగలరు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా 2007 టీ20, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియాలో గంభీర్ సభ్యుడు. ఇక 2007లో భారత జట్టుకు కోచ్గా లాల్చంద్ రాజ్పుత్ వ్యవహరించగా.. 2011లో గ్యారీ కిర్స్టన్ మార్గదర్శనం చేశాడు. చదవండి: WC 2023: రోహిత్, ద్రవిడ్ను వివరణ అడిగిన బీసీసీఐ.. హెడ్కోచ్ ఆన్సర్ ఇదే?! -
వరల్డ్కప్ ఓటమిపై వివరణ అడిగిన బీసీసీఐ.. ద్రవిడ్ ఆన్సర్ ఇదే!?
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ద్రవిడ్ అహ్మదాబాద్ పిచ్ తయారు చేసిన విధానం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచకప్ ఫైనల్లో పరాజయంతో రోహిత్ సేనతో పాటు కోట్లాది అభిమానుల హృదయాలు ముక్కలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది గెలిచి.. సెమీస్లోనూ సత్తా చాటిన భారత జట్టు తుదిపోరులో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయింది. సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ట్రోఫీ గెలుస్తుందని ధీమాగా ఉన్న రోహిత్ సేనకు షాకిచ్చిన ఆసీస్ ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసీస్తో ఫైనల్లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ రాహుల్ ద్రవిడ్, రోహిత శర్మను వివరణ అడిగినట్లు దైనిక్ జాగరణ్ తాజాగా కథనం వెలువరించింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం.. బీసీసీఐ సమావేశానికి రాహుల్ ద్రవిడ్ ప్రతక్ష్యంగా హాజరు కాగా.. కుటుంబంతో పాటు లండన్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి రాజీవ్ శేఖర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో.. టీమిండియా వైఫల్యం గురించి ద్రవిడ్, రోహిత్ శర్మను వివరణ కోరారు. ఇందుకు బదులుగా.. నరేంద్ర మోదీ స్టేడియంలో తయారు చేసిన స్లో ట్రాక్ తమ అవకాశాలను దెబ్బకొట్టిందని ద్రవిడ్ సమాధానమిచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ ఊహించినట్లుగా పిచ్ నుంచి సహకారం అందలేదని.. బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడం ప్రభావం చూపిందని ద్రవిడ్ తెలిపాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను స్పిన్ మాయాజాలంతో తిప్పలు పెట్టాలన్న వ్యూహాలు ఫలించలేదని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా మోదీ స్టేడియంలో నవంబరు 19న టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. రోహిత్ శర్మ 47 పరుగులు, విరాట్ కోహ్లి 54, కేఎల్ రాహుల్ 66 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ను ఓపెనర్ ట్రవిస్ హెడ్ 137 పరుగులతో రాణించి విజయతీరాలకు చేర్చాడు. తద్వారా కంగారూ జట్టు మరోసారి వన్డే వరల్డ్కప్ చాంపియన్గా నిలిచింది. చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే -
‘అలా అయితేనే షమీ టీ20 ప్రపంచకప్ ఆడతాడు.. లేదంటే!’
అనూహ్య రీతిలో వన్డే వరల్డ్కప్-2023 ఆడే అవకాశం దక్కించుకున్న టీమిండియా వెటరన్ స్పీడ్స్టర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మూడో ఆప్షన్గా తుది జట్టులో చోటు సంపాదించిన ఈ రైటార్మ్ పేసర్.. 7 మ్యాచ్లలో కలిపి 24 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ షమీ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఇలా సత్తా చాటిన షమీ ప్రస్తుతం చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిని సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్కు ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. అదే విధంగా టెస్టు జట్టులోనూ షమీ అందుబాటులో ఉంటాడో లేదోనన్న విషయంలో సందిగ్దత ఉంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్వయంగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడని.. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో షమీ అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్లో షమీ ఆడతాడా లేదా అన్నది.. అతడి ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున అతడు గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి రానున్న ఎడిషన్లో షమీ ఎలా ఆడతాడో చూడాలి’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘మ్యాచ్ సమయంలో అతడికి గాయం కాలేదు. అయితే, మడిమ నొప్పి రాను రాను తీవ్రమైంది. ముంబైలో షమీ పలువురు డాక్టర్లను సంప్రదించాడు. తదుపరి జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు పునరావాసం పొందనున్నాడు’’ సదరు వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గాయమైతే అంత తీవ్రంగా లేదు. తన తమ్ముడు మహ్మద్ కైఫ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న మ్యాచ్ను చూడటానికి కూడా షమీ వచ్చాడు. అపుడు కాలు కాస్త ఉబ్బినట్లు కనిపించింది’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన షమీ దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తాడన్న విషయం తెలిసిందే. చదవండి: ‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్కు పంపాల్సింది’ -
ఆరోజు రోహిత్, కోహ్లి ఏడుస్తూనే ఉన్నారు.. మేమంతా
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పరిస్థితి చూడలేకపోయామని టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత వాళ్లిద్దరూ ఏడుస్తూనే ఉన్నారని నవంబరు 19 నాటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత వరల్డ్ కప్ టైటిల్ ముంగిట నిలిచిన భారత జట్టుకు ఆసీస్ షాకిచ్చిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షకు పైగా టీమిండియా అభిమానుల నడుమ ఆరోసారి చాంపియన్గా అవతరించింది. దీంతో కప్ గెలవాలనుకున్న రోహిత్ సేన ఆశలకు గండిపడింది. ఇక 36 ఏళ్ల రోహిత్ శర్మ, 35 ఏళ్ల విరాట్ కోహ్లికి ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ కానుందన్న తరుణంలో వారిద్దరు కంటతడి పెట్టిన తీరు అభిమానుల మనసులను మెలిపెట్టింది. చేతుల్లో ముఖం దాచుకుంటూ కన్నీళ్లను ఆపుకొంటూ ఇద్దరూ మైదానం వీడటం ఉద్వేగానికి గురిచేసింది. నాటి సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అశ్విన్.. "ఆరోజు మేమంతా చాలా బాధపడ్డాం. ముఖ్యంగా రోహిత్, కోహ్లి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్లిద్దరిని అలా చూసి మాకు మరింత బాధ కలిగింది. అసలు అలా జరగకుండా ఉండాల్సింది. ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న జట్టు. కచ్చితంగా గెలుస్తుందనే అనుకున్నాం. జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రలను చక్కగా పోషించారు. కానీ చేదు అనుభవం ఎదురైంది. సహజంగానే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఇద్దరు లీడర్లు ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చి వాళ్లు మరింత మెరుగుపడేలా చేశారు" అని రోహిత్, కోహ్లిల వ్యక్తిత్వాలను ప్రశంసించాడు. ఇక రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అన్న అశూ.. జట్టులోని ప్రతి ఆటగాడి ఇష్టాలు, అయిష్టాలు అతడికి తెలుసని పేర్కొన్నాడు. అందరి నైపుణ్యాల గురించి అతడికి అవగాహన ఉందని.. ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో రోహిత్కు బాగా తెలుసని కొనియాడాడు. అయితే, కొన్నిసార్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోక తప్పదంటూ ప్రపంచకప్ ఓటమిని ఉదాహరించాడు. కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరం కావడంతో అశ్విన్ ఆఖరి నిమిషంలో వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో అక్టోబరు 8 నాటి చెన్నై మ్యాచ్లో మాత్రమే ఆడే అవకాశం ఈ స్పిన్నర్కు దక్కింది. -
ఇక చాలు.. టీమిండియా తప్పులు తెలుసుకోవాలి.. 2007 తర్వాత..
గత దశాబ్దకాలంగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నా ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ప్రపంచకప్-2015లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇక 2019లో లీగ్ దశలో ఒకే మ్యాచ్ ఓడిపోయి సెమీస్ చేరిన టీమిండియాకు అక్కడ.. న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. అయితే, ఈసారి సొంతగడ్డపై పొరపాట్లకు తావివ్వకుండా కచ్చితంగా మరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లే రోహిత్ సేన ఫైనల్ వరకు అజేయంగా దూసుకువచ్చింది. టైటిల్కు అడుగుదూరంలో నిలిచిన భారత జట్టు గెలుపు లాంఛనమే అని అభిమానులు సంబరపడుతున్న వేళ.. ఫైనల్లో ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చింది. దీంతో మరోసారి టీమిండియాకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కాగా ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశమంతా భారత జట్టుకు అండగా నిలిచారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లోనైనా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఈ పరిణామాలపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనదైన శైలిలో స్పందించాడు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే మరోసారి చేదు అనుభవం ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. జట్టుకు అండగా నిలవడం మంచిదే అని.. అయితే, ప్రతిసారి ఏదో ఒక కారణం చూపి క్షమించేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. టీమిండియా 2007 తర్వాత ఇప్పటి వరకు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవకలేకపోవడాన్ని ప్రస్తావించిన గావస్కర్... "టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడది గతం. ఆ ఓటమి బాధ నుంచి త్వరగా తేరుకోవాలి. గత నాలుగు వరల్డ్ కప్ ఈవెంట్లలో రెండుసార్లు ఫైనల్ వరకు రాగలిగినా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది టీమిండియా. మిగతా జట్లతో పోలిస్తే ఈసారి మరింత గొప్పగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. అయితే.. ఇప్పటికైనా టీమిండియా తమ తప్పులను తెలుసుకుని విశ్లేషించుకోవాలి. ట్రోఫీ ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించుకోవాలి. పొరపాట్లను అంగీకరించే గుణం అలవరచుకోవాలి. అప్పుడే పురోగతి కనిపిస్తుంది. రానున్న వారం రోజుల్లో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 2007 తర్వాత మనం టీ20 ప్రపంచకప్ గెలవనేలేదు. ఐపీఎల్ రూపంలో ఇంత మంది యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నా ఇలా జరగడం విచారకరం" అని మిడ్ డేకు రాసిన కాలమ్లో పేర్కొన్నాడు. అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండాలని భావిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ల నిర్ణయాలు గౌరవించి.. వరల్డ్ కప్-2024 నాటికి యువ జట్టును సన్నద్ధం చేయాలని పరోక్షంగా సూచించాడు గావస్కర్. కాగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు -
ఇంతకంటే చెత్త ప్రదర్శన మరోటి ఉండదు.. స్పిన్ దిగ్గజం విమర్శలు
శ్రీలంక క్రికెట్ భవితవ్యంపై దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లుగా కెరీర్ ఎంచుకునే వాళ్లను భయపెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని వాపోయాడు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఈ విషయంలో చొరవ తీసుకొని లంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశాడు. భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్- 2023లో శ్రీలంక దారుణంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో డీలాపడ్డ లంక పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. 1975, 1983, 1987, 1992 ఎడిషన్ల తర్వాత మరోసారి ఇలాంటి ఘోర పరాభవం మూటగట్టుకుంది స్వర్ణ యుగం కాగా... 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక 2007, 2011లో రన్నరప్గా నిలిచింది 2003లో సెమి ఫైనల్ వరకు చేరింది. అలాంటి జట్టు ఈసారి పూర్తిగా విఫలం కావడం తనను బాధించిందని మురళీధరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో 1975 తర్వాత శ్రీలంకకు ఇదే అత్యంత చెత్త ఎడిషన్ అని విమర్శలు గుప్పించాడు. నిబద్ధత, అంకితభావం లోపించినందువల్లే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. వ్యక్తిగత అజెండాలను ఆటలపై రుద్దాలనుకోవడం సరికాదని బోర్డు సభ్యులను విమర్శించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్రికెట్ను తాకట్టు పెట్టొద్దని చురకలు అంటించాడు. వాళ్ల పరిస్థితి ఏం కావాలి? ఇలాంటి పరిణామాల వల్ల యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని పేర్కొన్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడాలనుకునే వాళ్లను చిన్నబుచ్చుకునేలా చేయొద్దని ముత్తయ్య మురళీధరన్ విజ్ఞప్తి చేశాడు కాగా వనిందు హసరంగ వంటి స్టార్ ఆల్ రౌండర్ ఫిట్గా ఉన్నప్పటికీ అతడిని పక్కన పెట్టారని లంక సెలక్షన్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. అదే విధంగా.. క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించే క్రమంలో తాను పాత కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆదేశ క్రీడామంత్రి రోషన్ రణసింగి గతంలో ప్రకటించారు. లంక బోర్డుపై నిషేధం అయితే బోర్డు సభ్యులు కోర్టుకు వెళ్లగా అక్కడ వారికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం ఈ విషయాలపై తీవ్రంగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ నిషేధం విధించింది ఈ పరిణామాల నేపథ్యంలో లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
ఆ్రస్టేలియా : స్వదేశంలో వరల్డ్ కప్ గెలుపు సంబరాలు (ఫొటోలు)
-
ద్రవిడ్ గురించి రోహిత్ అలా చెప్పడం సరికాదు: గంభీర్
ICC ODI WC 2023- Gambhir Comments On Rohit Sharma: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలను మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తప్పుబట్టాడు. రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి రోహిత్ అలా కామెంట్ చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు దేశం కోసం మాత్రమే ఆడాలని.. వ్యక్తుల కోసం కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారత జట్టు ట్రోఫీ గెలుస్తుందన్న ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా చరిత్రపుటల్లోకెక్కింది. ద్రవిడ్ కోసమన్న రోహిత్ అయితే, ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం తాము కప్ గెలవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. వరల్డ్కప్-2003లో ద్రవిడ్ ఆటగాడిగా ఉన్నపుడు ఆసీస్ చేతిలో భారత్ ఓడగా.. 20 ఏళ్ల తర్వాత అతడి మార్గదర్శనంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామన్న ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్కీడా ఇంటర్వ్యూలో గౌతం గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. దేశం కోసం ఆడాలే తప్ప.. వ్యక్తుల కోసం గెలుస్తామంటూ చెప్పడం సరికాదంటూ రోహిత్ వ్యాఖ్యలను విమర్శించాడు. తాను 2011 వరల్డ్కప్ సమయంలో కూడా ఇదే మాట సహచర ఆటగాళ్లతో చెప్పానని పేర్కొన్నాడు. సచిన్ కోసం నాడు ట్రోఫీ గెలిచామంటూ కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్కప్- 2011 చేరినపుడు.. సచిన్ టెండుల్కర్ కోసం తాము ట్రోఫీ గెలుస్తామంటూ కొంతమంది ఆటగాళ్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే సచిన్ సొంతమైదానం వాంఖడేలో శ్రీలంకను ఓడించి విజయాన్ని అతడికి బహుమతిగా అందించారు. ఈ రెండు సందర్భాల్లో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ గంభీర్.. ‘‘అసలు క్రికెటర్లు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు. ఒక వ్యక్తి కోసం తాము గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పడం సరికాదు. ఇలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు దేశం కోసం మనం టైటిల్ గెలవాలి అనుకోవాలి. ఒకవేళ మీరు ఓ వ్యక్తి కోసం ఇలా చేయాలని భావిస్తే అలాంటివి మీడియా ముందు చెప్పడం ఎందుకు? 2011లో చాలా మంది నాతో.. ‘‘మనం వ్యక్తి కోసం గెలవాలి’’అని చెప్పారు. కానీ నేను మాత్రం బ్యాట్ చేతబట్టి నా దేశం కోసం గెలుస్తానని వాళ్లందరికీ చెప్పాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా గౌతం గంభీర్ ఐపీఎల్తో బిజీ కానున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ 2024 సీజన్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కోల్కతా నైట్రైడర్స్కు మారిన గౌతీ.. ఆజట్టుకు మెంటార్గా వ్యవహరించనున్నాడు. చదవండి: మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య! -
క్రికెట్ బోర్డులో అవినీతి? నన్ను చంపేస్తారంటూ సంచలన ఆరోపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. వరల్డ్కప్లో పరాభవం ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది. లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు. నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం! ఈ మేరకు.. ‘‘క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్ స్టాఫ్ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించారు. భారీ ఆదాయానికి గండి! కాగా మంత్రి వర్గం నుంచి రోషన్ సస్పెన్షన్పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గతంలో వరల్డ్కప్ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. అభిమానులు ఖుషీ
ICC WC 2023- Rohit Sharma: అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. వన్డే వరల్డ్కప్-2023 ఓటమి తర్వాత తొలిసారి ఇన్స్టా వేదికగా అందమైన ఫొటోను పంచుకున్నాడు. కాగా.. ఆసియా వన్డే కప్-2023 గెలిచిన టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ కూడా గెలిచి సత్తా చాటుతుందని అభిమానులు భావించారు. సమిష్టి ప్రదర్శనతో సెమీస్కు అందుకు తగ్గట్లుగానే లీగ్ దశలో భారత జట్టు ఎదురులేని విజయాలతో సెమీస్కు దూసుకెళ్లింది. టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్, వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించారు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ అదరగొట్టడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఇక న్యూజిలాండ్తో సెమీ ఫైనల్లోనూ సమిష్టి కృషితో గెలుపొందిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోటీపడింది. ఆఖరి మెట్టుపై బోల్తా అయితే, అసలు పోరులో ఒత్తిడిని జయించలేక ఓటమిపాలైంది. అహ్మదాబాద్ మైదానంలో లక్ష పైచిలుకు అభిమానుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు ఓటమిపాలై టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయింది. దీంతో జట్టుతో పాటు టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలైపోయాయి. కన్నీళ్లను దిగమింగి కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు. ఇక తనకు అనధికారికంగా ఇదే ఆఖరి వన్డే వరల్డ్కప్ కావడం.. ఇక్కడిదాకా వచ్చి కూడా ట్రోఫీ చేజారడంతో 36 ఏళ్ల రోహిత్ మరింత కుంగిపోయాడు. చేతులతో ముఖం దాచుకుంటూ కన్నీళ్లను ఆపుకొనే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలు చూసి రోహిత్ ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మరేం పర్లేదు హిట్మ్యాన్.. ఆటలో గెలుపోటములు సహజం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాడికి అండగా నిలిచారు. అప్పటి నుంచి రోహిత్ ఎప్పుడెప్పుడు స్పందిస్తాడా అని ఆశగా ఎదురుచూశారు. సెలవుల్లో రోహిత్ శర్మ ఈ క్రమంలో భార్య రితికా సజ్దేతో ఉన్న ఫొటోను హిట్మ్యాన్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం హాలిడే మూడ్లో ఉన్న రోహిత్.. చెట్ల మధ్య ఉన్న మట్టిబాటలో భార్యతో కలిసి నడుస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ నడుస్తూ ఉన్న ఈ ఫొటో వైరల్గా మారింది. కాగా వరల్డ్కప్ తర్వాత రోహిత్ సహా మిగతా సీనియర్లు విశ్రాంతి తీసుకుంటుండగా.. యువ జట్టు సూర్యకుమార్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్లలో రెండూ గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. తదుపరి మంగళవారం మూడో టీ20 ఆడనుంది సూర్యసేన. చదవండి: Ind vs Aus: యశస్వి సరికొత్త చరిత్ర.. రోహిత్ రికార్డు బద్దలు! తొలి భారత బ్యాటర్గా.. A beautiful Instagram story by Rohit Sharma. pic.twitter.com/HPVjT6ihMm — Johns. (@CricCrazyJohns) November 26, 2023 -
కుర్చీ ఎత్తి కిందపడేయగలను.. కానీ!.. అందుకే యూపీకి ఆడలేదు: షమీ
Mohammed Shami Comments: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అమ్రోహా జిల్లాలోని సహాస్పూరాలో జన్మించాడు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం యూపీకి ఎప్పుడూ ఆడలేదు షమీ. తన ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చిన బెంగాల్ జట్టుకే సేవలు అందించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న షమీ.. ప్రస్తుతం భారత పేస్ త్రయంలో ముఖ్య సభ్యుడు. అంతేకాదు వన్డే వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ ఈ రైటార్మ్ పేసర్ రికార్డులు సాధించాడు. లేట్గా ఎంట్రీ ఇచ్చినా అవార్డుతో ముగించి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 సందర్భంగా ఆరంభంలో ఆడలేకపోయినా.. తర్వాత వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఏకంగా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. టోర్నీ మొత్తంలో 24 వికెట్లు తీసి అవార్డు అందుకున్నాడు. అంతాబాగానే ఉందని.. ఆఖర్లో ఇన్ని ఘనతలు సాధిస్తున్న షమీ సొంత రాష్ట్రం తరఫున ఒక్కసారి కూడా ఆడలేకపోయాడు. ఇందుకు గల కారణాన్ని తాజాగా ప్యూమా షోలో వెల్లడించాడు షమీ. ‘‘రంజీ టీమ్ ట్రయల్స్ కోసం రెండుసార్లు వెళ్లాను. అంతబాగానే ఉందని చెప్పి ఆఖర్లో నాకు మొండిచేయి చూపేవారు. మొదటి ఏడాదే చేదు అనుభవం ఎదురైనా.. నాలో ఆశావహ దృక్పథం కారణంగా మరోసారి ప్రయత్నించాం. కానీ మరుసటి ఏడాది కూడా అదే జరిగింది. ఆ సమయంలో నా సోదరుడు నాతోనే ఉన్నాడు. అపుడు చీఫ్గా ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి నా గురించి మాట్లాడాడు. కుర్చీ కదపడం కాదు.. ఎత్తి కిందపడేస్తా.. కానీ అందుకు బదులుగా అతడు ఇచ్చిన సమాధానం నా సోదరుడు జీవితంలో అంతకుముందెన్నడూ వినలేదు. అంత పరుషంగా మాట్లాడాడతను!! ‘‘నువ్వు నా కుర్చీని కదపగలిగితే.. మీ సోదరుడు సెలక్ట్ అయినట్లే.. అతడి కెరీర్ బాగుంటుంది. లేదంటే సారీ.. నేనేమీ చేయలేను!’’ అని నా సోదరుడితో అన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేను కేవలం ఈ కుర్చీని కదపడం కాదు.. ఎత్తి కిందపడేయగల బలవంతుడిని. నా తమ్ముడికి టాలెంట్ ఉంటే సెలక్ట్ చేయండి. లేదంటే వదిలేయండి’’ అని గట్టిగానే సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి.. ‘‘ఇక్కడ బలవంతులకు.. బలంగా ఉండేవాళ్లకు చోటు లేదు’’అని ముఖం మీదే చెప్పాడు. దీంతో బయటకొచ్చిన నా సోదరుడు.. నా ఫామ్ను చించేసి ఇకపై నువ్వు యూపీకి ఆడే ప్రసక్తే లేదని చెప్పాడు’’ అంటూ గతం తాలుకు చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు 33 ఏళ్ల మహ్మద్ షమీ. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అత్యంత ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్? -
IPL 2024: గంభీర్ గుడ్బై.. లక్నో మెంటార్గా రాహుల్ ద్రవిడ్?
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాగా టీ20 వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్కోచ్గా వైదొలగగా.. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో రాహుల్ మార్గదర్శనం, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్ ద్రవిడ్ను తమ మెంటార్గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. మెంటార్గా గౌతం గంభీర్ స్థానంలో ద్రవిడ్ అయితే బాగుంటుందని ఎల్ఎస్జీ యాజమాన్యం ఆలోచిస్తోందట. కాగా లక్నో మెంటార్గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తిరిగి కోల్కతా నైట్రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆవేశ్ ఖాన్ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో డైరెక్ట్ స్వాప్ ద్వారా దేవ్దత్ పడిక్కల్ను దక్కించుకుంది. కోచ్గా ఆస్ట్రేలియా మాజీ హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ను నియమించుకుంది. -
కోహ్లిలా ఉంటే రోహిత్ మరో వరల్డ్కప్ ఆడతాడు: లంక స్పిన్ దిగ్గజం
Rohit Sharma- T20I Future: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో వరల్డ్కప్ ఆడే సత్తా ఉన్నవాడేనని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్-2024లో అతడు ఆడతాడని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ దాకా అజేయంగా నిలిచిన టీమిండియా.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తప్పక అందుతుందనుకున్న ట్రోఫీ చేజారడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఇతర ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గత ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరమయ్యారు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఓటమి తర్వాత వీరిద్దరు ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకొనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్కప్లో అద్భుతంగా ఆడాడు ఈ నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ రోహిత్ కెరీర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వన్డే వరల్డ్కప్ టోర్నీలో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మెరుగైన స్ట్రైక్రేటుతో అతడి బ్యాటింగ్ సాగింది. ఈవెంట్ మొత్తంలో అతడు ఒక్కసారిగా వైఫల్యం చెందిన సందర్భం లేదు. అతడికి ఇప్పుడు కేవలం 36 ఏళ్లే.. అంటే ఇంకా యువకుడనే అర్థం. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా ఇంకో వరల్డ్కప్ ఆడే అవకాశం ఉంది. ఇంకా యువకుడే.. కోహ్లిలా ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డేల్లో అతడి స్ట్రైక్రేటు 130కిపైగానే.. టీ20లలో కూడా మెరుగైన గణాంకాలే కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్గా తనకెంతో అనుభవం ఉంది. ఏ ఆటగాడైనా 35 ఏళ్ల తర్వాత కూడా కొనసాగాలనుకుంటే ఫిట్నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రోహిత్ ఆడాలని భావిస్తే తప్పక ఆ దిశగా మరింత కష్టపడతాడు. నాకు తెలిసి తను మరో వరల్డ్కప్ ఆడటానికి కచ్చితంగా సిద్ధమవుతాడు’’ అని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్కప్-2024 జూన్ 4న మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. యంగ్ టీమిండియా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో బిజీగా ఉంది. చదవండి: వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు -
ద్రవిడ్ మా అంకుల్.. ఆయనను చూస్తే బాధేసింది: సీరియల్ నటి
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమి తననెంతో బాధించిందని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ బంధువు, మరాఠా నటి అదితి ద్రవిడ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా తన అంకుల్ అత్యుత్తమ కోచ్గా చరిత్రలో నిలిచిపోతారంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సొంతగడ్డపై టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా ఉన్న భారత జట్టుకు షాకిస్తూ.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా అవతరించింది. దీంతో టీమిండియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు చూసి టీమిండియా ఫ్యాన్స్ హృదయాలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో అదితి ద్రవిడ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకుంది. రాహుల్ ద్రవిడ్ను చూసి తమ కుటుంబమంతా గర్విస్తోందని పేర్కొంది. ద్రవిడ్ మా అంకుల్ ఈ మేరకు.. ‘‘రాహుల్ ద్రవిడ్ మా అంకుల్. గత 30- 35 ఏళ్లుగా ఆయన క్రికెట్ మైదానంలో కఠిన శ్రమకోరుస్తున్నారు. మా నాన్న వినాయక్ ద్రవిడ్ కూడా రంజీ ప్లేయర్. అందుకే నాకు క్రికెట్తో అనుబంధం ఏర్పడింది. టీమిండియా ఓడిపోయిన దృశ్యాలు చూసి నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో మా అంకుల్ను చూస్తే చాలా బాధేసింది. హెడ్కోచ్గా ఆయన ప్రస్థానం కూడా ముగింపునకు వస్తోంది. ఆయనకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్కప్. ఎంతో హార్డ్వర్క్ చేసి జట్టును ఇక్కడిదాకా తీసుకువచ్చారు. కానీ ఆఖర్లో ఇలా జరిగిపోయింది. ఏదేమైనా ఆయన బెస్ట్ కోచ్’’ అని అదితి ద్రవిడ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ది వాల్ రాహుల్ ద్రవిడ్.. హెడ్కోచ్గానూ కాగా మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాహుల్ ద్రవిడ్కు అదితి కూతురు వరుస అవుతుంది. ఆమె ప్రస్తుతం బుల్లితెరపై నటిగా రాణిస్తోంది. ఇటీవల సుందర మన మధ్యే భార్లీ సీరియల్లో కనిపించింది. అంతేకాదు రెండు మరాఠా సినిమాల్లోనూ అదితి మెరిసింది. ఎంటర్ప్రెన్యూర్గానూ రాణిస్తోంది. ఇక మరాఠా మూలాలున్న రాహుల్ ద్రవిడ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన విషయం తెలిసిందే. తండ్రి ఉద్యోగరిత్యా కర్ణాటకకు షిఫ్ట్ కావడంతో అక్కడే పెరిగి పెద్దైన ద్రవిడ్.. దేశవాళీ క్రికెట్లో కన్నడ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున ది వాల్గా.. దిగ్గజ క్రికెటర్గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం హెడ్కోచ్గా సేవలు అందిస్తున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్ట్ ముగియనుంది. -
ఆసీస్తో ఫైనల్ రోజే అలా! అమ్మను తలచుకుని షమీ భావోద్వేగం
CWC 2023- Ind vs Aus- Mohammad Shami: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి లోనయ్యాడు. అనారోగ్యం బారిన పడ్డ తన తల్లి గురించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు షమీ. ఈ మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ యూపీ బౌలర్. మూడు ఐదు వికెట్ల హాల్స్ ఈ క్రమంలో.. లీగ్ దశలో తొలుత న్యూజిలాండ్పై ఫైవ్ వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్పై నాలుగు వికెట్లు తీసిన షమీ.. శ్రీలంకపై ఐదు వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన ఈ 33 ఏళ్ల పేసర్.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్పై రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో ఒక వికెట్తో మెరిశాడు. ఆసీస్తో ఫైనల్ ఆడుతున్న సమయంలో తల్లికి అస్వస్థత ఇలా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్లో మొత్తం 24 వికెట్ల తన ఖాతాలో వేసుకుని.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవార్డు అందుకున్నాడు. అయితే, షమీ ఆసీస్తో ఫైనల్ ఆడుతున్న సమయంలో అతడి తల్లి ఆనుం ఆరా అనారోగ్యం పాలయ్యారు. సహాస్పూర్లోని తమ నివాసంలో ఉన్న సమయంలో అస్వస్థతకు గురైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నీరసం, జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆనుం ఆరాకు చికిత్స అందించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బంధువు డాక్టర్ ముంతాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం ఇన్స్టా వేదికగా తన తల్లితో ఉన్న ఫొటోను షేర్ చేసిన షమీ.. ‘‘నువ్వే నా సర్వస్వం అమ్మా. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’’ అంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. నెట్టింట వైరల్ అవుతున్న షమీ పోస్టుకు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘అమ్మ తప్పక కోలుకుని త్వరలోనే తిరిగి వస్తారు. ఆమె కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం భయ్యా’’ అంటూ అభిమానులు షమీకి ధైర్యం చెబుతున్నారు. చదవండి: యూట్యూబర్ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్ View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్గా అతడే ఉండాలి: గంభీర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న రోహిత్.. కేవలం వన్డేల్లో, టెస్టుల్లో మాత్రమే కొనసాగున్నట్లు క్రికెట్ వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది. రోహిత్తో పాటు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా గత ఏడాది నుంచి టీ20ల్లో ఆడటం లేదు. రోహిత్ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా టీ20ల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఆడాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. "టీ20 ప్రపంచకప్-2024కు రోహిత్ శర్మ, కోహ్లి ఇద్దరినీ కచ్చితంగా ఎంపిక చేయాలి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్లో భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాలి. హార్దిక్ టీ20ల్లో సారథిగా ఉన్నప్పటికీ.. రోహిత్ను నేను కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను. ఈ ఏడాది వన్డే వరల్డ్కప్లో రోహిత్ తన బ్యాటింగ్ పవర్ ఎంటో చూపించాడు. రోహిత్ను ఎంపిక చేస్తే విరాట్ కోహ్లి కూడా ఆటోమేటిక్గా జట్టులోకి వస్తాడు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకుంటే, అతడిని బ్యాటర్గా కాకుండా కెప్టెన్గా ఎంపిక చేయాలి" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు రోహిత్ శర్మ, కోహ్లితో పాటు సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. చదవండి: IPL 2024-Rashid Khan Injury: గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. రషీద్ ఖాన్కు సర్జరీ!? ఐపీఎల్కు దూరం -
అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన
ICC CWC 2023 Winner Australia: టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కౌంటర్ ఇచ్చాడు. మీరంటే నాకిష్టం అంటూనే.. అసలైన రోజున ఆడినవాళ్లకు మాత్రమే విజేతలుగా నిలిచే అర్హత దక్కుతుందని ఉద్ఘాటించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో లీగ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తద్వారా టేబుల్ టాపర్గా ఫైనల్ చేరింది భారత జట్టు. మరోవైపు.. ఆరంభంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా తర్వాత వరుసగా ఎనిమిది మ్యాచ్లు గెలిచి.. తుదిమెట్టుకు చేరుకుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్లో టీమిండియాతో ఫైనల్లో జయభేరి మోగించి.. ఏకంగా ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అత్యుత్తమ జట్టు వరల్డ్కప్ గెలిచిందంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా కనిపిస్తోంది’’ అని కైఫ్ అన్న క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గ్లెన్ మిచెల్ అనే యూజర్ కైఫ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటో షేర్ చేయగా.. వార్నర్ స్పందించాడు. ‘‘నాకు ఎంకే(మహ్మద్ కైఫ్) అంటే ఇష్టమే.. అయితే.. పేపర్ మీద ఏం కనబడుతుందన్న విషయంతో సంబంధం లేదు. అసలైన సమయంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యం. అందుకే దానిని ఫైనల్ మ్యాచ్ అంటారు. అదే అన్నిటికంటే కీలకం. అదే ఆటకు అర్థం. 2027లో చూద్దాం’’ అంటూ వార్నర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించాడు. చదవండి: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం? I like MK, issue is it does not matter what’s on paper. At the end of the day you need to perform when it matters. That’s why they call it a final. That’s the day that counts and it can go either way, that’s sports. 2027 here we come 👍 https://t.co/DBDOCagG2r — David Warner (@davidwarner31) November 22, 2023 -
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం?
Is Rohit Sharma Unlikely To Play T20Is Anymore?: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై అతడు అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్కప్-2023 ఆరంభానికి ముందే రోహిత్ ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. దారుణ వైఫల్యం.. విమర్శల వర్షం కాగా టీ20 వరల్డ్కప్-2022 టోర్నీలో టీమిండియా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ సేన సెమీ ఫైనల్లోనే నిష్క్రమించింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా సెలక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ కమిటీని రద్దు చేసింది. అజిత్ అగార్కర్ రాక.. కొన్ని రోజుల అనంతరం మళ్లీ చేతన్ శర్మను చీఫ్ సెలక్టర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, చేతన్ భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఓ స్టింగ్ ఆపరేషన్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. అతడు రాజీనామా చేయాల్సి వచ్చింది. రోహిత్కు బదులు హార్దిక్ పాండ్యానే ఈ క్రమంలో మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే.. గతేడాది వరల్డ్కప్ ముగిసిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉంటున్నాడు. అతడి స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే, వరల్డ్కప్-2023 నేపథ్యంలో వన్డేలపై మరింత దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడనే వార్తలు వినిపించాయి. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రపంచకప్-2023 ముగిసిన తర్వాత హిట్మ్యాన్ తిరిగి టీ20లు ఆడతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. పని భారాన్ని తగ్గించుకునే క్రమంలో రోహిత్ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరంగా ఉందామనే నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రోహిత్ నిర్ణయమే ఇది ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇది కొత్త విషయమేమీ కాదు. వన్డే వరల్డ్కప్ టోర్నీపై ఫోకస్ చేసే ఉద్దేశంతో గత ఏడాది కాలంగా రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడు. ఈ విషయం గురించి ఇప్పటికే సెలక్షన్ చైర్మన్ అజిత్ అగార్కర్తో కూడా రోహిత్ చర్చించాడు. ఇంటర్నేషనల్ టీ20లకు దూరంగా ఉండాలనేది తనకు తానుగా తీసుకున్న నిర్ణయం’’ అని పేర్కొన్నాయి. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికో?! కాగా రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్లు శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ల రూపంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే గిల్ రోహిత్ జోడీగా పాతుకుపోగా.. మిగిలిన వాళ్లు తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో సత్తా చాటుతున్నారు. ఒకవేళ అనుభవమున్న కెప్టెన్ కావాలనుకుంటే ఈ నేపథ్యంలో రోహిత్ వర్క్లోడ్ విషయంలో రాజీపడక టీ20లకు దూరంగా ఉండాలనుకుంటే గిల్తో పాటు మరో కొత్త ఓపెనర్ను చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. టీ20 వరల్డ్కప్-2024లో అనుభవమున్న కెప్టెన్ కావాలని భావిస్తే.. 36 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ టీ20లలో కొనసాగాలని.. బీసీసీఐ ఆ దిశగా అతడిని ఒప్పించే ప్రయత్నాలు చేయొచ్చు. ఆసీస్ సిరీస్లో.. సూర్య టీ20 సారథిగా ఇక వన్డే వరల్డ్కప్-2023లో రన్నరప్తో సరిపెట్టుకున్న భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సిద్ధమైంది. వైజాగ్ వేదికగా నవంబరు 23న ఈ సిరీస్ ఆరంభం కానుంది. రోహిత్, విరాట్ కోహ్లి తదితరులు విశ్రాంతి తీసుకోగా.. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఆసీస్తో సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. చదవండి: సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్ లెజెండ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
రోహిత్ శర్మను ఉద్దేశించి కపిల్ దేవ్ వ్యాఖ్యలు.. నీ కోసం..
భారత్లో క్రికెట్ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్ డెవిల్స్కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్కప్-1983లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన కపిల్దేవ్ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్గా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్ను ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి.. ఆ మ్యాజిక్ను రిపీట్ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. వన్డే వరల్డ్కప్-2023లో అజేయ రికార్డుతో ఫైనల్తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి. ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్ సేనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్వి అయిపోయావు. నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్ షేర్ చేశాడు. ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్ దేవ్ బాసటగా నిలిచాడు. -
టాప్లోనే గిల్.. దూసుకొచ్చిన కోహ్లి, రోహిత్! సిరాజ్ వెనక్కి..
Top 5 of the ICC ODI Rankings for batters And Bowlers: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టాప్-3లోకి దూసుకొచ్చాడు. వన్డే వరల్డ్కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మూడో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ టాప్ ర్యాంకును నిలుపుకొన్నాడు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో టాప్-5లో టీమిండియా బ్యాటర్ల సంఖ్య మూడుకు చేరింది. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా 11 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 3 శతకాలు, 6 అర్ధ శతకాల సాయంతో 765 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 791 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. గతంలో 1258 రోజుల పాటు నంబర్ 1లో కొనసాగిన ఈ పరుగుల యంత్రం సుదీర్ఘకాలం తర్వాత మరోసారి టాప్ ర్యాంకుకు చేరువకావడం విశేషం. భారీ జంప్ కొట్టిన హెడ్ ఇక రోహిత్ శర్మ సైతం.. 11 మ్యాచ్లు ఆడి ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి 597 పరుగులు చేశాడు. దీంతో మరిన్ని పాయింట్లు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. వరల్డ్కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ట్రవిస్ హెడ్ ఏకంగా 28 పాయింట్లు మెరుగుపరచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు. సిరాజ్ను వెనక్కి నెట్టిన హాజిల్వుడ్.. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ నాలుగు స్థానాలు ఎగబాకాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ను వెనక్కినెట్టి రెండో ర్యాంకు సాధించాడు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ ఎనిమిది స్థానాలు మెరుగుపరచుకుని 12, ప్యాట్ కమిన్స్ ఏడు స్థానాలు మెరుగుపరచుకుని 27వ ర్యాంకుకు చేరుకున్నారు. ఇక మరో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓవరాల్గా నాలుగో స్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ టాప్-5 బ్యాటర్లు 1. శుబ్మన్ గిల్(ఇండియా)- 826 పాయింట్లు 2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 824 పాయింట్లు 3. విరాట్ కోహ్లి(ఇండియా)- 791 పాయింట్లు 4. రోహిత్ శర్మ(ఇండియా)- 769 పాయింట్లు 5. క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- 760 పాయింట్లు టాప్-5 బౌలర్లు 1. కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా)- 741 పాయింట్లు 2. జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)- 703 పాయింట్లు 3. మహ్మద్ సిరాజ్(ఇండియా)- 699 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 685 పాయింట్లు 5. ఆడం జంపా(ఆస్ట్రేలియా)- 675 పాయింట్లు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? -
సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్ లెజెండ్
ICC WC 2023- PM Modi Gesture: టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలిచిన తీరుపై పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తన చర్య ద్వారా దేశం మొత్తం జట్టుకు అండగా ఉందనే సందేశాన్ని ఇచ్చారని ప్రధానిని కొనియాడాడు. ఆటగాళ్లను తన సొంత బిడ్డల్లా ఆప్యాయంగా హత్తుకున్న విధానం ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. సెమీస్ వరకు అజేయంగా కొనసాగిన టీమిండియా అహ్మదాబాద్లో ఆదివారం నాటి తుదిపోరులో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. ఫలితంగా సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలన్న కల చెదిరిపోయింది. కళ్లలో నీళ్లు నింపుకొని ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక.. కళ్లలో నీళ్లు నింపుకొని మైదానాన్ని వీడారు. షమీని ఆత్మీయంగా హత్తుకుని దీంతో అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. టీమిండియాను ప్రేమించే వాళ్లంతా హృదయం ముక్కలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ భారత జట్టు డ్రెస్సింగ్రూంకు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. రోహిత్, కోహ్లిలను దగ్గరకు తీసుకుని.. ఆటలో గెలుపోటములు సహజమంటూ నచ్చజెప్పారు. మహ్మద్ షమీని ఆప్యాయంగా హత్తుకుని మరేం పర్లేదంటూ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సొంతబిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ జీ న్యూస్తో మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్రూంకి వెళ్లి.. వాళ్లకు తానున్నానంటూ ప్రధాని ధైర్యం చెప్పారు. దేశం మొత్తం మీ వెంటే ఉందనే సందేశాన్ని ఇచ్చారు. నిజానికి భారత్కు అదొక ఉద్విగ్న క్షణం. అలాంటి సమయంలో ప్రధాని మోదీ ఆటగాళ్లను తన సొంతపిల్లల్లా అక్కున చేర్చుకున్నారు. వాళ్లకు నైతికంగా మద్దతునిచ్చి తలెత్తుకోవాలంటూ స్ఫూర్తి నింపారు. ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో గొప్పగా వ్యవహరించారు’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? -
అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం?
‘‘మనం ఊహించిన ఫలితం వేరు.. కానీ జరిగింది వేరు.. అయినా మనమంతా టీమిండియా వెంటే ఉంటాం.. కుటుంబంలోని సభ్యులు ఎవరైనా బాధతో కుంగిపోయినపుడు.. మనం వాళ్లను వదిలేయం కదా! నిజానికి అలాంటపుడే మనం వాళ్లకు మరింత మద్దతుగా నిలవాలి’’- వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో భారత జట్టు ఓటమి తర్వాత తన తమ్ముడు విరాట్ కోహ్లిని అనునయిస్తూ భావనా కోహ్లి ధింగ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భావాలు.. అవును భావనా అన్న మాటలు అక్షరాలా నిజం.. అన్నీ సజావుగా సాగుతూ.. ఉన్నత స్థితిలో ఉన్నపుడు మనోళ్లు అంటూ ప్రశంసించడం కంటే.. కష్టాల్లో ఉన్నపుడు అండగా ఉంటేనే ఏ బంధానికైనా విలువ ఉంటుంది. భారీ అంచనాలు ఇప్పుడు ఈ విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత భారత క్రికెట్ జట్టు అభిమానులపై ఉంది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ అనగానే దేశమంతా సరికొత్త ఉత్సాహం.. క్రికెట్ను కేవలం ఆటలా కాకుండా ఓ ‘మతం’లా భావించే భారతీయులకు నిజంగా ఇది పండుగ లాంటిదే. మొదటి నుంచీ భారీ అంచనాలు.. ఈసారి కప్పు మనదేనంటూ జోస్యాలు.. అక్టోబరు 5న ఇంగ్లండ్- న్యూజిలాండ్ పోరుతో ఈ మెగా క్రికెట్ సమరానికి తెర లేచింది. ఆ తర్వాతి మూడు రోజులకు ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా టీమిండియా తొలి మ్యాచ్.. నాడు రోహిత్ సేన ఛేదించాల్సిన లక్ష్యం 200.. కష్టమ్మీద వచ్చిన గెలుపుతో ఆరంభం చిన్న టార్గెట్ ఈజీగానే కొట్టేస్తారు అనుకున్నారంతా! కానీ ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్.. వన్డౌన్లో వచ్చిన కోహ్లికి శ్రేయస్ అయ్యర్ తోడుంటానుకుంటే అతడూ సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. అప్పుడొచ్చాడు కేఎల్ రాహుల్.. కోహ్లితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రన్మెషీన్ 85 పరుగులు సాధిస్తే.. రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. 41.2 ఓవర్ వద్ద సిక్సర్తో లక్ష్యాన్ని ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై నుంచి ముంబై దాకా టాప్ గేర్ ఒకవేళ ఆరోజు కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. అలా అతి కష్టమ్మీద తొలి మ్యాచ్ తర్వాత.. టీమిండియా గేర్ మార్చింది. చెన్నైలో మొదలుపెట్టిన విజయ ప్రస్థానాన్ని ముంబై దాకా అప్రతిహతంగా కొనసాగించింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా తర్వాత అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్లపై వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా శ్రీలంకను ఏకంగా 302 పరుగుల తేడాతో ఓడించి అతిపెద్ద గెలుపు నమోదు చేసింది. సెమీస్ గండాన్నీ దాటేసి.. ఆ తర్వాత తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ రూపంలో ఎదురైన గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఫైనల్కు అర్హత సాధించింది టీమిండియా. ఇక అప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా పూజలు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భారత జట్టు సారథి రోహిత్ శర్మ ట్రోఫీ అందుకోవడం ఖాయమని ఫిక్సైపోయారు అభిమానులు. అంతటితో ఆగిపోలేదు.. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టును ఎదుర్కోవాలంటే ఆటతో పాటు సెంటిమెంట్లు కూడా కలిసిరావాలి.. పూజలు, ప్రార్థనలు చేయాలి.. ఉపవాసాలు ఉండాలి.. ఏం చేసినా ఏదేమైనా కప్పు మనదేనన్న విషయం మాత్రం మర్చిపోకూడదు.. ఇలా దేశమంతా అభిమానులు ఒక్కటై సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా తమ ఆకాంక్షలను పెద్ద ఎత్తున చాటారు. మనోళ్లు గెలవాలన్న తాపత్రయమే ఇదంతా.. కానీ నిజానికి ఇదంతా.. జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తూ.. సానుకూల దృక్పథంతో ఉండటంలో భాగమే! కానీ ఎంత కాదనుకున్నా.. బయటి విషయాలు పట్టించుకోమని చెబుతున్నా.. కచ్చితంగా ఆటగాళ్లపై ఇవన్నీ ప్రభావం చూపుతాయి. ఈ ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు కూడా చెప్పిన మాట ఇదే... ఈసారి టైటిల్ ఫేవరెట్ టీమిండియానే.. కానీ సొంతగడ్డపై ఆడటం వారికి ఎంత సానుకూలమో.. అంచనాలు, ఆశల వల్ల కలిగే ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.. అందుకు తగ్గట్లుగానే.. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య.. నీలి సంద్రాన్ని తలపించే స్టేడియంలో.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుపై ఆ ప్రభావం పడింది. మనోళ్లు సిక్స్ కొడితే ప్రేక్షకుల ఉత్సాహంతో హోరెత్తిపోయిన స్టేడియం.. ఒక్క వికెట్ పడితే అంతకంటే నిశ్శబ్దంగా మారిపోయింది. మైదానంలో దిగిన ఆటగాళ్లకు ఈ ఒక్క మార్పు చాలు అభిమానుల మనఃస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి! ఎలాగైనా పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకున్నాడు రోహిత్.. తొలి వరల్డ్కప్ ఆడుతున్న మరో ఓపెనర్, యువ బ్యాటర్ గిల్ అప్పటికే పెవిలియన్ చేరాడు. కోహ్లితో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ నిర్మిస్తాడనుకుంటే ఆ ఆశ కూడా పోయింది. అంతకు ముందు వరుస శతకాలు చేసిన శ్రేయస్ అయ్యర్ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. తొలి మ్యాచ్ మాదిరే.. మరోసారి అదే ప్రత్యర్థిపై కోహ్లి, కేఎల్ రాహుల్ కచ్చితంగా వీరబాదుడు బాదుతారని అభిమానుల నమ్మకం.. కానీ ఆసీస్ పేసర్ల బంతులు మన ఆశల కంటే పదునైనవి కదా.. ఎంత జాగ్రత్తగా ఆడుతున్నా కీలక సమయంలో కోహ్లిని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ అనూహ్య రీతిలో వెనక్కి పంపితే.. బాధ్యతగా ఆడుతున్న రాహుల్ను మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. అంతే.. మన బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 240 పరుగులకే కథ ముగిసింది. స్టేడియంలో మరోసారి నిశ్శబ్దం.. అయితే, మన పేస్ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్పై అంతే నమ్మకం కూడా! ఎలాగైనా గెలిచేస్తాం.. కప్పు మనదే.. కానీ సీన్ రివర్స్ అయింది. షమీ బౌలింగ్లో కోహ్లి.. ఓపెనర్ వార్నర్ క్యాచ్ పట్టగానే ఎగిరి గంతేసిన ఫ్యాన్స్ ఆనందాన్ని ట్రవిస్ హెడ్ ఎంతో సేపు నిలవనీయలేదు. లబుషేన్తో కలిసి క్రీజులో పాతుకుపోయి 137 పరుగులు చేసి మ్యాచ్ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. లబుషేన్ ఆఖరి వరకు అజేయ అర్ధ శతకంలో నిలవగా.. ఈ టోర్నీలో ద్విశతక వీరుడైన మాక్స్వెల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతే.. ఒక్కసారిగా స్మశాన నిశ్శబ్దం.. అంతా మనవల్లేనేమోనన్న పశ్చాత్తాపం కొందరిలో! అవును.. బ్యాటింగ్ చేస్తున్నపుడు.. ఫీల్డింగ్ చేస్తున్నపుడు మన వాళ్ల తత్తరబాటు చూస్తే నిజమే అనిపించింది. మరోవైపు.. ఆస్ట్రేలియా జట్టు.. లక్ష మందికి పైగా.. ప్రత్యక్షంగా ప్రత్యర్థికి మద్దతుగా.. తమకు వ్యతిరేక పవనాలు వీస్తున్న చోట.. ఫ్లడ్ లైట్ల వెలుగులో.. పిచ్ నుంచి సహకారం లభించక తిప్పలు పడుతున్న ప్రత్యర్థి బౌలింగ్లో.. చాలా సింపుల్గా.. ఏదో ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ ఆడుతుందా అన్నట్లుగా అలా అలా ముందుకు సాగి.. ఏకంగా ఆరోసారి చాంపియన్గా నిలిచింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తమ వ్యూహాలు, ప్రణాళికలు పక్కాగా అమలు చేసి.. తాము కంగారు పడే వాళ్లం కాదు.. కంగారు పెట్టేవాళ్లమని మరోసారి నిరూపించింది. అంతే అక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటే పొరపాటే! ఎందుకీ విద్వేష విషం? కొందరు ‘దురభిమానులు’.. వాళ్ల ఐడెంటిటీని వ్యక్తపరిచే ధైర్యం లేని వ్యక్తులు.. తమ వ్యాఖ్యలకు ‘టీమిండియా ఫ్యాన్స్’ను బాధ్యులను చేస్తూ.. ఆసీస్ క్రికెటర్లు, వారి కుటుంబాలపై విద్వేష విషం చిమ్మారు. మనోళ్ల తప్పులు ఎంచుతూనే.. ప్రత్యర్థి జట్టును కూడా దారుణంగా.. అసభ్యకరరీతిలో అవమానించారు. షమీకి మద్దతుగా ఉన్నందుకు కోహ్లి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ పేరిట నిజమైన అభిమానులకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు. నిజమైన అభిమానులంటే? అవును.. నిజమైన అభిమానులు ఎవరు?? అత్యధిక పరుగుల వీరుడు కోహ్లి నిరాశతో కళ్ల నిండా నీళ్లు నింపుకొంటే.. తాము కన్నీటి ధారలు కురిపించేవాళ్లు.. ఇక్కడిదాకా వచ్చి.. ఇప్పుడుకాక.. ఇంకెప్పుడూ లేదని ముఖం దాచుకున్న రోహిత్ను చూసి కళ్లను నీటి చెమ్మతో తడిచేసుకునే వాళ్లు.. సిరాజ్ చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే.. రాహుల్ తల నేలకేసి నిట్టూరుస్తుంటే అయ్యో ఆటలో ఇవన్నీ భాగమే.. బాధపడొద్దు అని దూరం నుంచే నచ్చజెప్పే వాళ్లు.. వీటన్నిటికీ మించి.. గెలుపోటములు సహజం అంటూ ప్రత్యర్థి జట్టు విజయాన్ని కూడా హుందాగా అంగీకరించే మనస్తత్వం ఉన్నవాళ్లు.. అని చెప్పొచ్చేమో బహుశా!! మీరేమంటారు!? అభిమానానికి ఇదీ ఓ నిర్వచనం లాంటిదనుకుంటే అందులో నేనూ ఉంటాను!! -ఇట్లు టీమిండియా ఫ్యాన్.. ఎస్వీ!! View this post on Instagram A post shared by Bhawna Kohli Dhingra (@bhawna_kohli_dhingra) -
ఫైనల్లో అలా ఎందుకు చేశారు.. అతడికి బదులు: గంభీర్ విమర్శలు
CWC 2023 Final Ind Vs Aus Winner Australia: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన తుదిమెట్టుపై బోల్తా పడటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచకప్ టోర్నీ ముగిసి రెండురోజులు అవుతున్నా క్రీడా వర్గాల్లో ఈ మ్యాచ్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ గౌతం గంభీర్, పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరోసారి జగజ్జేతగా నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ సేన విధించిన ఈ లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. ఫైనల్ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చర్చలకు తావిచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ను ఆరో స్థానంలో గాకుండా ఏడో నంబర్లో ఆడించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా ఎందుకు చేశారు? ఈ విషయంపై తాజాగా స్పందించిన గంభీర్.. ‘‘నిజం చెప్తున్నా.. సూర్యకుమార్ కుమార్ విషయంలో అలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. ఏదేమైనా అతడిని ఏడో నంబర్కు డిమోట్ చేయడం సరైన నిర్ణయం కాదు. విరాట్ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నపుడు.. అతడికి తోడుగా సూర్యను పంపించి.. దూకుడుగా ఆడమని చెప్పాల్సింది. ఎందుకంటే అతడి తర్వాత జడేజా ఉంటాడు కాబట్టి సూర్య కూడా కాస్త స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సూర్య బాగా ఇబ్బంది పడ్డాడు. ‘‘నేను అవుటైతే.. నా తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్షమీ, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నారు’’ అనే మైండ్సెట్తో మరీ డిఫెన్సివ్గా ఆడాడు. సమర్థించిన వసీం ఒకవేళ తన తర్వాత జడేజా వస్తాడంటే సూర్య తన సహజమైన గేమ్ ఆడేవాడు. సూర్యకు ప్యూర్ బ్యాటర్గా జట్టులో చోటిచ్చి ఏడో నంబర్లో పంపే బదులు.. అతడికి బదులు వేరే వాళ్లను ఎంపిక చేయాల్సింది’’ అని స్పోర్ట్స్కీడా షోలో అభిప్రాయపడ్డాడు. ఇక వసీం అక్రం కూడా గంభీర్ వాదనను సమర్థిస్తూ.. ‘‘అవును.. అతడు ప్యూర్ బ్యాటర్. ఒకవేళ హార్దిక్ జట్టులో ఉన్నపుడు కేవలం కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయనకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదనిపిస్తుంది. కానీ అప్పటికి చాలా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా!’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. చదవండి: వరల్డ్కప్లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్కప్లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం
CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్కప్-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది. అదే విధంగా టెస్టు పగ్గాలను షాన్ మసూద్కు అప్పగించింది. ఇక కెప్టెన్సీ మార్పులతో పాటు పాలనా విభాగం, శిక్షనా సిబ్బందిలోనూ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమించిన పీసీబీ.. వహాబ్ రియాజ్ను చీఫ్ సెలక్టర్గా ఎంపిక చేసింది. బౌలింగ్ కోచ్లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ తాజాగా.. పీసీబీ తమ కోచింగ్ స్టాఫ్లో మరో ఇద్దరు మాజీ క్రికెటర్లను చేర్చుకుంది. ఉమర్ గుల్, సయీద్ అజ్మల్లకు బౌలింగ్ కోచ్లుగా అవకాశం ఇచ్చింది. గుల్ ఫాస్ట్బౌలింగ్ విభాగానికి కోచ్గా సేవలు అందించనుండగా.. అజ్మల్ స్పిన్ దళానికి మార్గదర్శనం చేయనున్నాడు. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా ఉమర్ గుల్ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం ఆరంభించాడు. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా కోచ్గా వ్యవహరించాడు. మోర్నీ మోర్కెల్ గుడ్బై కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బాబర్ బృందం వరుస ఓటముల కారణంగా.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ముఖ్యంగా వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు. ఉమర్ గుల్.. సయీద్ అజ్మల్ కెరీర్ వివరాలు పాకిస్తాన్ తరఫున 2003లో ఎంట్రీ ఇచ్చిన 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక తన కెరీర్లో ఈ రైటార్మ్ పేసర్ 47 టెస్టులాడి 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు. అజ్మల్ విషయానికొస్తే.. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్.. 2015లో ఆటకు గుడ్బై చెప్పాడు. తన కెరీర్లో 35 టెస్టులు, 113 వన్డేలు, 64 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 178, 184, 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 WC: ‘వరల్డ్కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’ -
CWC 2023: టాక్సీ డ్రైవర్ మాట విన్నందుకు ఇలా: సౌతాఫ్రికా లెజెండ్
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ గత కొన్ని రోజులుగా భారత్లో పర్యటిస్తున్నాడు. ఢిల్లీ, గోవా అంటూ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు పయనమైన జాంటీ రోడ్స్కు టాక్సీ డ్రైవర్ మూలంగా కర్ణాటక వంటల రుచులు చవిచూసే అవకాశం లభించింది. అది కూడా రోడ్సైడ్ ఫుడ్! అయితే, జాంటీ రోడ్స్ ఆహార పదార్థాలను టేస్ట్ చేయడానికి మాత్రమే పరిమితమైపోలేదు. అవెంతో రుచిగా ఉన్నాయని.. తనకు ఈ అవకాశం కల్పించిన సదరు డ్రైవర్కు ధన్యవాదాలు కూడా చెప్పాడు. ట్రాఫిక్ చికాకు నుంచి తప్పించుకునే క్రమంలో తనకు ఇంత టేస్టీ ఫుడ్ పరిచయం చేసినందుకు అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు..‘‘బెంగళూరు ఎయిర్పోర్టు దగ్గర టాక్సీ డ్రైవర్ నాకో సలహా ఇచ్చాడు. ఎలాగూ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి.. మార్గమధ్యంలో రోడ్డు పక్కన తనకు ఇష్టమైన రెస్టారెంట్లో కాసేపు ఆగుదామని నాకు చెప్పాడు. నాకు తన ఆలోచన నచ్చి అలాగే అన్నాను. అద్భుతమైన రుచి గల మంగళూరు బన్తో మొదలుపెట్టి.. మైసూర్ మసాలా దోశ, మసాలా ఛాయ్తో ముగించాను’’ అంటూ ఐలవ్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ను జతచేశాడు. అక్కడితో జాంటీ రోడ్స్ ఆగిపోలేదు.. తనకు ఇంతటి రుచికరమైన వంటకాలు అందించిన రెస్టారెంట్ సిబ్బందితో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు మంగళవారం జాంటీ రోడ్స్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ‘‘క్రికెటర్లు అంటేనే లగ్జరీ లైఫ్.. ఫైవ్స్టార్ హోటళ్లలో బస.. లావిష్ రెస్టారెంట్లలో ఫుడ్.. అబ్బో వాళ్ల లైఫ్స్టైలే వేరు.. కానీ జాంటీ రోడ్స్ మాత్రం మిగతా క్రికెటర్లకు భిన్నం.. రోడ్సైడ్ ఫుడ్ టేస్ట్ చేయడంతో పాటు.. వాళ్ల సేవలకు తగిన మర్యాద ఇచ్చాడు. ముఖ్యంగా భారత్ మీద తన ప్రేమను చాటుకున్న విధానం అద్భుతం.. అందుకే నువ్వు లెజెండ్’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీ టూర్ నుంచి జాంటీ రోడ్స్ ఇండియాలోనే ఉన్నాడు. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లోనూ ప్రయాణం చేశాడు. సౌతాఫ్రికా తరఫున 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాంటీ రోడ్స్.. దిగ్గజ ఫీల్డర్గా పేరుగాంచాడు. 2003లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఈ ప్రొటిస్ బ్యాటర్.. తన కెరీర్లో 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 2532, 5935 పరుగులు సాధించాడు. When taxi driver at Bengaluru airport suggested to stop at his favourite restaurant for a roadside bite, because according to him: "traffic will be standing!" Grateful I took his advice. Excellent #mangalorebun and #Mysoremasaldosa, finished off with #masalachai #loveIndia pic.twitter.com/tH3KjykLUI — Jonty Rhodes (@JontyRhodes8) November 21, 2023 -
CWC 2023: ఇంకా తేల్చుకోలేదు... అహర్నిశలు పనిచేశా
అహ్మదాబాద్: టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ ఆయనతో కుదుర్చుకున్న రెండేళ్ల కాంట్రాక్టు నవంబర్ 19న వరల్డ్కప్ ఫైనల్తో ముగిసింది. టైటిల్ పోరులో పరాజయం అనంతరం భారమైన హృదయంతో ద్రవిడ్ మీడియా సమావేశానికి వచ్చాడు. నిరాశను దిగమింగి జట్టు ప్రదర్శన, ఫైనల్ పరాజయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ‘కొంతకాలంగా నేను పూర్తిగా ప్రపంచకప్పైనే దృష్టి పెట్టాను. జట్టు సన్నద్ధత కోసమే అహర్నిశలు పనిచేశాను. ఇది కాకుండా మరో ఆలోచనేది నేను చేయలేదు. భవిష్యత్ ప్రణాళికలపై ఆలోచించడానికి కూడా నేను సమయం వెచ్చించలేదు. నా రెండేళ్ల పదవీకాలంలోని జయాపజయాలు, ఘనతలు, విశేషాలపై విశ్లేషించుకోవడం లేదు’ అని 50 ఏళ్ల ద్రవిడ్ వివరించాడు. ‘అన్ని ఫార్మాట్లకు కోచ్గా పనిచేయడం చాలా బాగా అనిపించింది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ మార్గదర్శనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. జట్టు కోసం, ప్రపంచకప్ కోసం నాయకుడిగా రోహిత్ శర్మ ఎంతో శ్రమించాడు. మున్ముందు భారత హెడ్ కోచ్గా కొనసాగడంపై ఏ నిర్ణయం తీసుకోని నేను 2027 వన్డే ప్రపంచకప్పై ఏం మాట్లాడగలను. అప్పటికి జట్టులో ఎవరు ఉంటారో... ఏవరు పోతారో ఎవరికీ తెలియదు. అలాంటి దానిపై స్పందించడం తగదు’ అని ద్రవిడ్ వివరించాడు. -
వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా ఛాంపియన్స్గా అవతరించగా.. భారత్ మరోసారి రన్నరప్గా నిలిచింది. ఇక ఛాంపియన్స్గా నిలిచిన ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అభినందనలు తెలిపాడు. "వన్డే ప్రపంచకప్-2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు నా అభినందనలు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శరన కనబరిచింది. టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. కానీ టోర్నీ మొత్తం భారత్ అద్భుతంగా ఆడింది" అని ట్విటర్లో అఫ్రిది పోస్ట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66) పరుగులు చేశారు. అనంతరం 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజేతగా నిలవడంలో ట్రావిడ్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. హెడ్ అద్బుతమైన సెంచరీతో (120 బంతుల్లో 137 పరుగులు) ఆరోసారి తన జట్టును ఛాంపియన్స్గా నిలిపాడు. చదవండి: AUS vs PAK: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ -
దెబ్బకొట్టిన ప్రపంచకప్ ఫైనల్.. తెలుగు హిట్ సినిమాకు ఆ రేంజ్ నష్టాలు!
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి కూడా మనోళ్లకు అదృష్టం కలిసిరాలేదని.. అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. సరే దాని గురించి అలా వదిలేయండి. ఇదే వరల్డ్కప్ ఫైనల్ వల్ల ఓ తెలుగు హిట్ సినిమాపై దారుణమైన దెబ్బ పడింది. అలాంటి ఇలాంటి దెబ్బ కాదని చెప్పొచ్చు. దీంతో లాభాలు రావాల్సింది నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ప్రపంచకప్- ఆ తెలుగు చిత్రానికి సంబంధమేంటి? దురదృష్టం.. ఎప్పుడు, ఎలా వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. 'మంగళవారం' చిత్రానికి మాత్రం ప్రపంచకప్ ఫైనల్ రూపంలో వచ్చింది. సినిమాపై మంచి బజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికి తోడు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన టాక్ సంపాదించింది. కానీ ఏం లాభం. టీమిండియా.. ఈ వరల్డ్కప్లో అత్యద్భుతమైన ఫామ్ తో ఫైనల్కి చేరడం.. 'మంగళవారం' మూవీకి శాపమైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ శనివారం నుంచి దేశమంతా ఆ వైబ్లోకి వెళ్లిపోయింది. దీంతో హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీని పూర్తిగా మరిచిపోయారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్లో ఘోరమైన డ్రాప్ కనిపించింది. తొలిరోజు బాగానే వచ్చాయి కానీ కీలకమైన వీకెండ్లో మాత్రం వరల్డ్కప్ వల్ల జనాలు థియేటర్ల ముఖమే చూడలేదు. మనోళ్లు కప్ కొట్టకపోయేసరికి అభిమానులు ఇంకా బాధలోకి వెళ్లిపోయారు. దాన్నుంచి బయటకొచ్చి సినిమా చూస్తారా? అంటే సందేహమే!? అలానే వరల్డ్కప్ లేకపోయింటే.. 'మంగళవారం' సినిమాకు తక్కువలో తక్కువ రూ.3 కోట్లు గ్రాస్ వసూళ్లు అయినా వచ్చి ఉండేవని, ఈ ఫైనల్ దెబ్బకు రూ.1 కోటి కంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు టాక్. ఇప్పుడు వీక్ డేస్లో జనాలు ఈ సినిమాని ఆదరిస్తే పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే హిట్ కొట్టిన నష్టాలు మాత్రం తప్పవు! (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆసీస్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ బ్యాటర్ షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్తో పాకిస్తాన్ టెస్టు కెప్టెన్గా మసూద్ ప్రయాణం ప్రారంభం కానుంది. బాబర్ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్ టెస్టు సారధిగా మసూద్ ఎంపికయ్యాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఓపెనర్ సైమ్ అయూబ్కు తొలిసారి పాక్ టెస్టు జట్టులో చోటు దక్కింది. అయూబ్తో పాటు యువ బౌలర్ ఖుర్రం షాజాద్కు పాక్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్తో టెస్టులకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇమామ్-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీప), షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మీర్ హమ్జా, ఖుర్రం షాజాద్ హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, నోమన్ అలీ, అబ్రార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్ చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం The 18-member squad for Australia series has been revealed Saim Ayub & Khurram Shahzad have been called up for the three-match series #PAKvAUS #TestSeries pic.twitter.com/9rhZujQOg1 — Cricket Pakistan (@cricketpakcompk) November 20, 2023 -
వరల్డ్కప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదరైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కు చేరిన భారత్.. తుది పోరులో మాత్రం ఆసీస్ జోరు ముందు చిత్తు అయింది. ఫైనల్ పోరులో ఆసీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో సొంత గడ్డపై భారత పతాకాన్ని రెపాలపాడాలంచాలనకున్న రోహిత్ సేన ఆశలు ఆడియాశలయ్యాయి. మరోవైపు వరల్డ్కప్ను తమ ఇంటిపేరుగా మార్చుకున్న ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఛాంపియన్స్, రన్నరప్ జట్లకు ఇచ్చే ఫ్రైజ్మనీపై ఓ లుక్కేద్దాం. విజేతకు ఎంతంటే? వన్డే వరల్డ్కప్ ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్మనీ రూపంలో 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్గా నిలిచిన భారత్కు 2 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం 16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) దక్కింది. ఇక సెమీ ఫైనల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్కు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు)చొప్పున అందింది. అదే విధంగా గ్రూపు దశ నుంచి వైదొలిగిన 6 జట్లకు లక్ష యూఎస్ డాలర్లు (82 లక్షల 92 వేల 950 రూపాయలు) చొప్పున లభించింది. అదనంగా ప్రతీ గ్రూప్ స్టేజ్ విజయానికి ఆయా జట్లకు 40,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) దక్కుతాయి. చదవండి: CWC 2023: నిరాశలో టీమిండియా! ఫైనల్లో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అతడికే.. వీడియో వైరల్ -
వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి.. టీమిండియా చేసిన తప్పులు ఇవే?
ఒకే ఒక్క మ్యాచ్.. కోట్ల మంది భారత అభిమానుల గుండె పగిలేలా చేసింది. ఒకే ఒక్క మ్యాచ్.. సొంత గడ్డపై మూడోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడాలన్న టీమిండియా ఆశలను అడియాశలు చేసింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. కీలకమైన ఫైనల్లో మాత్రం కంగారుల ముందు చేతులేత్తేసింది. తుది పోరులో అన్ని విభాగాల్లో విఫలమైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాకు మరోసారి వరల్డ్కప్ను అప్పగించింది. కాగా ఫైనల్ వరకు అజేయ జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై ఎందుకు బోల్తా పడింది? అందుకు కారణాలు ఏంటి? బ్యాటింగ్ వైఫల్యం.. టీమిండియా ఓటమికి ప్రాధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. ఈ నిజాన్ని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అంగీకరించాడు. ఆసీస్ కెప్టెన్ టాస్ గెలిచి అందరిని ఆశ్చర్యపరుస్తూ భారత జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్హనించాడు. అదేంటి బ్యాటింగ్ అనుకూలించే వికెట్పై కమ్మిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడేంటని తెగ చర్చనడిచింది. హమ్మయ్య టీమిండియా తొలుత బ్యాటింగ్.. ఇక వరల్డ్కప్ మనదే అని అంతా ఫిక్స్ అయిపోయారు. రోహిత్ సైతం తాము మొదట బ్యాటింగే చేయాలనకుంటున్నట్లు టాస్ సందర్భంగా తెలిపాడు. కానీ మ్యాచ్ సగంలోనే ఆర్ధమైంది కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్కు బిగ్ షాక్ తగిలింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నానని మర్చిపోయిన యువ ఓపెనర్ శుబ్మన్ గిల్.. చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. అనంతరం కాసేపు అలరించిన రోహిత్ శర్మ కూడా అనవసరపు షాట్ ఆడి పెవిలియన్కు చేరాడు. కీలక సమయంలో క్రీజులో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సైతం కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే చేశారు. అయితే విరాట్, రాహుల్ను జట్టును ముందుకు నడిపించినప్పటికి.. పూర్తిగా డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్లిపోయారు. దీంతో స్కోరింగ్ రేట్ పూర్తిగా పడిపోయింది. మిడిల్ ఓవర్లలో అస్సలు వీరిద్దరూ బ్యాట్ నుంచి బౌండరీలు కరవైపోయాయి. ఈ క్రమంలో విరాట్ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా సైతం జట్టును ఆదుకోలేకపోయాడు. రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎటువంటి ఒత్తిడి పెట్టలేకపోయాడు. 107 బంతులు ఆడిన రాహుల్ ఇన్నింగ్స్లో కేవలం ఒక్క బౌండరీ మాత్రమే ఉంది. ఇక్కడే మనకు అర్ధమవుతోంది. మిడిల్ ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్ తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్ అయినా మెరుపులు మెరిపిస్తుండనుకుంటే తుస్సుమన్పించాడు. 28 బంతుల్లో 18 పరుగులు చేసి ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయింది. రాహుల్-కోహ్లి భాగస్వామ్యం మినహా భారత బ్యాటింగ్లో చెప్పకొదగ్గ పార్టనర్ షిఫ్ లేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 240 పరుగులకే చాపచుట్టుసేంది. చెత్త ఫీల్డింగ్.. టోర్నీ ఆరంభం నుంచి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం చేతేలేస్తేంది. తొలుత ఆస్ట్రేలియా ఫీల్డింగ్లో 20-25 పరుగులు కాపాడుకోగల్గితే.. భారత్ అందుకు భిన్నంగా అదనపు పరుగులు సమర్పించకుంది. ఫీల్డ్లో చాలా బద్దకంగా వ్యవహరించారు. ఒక పరుగు రావల్సిన చోట మరో అదనపు ఇచ్చి ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా లేకుండా చేశారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా సంప్ట్స్ వెనుక పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఇక భారత్ ఫీల్డింగ్లో ఆటగాళ్లు డైవ్ చేయడం కూడా మర్చిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్ మొత్తంలో డైవ్ చేసిన సందర్భాలు కేవలం ఒకట్రెండు ఉంటాయి. ఎక్స్ట్రాస్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతీ పరుగు చాలా ముఖ్యం. అటువంటిది భారత్ బౌలర్లు ఏకంగా 18 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా మొత్తం 50 ఓవర్లలో 12 ఎక్స్ట్రాస్ ఇస్తే.. టీమిండియా 43 ఓవర్లలో 18 ఎక్స్ట్రాస్ సమర్పించుకుంది. ఇందులో 9 పరుగులు వైడ్ల రూపంలో వచ్చినివి. స్పిన్నర్లు విఫలం.. ఫైనల్ పోరులో టీమిండియా పేసర్లు కాస్త పర్వాలేదన్పించనప్పటికీ స్పిన్నర్లు మాత్రం విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. వికెట్ మాట పక్కన పడితే బ్యాటర్లను కొంచెం కట్టడి చేయలేకపోయారు. జడేజా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిస్తే.. కుల్దీప్ 56 పరుగులు సమర్పించుకున్నాడు. హెడ్ అద్బుత పోరాటం.. 241 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. మనకంటే ఆసీస్కు చెత్త ఆరంభం లభించింది. మనం 10.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేస్తే.. ఆసీస్ 6.6 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఈ సమయంలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన శైలికి భిన్నంగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఎప్పుడైతే క్రీజులో నిలదొక్కుకున్నాడననే భారత బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చివరి వరకు అద్బుతంగా ఆడిన హెడ్ (120 బంతుల్లో 137 పరుగులు) ఆరోసారి తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్ (58 నాటౌట్) పరుగులతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం -
నిరాశలో టీమిండియా! ఫైనల్లో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అతడికే.. వీడియో వైరల్
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో అనూహ్య ఓటమితో టీమిండియాకు నిరాశే మిగిలింది. సొంతగడ్డపై కప్ గెలవాలన్న పట్టుదలతో ఆది నుంచి అద్భుతంగా ఆడినా.. అసలు పోరులో పరాజయమే ఎదురైంది. దీంతో పుష్కరకాలం తర్వాత మరోసారి వన్డే ప్రపంచకప్ను అందుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. అహ్మదాబాద్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత అభిమానులతో పాటు ఆటగాళ్ల గుండెలు ముక్కలయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తుదిమెట్టుపై బోల్తా పడిన తీరును జీర్ణించుకోలేక ముంచుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని డ్రెస్సింగ్రూంకు వెళ్లిపోయారు. నిరాశతో అలా కూర్చుండిపోయారు. అయితే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆ గంభీర వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ప్రపంచకప్-2023 సందర్భంగా ప్రవేశపెట్టిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆఖరి మ్యాచ్లోనూ బెస్ట్ ఫీల్డర్ మెడల్ను అందజేశాడు. అహ్మదాబాద్లో ఆసీస్తో ఆదివారం నాటి ఫైనల్లో ఈ అవార్డు అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లికి లభించింది. అయితే, ప్రతిసారి వినూత్న పద్ధతిలో విజేతను ప్రకటించే దిలీప్ ఈసారి మాత్రం సాదాసీదాగా కోహ్లి పేరును ప్రకటించాడు. ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లంతా అలా నిరాశగా కూర్చుండిపోగా దిలీప్ స్ఫూర్తిదాయక ప్రసంగంతో వారిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాడు. ‘‘ఇది కష్టసమయం. మనందరికీ బాధాకరమైన రోజు. అయితే, మనలో ఎలాంటి ప్రయత్నలోపం లేదు. ప్రతి ఒక్కరం గెలుపు కోసం శ్రమించాం. కానీ ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే, రాహుల్ భయ్యా చెప్పినట్లు మిమ్మల్ని చూసి మాతో పాటు అభిమానులంతా గర్వపడుతున్నారు. ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ప్రాక్టీస్ సెషన్లో ఎంత కఠినశ్రమకోర్చాడో మాకు తెలుసు. ఆట పట్ల మీ అంకిత భావం, నిబద్ధతను ప్రశంసించితీరాల్సిందే. గెలిచేందుకు మీరు శాయశక్తులా ప్రయత్నించారు. ఇంతకంటే ఇంకేం కావాలి. చాలా బాగా ఆడారు’’ అని దిలీప్ టీమిండియాను ప్రశంసించాడు. అనంతరం రవీంద్ర జడేజా మెడల్ను కోహ్లి మెడలో వేశాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఫీల్డింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు దిలీప్ ఇలా మెడల్స్ అందజేశాడు. కోహ్లి రెండుసార్లు, శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు గెలవగా.. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ తదితరులు కూడా పతకం అందుకున్నారు. కాగా ఆసీస్తో ఫైనల్లో షమీ బౌలింగ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ను కోహ్లి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) View this post on Instagram A post shared by ICC (@icc) -
నిన్నటి రోజు మనది కాకుండా పోయింది: షమీ భావోద్వేగం.. పోస్ట్ వైరల్
ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. టోర్నీ ఆసాంతం తాము అద్బుతంగా ఆడామని.. కానీ నిన్నటి రోజు మాత్రం తమది కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పడిలేచిన కెరటంలా తిరిగి పుంజుకుని అభిమానులను గర్వపడేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం(నవంబరు 19) జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా భారత జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అజేయ జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా ఈ ఎడిషన్లో లీగ్ దశ నుంచి ఓటమన్నదే ఎరుగని రోహిత్ సేనకు తొలి ఓటమిని రుచి చూపించి.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. దీంతో.. మనోళ్లు కప్ గెలుస్తారని ఆశగా ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. సొంతగడ్డపై భారత్ను మరోసారి చాంపియన్గా చూడాలనుకున్న స్వప్నాలు చెదిరిపోయాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ ‘ఎక్స్’ వేదికగా తన భావాలు పంచుకున్నాడు. ‘‘దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మనది కాకుండా పోయింది. జట్టుకు, నాకు టోర్నీ ఆసాంతం మద్దతుగా నిలిచిన భారతీయులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మోదీజీకి థాంక్స్ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన డ్రెస్సింగ్ రూంకి వచ్చి మాలో స్ఫూర్తిని నింపారు. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని షమీ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రధాని మోదీ తనను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చుతున్న ఫొటోను జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత పేస్ త్రయంలో కీలకమైన మహ్మద్ షమీకి ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్లలో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా రూపంలో పేస్ ఆల్రౌండర్ అందుబాటులో ఉండటంతో షమీని పక్కనపెట్టారు. ఆరంభంలో చోటే లేదు.. హయ్యస్ట్ వికెట్ టేకర్గా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు తుదిజట్టులో చోటిచ్చే క్రమంలో అతడికి తుదిజట్టులో చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో పాండ్యా గాయపడగా షమీ జట్టులోకి వచ్చాడు. లీగ్ దశలో న్యూజిలాండ్తో మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్ ఐదు వికెట్ల హాల్తో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్పై 4, శ్రీలంకపై 5, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్తో సెమీస్లో ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మొత్తంగా 24 వికెట్లు తీసిన షమీ.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచి అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్గా రోహిత్.. ఆసీస్ హీరోకు నో ఛాన్స్ Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5 — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్గా రోహిత్.. ఆసీస్ హీరోకు నో ఛాన్స్
45 రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్-2023కు ఎండ్ కార్డ్ పడింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ముగిసింది. వరల్డ్కప్-2023 ఛాంపియన్స్గా ఆస్ట్రేలియా నిలవగా.. టీమిండియా రన్నరప్గా నిలిచింది. ఫైనల్ పోరులో ఆసాధరణ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన భారత జట్టు ఆఖరి పోరులో మాత్రం తేలిపోయింది. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్కప్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రోహిత్తో కలిపి మొత్తం 6 మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఉన్నారు. ఇక వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి గ్లెన్ మాక్స్వెల్, ఆడమ్ జంపా.. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ నుంచి డార్లీ మిచెల్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మదుషంకకు చోటు దక్కింది. అదే విధంగా 12వ ఆటగాడిగా సౌతాఫ్రికాకు చెందిన కోయెట్జీని ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఐసీసీ ఎంపిక చేసిన ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ఈ మెగా టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే ఈ వరల్డ్కప్ సెమీఫైనల్, ఫైనల్లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఐసీసీ బెస్ట్ ఎలెవన్: క్వింటన్ డికార్ (సౌతాఫ్రికా), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, డారెల్ మిచెల్, కేఎల్ రాహుల్, గ్లెన్ మ్యాక్స్వెల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మదుషంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ. 12వ ఆటగాడిగా కోయెట్జీ. -
గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లిని ఓదార్చిన సచిన్
ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు అంటూ ఊరించిన విజయం ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలన్న టీమిండియా కల ఆస్ట్రేలియా కారణంగా చెదిరిపోయింది. ఐసీసీ టోర్నీల్లో తమకు తామే సాటి అన్న విషయాన్ని మరోసారి నిరూపించిన కంగారు జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి విజేతగా నిలవగా.. మూడోసారి కప్ను ముద్దాడాలని భావించిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. అత్యధిక పరుగుల వీరుడుగా విరాట్ కోహ్లి.. అత్యధిక వికెట్లు పడగొట్టిన ధీరుడిగా మహ్మద్ షమీ.. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ రాణించిన రోహిత్ శర్మ.. మిడిలార్డర్లో స్థాయికి తగ్గట్లు ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. తమ పని తాము చేసుకుపోతూ విజయాల్లో తమ వంతు పాత్ర పోషించిన బౌలింగ్ దళం.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన సిరాజ్ ఒక మ్యాచ్లో ఒకరు హీరోగా నిలిస్తే.. మరో మ్యాచ్లో ఇంకొకరు.. అంతా కలిసి సమష్టిగా రాణించి లీగ్ దశతో పాటు సెమీ ఫైనల్లోనూ జట్టును అజేయంగా నిలిపారు. ఉవ్వెత్తున ఎగిసే కెరటాల్లా టాప్గేర్లో ఫైనల్కు దూసుకెళ్లారు. కానీ.. తుదిమెట్టుపై ఊహించని ఫలితంతో డీలా పడ్డారు. ఇప్పుడు కాక.. ఇంకెప్పుడు.. దిగాలుగా రోహిత్, కోహ్లి అహ్మదాబాద్లో లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక సిరాజ్ చిన్నపిల్లాడిలా ఏడిస్తే.. రోహిత్, కోహ్లి సైతం దిగాలుగా తలలు దించుకున్నారు. ఇంతదాకా వచ్చి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్న పరిస్థితిలో దాదాపుగా తమ ఫైనల్ వన్డే వరల్డ్కప్ ఆడిన ఈ దిగ్గజ బ్యాటర్ల మనసులో దాగిన ఆవేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో అశేష అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్ల హృదయాలు కూడా ముక్కలయ్యాయి. జట్టును ఓదార్చిన సచిన్ అయితే, ఆటలో గెలుపోటములు సహజమంటూ ఫ్యాన్స్తో పాటూ వారూ రోహిత్ సేనకు అండగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మైదానంలోకి వచ్చి భారత ఆటగాళ్లను ఓదార్చిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన వన్డే సెంచరీల రికార్డు బ్రేక్ చేసిన కోహ్లిని ఆత్మీయంగా హత్తుకున్న సచిన్.. మిగతా ఆటగాళ్లతో కరచాలనం చేస్తూ వారిని అనునయించే ప్రయత్నం చేశాడు. ఇక్కడిదాకా సాగిన మీ ప్రయాణం అద్బుతం అంటూ ఓటమి బాధలో కూరుకుపోయిన జట్టును ఓదార్చాడు. నిజమే కదా.. ఆట అన్నాక ఒకరు గెలవడం.. మరొకరు ఓడిపోవడం సహజమే.. అయితే, ఆ ఓడిపోయిన వాళ్లుగా మన జట్టు ఉండటం విషాదం!! చదవండి: CWC 2023: విరాట్ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా Sachin Tendulkar with the Indian team. pic.twitter.com/6JshYuzDsd — Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
భారతదేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్.. ఎవరీ పల్వంకర్ బాలూ
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి ఓటమి ఎరుగని జట్టుగా పేరుతెచ్చిన భారత్.. ఫైనల్లో చతికిలబడింది. తుదిపోరులో ఆరు వికేట్ల తేడాతో రోహిత్ సేన జట్టు కంగారుల చేతిలో ఘోర పరాజయపాలైంది. అయితే హోం గ్రౌండ్లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 తర్వాత ప్రపంచకప్ను ముద్దాడుతుందనుకున్న భారత్కు ఇలా జరగడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్ అహింస చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెట్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఒకవేళ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటే భారత్ వరల్డ్కప్ సులువగా గెలిచేదని తెలిపారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. డబ్బు, కీర్తి కోసం కాకుండా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లు దేశానికి అవసరమని.. 1876లో కర్ణాటకలోని ధర్వాడ్లో జన్మించిన భారత దేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వకంర్ బాలూ ప్రస్తావన తీసుకొచ్చారు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ క్రికెటర్(బౌలర్)గా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చేతన్ అహింస ప్రస్తావనతో పల్వంకర్ బాలూ గురించి బయటకొచ్చింది. పల్వంకర్ బాలూ భారతీయ క్రికెటర్, రాజకీయ కార్యకర్త. 1876 మార్చి 19న కర్ణాటకలోని ధార్వాడ్లో(ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ) జన్మించాడు. ప్రపంచ క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా బాలూ చరిత్రకెక్కాడు. అతడు పరమానందాస్ జీవందాస్ హిందూ జింఖానా, బాంబే బెరార్, కేంద్ర రైల్వేశాఖకు చెందిన కార్పొరేట్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ఎడమ చేతి స్పిన్ బౌలర్ అయిన బాలూ.. మొత్తం 33 ఫస్ట్-క్లాస్మ్యాచ్లలో (15.21 బౌలింగ్ సగటుతో) 179 వికెట్లు పడగొట్టాడు. 1911 ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘రోడ్స్ ఆఫ్ ఇండియా’గా పేరు సంపాదించాడు. అయితే బాలూ తన సామాజిక వర్గం కారణంగా కెరీర్లో అనేక వివక్షతను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడటంతో సమాన అవకాశాలు దక్కలేదనే విమర్శ ఉంది. ఒకసారి పుణెలో మ్యాచ్ ఆడుతుండగా.. టీ విరామం సమయంలో అతనికి టీం సభ్యులందరితో కాకుండా బయట డిస్పోజబుల్ కప్పులో అందించినట్లు, అతనికి భోజనం కూడా ప్రత్యేక టేబుల్పై వడ్డించినట్లు వార్తలొచ్చాయి. పల్వంకర్ తన ముఖం కడక్కోవాలనుకున్నా అణగారిన వర్గానికి చెందిన అటెండర్ అతనికి ఒక మూలన నీళ్లు తెచ్చి పెట్టేవాడని తెలుస్తోంది. అయితే బాలూ బొంబాయికి మారిన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్లో అతనికి హిందూ జట్టు కెప్టెన్సీ నిరాకరించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పల్వంకర్ పేరు గాంచారు. గాంధీ భావజాలంతో ప్రభావితమై.. దేశంలో హోమ్ రూల్ తీసుకురావడానికి కృషి చేశాడు. 1910లో పల్వంకర్ బీఆర్ అంబేద్కర్ను తొలిసారి కలిశాడు. అనంతరం ఇరువురు మంచి మిత్రులుగా మారారు. వీరిద్దరూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం దెబ్బతింది. 1932లో అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్ను బాలూ వ్యతిరేకించాడు. అనంతరం అంబేద్కర్కు వ్యతిరేకంగా ‘రాజా-మూంజే ఒప్పందం’పై సంతకమూ చేశాడు. అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అణగారిన వర్గాలను ఇతర మతాల్లోకి మార్చడాన్ని 'ఆత్మహత్య'గా అభివర్ణించాడు. 1933లో బాలూ హిందూ మహాసభ టికెట్పై బొంబాయి మున్సిపాలిటీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి చెందాడు. నాలుగు సంవత్సరాల తరువాత కాంగ్రెస్లో చేరి బొంబాయి శాసనసభ ఎన్నికలలో బీఆర్ అంబేద్కర్కు వ్యతిరేకంగా పోటీ చేసి మరోసారి పరాజయం పొందాడు. స్వాతంత్ర్యం అనంతరం 1955 జూలై4న బాంబే స్టేట్లో మరణించాడు. డాయన అంత్యక్రియలకు పలువురు జాతీయ నాయకులు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. -
CWC 2023: వాళ్ల చేతిలో ఓడినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు!
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓడిన రోహిత్ సేనకు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అండగా నిలిచాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన జట్టు చేతిలో ఓడిపోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో వినోదం పంచడం గొప్ప విషయమంటూ బాసటగా నిలిచాడు. కాగా సొంతగడ్డపై లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. సెమీస్లో న్యూజిలాండ్ రూపంలో ఎదురైన గండాన్ని దిగ్విజయంగా దాటింది. ప్రపంచకప్ పదమూడవ ఎడిషన్లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. కానీ తుదిమెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది. టాస్ ఓడి నామమాత్రపు స్కోరుకు పరిమితమైన రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత్ ఓటమిపై మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి అంతా సజావుగా సాగుతుందని భావిస్తే దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో తారుమారైంది. ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి వస్తేనే అనుకున్నవి సాధ్యపడతాయి. అయినా.. పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయిన కారణంగా ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఆసీస్పై టీమిండియా పైచేయి సాధించింది. ఈరోజు వాళ్లు తమదైన శైలిలో రాణించి గెలిచారు. ఐదుసార్లు చాంపియన్ అయిన జట్టుకు ఫైనల్లో ఎలా గెలవాలో కచ్చితంగా తెలిసే ఉంటుంది కదా! ఏదేమైనా టీమిండియా ఇక్కడి దాకా సాగించిన ప్రయాణం మమ్మల్నందరినీ గర్వపడేలా చేసింది. కోట్లాది మంది ప్రేక్షకులకు మీరు వినోదం పంచారు. గర్వపడేలా చేశారు’’ అంటూ భారత ఆటగాళ్లను గావస్కర్ ప్రశంసించాడు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు సైతం టీమిండియాకు మద్దతుగా ట్వీట్లు చేసిన విషయం విదితమే!! ఇదిలా ఉంటే తాజా విజయంలో ఆస్ట్రేలియా ఆరోసారి చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
రోహిత్ నిరాశ చెందాడో లేదో కానీ.. వాళ్లు మాత్రం: సెహ్వాగ్ విమర్శలు
ICC CWC 2023 Final- Rohit Sharma: టీమిండియా ఈసారి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. సొంతగడ్డపై 2011 నాటి ఫలితం పునరావృతమవుతుందనుకుంటే తీవ్ర నిరాశే మిగిలింది. తుదిపోరుకు ముందు దాకా అజేయంగా ముందుకు సాగిన రోహిత్ సేన అసలు మ్యాచ్లో తడబడి భారీ మూల్యమే చెల్లించింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా ఒత్తిడిని చిత్తు చేసి ట్రోఫీ గెలవగా.. భారత జట్టుతో పాటు అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దూకుడుగా ఆడిన రోహిత్ అహ్మదాబాద్ వేదికగా ఆసీస్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది టీమిండియా. ఓపెనర్ రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడి అద్భుత ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(4) విఫలమైనా వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(54)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరు క్రీజులో కుదురుకుంటే మెరుగైన భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది పడేది. కానీ రోహిత్ శర్మ అనూహ్య రీతిలో అవుట్ కావడం కొంపముంచింది. టీమిండియా ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఆసీస్ స్పిన్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్కు వచ్చాడు. హెడ్ అద్భుత క్యాచ్తో హిట్మ్యాన్ ఇన్నింగ్స్కు తెర అతడి బౌలింగ్లో రెండో బంతికి సిక్స్ కొట్టిన రోహిత్.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. కానీ మరోసారి భారీ షాట్కు యత్నించి మూల్యం చెల్లించాడు. మాక్సీ విసిరిన బంతిని మిడాన్ దిశగా రోహిత్ గాల్లోకి లేపగా.. కవర్ పాయింట్లో ఉన్న ట్రవిస్ హెడ్ పాదరసంలా వెనక్కి కదిలి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాక్సీ, ఆసీస్ కెప్టెన్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా.. మోదీ స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. అలా హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్.. తొందరపడి తప్పుడు షాట్ సెలక్షన్తో 47 పరుగుల వద్ద నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో కోహ్లి 54, రాహుల్ 66 పరుగులతో రాణించగా.. 240 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమిపాలైంది. చెత్త షాట్ సెలక్షన్ ఈ నేపథ్యంలో సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో రోహిత్ నిరాశ చెందాడో లేదో కానీ మేనేజ్మెంట్ మాత్రం కచ్చితంగా డిస్సప్పాయింట్ అయి ఉంటుంది. వరుస బంతుల్లో సిక్స, ఫోర్ బాదిన తర్వాత కూడా ఇలాంటి షాట్లు ఎంపిక చేసుకోవద్దని శిక్షణా సిబ్బంది అతడికి చెప్పండి. పవర్ ప్లే ముగస్తుంది కాబట్టి మాక్స్వెల్ బౌలింగ్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని రోహిత్ భావించి ఉంటాడు. ఏదేమైనా.. నిజంగా అది చెత్త షాట్ సెలక్షన్. ఒకవేళ రోహిత్ గనుక అలా చేయకపోయి ఉంటే కథ వేరుగా ఉండేది’’ అని విమర్శించాడు. చదవండి: CWC 2023 Final: మిచెల్ మార్ష్ అనుచిత ప్రవర్తన.. ! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: విరాట్ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా
CWC 2023 Winner Australia: క్రికెట్ మెగా సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్కప్ పండుగ ఆదివారంతో ముగిసిపోయింది. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అనూహ్య విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన ప్యాట్ కమిన్స్ బృందం విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ముగించి సగర్వంగా స్వదేశానికి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. అసలు మ్యాచ్లో ఓటమిపాలైన టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వంటి అవార్డులు గెలుచుకుంది. ప్రపంచకప్-2023 టోర్నమెంట్లో వివిధ అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు 1.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ- ఇండియా (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్లు) 2. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్- ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా(137 పరుగులు, 1 క్యాచ్) 3.అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి(11 ఇన్నింగ్స్లో 765 పరుగులు) 4.అత్యధిక స్కోరు- గ్లెన్ మాక్స్వెల్(ముంబైలో అఫ్గనిస్తాన్ మీద 201 పరుగులు- నాటౌట్) 5. అత్యధిక సెంచరీలు- క్వింటన్ డికాక్- సౌతాఫ్రికా(4 శతకాలు) 6. అత్యధిక అర్ధ శతకాలు- విరాట్ కోహ్లి(6 ఫిఫ్టీలు) 7. అత్యధిక వికెట్లు- మహ్మద్ షమీ- ఇండియా(7 ఇన్నింగ్స్లో 24 వికెట్లు) 8. అత్యుత్తమ గణాంకాలు- మహ్మద్ షమీ(ముంబైలో న్యూజిలాండ్ మీద 7/57) 9. అత్యధిక సిక్సర్లు- రోహిత్ శర్మ- ఇండియా(31 సిక్స్లు) 10. అత్యధిక క్యాచ్లు- డారిల్ మిచెల్- న్యూజిలాండ్(11 క్యాచ్లు) 11. అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్- క్వింటన్ డికాక్(20) 13. అత్యధిక స్ట్రైక్రేటు- గ్లెన్ మాక్స్వెల్(150.37) పూర్తి వివరాలు- ఇతర విశేషాలు ►ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా భారత స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు. ►ఈ ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచ్లు ఆడి మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. ►మొత్తం ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక టీమ్ స్కోరు ఈ ప్రపంచకప్లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగులు సాధించింది. ►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం. ►ఈ ప్రపంచకప్లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్గా ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్వెల్ నిలిచాడు. అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్లు) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. ►ఈ ప్రపంచకప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ►ఈ ప్రపంచకప్లో ఒకే ఇన్నింగ్స్లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్పై భారత్ (410/4), పాకిస్తాన్పై న్యూజిలాండ్ (401/6) సాధించాయి. ►వన్డే వరల్డ్కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2003లో), యువరాజ్ సింగ్ (2011లో) ఈ ఘనత సాధించారు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మ్యాచ్ చూస్తూండగా ఉత్కంఠ లోనైన క్రికెట్అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న జ్యోతి కుమార్.. ఇంటి వద్దనే ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్కప్ఫైన్ మ్యాచ్ను స్నేహితులతో కలిసి చూశాడు. ఎంతో ఉద్వేగంతో మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో గుండె నొప్పి రావడంతో చికిత్స కోసం స్నేహితులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు పడే సరికి ఆనందంతో తట్టుకోలేక ఊగిపోయాడని, ఆ తర్వాత గుండె నొప్పి రావడంతో తుది శ్వాస విడిచాడని స్నేహితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడు కుటుంబాన్ని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు. చదవండి: దేశం ఎప్పుడూ మీ వెంటే: వరల్డ్కప్ ఫైనల్లో భారత్ ఓటమిపై ప్రధాని మోదీ -
ఛేదనలో నా గుండె దడ కూడా పెరిగింది.. అతడో లెజెండ్: ఆసీస్ కెప్టెన్
CWC 2023 Winner Australia- Pat Cummins Comments: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ గెలవడం రెట్టింపు సంతోషాన్నిచ్చిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టిగా రాణించడం వల్లే ఈ అపురూప విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత్లో ఐసీసీ ట్రోఫీ గెలవడం అద్భుతమైన అనుభూతి అని.. తన జీవితంలో ఈ క్షణాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని ఉద్వేగానికి లోనయ్యాడు. లక్ష పైచిలుకు అభిమానుల నడుమ కాగా ప్రపంచకప్-2023లో ఆదిలో ఓటముల పాలైన ఆస్ట్రేలియా అనూహ్య రీతిలో పుంజుకుని ఫైనల్కు దూసుకువచ్చింది. సౌతాఫ్రికాతో సెమీస్లో పోరాడి గెలిచిన కంగారూ జట్టు తుదిపోరులో ఆతిథ్య టీమిండియాపై జయభేరి మోగించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లక్ష పైచిలుకు భారత అభిమానుల మధ్య ఆతిథ్య జట్టును ఓడించి.. గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించిన ఆసీస్ 240 పరుగులకే కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డా ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం(137)తో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) పిచ్కు అనుగుణంగా వ్యూహాలు మార్చుకున్నాం ఈ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘మా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లుంది. కీలక మ్యాచ్లలో ఆడే సత్తా ఉన్నవారంతా సరైన సమయంలో స్పందించారు. ఇలాంటి ఛేదన సులువని మేం భావించాం. మా బౌలింగ్ చాలా బాగా సాగింది. పిచ్కు అనుగుణంగా వ్యూహాలు మార్చుకున్నాం. జట్టులో ఎక్కువ వయస్సున్నవాళ్లు ఉన్నా అంతా రాణించారు. టీమిండియాను 300 లోపు కట్టడి చేద్దామనుకుంటే 240కే ఆపగలిగాం. ఛేదనలో నా గుండె దడ కూడా పెరిగింది. కానీ హెడ్, లబుషేన్ కలిసి గెలిపించారు. చేయి విరిగిన తర్వాత కూడా హెడ్పై మేం నమ్మకం ఉంచి జట్టుతో కొనసాగించడం పని చేసింది. ఆటపై విపరీత అభిమానం చూపించే భారత గడ్డపై మ్యాచ్ ఆడటమే ఒక మంచి జ్ఞాపకం. అలాంటిది మేం ఇక్కడ ప్రపంచకప్ గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ క్షణాన్ని చిరస్మరణీయంగా మార్చుకోగలిగాం. మేము సాధించిన విజయాల్లో ఇది ఎప్పుటికీ శిఖరాగ్రాన నిలిచిపోతుంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
దేశం ఎప్పుడూ మీ వెంటే: వరల్డ్కప్ ఫైనల్లో భారత్ ఓటమిపై ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశం నేడు, ఎప్పుడూ టీమిండియాకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో.. ‘డియర్ టీమిండియా. ప్రపంచకప్లో ద్వారా మీరు చూపిన ప్రతిభ, పట్టుదల గుర్తించదగినది. గొప్ప స్పూర్తితో ఆడి దేశానికి గర్వకారణంగా నిలిచారు. దేశం ఎప్పుడూ మీకు అండగా, మీ వెంటే ఉంటాం’ అంటూ టీమిండియా జట్టును ఉద్ధేశించి మోదీ ట్వీట్ చేశారు. Dear Team India, Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation. We stand with you today and always. — Narendra Modi (@narendramodi) November 19, 2023 అదే విధంగా ఆరోసారి వన్డే వరల్డ్ కప్లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో వారి ఆట ప్రదర్శన ప్రశంసనీయమైనదని.. అద్భుతమైన విజయంతో ముగించారని తెలిపారు. ఫైనల్లో అద్భుతంగా ఆడిన ట్రావిస్ హెడ్కు అభినందనలు తెలిపారు. కాగా మ్యాచ్ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్తో కలిసి స్టేడియంలో మ్యాచ్ని వీక్షించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు ప్రపంచకప్ టైటిల్ను మోదీ, ఆసీస్ ఉప ప్రధాని అందించారు. Congratulations to Australia on a magnificent World Cup victory! Theirs was a commendable performance through the tournament, culminating in a splendid triumph. Compliments to Travis Head for his remarkable game today. — Narendra Modi (@narendramodi) November 19, 2023 ఇక వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. భారత్ విషాదంగా మెగా టోర్నీని ముగిచింది. లీగ్ దశలో టీమిండియా ఆటతీరు చూస్తే కప్ ఈసారి మనదే అనిపించగా.అసలు పోరాటంలో మాత్రం అనూహ్యంగా అడుగులు తడబడ్డాయి.. భారతావని క్రికెట్ అభిమానులంతా టీమిండియా విజయం కోసం చేసిన పూజలు, మొక్కులు పని చేయక మరోసారి విషాదమే మిగిలింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తోడాతో టీమిండియా పరాజయం పాలవ్వగా.. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఆరోసారి వన్డే క్రికెట్లో జగజ్జేతగా నిలిచింది. చదవండి: IND Vs AUS Finals: గుండె ‘పదకొండు’ ముక్కలు! -
ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
IND Vs AUS Finals: గుండె ‘పదకొండు’ ముక్కలు!
నిశ్శబ్దం...నిశ్శబ్దం...నిశ్శబ్దం...నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో! లక్ష మందికి పైగా మన జనాలు ఉన్న మైదానంలో కూడా నిశ్శబ్దం ఆవరిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేది అక్కడ కనిపించింది... లక్ష మందిని నిశ్శబ్దంగా ఉంచగలిగితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది అంటూ మ్యాచ్కు ముందు పరిహసించిన కమిన్స్ దానిని నిజం చేసి చూపించాడు... ఆ నిశ్శబ్దం ఒక్కసారి కాదు స్టేడియంలో మళ్లీ మళ్లీ కనిపించింది... దూసుకుపోతున్న రోహిత్ అవుటైన క్షణాన... 97 బంతుల పాటు కనీసం ఫోర్ కూడా కనిపించని వేళ... కోహ్లిని అవుట్ చేసి కమిన్స్ సింహనాదం చేసినప్పుడు... ఆ తర్వాత ట్రవిస్ హెడ్, లబుషేన్ వికెట్ల వద్ద పాతుకుపోయి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వనప్పుడూ అదే నిశ్శబ్దం కనిపించింది. మైదానంలోనే కాదు... దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశలు, అంచనాలు కూడా తప్పగా మరోసారి గుండెకోతను మిగుల్చుతూ భారత ప్రపంచకప్ సమరం ఓటమితో ముగిసింది. రోహిత్, కోహ్లి ముఖాల్లో ఎలాంటి భావాలు కనిపించడం లేదు... కేఎల్ రాహుల్ మోకాళ్లపై కూర్చుండిపోయాడు... సిరాజ్కు కన్నీళ్లు ఆగడం లేదు... బుమ్రాలో నాలుగేళ్ల తర్వాతా మళ్లీ అదే బాధ... ప్రపంచకప్ గెలుచుకోవాలని కలగన్న మిగతా ఆటగాళ్ల కళ్ల ముందూ ఒక్కసారిగా శూన్యం ఆవరించింది... ఎన్ని అద్భుత ప్రదర్శనలు... ఎంత గొప్ప ఆట... తిరుగులేని బ్యాటింగ్, పదునైన బౌలింగ్తో వరుసగా 10 విజయాలు... ఓటమన్నదే లేకుండా సాగిన ప్రయాణం చివరి మెట్టుపై నిరాశను మిగిల్చింది. లీగ్ దశలో టీమిండియా ఆటతీరు చూస్తే కప్ ఈసారి మనదే అనిపించగా... అసలు పోరాటంలో మాత్రం అనూహ్యంగా అడుగులు తడబడ్డాయి... భారతావని క్రికెట్ అభిమానులంతా టీమిండియా విజయం కోసం చేసిన పూజలు, మొక్కులు పని చేయక మరోసారి విషాదమే మిగిలింది. పదేళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్లేని టీమిండియా బాధ మరికొంత కాలం అందరినీ వెంటాడక తప్పదు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది... తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేయడం మంచి అవకాశమే అనిపించింది... రోహిత్ దూకుడైన ఆరంభం చూస్తే భారీ స్కోరు ఖాయం అన్నట్లుగా అతని బ్యాటింగ్ ధాటి చూపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది... ఫైనల్ మ్యాచ్ ఒత్తిడి కనిపించింది... తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన జట్టు తర్వాతి పదేసి ఓవర్లలో 35, 37, 45, 43 పరుగులే...చివరకు 240 వద్దే ఆట ముగిసింది. అయినా సరే...ఇంగ్లండ్తో 229 పరుగులను కాపాడుకోలేదా? సెమీస్లో దక్షిణాఫ్రికాపై 213 పరుగులు సాధించేందుకు ఆసీస్ తీవ్రంగా ఇబ్బంది పడలేదా? ఇప్పుడూ సాధ్యమే అనే ఆశ... ఆసీస్ 47/3 వద్ద ఆ నమ్మకం పెరిగింది... కానీ ‘హెడ్’ను తీయలేక, లబుషేన్ను అడ్డుకోలేక ఆ విశ్వాసం ఓవర్లు సాగుతున్నకొద్దీ కరుగుతూ వచ్చింది... చివరకు ఏమి చేయలేని స్థితిలో భారత్ ఓటమికి సిద్ధమైంది... 2003 ప్రపంచకప్ ఫైనల్కు ప్రతీకారంలా కాకుండా రీప్లేలా 2023 వరల్డ్ కప్ సినిమా ముగిసింది. అహ్మదాబాద్: అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఆరోసారి వన్డే క్రికెట్లో జగజ్జేతగా నిలిచింది. టోర్నీ ఆరంభ దశలో తడబడి ఆ తర్వాత కోలుకున్న ఆ జట్టు చివరి వరకు అదే పట్టుదలను కనబర్చి వరల్డ్కప్ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు వరుసగా 10 విజయాలతో ఊపు మీద కనిపించిన భారత్ అసలు పోరులో తలవంచింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 66; 1 ఫోర్), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 54; 4 ఫోర్లు), రోహిత్ శర్మ (31 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ ట్రవిస్ హెడ్ (120 బంతుల్లో 137; 15 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, మార్నస్ లబుషేన్ (110 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 35.5 ఓవర్లలో 192 పరుగులు జోడించారు. గతంలోఆ్రస్టేలియా 1987, 1999, 2003, 2007, 2015లలో కూడా వన్డే ప్రపంచకప్ చాంపియన్గా నిలిచింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం ఇది రెండోసారి. 2003 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ ఓడిపోయింది. ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా డిప్యూటీ ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ విన్నర్స్ ట్రోఫీని అందజేశారు. విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 33 కోట్ల 32 లక్షలు), రన్నరప్ భారత జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 66 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. రాహుల్ అర్ధ సెంచరీ... రోహిత్ ఎప్పటిలాగే తనదైన శైలిలో దూకుడుగా ఆటను ప్రారంభించాడు. మరో ఎండ్లో గిల్ (7 బంతుల్లో 4) విఫలమైనా రోహిత్ జోరుతో స్కోరు దూసుకుపోయింది. స్టార్క్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో కోహ్లి కూడా ధాటిని చూపాడు. 9 ఓవర్లలో భారత్ స్కోరు 66/1. అయితే మ్యాక్స్వెల్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రోహిత్ మరో భారీ షాట్కు ప్రయత్నించగా, హెడ్ పట్టిన అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (3 బంతుల్లో 4; 1 ఫోర్) కూడా అవుటయ్యాడు. ఇక్కడి నుంచి భారత్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆసీస్ బౌలర్లు మన బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. మెరుగైన ఫీల్డింగ్ కూడా ఆ జట్టు అదనపు బలంగా మారింది. కోహ్లి కొంత మెరుగ్గా ఆడినా... రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకదశలో వరుసగా 26.1 ఓవర్ల పాటు (97 బంతులు) ఒక్క ఫోర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. ఆ వెంటనే కమిన్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని కోహ్లి నిష్క్ర మించాడు. కోహ్లి, రాహుల్ నాలుగో వికెట్కు 67 పరుగులు జోడించారు. తడబాటును కొనసాగిస్తూ 86 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీకి చేరగా, బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన రవీంద్ర జడేజా (22 బంతుల్లో 9) ప్రభావం చూపలేకపోయాడు. ఆపై వరుసగా వికెట్లు తీసిన ఆసీస్ చివరి వరకు ఒత్తిడిని కొనసాగించడంలో సఫలమైంది. 41వ ఓవర్లో స్కోరు 200 పరుగులకు చేరగా, సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా ఆఖర్లో ఏమీ చేయలేకపోయాడు. భారీ భాగస్వామ్యం... లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. షమీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే వార్నర్ (3 బంతుల్లో 7; 1 ఫోర్) వెనుదిరగ్గా, బుమ్రా బౌలింగ్లో మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ (9 బంతుల్లో 4; 1 ఫోర్)ను కూడా బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్ స్కోరు 47/3... ఇక్కడే భారత బృందంలో చిన్న ఆశ. మరో వికెట్ తీస్తే ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయొచ్చనే వ్యూహం. కానీ హెడ్, లబుషేన్ ఆ అవకాశం ఇవ్వలేదు. హెడ్ తన దూకుడును ఎక్కడా తగ్గించకుండా చెలరేగిపోగా, లబుషేన్ చక్కటి డిఫెన్స్తో బలంగా నిలబడ్డాడు. వీరిద్దరి జోడీని విడదీయడానికి భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. పిచ్ జీవం కోల్పోయి బ్యాటింగ్కు బాగా అనుకూలంగా మారిపోవడంతో పాటు మన బౌలర్లలో కూడా పదును లోపించింది. దీనిని ఆసీస్ ఇద్దరు బ్యాటర్లూ సమర్థంగా వాడుకున్నారు. ఎక్కడా కనీస అవకాశం కూడా ఇవ్వకుండా వీరిద్దరు లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. 95 బంతుల్లోనే హెడ్ శతకం పూర్తి చేసుకోగా, 99 బంతుల్లో లబుషేన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి మరో 2 పరుగుల దూరంలో హెడ్ అవుటైనా... మ్యాక్స్వెల్ (2 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. దాంతో ఆసీస్ శిబిరంలో భారీ సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హెడ్ (బి) మ్యాక్స్వెల్ 47; గిల్ (సి) జంపా (బి) స్టార్క్ 4; కోహ్లి (బి) కమిన్స్ 54; అయ్యర్ (సి) ఇన్గ్లిస్ (బి) కమిన్స్ 4; రాహుల్ (సి) ఇన్గ్లిస్ (బి) స్టార్క్ 66; జడేజా (సి) ఇన్గ్లిస్ (బి) హాజల్వుడ్ 9; సూర్యకుమార్ (సి) ఇన్గ్లిస్ (బి) హాజల్వుడ్ 18; షమీ (సి) ఇన్గ్లిస్ (బి) స్టార్క్ 6; బుమ్రా (ఎల్బీ) (బి) జంపా 1; కుల్దీప్ (రనౌట్) 10; సిరాజ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 240. వికెట్ల పతనం: 1–30, 2–76, 3–81, 4–148, 5–178, 6–203, 7–211, 8–214, 9–226, 10–240. బౌలింగ్: స్టార్క్ 10–0–55–3, హాజల్వుడ్ 10–0–60–2, మ్యాక్స్వెల్ 6–0–35–1, కమిన్స్ 10–0–34–2, జంపా 10–0–44–1, మార్ష్ 2–0–5–0, హెడ్ 2–0–4–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) కోహ్లి (బి) షమీ 7; హెడ్ (సి) గిల్ (బి) సిరాజ్ 137; మార్ష్ (సి) రాహుల్ (బి) బుమ్రా 15; స్మిత్ (ఎల్బీ) (బి) బుమ్రా 4; లబుషేన్ (నాటౌట్) 58; మ్యాక్స్వెల్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 18; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–16, 2–41, 3–47, 4–239. బౌలింగ్: బుమ్రా 9–2–43–2, షమీ 7–1–47–1, జడేజా 10–0–43–0, కుల్దీప్ 10–0–56–0, సిరాజ్ 7–0–45–1. -
ఆస్ట్రేలియాకు మాత్రమే సాధ్యం! 2015 కంటే ఈ విజయమే గొప్పది!
CWC 2023 Winner Australia: ‘2015 కంటే ఈ విజయమే గొప్పది, ఎందుకంటే ఇది భారత గడ్డపై వచ్చింది’... హాజల్వుడ్ వ్యాఖ్య ఇది. ఇదే ఈ విజయం విలువేమిటో చెబుతోంది. టోర్నీ ఆరంభంలో 2 మ్యాచ్లలో ఓడిన తర్వాత పాయింట్ల పట్టికలో ఆ్రస్టేలియా అట్టడుగున ఉంది. ఫలితం మాత్రమే కాదు ప్రదర్శన కూడా చెత్తగా ఉంది. రెండు మ్యాచ్లలో జట్టు 199, 177 పరుగులే చేయగలిగింది. దాంతో అందరూ ఆసీస్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ తర్వాతి మ్యాచ్ నుంచి మొదలు పెడితే సెమీస్ వరకు వరుసగా ఎనిమిదో విజయాలతో ఆ జట్టు దూసుకుపోయింది. న్యూజిలాండ్తో, సెమీస్లో దక్షిణాఫ్రికాతో అతి కష్టమ్మీద గెలవడంతో ఫైనల్ కూడా భారతే ఫేవరెట్గా కనిపించింది. కానీ పట్టుదల, చివరి వరకు ఓటమిని అంగీకరించని తర్వాత ఉన్న కంగారూ బృందం ఎప్పటిలాగే ఐసీసీ టోర్నీలో అసలు సమరంలో సత్తా చాటింది. ప్రధాన పోటీల్లో ఒత్తిడికి తలవంచని తమ బలాన్ని మళ్లీ చూపించింది. ప్రపంచ కప్కు ముందు హెడ్ చేతికి గాయమైంది. అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉన్నా ఆసీస్ ఆ పని చేయక 14 మందితోనే జట్టును కొనసాగించింది. ఇప్పుడు అతను సెమీస్, ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. టోర్నీకి ప్రకటించిన టీమ్లో లబుషేన్కు చోటు దక్కలేదు. స్పిన్నర్ అగర్ గాయపడగా... అతని స్థానంలో మరో స్పిన్నర్ను ఎంచుకోకుండా లబుషేన్ను తీసుకుంది. జట్టు కుప్పకూలిపోకుండా మిడిలార్డర్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు సరైన వాడని ఆసీస్ భావించింది. ఫైనల్లో అతను అదే చేసి చూపించాడు. వార్నర్, మ్యాక్స్వెల్ ఐపీఎల్ అనుభవం ఇక్కడా బాగా పని చేయగా, మార్ష్ కూడా రెండు కీలక శతకాలు బాదాడు. ముఖ్యంగా అఫ్గానిస్తాన్పై 91/7తో ఓటమికి చేరువైన దశలో మ్యాక్స్వెల్ చేసిన డబుల్ సెంచరీ నభూతో నభవిష్యత్. స్టార్క్, హాజల్వుడ్ చెరో 16 వికెట్లతో జట్టుకు చుక్కానిలా నిలవగా, లెగ్స్పిన్నర్ జంపా 23 వికెట్లతో సత్తా చాటాడు. అన్నింటికి మించి పేసర్గా, కెప్టెన్ కమిన్స్ ముద్ర ప్రత్యేకం. బౌలింగ్లో 15 వికెట్లు పడగొట్టడంతో పాటు వ్యూహాలపరంగా అతను చూపించిన సాహసం, తెగువ కమిన్స్ను ప్రత్యేకంగా నిలిపాయి. ఫైనల్లో తన 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా భారత్ను కట్టి పడేయగలిగాడు. 2023లో డబ్ల్యూటీసీ, యాషెస్, వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్కు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన కమిన్స్... ఈ మూడింటిలోనూ అద్భుత విజయాలతో ఆసీస్ గొప్ప నాయకుల్లో ఒకడిగా తన స్థానాన్ని లిఖించుకున్నాడు. –సాక్షి క్రీడా విభాగం View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అందరూ హీరోలే.. కానీ టీమిండియా చివరకు ఇలా!
మళ్లీ అదే బాధ... మరోసారి అదే వేదన... చేరువై దూరమైన వ్యథ! తమ అద్భుత ఆటతో అంచనాలను పెంచి విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్న జట్టుగా కనిపించిన భారత్ విషాదంగా మెగా టోర్నీని ముగించింది. 2003లో ఆసీస్ చేతిలో ఓడిన బాధ నాటి తరానికి మాత్రమే గుర్తుంటుంది... కానీ నాలుగేళ్ల క్రితం 2019 సెమీఫైనల్లో మన ఓటమి ఇంకా అభిమానుల మదిలో తాజాగానే ఉంది. ఇప్పుడు స్వదేశంలో దానిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై మన ఆధిపత్యం చూస్తే భారత జట్టుపై అంచనాలు పెరిగాయి... ప్రపంచకప్నకు ఆరు నెలల ముందు నుంచి జట్టు కూర్పుపై ప్రణాళికలు, ప్రదర్శన, ఒక్కో ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనలు, వారికి అప్పగించిన వేర్వేరు బాధ్యతలు అద్భుతంగా పని చేశాయి. కోచ్గా రాహుల్ ద్రవిడ్, రోహిత్ కెప్టెన్సీ మధ్య గొప్ప సమన్వయం మెరుగైన వ్యూహాలకు బాట వేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో 66 వన్డేల్లో కలిపి భారత్ 50 మంది ఆటగాళ్లను ఆడించింది. ఏ ఇతర జట్టూ ఇంత మందికి అవకాశం కల్పించలేదు. ముఖ్యంగా ప్రతీ స్థానం కోసం సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను గుర్తించే ప్రయత్నం ఇందులో జరిగింది. ఆయా ఆటగాళ్ల ప్రదర్శన తర్వాత ఈ సంఖ్యను సగానికి తగ్గించి 24 మందితో ఒక జాబితా తయారైంది. ఇందులో నుంచే వరల్డ్కప్ కప్ టీమ్ ఉంటుందనే విషయంపై స్పష్టత వచ్చింది. వరల్డ్కప్నకు ఆరు నెలల ముందునుంచి చూస్తే 2023 మార్చి 1 నుంచి అక్టోబర్ 4 మధ్య భారత్ 15 వన్డేలు ఆడితే ఈ 24 నుంచే జట్లను ఎంపిక చేశారు. అనంతరం 15 మందితో వరల్డ్ కప్ టీమ్ ఎంపికైంది. వరుస అద్భుత విజయాలు వీరితోనే సాధ్యమయ్యాయి. ‘మేం జట్టుగా గెలుస్తాం...జట్టుగా ఓడతాం’... ప్రపంచకప్ మొత్తం భారత డ్రెస్సింగ్ రూమ్లో ఈ నినాదం గట్టిగా మార్మోగింది. సెమీస్ వరకు ఒక్కసారి కూడా ఓటమిని దరి చేరనీయకుండా విజయంపై విజయంపై సాధిస్తూనే టీమిండియా తమ స్థాయిని ప్రదర్శించింది. ఎదురులేని ఆటతో వరుసగా 10 మ్యాచ్లను సొంతం చేసుకొని అంచనాలను ఆకాశానికి పెంచింది. 1983 వరల్డ్కప్ అనగానే జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 నాటౌట్, ఫైనల్లో కపిల్ పట్టిన రిచర్డ్స్ క్యాచ్లాంటివి ప్రత్యేకంగా కనపడతాయి. 2011లో యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో పాటు ధోని కొట్టిన విన్నింగ్ సిక్సరే అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. ఈ రెండు మెగా టోర్నీల్లోనూ ఇతర ఆటగాళ్లూ తమ వంతు పాత్ర పోషించినా... టీమ్ గేమ్లో గెలవాలంటే అందరి భాగస్వామ్యం తప్పనిసరి అని ఎన్ని మాటలు చెప్పుకున్నా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలే హైలైట్ అయి అవే ప్రపంచకప్ను గెలిపించాయనే భావన కలిగిస్తాయి. కానీ ఈ టోర్నీలో మాత్రం భారత ఆటగాళ్లందరూ హీరోలే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. మైదానంలోకి దిగిన ప్రతీ ఒక్కరు తమదైన ఆటతో జట్టును గెలిపించారు... జట్టు కోసం గెలుపు అవకాశాలు సృష్టించారు. జట్టుకు విజయం అందించేందుకు ఒకటో నంబర్ ఆటగాడినుంచి పదకొండో నంబర్ ప్లేయర్ వరకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. వ్యక్తిగతంగా చూస్తే ప్రతీ పోరులో ఒకరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలుస్తారు. కానీ భారత జట్టుకు సంబంధించి ప్రతీ మ్యాచ్లో అందరూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లే. ఒక బ్యాటర్ నెమ్మదించినట్లు కనిపిస్తే మరొకరు చెలరేగిపోయారు. ఒక బౌలర్ కాస్త తడబడినట్లు అనిపిస్తే నేనున్నానంటూ మరో బౌలర్ వచ్చి లెక్క సరిచేశారు. పవర్ప్లేలో పవర్ అంతా చూపిస్తే, మధ్య ఓవర్లలో మరొకరు ఇన్నింగ్స్ నడిపించారు. చివర్లో చెలరేగే బాధ్యత ఇంకొకరిది. భారత గడ్డపై పేసర్లు ఇంతగా ప్రభావం చూపించగలరని ఎవరైనా అనుకున్నారా! మన త్రయం దానిని చేసి చూపించింది. ఒక్కో బంతిని ఆడేందుకు బ్యాటర్లు పడిన తిప్పలు చూస్తే దాని పదునేమిటో తెలుస్తుంది. ఇక స్పిన్ ద్వయం ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఐదుగురూ వికెట్లు తీయగల సమర్థులైన బౌలర్లు ఉన్న టీమిండియాను చూసి ఎన్నాళ్లయింది? అంకెలపరంగా చూస్తే ప్రతీ ఒక్కరి పాత్ర జట్టును గెలిపించింది. 11 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 765 పరుగులు చేసిన కోహ్లి తన విలువేంటో చూపించాడు. ముందుగా క్రీజ్లో కుదురుకొని తర్వాత ధాటిగా ఆడే తన శైలిని మార్చుకొని ఆరంభంలో చెలరేగి విజయానికి పునాది వేసే వ్యూహంతోనే ఆడిన కెప్టెన్ రోహిత్ కూడా 597 పరుగులు చేశాడు. శ్రేయస్ (530), రాహుల్ (452), శుబ్మన్ గిల్ (354) కూడా కీలక పరుగులు సాధించారు. ఇక బౌలింగ్లో 7 మ్యాచ్లలోనే కేవలం 10.70 సగటుతో 24 వికెట్లు తీసి మొహమ్మద్ షమీ టోర్నీని ఒక ఊపు ఊపాడు. బుమ్రా 20 వికెట్లతో తన సత్తాను చాటగా... జడేజా (16), కుల్దీప్ (15), సిరాజ్ (14) బౌలింగ్ దళం బలాన్ని చూపించారు. కానీ... కానీ... ఫైనలో పోరులో మాత్రం ఈ గణాంకాలన్నీ పనికి రాలేదు. సెమీస్ వరకు స్వేచ్ఛగా ఆడినా... వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి సహజంగానే వారిలో కనిపించింది. అందుకే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఏదీ కలిసి రాలేదు. గిల్, శ్రేయస్ జోరు చూపించలేకపోగా, రాహుల్ పూర్తిగా తడబడ్డాడు. ఫైనల్లాంటి కీలక పోరులో రోహిత్ తన దూకుడు కాస్త నియంత్రించుకొని ఉంటే బాగుండేదని అనిపించినా... అతనూ విఫలమయ్యే ప్రమాదమూ ఉండేది. కోహ్లి ఒక్కడే తన స్థాయికి తగ్గ ఆటను చూపించగలిగినా అది సరిపోలేదు. జడేజా, సూర్య ఇలాంటి సమయంలో ఆదుకోలేకపోయారు. అయితే బౌలింగ్ దళం కాస్త ఆశలు కలిగించింది. ఆరంభంలో మూడు వికెట్లు తీయడం కూడా నమ్మకం పెంచింది. అయితే 240 పరుగుల స్కోరు మరీ చిన్నదైపోయింది. పది విజయాల ప్రదర్శన తర్వాత ఇలాంటి ఆట ఓటమి వైపు నిలిపింది. అయినా సరే... భారత్ ప్రదర్శనను తక్కువ చేయలేం. లీగ్ దశలో తొమ్మిది వేర్వేరు ప్రత్యర్థులతో, వేర్వేరు వేదికలపై సాగించిన ఆధిపత్యం అసాధారణం. ఆటగాళ్ల శ్రమ, అంకితభావం అన్నింటిలో కనిపించాయి. ఈ టీమ్ చాంపియన్గా నిలిచేందుకే పుట్టింది అని అనిపించింది. అయితే ఏదైనా తప్పు జరగాలని రాసి పెట్టి ఉంటే అది ఎలాగూ జరుగుతుంది. కానీ కీలక సమయంలోనే అది జరుగుతుంది. ఈ టోర్నీలో మనం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. ఆ మ్యాచ్ కాస్తా ఫైనల్ మ్యాచ్ కావడమే విషాదం! –సాక్షి క్రీడా విభాగం View this post on Instagram A post shared by ICC (@icc) -
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ
టీమిండియా అభిమానుల గుండె పగిలింది. ముచ్చటగా మూడో సారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడాలన్న భారత జట్టు ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో అదరగొట్టిన భారత జట్టు.. కీలకమైన ఫైనల్లో చేతులేత్తేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన రోహిత్ సేన.. కంగూరులకు వరల్డ్కప్ను అప్పగించేసింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచింది. ఆసీస్ విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్ 14 ఫోర్లు, 4 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఫైనల్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్లో విఫలమకావడంతో ఓటమి పాలైమని రోహిత్ తెలిపాడు. "ఫైనల్ మ్యాచ్లో ఓడి పోవడం చాలా బాధగా ఉంది. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. ఈ మ్యాచ్లో మేము మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మేము టార్గెట్ను డిఫెండ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నించాం. కానీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాం. మరో 20-30 పరుగులు చేసి ఉంటే బాగుండేది. రాహుల్, కోహ్లి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో 270 నుంచి 280 స్కోర్ వస్తాదని మేము అనుకున్నాం. కానీ మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. 240 వంటి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేయాలంటే ఆరంభంలో వికెట్లు తీయాలని నిర్ణయించుకున్నాం. మేము అనుకున్న విధంగా మూడు వికెట్లు సాధించాం. కానీ హెడ్, లబుషేన్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను మా నుంచి దూరం చేశారు. కచ్చితంగా వారిద్దరికి క్రెడిట్ ఇవ్వాలి. ఫ్లడ్ లైట్స్లో బ్యాటింగ్ చేయడానికి పిచ్ కొంచెం మెరుగ్గా ఉంది. అయితే దీనిని సాకుగా చెప్పాలనుకోవడం లేదు. మేము ప్రత్యర్ధి ముందు మంచి టార్గెట్ను ఉంచలేకపోయాం. ఏదైమనప్పటికీ ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన కనబరిచింది" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023 Final Viral Videos: వరల్డ్కప్లో ఓటమి.. కనీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్ -
CWC 2023 Final: పోరాట యోధులు.. మ్యాచ్ ఓడినా, మనసులు గెలుచుకున్నారు..!
తాడేపల్లి : వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2023 వరల్డ్ కప్లో మన క్రికెటర్లు మంచి పోరాట పటిమ చూపించారు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేకపోయినా వారి క్రీడా స్ఫూర్తి, యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇండియా టీమ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అంటూ సీఎం వైస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. My admiration and respect for our warriors of the Indian Cricket Team for their incredible journey in the 2023 Cricket World Cup. Although the match didn’t go in our favour, their spirit, sportsmanship and innumerable moments through this journey have greatly inspired the entire… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 19, 2023 -
వరల్డ్కప్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్
వన్డే వరల్డ్కప్-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో 12 ఏళ్ల వరల్డ్కప్ ట్రోఫి నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగిన మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఓటమితో 140 కోట్ల భారతీయులకు గుండె కోతను మిగిల్చింది. మరోవైపు ఈ ఫైనల్ పోరులో అద్బుత ప్రదర్శన ఆస్ట్రేలియా.. ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్ 14 ఫోర్లు, 4 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది. కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్.. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలవ్వగానే స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన బౌలింగ్లో మాక్స్వెల్ తన బౌలింగ్లో విన్నింగ్ షాట్ కొట్టగానే సిరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా అతడి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. అంతకుముందు విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆసీస్ విజయానికి చేరువులో ఉన్నప్పుడు కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ టోర్నీ మొత్తం కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 765 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: CWC 2023: అన్నంత పనిచేసిన కమిన్స్.. టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలు Siraj & entire team crying they dint deserve this man💔#CWC23 #CWC23Final #INDvAUS pic.twitter.com/avux5bct6H — ᴀꜱɪᴍ ʀɪᴀᴢ ᴜɴɪᴠᴇʀꜱᴇ 💛 (@AsimRiazworld) November 19, 2023 pic.twitter.com/l7rXZYXzIj — Sitaraman (@Sitaraman112971) November 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 Final Photos Gallery: ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా ఆస్ట్రేలియా (ఫొటోలు)
-
IND Vs AUS Finals: అన్నంత పనిచేసిన కమిన్స్.. టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలు
ఆస్ట్రేలియా వంటి ప్రమాదకరమైన జట్టుతో జాగ్రత్త.. డేంజరస్ టీమ్.. ఫైనల్కు వచ్చిందంటే కప్ ఎగురేసుకుపోకుండా ఉండదు.. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్లు జారీ చేసిన హెచ్చరికలు.. ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి. స్టేడియంలో లక్ష మందికిపైగా టీమిండియా అభిమానుల మధ్య రోహిత్ సేనపై అలవోకగా విజయం సాధించింది కంగారూ జట్టు. రికార్డు స్థాయిలో ఏకంగా ఆరోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. భారత జట్టుకు మద్దతుగా నరేంద్ర మోదీ స్టేడియం మొత్తం హోరెత్తుతుందని తెలుసు.. వాళ్లందరినీ నిశ్శబ్దంగా ఉంచడమే లక్ష్యం.. అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు.. అన్నట్లుగానే కోట్లాది మంది టీమిండియా అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మొదలు.. పదే పదే బౌలర్లను మారుస్తూ భారత బ్యాటర్లను కట్టడి చేసిన విధానం.. ఆపై లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు రచించిన తీరు అద్భుతం. మ్యాచ్ ఆసాంతం పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన విధానం కమిన్స్ నాయకత్వ ప్రతిభకు అద్దంపట్టాయి. ఆసీస్కు వరల్డ్కప్ అందించిన దిగ్గజ కెప్టెన్ల సరసన నిలిపాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచకప్-2023 ఫైనల్ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో ఆతిథ్య టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా చాంపియన్గా అవతరించింది. మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గిల్, అయ్యర్ పూర్తిగా విఫలం ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ యువ బ్యాటర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లి, 54 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్ బ్యాటర్, గత మ్యాచ్లలో వరుసగా సెంచరీలు చేసిన శ్రేయస్ అయ్యర్ కీలక మ్యాచ్లో మాత్రం 4 పరుగులకే నిష్క్రమించాడు. రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఈ క్రమంలో రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 107 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించి టీమిండియా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లలో సూర్యకుమార్ యాదవ్ (18), కుల్దీప్ యాదవ్(10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో పేసర్లు మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు దక్కించుకోగా.. హాజిల్వుడ్, కమిన్స్ తలా రెండు వికెట్లు తీశారు. స్పిన్నర్లు మాక్స్వెల్, జంపా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. హెడ్ అద్భుత సెంచరీ ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(7)ను షమీ పెవిలియన్కు చేర్చగా.. వన్డౌన్ బ్యాటర్ మిచెల్ మార్ష్(15)ను బుమ్రా అవుట్ చేశాడు. ఆరోసారి జగజ్జేతగా ఆస్ట్రేలియా కానీ మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. అద్భుత శతకం(120 బంతుల్లో 137 పరుగులు)తో రాణించి ఆరోసారి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అతడి తోడుగా మార్నస్ లబుషేన్ 58 పరుగులతో అజేయంగా నిలవగా.. మాక్స్వెల్ రెండు పరుగులు తీసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కంగారూ జట్టు 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆశగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు కోలుకోలేని షాకిచ్చింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
CWC 2023: చెప్పినట్లే రోహిత్, అయ్యర్ అవుటయ్యారు! ఇదేందయ్యా..!
ICC CWC 2023 Final Ind Vs Aus: సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా.. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తుదిపోరు.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ హైవోల్టేజీ మ్యాచ్ గురించే చర్చ.. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మరీ వీక్షణలు.. ఏ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అనే విశ్లేషణలు.. ఈసారి భారత జట్టు ఎలాగైనా ట్రోఫీ గెలవాలని పూజలు, ప్రార్థనలు.. టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్.. మ్యాచ్ విజేత ఎవరన్న విషయాలపై అంచనాలు.. రోహిత్ హిట్టింగ్ ఆడతాడు.. కోహ్లి పరుగుల వరద పారిస్తాడనే ఆకాంక్షలు.. ఇలా ఆదివారం ప్రతీ క్రికెట్ అభిమాని తమకు తోచిన రీతిలో సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. అయితే, ఇందులో ప్రముఖ జ్యోతిష్కుడు సుమిత్ బజాజ్ కచ్చితమైన అంచనాతో ముందుకు వచ్చి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్చపరిచారు. టీమిండియా- ఆస్ట్రేలియా ఫైనల్లో ముఖ్యమైన ఓవర్లు ఇవేనంటూ సుమిత్ వేసిన అంచనా నిజమైంది. ‘‘తొలి ఇన్నింగ్స్లో 3, 5, 7,9, 9.4- 10.2, 10.3- 11.2, 14.4- 15.2, 17, 19, 20, 22, 24,25,27,31,34.4-35.2,47’’ అని సుమిత్ బజాజ్ ఎక్స్ ఖాతాలో తన అంచనాను తెలియజేశాడు. కాగా అహ్మదాబాద్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. పవర్ ప్లేలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ రెండో బంతికి స్టార్క్ బౌలింగ్లో శుబ్మన్ గిల్(4) ఆడం జంపాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ దూకుడుగా ఆడుతున్న తరుణంలో 9.4 ఓవర్ వద్ద గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్లో రోహిత్(42) హెడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వచ్చీ రావడంతోనే ఫోర్ బాదాడు. కానీ... 10.2 వద్ద కమిన్స్ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సుమిత్ చెప్పినట్లు 9.4-10.2 మధ్య టీమిండియా రోహిత్, అయ్యర్ రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
IND Vs AUS: అయ్యో కోహ్లి.. అస్సలు ఊహించలేదు! షాకింగ్ రియాక్షన్
వన్డే ప్రపంచకప్-2023 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66), రోహిత్ శర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4), రవీంద్ర జడేజా(9) తీవ్ర నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్,కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు మాక్స్వెల్, జంపా చెరో వికెట్ సాధించారు. కోహ్లి షాకింగ్ రియాక్షన్.. కాగా ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ ఔటైన తర్వాత విరాట్ కోహ్లి.. రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే 54 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి.. ఊహించని రీతిలో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 29 ఓవర్లో మూడో బంతిని కమ్మిన్స్ షర్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో కోహ్లి ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని సంప్ట్స్ను గిరాటేసింది. దీంతో విరాట్ కోహ్లి షాక్తో కాసేపు క్రీజులో అలా ఉండిపోయాడు. నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared b -
అందుకే ఫైనల్ మ్యాచ్ చూడను - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
యావత్ భారతావని ఈ రోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విశ్వవిజేత ఎవరనేది తెలుసుకోవడానికి సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చూడనని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. దేశ సేవలో భాగంగానే జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడనని నిర్ణయం తీసుకున్నారు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక జెర్సీ ఫొటో షేర్ చేస్తూ.. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పేవరకు లైవ్ చూడనని ట్వీట్ చేశారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఓ సెంటిమెంట్ నమ్ముతారు. ఆయన లైవ్ మ్యాచ్ చూస్తే ఇండియా ఓడిపోతుందేమో అని నమ్ముతారు. ఈ కారణంగానే ఆనంద్ మహీంద్రా లైవ్ మ్యాచ్ చూడకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఫ్యాన్స్ కూడా కీలకమైన మ్యాచ్లు మీరు చూడకండి అంటూ సరదాగా సలహాలు ఇచ్చారు. ఇదీ చదవండి: వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లలో ఒకరు స్పందిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం జట్టుకు మద్దతుగా నిలవడంతో ఒక భాగమే అంటూ వెల్లడించారు. మరొకరు ఎప్పటికీ మీరు మా హీరోనే.. మీ త్యాగాన్ని చరిత్ర గుర్తుంచుకుందని కామెంట్ చేశారు. ఇంకొకరు ఇవన్నీ అపోహలు.. మీరు హ్యాప్పీగా మ్యాచ్ చూడవచ్చని సలహా ఇచ్చారు. No, no, I am not planning to watch the match (my service to the nation 🙂) But I will, indeed, be wearing this jersey and installing myself in a hermetically sealed chamber with no contact with the outside world until someone knocks and tells me we’ve won… pic.twitter.com/HhMENqORp1 — anand mahindra (@anandmahindra) November 19, 2023 -
IND Vs AUS: విరాట్ కోహ్లి- మ్యాక్స్వెల్ ఫ్రెండ్లీ ఫైట్.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), బుమ్రా(1) ఉన్నారు. అంతకుముందు రాహుల్(66), రోహిత్ శర్మ(47), విరాట్ కోహ్లి(54) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లి- గ్లెన్ మాక్స్వెల్ మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటు చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ మార్ష్ బౌలింగ్లో విరాట్ కోహ్లి మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే బంతి నేరుగా మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న మాక్స్వెల్ చేతికి వెళ్లింది. అయితే మాక్సీ వికెట్ కీపర్ త్రో వేసే క్రమంలో బంతి మిస్స్ అయ్యి విరాట్ కోహ్లి పైకి వెళ్లింది. కోహ్లి వెంటనే బంతిని చేతితో పట్టుకున్నాడు. మాక్సీ కూడా కోహ్లి వైపు చూస్తూ సారీ చెప్పాడు. ఈ క్రమంలో కోహ్లి మాక్సీ దగ్గరకు వెళ్లి సీరియస్గా చూస్తూ నవ్వాడు. మాక్సీ కూడా నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా మాక్సీ, కోహ్లి మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ హిస్టరీలోనే View this post on Instagram A post shared by ICC (@icc) -
ఫైనల్ మ్యాచ్కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్
Matthew Hayden Mahindra Scorpio N: మహీంద్రా కార్లను సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశీయ విఫణిలో విడుదలైన అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లిన 'మహీంద్రా స్కార్పియో ఎన్' (Mahindra Scorpio N) ఎస్యూవీని మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' (Matthew Hayden) కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో భారతీయ కార్ల తయారీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మాథ్యూ హేడెన్ ఇటీవల తన గ్యారేజీకి 'స్కార్పియో ఎన్' జోడించాడు. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా ఆస్ట్రేలియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో మాథ్యూ హేడెన్ క్వీన్స్ల్యాండర్ బ్రిస్బేన్లోని మహీంద్రా డీలర్షిప్ చుట్టూ తిరుగుతూ, ఎవరెస్ట్ వైట్ కలర్ స్కీమ్ కలిగిన స్కార్పియో-ఎన్ డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.26 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). వేరియంట్లలో లభించే ఈ కారు 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్లలో లభిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ SUV 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 175 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 203 పీఎస్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. ఇదీ చదవండి: మస్క్ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు! ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మొదలైనవి ఉంటాయి. -
వరల్డ్కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!
టాలీవుడ్ హీరో నాని పేరు చెప్పగానే మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు గుర్తొస్తాయి. ఇతడి లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. పాన్ ఇండియా వైడ్ డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు. తాజాగా వన్డే ప్రపంచకప్లోనూ సందడి చేశాడు. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ని కలవడంతో పాటు తనలోని ఓ పాత టాలెంట్ని మళ్లీ అందరికీ చూపించాడు. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) హీరో కాకముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని.. 'అష్టాచెమ్మా' మూవీతో హీరో అయ్యాడు. ఒక్కో సినిమాతో తన నటన మెరుగుపరుచుకుంటూ పాన్ ఇండియా స్థాయికి వెళ్లాడు. తాజాగా ప్రపంచకప్ ఫైనల్లో తనదైన కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇతర కామెంటేటర్స్ కూడా చాలా బాగా చేస్తున్నావ్ నాని అనగా.. సినిమాల్లోకి రాకముందే తను ఆర్జే(రేడియా జాకీ)గా కొన్నేళ్ల పనిచేశానని, అందుకే ఇలా అని నాని చెప్పుకొచ్చాడు. అలానే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్తో నాని ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరేమో సూపర్ స్టార్, నాని ఏమో నేచురల్ స్టార్.. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేములో కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్లో ఆ థ్రిల్లర్ మూవీ) Natural Star @NameisNani LIVE now on @StarSportsTel for the epic clash of #INDvsAUSfinal. 🏏💪 Watch on @DisneyPlusHS 🔥 #CWC2023 #INDvAUS #TeamIndia #HiNanna #HiNannaOnDec7th @VyraEnts pic.twitter.com/mSQX6v3YTg — Telugu Film Producers Council (@tfpcin) November 19, 2023 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ హిస్టరీలోనే
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 47 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్ 10 ఓవర్లో మాక్స్వెల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన హిట్మ్యాన్.. హెడ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ ఓవరాల్గా 597 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు.వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరిట ఉండేది. 2019 వరల్డ్కప్లో విలియమ్సన్ 578 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో కేన్ మామ ఆల్టైమ్ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు. చదవండి: World Cup 2023 Final: చెత్త షాట్ ఆడి ఔటైన శుబ్మన్ గిల్.. కోపంతో చూసిన రోహిత్! వీడియో వైరల్ Most runs by captains in a World Cup: 597 - ROHIT SHARMA🇮🇳 in 2023 578 - Kane Williamson🇳🇿 in 2019 548 - Mahela Jayawardene🇱🇰 in 2007#CWC2023 #INDvsAUSfinal pic.twitter.com/PJ8utlco09 — Kausthub Gudipati (@kaustats) November 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్కప్ ఫీవర్.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్ఈడీ స్క్రీన్..
సాక్షి, కరీంనగర్: క్రికెట్పై భారతదేశ ప్రజలకు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం దేశమంతా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా నేడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న వేళ.. క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు సెటిలైపోయారు. అందులోనూ ఈరోజు ఆదివారం సెలవు దినం కావటంతో.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ భారతీయులంతా ప్రార్థిస్తున్నారు. వరల్డ్కప్ ఫీవర్ ఇతర కార్యక్రమాలకు అంటుకుంది. ఈ సందర్భంగా కరీంనగర్లో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఫంక్షన్ హల్లో ఆదివారం పెళ్లి జగుతుండగా.. ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథుల కొసం పెళ్లి వారు క్రికెట్ లైవ్ ప్రసారం చేశారు. దీంతో పెళ్లి పనుల హడావిడీలోనూ అందరూ తమకెంతో ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ను కూడా వీక్షించారు. ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టోర్నీలో అత్యుత్తమ జట్లలో విజేతగా నిలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
చెత్త షాట్ ఆడి ఔటైన శుబ్మన్ గిల్.. కోపంతో చూసిన రోహిత్! వీడియో వైరల్
వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. 7 బంతులు ఆడిన గిల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టీమిండియా బ్యాటింగ్ను ఆహ్హనించాడు. ఈ క్రమంలో భారత్ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్లో రెండో బంతిని గిల్ మిడాన్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి మిడాన్లో ఉన్న ఆడమ్ జంపా చేతికి బంతి వెళ్లింది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో నాన్స్ట్రైక్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ గిల్ వైపు కోపంతో చూశాడు. ఎందుకంటే స్టార్క్ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్కు గిల్ ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కీలక మ్యాచ్లో అనవసర షాట్ ఆడి గిల్ తన వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే రోహిత్ గిల్ వైపు సీరియస్గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 18 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(35), కేఎల్ రాహుల్ (15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ(47), శుబ్మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4) పరుగులు చేసి ఔటయ్యారు. చదవండి: ODI World Cup Final: రోహిత్ శర్మ- గిల్ అరుదైన రికార్డు.. వరల్డ్కప్ చరిత్రలోనే pic.twitter.com/sgPw64sQ9S — Sitaraman (@Sitaraman112971) November 19, 2023 -
రోహిత్ శర్మ- గిల్ అరుదైన రికార్డు.. వరల్డ్కప్ చరిత్రలోనే
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టీమిండియా బ్యాటింగ్ను ఆహ్హనించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు నష్టపోయి 81 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(47), శుబ్మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4) పరుగులకే ఔటయ్యారు. రోహిత్-గిల్ జోడీ అరుదైన ఘనత.. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ అరుదైన ఘనత సాధించారు. వన్డే వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఓపెనింగ్ జోడీగా వీరిద్దరూ చరిత్రకెక్కారు. ఈ ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ తొలి వికెట్కు 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఈ రికార్డు మాజీ ఓపెనర్లు వీరేంద్ర సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 వరల్డ్కప్ ఫైనల్లో ఈ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్కు 4 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్తో ఈ రికార్డును గిల్-రోహిత్ బ్రేక్ చేశారు. -
మేము ముందు బ్యాటింగే చేయాలనుకున్నాం.. నా కల నేరవేరింది: రోహిత్
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ మ్యాచ్కు విజిల్ మోగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. ఈ తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "నిజంగా మాకు తొలుత బ్యాటింగ్ చేయాలనే ఉంది. పిచ్ బ్యాటింగ్కు చాలా బాగుంది. అదే విధంగా ఇది మాకు చాలా పెద్ద మ్యాచ్. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకుంటున్నాము. మేము ఈ వేదికలో ఆడిన ప్రతిసారీ ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి పెద్ద సంఖ్యలో వస్తారు. టోర్నీలో చివరి దశకు వచ్చాం. ఈ మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. టోర్నీ మొత్తం ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఆడి ఇక్కడకు వచ్చామో.. ఫైనల్లో కూడా అదే తీరును కనబరుస్తాము. ఒక ఒక వరల్డ్కప్ టోర్నీలో ఫైనల్లో జట్టుకు కెప్టెన్సీ చేయాలన్న నా కల ఈ రోజు నేరవేరింది. ఈ మ్యాచ్లో బాగా ఆడి విజయం సాధించడమే మా లక్ష్యం. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. గత 10 మ్యాచ్ల్లో అదే చేశాం. ఈ మ్యాచ్లో కూడా 100 శాతం ఎఫెక్ట్ పెడతాం. జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్లో బరిలోకి దిగాం అని పేర్కొన్నాడు. చదవండి: -
CWC 2023 Final Ind vs Aus: కిక్కిరిసిపోయిన మోదీ స్టేడియం.. అభిమానుల సందడి (ఫొటోలు)
-
CWC 2023 Final: వన్డే వరల్డ్కప్-2023 విజేతగా ఆస్ట్రేలియా..
ICC Cricket World Cup 2023- India vs Australia, Final Updates: వన్డే వరల్డ్కప్-2023 విజేతగా ఆస్ట్రేలియా.. 12 ఏళ్ల తర్వాత వరల్డ్కప్ గెలవాలని కలలు కన్న భారత జట్టుకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచింది. ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్ 14 ఫోర్లు, 4 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా తీవ్ర నిరాశపరిచింది. నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 47 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(4) పూర్తిగా నిరాశపరిచాడు. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66) అర్ధ శతకాలతో రాణించారు. మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్ 4, రవీంద్ర జడేజా 9, సూర్యకుమార్యాదవ్ 18, మహ్మద్ షమీ 6, జస్ప్రీత్ బుమ్రా 1, కుల్దీప్ యాదవ్(10- రనౌట్), మహ్మద్ సిరాజ్ 9 పరుగులు చేశారు. 37 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 204/3 ►37 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 204/3. ఆసీస్ విజయానికి ఇంకా 37 పరుగులు కావాలి. ట్రావిస్ హెడ్ సెంచరీ.. టీమిండియాతో జరుగుతున్న ఫైనల్లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లోనే 14 ఫోర్లు, 1 సిక్స్తో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ►29 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 165 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(85), లబుషేన్(36) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ విజయానికి 76 పరుగులు కావాలి. ►26 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 94 పరుగులు కావాలి. 24 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 127/3 అర్ధ శతకం పూర్తి చేసుకున్న హెడ్ 21.2: కుల్దీప్ బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రవిస్ హెడ్. స్కోరు: 117-3(22) 21 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 110-3 హెడ్ 49, లబుషేన్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 19.1: సెంచరీ కొట్టిన ఆస్ట్రేలియా హాఫ్ సెంచరీ దిశగా హెడ్ హెడ్ 40, లబుషేన్ 10 పరుగులతో ఆడుతున్నారు. స్కోరు: 93/3 (17) 15 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 78/3 హెడ్ 28, లబుషేన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 33 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ, కుల్దీప్ 13, 14 ఓవర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేశారు. జడ్డూ రెండు పరుగులు మాత్రమే ఇస్తే.. కుల్దీప్ 4 రన్స్ ఇచ్చాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 74-3 పవర్ ప్లేలో ఆసీస్ స్కోరు: 60/3 (10) హెడ్ 19, లబుషేన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. బుమ్ బుమ్ బుమ్రా 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన స్మిత్ను బుమ్రా ఎల్బీ రూపంలో పెవిలియన్కు పంపాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 47/3 బుమ్ బుమ్ బుమ్రా.. మార్ష్ 41 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 3 ఓవర్లలో ఆసీస్ స్కోరు:29/1 సూపర్ షమీ 1.1: షమీ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వార్నర్(7) అవుట్. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మిచెల్ మార్ష్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 17/1 (1.2) ►తొలి ఓవర్లో ఆసీస్ స్కోరు: 15 ఆసీస్ ఓపెనర్లు ట్రవిస్ హెడ్, వార్నర్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ఆసీస్ లక్ష్యం 241 ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 47 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(4) పూర్తిగా నిరాశపరిచాడు. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66) అర్ధ శతకాలతో రాణించారు. మిగతా వాళ్లలో శ్రేయస్ అయ్యర్ 4, రవీంద్ర జడేజా 9, సూర్యకుమార్యాదవ్ 18, మహ్మద్ షమీ 6, జస్ప్రీత్ బుమ్రా 1, కుల్దీప్ యాదవ్(10- రనౌట్), మహ్మద్ సిరాజ్ 9 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో పేసర్లు మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. జోష్ హాజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్లు గ్లెన్ మాక్స్వెల్, ఆడం జంపా తలా ఓ వికెట్ పడగొట్టారు. ►49.2: ఫోర్ బాదిన సిరాజ్ 49 ఓవర్లలో టీమిండియా స్కోరు: 232/9 సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 47.3: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. దీంతో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 227/9 (48) ఎనిమిదో వికెట్ డౌన్.. 214 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జంపా బౌలింగ్లో బుమ్రా ఎల్బీగా వెనుదిరిగాడు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 221/8 షమీ రూపంలో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా 43.4: స్టార్క్ బౌలింగ్లో ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి షమీ(6) అవుటయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. సూర్య 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 43 ఓవర్లలో స్కోరు: 211/6 41.3: స్టార్క్ బౌలింగ్లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్లో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు. మహ్మద్ షమీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 207/6 (42). 200 పరుగుల మార్కు అందుకున్న టీమిండియా 41 ఓవర్లలో టీమిండియా 200 పరుగులు పూర్తి చేసుకుంది. రాహుల్ 66, సూర్య 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్లోగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్.. 40 ఓవర్లు ముగిసే సరికి స్కోరు: 197/5 సూర్యకు తొలి బౌండరీ 38.6: జంపా బౌలింగ్లో ఫోర్ బాదిన సూర్యకుమార్ యాదవ్. స్కోరు: 192/5 (39). 61 పరుగులతో నిలకడగా ఆడుతున్న రాహుల్. ►37వ ఓవర్లో కేవలం ఒక్క రన్ ఇచ్చిన మాక్స్వెల్ జడ్డూ అవుట్ 35.5: హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగిన జడేజా(9).. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 178-5 35.1: మిస్ఫీల్డ్ కారణంగా టీమిండియాకు రెండు పరుగులు రాహుల్ హాఫ్ సెంచరీ 34.5: స్టార్క్ బౌలింగ్లో సింగిల్ తీసి 50 పరుగుల మార్కు అందుకున్న కేఎల్ రాహుల్. స్కోరు: 173/4 (35) అర్ధ శతకానికి చేరువైన రాహుల్ రాహుల్ 47, జడేజా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 165/4 (33) 32.1: ఆచితూచి ఆడుతున్న రాహుల్, జడ్డూ కట్టుదిట్టంగా ఆసీస్ బౌలింగ్.. కష్టపడుతున్న బ్యాటర్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమవుతోంది. 31 ఓవర్లలో భారత్ స్కోరు: 158/4 30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 152/4 (30) నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 28.3: కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయిన కోహ్లి. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 149/4 (29). ►28 ఓవర్లు ముగిసే సరికి కోహ్లి 53, రాహుల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 146/3 ►టీమిండియా స్కోరు: 142/3 (27) 26.2: మాక్సీ బౌలింగ్లో ఫోర్ బాదిన రాహుల్ కోహ్లి అర్ధ శతకం 25.1: జంపా బౌలింగ్లో సింగిల్ తీసి అర్థ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి. View this post on Instagram A post shared by ICC (@icc) హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లి 24 ఓవర్లలో టీమిండియా స్కోరు: 128/3 ఆచితూచి ఆడుతున్న కోహ్లి, రాహుల్.. స్కోరు:125/3 (23) కోహ్లి 45, రాహుల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ►22 ఓవర్లలో టీమిండియా స్కోరు:121/3 ►19.1: మార్ష్తో బౌలింగ్ వేయిస్తున్న కమిన్స్. స్కోరు: 115/3 (20) పరుగులకు అవకాశమివ్వని ఆసీస్ కమిన్స్ 17, మాక్స్వెల్ 18 ఓవర్లో చెరో మూడు పరుగులు మాత్రమే ఇచ్చారు. స్కోరు: 107-3(18) సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా కోహ్లి 34, రాహుల్ 10 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 101-3 15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 97/3 కోహ్లి 32, రాహుల్ 8 పరుగులతో ఉన్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఆసీస్ 12 ఓవర్లో ఆసీస్ స్పిన్నర్ జంపా కేవలం ఐదు పరుగులు ఇవ్వగా.. 13వ ఓవర్లో కమిన్స్ మూడు రన్స్ మాత్రమే ఇచ్చాడు. స్కోరు: 89-3(13). కోహ్లి 27, రాహుల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 10.2: కమిన్స్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్(4) అవుటయ్యాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 82/3 (11) ►పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 80-2 కోహ్లి 23, అయ్యర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ అవుట్ కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆది నుంచి దూకుడుగా ఆడుతున్న హిట్మ్యాన్ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పదో ఓవర్ నాలుగో బంతికి మాక్స్వెల్ బౌలింగ్లో హెడ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ►9.3: బౌండరీ బాదిన రోహిత్ ►9.2: మాక్సీ బౌలింగ్లో సిక్సర్ బాదిన రోహిత్ నిలకడగా ఆడుతున్న కోహ్లి, రోహిత్.. టీమిండియా స్కోరు: 66/1 (9) 8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 61/1 కోహ్లి 21, రోహిత్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. వరుసగా మూడు ఫోర్లు బాదిన కోహ్లి ఏడో ఓవర్లో స్టార్క్ బౌలింగ్లో మూడు బంతుల్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన కోహ్లి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా- స్కోరు: 54/1 (7) 6 ఓవర్లలో టీమిండియా స్కోరు: 40/1 కోహ్లి 3 ,రోహిత్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్: 37/1. క్రీజులొ రోహిత్ శర్మ(31), విరాట్ కోహ్లి(1) పరుగుతో ఉన్నారు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 30/0 4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన హిట్టింగ్ను మొదలపెట్టాడు. 4 ఓవర్ వేసిన హాజిల్వుడ్ బౌలింగ్లో వరుసగా సిక్స్, ఫోర్ బాది బౌలర్ను ఒత్తడిలోకి నెట్టాడు. 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు:18/0 2.1 స్టార్క్ బౌలింగ్: స్లిప్ తప్పిదంతో బతికిపోయిన గిల్. 2 ఓవర్లలో టీమిండియా స్కోరు: 13/0 రోహిత్ 13, గిల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►1.3: రోహిత్కు మరో బౌండరీ ►1.2: హాజిల్వుడ్ బౌలింగ్లో ఫోర్ బాదిన రోహిత్ తొలి ఓవర్లో టీమిండియాకు 3 పరుగులు ►0.1: తొలి బంతికే ఎల్బీకి అప్పీలు చేసిన స్టార్క్.. రోహిత్ సేఫ్ ► టీమిండియా- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో ఆడిన జట్లతోనే టైటిల్ సమరంలో పోటీపడనున్నాయి. కాగా రోహిత్ సేన న్యూజిలాండ్ను.. ప్యాట్ కమిన్స్ బృందం సౌతాఫ్రికాను ఓడించి తుది పోరుకు అర్హత సాధించాయి. కమిన్స్ ఇలా.. రోహిత్ అలా టాస్ సందర్భంగా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ పొడిగా కనిపిస్తోంది. ఈ పిచ్పై డ్యూ(తేమ) ఎలాంటి పాత్ర పోషిస్తుందనేదే కీలకం. బ్యాటింగ్ సాగుతున్న కొద్ది వికెట్ మెరుగ్గా మారుతుంది. టోర్నీ ఆరంభంలో ఓటములు ఎదురైనా కోలుకుని.. మేము పూర్తి స్థాయిలో మ్యాచ్కు సిద్ధమయ్యాం’’ అని తెలిపాడు. ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలనే భావించామని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) తుదిజట్లు ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్స్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
కిర్స్టెన్, ధోనికి థాంక్స్ చెప్పాలి.. రోహిత్ కెప్టెన్సీకి సవాలు: గంభీర్
ICC CWC 2023 Final- Ind vs Aus: ‘‘పన్నెండేళ్ల క్రితం (2011) ఫైనల్ ముందు రోజు ఏప్రిల్ ఫూల్స్ డేలో ఉన్నాం. బస చేసిన తాజ్ మహల్ హోటల్లో ఆటగాళ్లందరం నచ్చిన ఫుడ్ తింటూ సరదాగా గడిపాం. జోక్లతో ఆ రాత్రి గడిపాం. చక్కగా నిద్రపోయాం. ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియంలోకి దిగగానే లోపల, బయట ఓ వేడుకే కనిపించింది. ఆటగాళ్లయితే ప్రశాంతంగా ఉన్నారు. మెగా ఫైనల్లా కాకుండా మాకిది మరో మ్యాచ్ అన్నట్లుగానే మైండ్సెట్ చేసుకున్నాం. కోచ్ గ్యారీ కిర్స్టెన్, కెప్టెన్ ధోనిలకు ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఒత్తిడి పెంచకుండా ఉత్సాహంగా కేవలం మరో మ్యాచ్ కోసమే ఆడుతున్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. నిజానికి క్వార్టర్ ఫైనల్లోనే ఆస్ట్రేలియాను ఓడించడంతోనే ఇక ఏ జట్టునైనా కంగుతినిపిస్తామన్న నైతిక బలం వచ్చేసింది. అందుకేనేమో సెమీఫైనల్లో పాకిస్తాన్పై ఫైనల్లో శ్రీలంకపై కొండంత ఒత్తిడున్నా దాన్ని అధిగమించాం. కప్ను జయించాం. ఇక ఇప్పడు అహ్మదాబాద్లో పూర్తిగా భిన్నమైన టీమిండియా ఫైనల్ పోరుకు సిద్ధమై ఉంది. ఆస్ట్రేలియా ఎదురుగా ఉంది. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇది సవాల్! భారత్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టమే కాదు ప్రత్యర్థి బౌలర్లకు దుర్బేధ్యంగా తయారైంది. ఇలాంటపుడు ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన 2003 ఫైనల్ ఓటమి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. పైగా ఇప్పటి శిక్షణ బృందంలో ఆనాడు ఫైనల్ ఆడిన రాహుల్ ద్రవిడ్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోపాలను సరిదిద్ది, ఎత్తుగడలకు పదునుపెట్టడంలో ద్రవిడ్ మేధస్సు ఉపయోగపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతు కొండంత బలమవుతుంది. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే... పూర్తిస్థాయి పేస్ దళం. స్లో వికెట్ అయినా రాణించగల సత్తా ఆసీస్ పేస్ బౌలర్లకు ఉంది. అలాగే లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా రూపంలో నాణ్యమైన స్పిన్నర్ కూడా అందుబాటులో ఉండటం... అతనీ ప్రపంచకప్లో నిలకడగా రాణిస్తుండటంతో అతని పాత్ర కూడా అంతిమ సమరంలో కీలకం కానుంది. వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో విరాట్ కోహ్లి, అశ్విన్లకు తెలుసు. గత రెండు ప్రపంచకప్లలో రోహిత్ శర్మ, షమీ ట్రోఫీని అందుకోవడానికి రెండు విజయాల దూరంలో ఉండిపోయారు. ఈసారి మాత్రం ఒక్క విజయం సాధిస్తే ట్రోఫీని ఎత్తుకుంటామన్న సంగతి వారికి కూడా తెలుసు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, వన్డే వరల్డ్కప్-2011 విజేత గౌతం గంభీర్ అన్నాడు. టీమిండియా- ఆస్ట్రేలియా ఫైనల్ పోరులో తలపడనున్న తరుణంలో ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా అహ్మదాబాద్లోని నర్రేంద మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. -
కోహ్లి కాదు!.. అతడి కోసం మేము కచ్చితంగా గెలవాల్సిందే: రోహిత్ శర్మ
ICC CWC 2023 Final ind Vs Aus: వన్డే వరల్డ్కప్- 2011లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచి ఆ విజయాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్కు అంకితం చేసింది.. విరాట్ కోహ్లి వంటి యువ ఆటగాడు సహా జట్టులోని ఇతర సభ్యులు ‘క్రికెట్ దేవుడి’ని తమ భుజాలపై మోస్తూ.. వాంఖడే స్టేడియమంతా తిప్పి సముచితంగా గౌరవించుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా వరల్డ్కప్ ట్రోఫీ గెలవలేదన్న లోటు.. సచిన్కు అలా ఆరో ప్రయత్నంలో తీరింది. కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాడికి సొంతగడ్డపై.. అదీ అతడి సొంతమైదానంలో సహచరులు అలా గొప్ప కానుక అందించారు. మళ్లీ పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ టోర్నీ.. పది విజయాలతో టాప్గేర్లో ఫైనల్కు దూసుకువచ్చిన టీమిండియా ఆఖరి పోరులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగునంది. ఈ నేపథ్యంలో.. నాడు క్రికెట్ గాడ్ సచిన్కు దక్కిన గౌరవం.. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లికి దక్కితే చూడాలని అతడి అభిమానులు ఆశపడుతున్నారు. ఆసీస్ను చిత్తు చేసి టీమిండియా ట్రోఫీని ముద్దాడితే.. ఆ అపురూప క్షణాల్లో తమ రికార్డుల రారాజుకు కూడా.. నాడు సచిన్ మాదిరే పట్టం కట్టాలని ఆకాంక్షిస్తున్నారు. కోహ్లికి ఈ విజయాన్ని అంకితం చేయాలని కోరుకుంటున్నారు. చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం 35 ఏళ్ల కోహ్లి కోసం భారత జట్టు టైటిల్ గెలిస్తే చూడాలని ఉందనే ఆకాంక్షను వెలిబుచ్చారు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈసారి భారత జట్టు తమ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం కప్పు గెలవాలని కోరుకుంటోందని రోహిత్ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్ కెరీర్లో మిగిలిపోయిన లోటును తీర్చాలనుకంటున్నట్లు తెలిపాడు. కాగా 2003లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టులో రాహుల్ ద్రవిడ్ సభ్యుడు. సౌతాఫ్రికా వేదికగా జొహన్నస్బర్గ్లో జరిగిన నాటి ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా తలపడ్డాయి. అప్పటి ఆసీస్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 140, డామిన్ మార్టిన్ 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 359 పరుగుల భారీ స్కోరు అందించారు. అయితే, టీమిండియా టాపార్డర్లో ఓపెనర్ సచిన్ టెండుల్కర్ (4), వన్డౌన్ బ్యాటర్ గంగూలీ(24) విఫలం కాగా మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 82 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్ ద్రవిడ్ 47 పరుగులు రాబట్టాడు. వీరిద్దరు మినహా మిగతా వాళ్లంతా కనీసం ముప్పై పరుగుల మార్కును దాటకపోవడంతో 234 పరుగులకే పరిమితమైంది టీమిండియా. దీంతో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అలా నాడు కంగారూల చేతిలో టీమిండియాకు పరాభవం ఎదురైంది. కాలక్రమంలో ఇరవై ఏళ్ల తర్వాత.. నాటి భారత జట్టులో సభ్యుడైన ద్రవిడ్ మార్గదర్శనంలోని టీమిండియా ఇప్పుడు ఫైనల్కు చేరుకుంది. అదే ప్రత్యర్థితో మరోసారి తుదిపోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలిచి ద్రవిడ్కు అంకితం చేయాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘మేము ఇక్కడి దాకా చేరుకోవడంలో రాహుల్ భయ్యా పాత్ర ఎంతో కీలకం. ఆయన తన కెరీర్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడారు. కోచ్గా ఉన్నప్పటికీ మాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే ఎలా ఆడాలో కూడా మార్గదర్శనం చేస్తారు. గడ్డు పరిస్థితుల్లో ముఖ్యంగా టీ20 వరల్డ్కప్ సమయంలో మాకు ఆయన నైతికంగా ఎంతో మద్దతుగా నిలిచారు. సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత మా లోపాలు సరిచేసి ఎలా ముందుకుసాగాలో నేర్పించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆయన కోసం మేము కచ్చితంగా గెలిచి తీరాల్సిందే’’ అని రోహిత్ శర్మ రాహుల్ ద్రవిడ్పై అభిమానం చాటుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC: 2003లో ఓడిపోయాం.. కానీ ఈసారి ట్రోఫీ మనదే: అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. మరికొన్ని గంటల్లో వన్డే వరల్డ్-2023 ఫైనల్ పోరుకు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా అజేయ టీమిండియా- ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో తలపడనుంది. ఇరవై ఏళ్ల క్రితం కంగారూ జట్టు చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, రాజకీయ నాయకుడు మహమ్మద్ అజహరుద్దీన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘‘ఈ రోజు మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్, బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేయాలా.. బౌలింగ్ చేయాలా అన్నది పిచ్పై ఆధారపడి ఉంటుంది. 2003లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోయాం. ఈసారి భారత జట్టు గెలిచి ప్రపంచ కప్ను అందుకుంటుంది. ప్రచారంలో ఉంటూనే తీరికవేళ మ్యాచ్ను తిలకిస్తాను’’ అని అజారుద్దీన్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా మేటి క్రికెటర్గా పేరొందిన అజారుద్దీన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒత్తిడిని జయించిన తీరు అద్భుతం: ఓజా అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా సాక్షితో మాట్లాడుతూ.. ‘‘లీగ్ దశ నుంచి ఒత్తిడిని జయిస్తూ మన భారత క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా నైపుణ్యాలు ఎంతో స్ఫూర్తి నింపాయి. ఎలాంటి తడబాటు లేకుండా క్రికెట్ ఫేవరెట్ టీంలను సైతం చిత్తు చేయడం కప్ను సాధిస్తామని చెప్పకనే చెప్పారు. బ్యాటింగ్లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు బౌలింగ్లో దూసుకుపోతున్న తీరు చూస్తూ ప్రతీ భారతీయుడు ఇప్పటికే విజయాన్ని ఖాయం చేసుకున్నారు. భారత క్రికెట్ ఆటగాడిగానే కాకుండా క్రికెట్కు అతిపెద్ద అభిమానిగా మరోసారి వరల్డ్ కప్ భారత ఒడిలో చేరుతుందని నమ్మకంగా ఉన్నాను’’ అని రోహిత్ సేన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. -
Hyd: షమీ మెరుపులు.. కోహ్లి, గిల్, రోహిత్ హిట్టింగ్ చూడాలని ఆశ
పుష్కర కాలంగా ఎదురుచూస్తున్న ఉద్విగ్న ఘట్టానికి టీమ్ ఇండియా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. భారత క్రికెట్ చరిత్రలో ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటానికి మరో అద్భుతమైన అవకాశం మన ముంగిట్లోకొచ్చింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో దూసుకెళుతున్న భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి.. గెలుపు తీరాలను చేరుకుంటుందని నగర వాసులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న నేపథ్యంలో సిటీలో క్రికెట్ అభిమానులు క్షణ.. క్షణం ఊపిరి సలపని వీక్షణంలో మునిగిపోనున్నారు. వరల్డ్ కప్ మనదేననే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంటే.. సంబరాలకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా రిసార్ట్స్, బార్లు, రెస్టారెంట్లతో పాటు పలు పబ్లిక్ ప్లేస్లలో భారీ లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు పెళ్లి చేసుకోబోతున్న ఓ నూతన జంట తమ వివాహ మంటపంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయనున్నామని సోషల్మీడియా వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం. విల్లాలు, పలు గ్రేటెడ్ కమ్యూనిటీల్లోనూ సామూహిక విక్షణకు ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి యువకులు దూరంగా ఉన్నారని ఓ రాజకీయ నాయకుడు చెప్పారు. దీపావళి మళ్లీ జరుగుతుందా అనేంతలా బాణాసంచాలు అమ్ముడుపోయాయని నగరానికి చెందిన ఓ టపాసుల వ్యాపారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి వేరే లెవెల్.. వరల్డ్కప్లో గతంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లు వేరు. ఈ రోజు జరగనున్న మ్చాచ్ వేరే లెవెల్. ఈసారి భారత బృందం ఆటతీరు అందరి మనసులను గెలుచుకుంది. అలాగే కప్ నెగ్గి మరోసారి భారత క్రికెట్ క్రీడా శక్తిని ప్రపంచానికి చూపించనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ కనిపించని అద్భుత శక్తిని తలపిస్తుంది. దానికి తగ్గట్టుగా క్రీడాకారుల పోరాట పటిమ ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తుంది. – సంతోష్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ 2011 విజయం పునరావృతం.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన క్షణాలు నిజం కానున్నాయి. ఒక భారత క్రీడాభిమానిగా భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని సెల్యూట్ కొట్టడానికి ఎదురుచూస్తున్నాను. మరోసారి మహ్మద్ షమీ బౌలింగ్ మెరుపులు, కోహ్లీ, గిల్, రోహిత్, అయ్యర్ హిట్టింగ్ చూడాలని ఆశగా ఉన్నాను. ధోనీ ఆధ్వర్యంలోని 2011 విజయం మళ్లీ రోహిత్ శర్మ వ్యూహాలతో పునరావృతం అవుతుందని ఆశిస్తున్నాను. – రాం రెడ్డి, క్రికెట్ అభిమాని, అల్వాల్ -
చరిత్రకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్! సచిన్ వరల్డ్ రికార్డుపై కన్ను
ICC CWC Final 2023: క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్కప్-2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ఈ ఫైనల్ పోరుకు తెరలేవనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ టైటిల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇక ఈ మ్యాచ్కు ముందు టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఆసీస్తో మ్యాచ్లో గిల్ మరో 31 పరుగులు సాధిస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను అధిగమిస్తాడు. కాగా 2023 క్యాలెండర్ ఇయర్లో గిల్ ఇప్పటివరకు 1580 పరుగులు చేశాడు. అంతకుమముందు 1996 ఏడాదిలో సచిన్ 1611 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్తో సచిన్ వరల్డ్ రికార్డును గిల్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన గిల్.. 350 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. ►సచిన్ టెండూల్కర్ (1996)- 1,611 పరుగులు ►శుబ్మన్ గిల్ (2023)-1,580 పరుగులు ► విరాట్ కోహ్లీ (2011)-1381 పరుగులు ►మహేల జయవర్ధనే (2001)-1,260 పరుగులు ►కేన్ విలియమ్సన్ (2015)- 1,224 పరుగులు చదవండి: CWC 2023 Final: అతడే మాకు అతిపెద్ద సవాల్.. హోరెత్తే స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే లక్ష్యం: ఆసీస్ కెప్టెన్ -
అతడే మాకు సవాల్.. స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే లక్ష్యం: ఆసీస్ కెప్టెన్
ICC CWC 2023 Final- Pat Cummins Comments Ahead Big Clash: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభంలో పరాజయాల పాలైన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఊహించని రీతిలో పుంజుకుంది. వరుసగా ఎనిమిది విజయాలు సాధించి ఫైనల్కు దూసుకువచ్చింది. అహ్మదాబాద్ వేదికగా పటిష్ట టీమిండియాతో తుదిపోరుకు సిద్ధమైంది. ఆరోసారి ట్రోఫీ గెలవాలనే సంకల్పంతో ఉన్న ప్యాట్ కమిన్స్ బృందం.. మూడోసారి టైటిల్ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉన్న రోహిత్ సేనను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆరంభంలో మా ఆట తర్వాత మేం అన్నీ సమీక్షించుకొని విజయాల బాట పట్టాం. అది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యర్థికి సవాల్ విసరాలంటే మా అత్యుత్తమ దశలోనే ఉండాల్సిన అవసరం లేదు. మేం విజయానికి దారులు వెతుక్కోగలం. ఇప్పుడు ఆడుతున్నవారెవరూ అప్పుడు లేరు కాబట్టి 2003 గురించి ఆలోచన అనవసరం. అయితే మైదానంలో 1 లక్షా 30 వేల మంది ప్రేక్షకులు ఉంటారని, వారంతా భారత్కే మద్దతిస్తారని మాకు తెలుసు. స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే లక్ష్యం ఓటమి లేకుండా దూసుకుపోతున్న అలాంటి జట్టును నిలువరించి స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చాలని కోరుకుంటున్నాం. అదే జరిగితే అంతకు మించిన సంతృప్తి ఉండదు’’ అని ప్యాట్ కమిన్స్ అన్నాడు ఇక టీమిండియాతో ఫైనల్లో పేసర్ మహ్మద్ షమీ తమకు అతిపెద్ద సవాలుగా మారతాడని కమిన్స్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లకు దూరమైన షమీ న్యూజిలాండ్తో మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు కూల్చిన ఈ యూపీ పేసర్.. తర్వాత మరో రెండు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేశాడు. న్యూజిలాండ్తో సెమీస్లో ఏడు వికెట్లతో చెలరేగి టీమిండియాను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది సెమీ ఫైనల్ కాదు.. షమీ ఫైనల్ అనేలా అద్భుతం చేశాడు. ఈ నేపథ్యంలో కమిన్స్ సైతం షమీ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖాముఖి పోరులో వన్డే ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా 13 సార్లు తలపడ్డాయి. భారత్ 5 మ్యాచ్ల్లో, ఆస్ట్రేలియా 8 మ్యాచ్ల్లో గెలుపొందాయి. అహ్మదాబాద్లో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగాయి. 2 మ్యాచ్ల్లో భారత్, 1 మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచాయి. అహ్మదాబాద్లోనే జరిగిన 2011 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియాపై భారత్ గెలిచి సెమీఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే అవకాశాలు! ఇప్పటి వరకు జరిగిన 12 వన్డే ప్రపంచకప్ టోర్నీల ఫైనల్స్లో ఎనిమిది సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. నాలుగు సార్లు ఛేజింగ్ చేసిన జట్టు చాంపియన్గా నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు 3 సార్లు తొలుత బ్యాటింగ్ చేసి,. 2 సార్లు ఛేజింగ్లో... భారత జట్టు ఒకసారి తొలుత బ్యాటింగ్ చేసి, మరొకసారి ఛేజింగ్లో గెలిచింది. ఆతిథ్య జట్లదే గత మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీ టైటిల్స్ను ఆతిథ్య జట్లే సొంతం చేసుకున్నాయి. 2011లో భారత్, 2015లో ఆ్రస్టేలియా, 2019లో ఇంగ్లండ్ జట్లు విజేతగా నిలిచాయి. అపుడు ఆసీస్ అలా వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ఫైనల్స్లో నమోదైన అత్యధిక టీమ్ స్కోరు 359. భారత జట్టుతో జొహనెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన 2003 ప్రపంచకప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 2 వికెట్లకు 359 పరుగులు చేసింది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్స్లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1999 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో లార్డ్స్ మైదానంలో తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 39 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్గా 12 ప్రపంచకప్ ఫైనల్స్లో 300 అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన ఏకైక జట్టుగా ఆ్రస్టేలియా నిలిచింది. వన్డే ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో (1975–2023) ఆస్ట్రేలియా ఆడిన మొత్తం మ్యాచ్లు 104 . ఇందులో 77 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచింది. 25 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. ఒక మ్యాచ్ రద్దయింది. వన్డే టోర్నీలో భారత్ @94 వన్డే ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో (1975–2023) భారత్ ఆడిన మొత్తం మ్యాచ్లు 94 . ఇందులో 63 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. 29 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. ఒక మ్యాచ్ రద్దయింది. ►వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్లు 44 . ఇందులో భారత్ 34 మ్యాచ్ల్లో గెలిచింది. 9 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. ►వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుకు కమిన్స్ కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్లు 14 . ఇందులో ఆస్ట్రేలియా 11 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
సూర్యకుమార్ ఔట్.. అశ్విన్ ఇన్? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్-2023 మెగా ఫైనల్కు సర్వం సిద్దమైంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాను చిత్తుచేసి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు అన్నివిధాల సన్నద్దమయ్యాయి. కాగా ఈ మ్యాచ్కు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పేసర్ మహ్మద్ సిరాజ్ లేదా సూర్యకుమార్ యాదవ్ను పక్కనపెట్టి అశ్విన్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదే విషయంపై ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. "మొత్తం 15 మంది ఆటగాళ్లు జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం 12-13 మంది ఆటగాళ్లను సిద్దం చేశాము. ఇంకా ప్లేయింగ్ ఎలెవన్ను ఖరారు చేయలేదు. మ్యాచ్ రోజు పిచ్, పరిస్థితులు బట్టి తుది జట్టును ఎంపిక చేస్తామమని" రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా అశ్విన్కు ఆస్ట్రేలియాపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. అశ్విన్ను ఎదుర్కొనేందుకు అతడి బౌలింగ్ స్టైల్ను పోలి ఉన్న నెట్బౌలర్తో ఆసీస్ చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ చేసింది కూడా! ఈ నేపథ్యంలో ఈ సీనియర్ ఆటగాడి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భారత జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అశ్విన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. లీగ్ దశలో చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అశ్విన్ ఆడాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. 8 ఓవర్లు వేసిన అశూ.. 34 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. -
అప్పుడు కపిల్ దేవ్, ధోని.. ఇప్పుడు! అది గతం.. హిట్మ్యాన్ భావోద్వేగం
వన్డే వరల్డ్కప్-2011.. జట్టులో చోటే కరువు.. 2023లో ఏకంగా కెప్టెన్గా బరిలోకి.. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిపించిన నాయకుడిగా సరికొత్త గుర్తింపు.. అజేయంగా నిలిచి ఫైనల్ వరకు ప్రయాణం.. ఆ ఒక్క అడ్డంకి దాటేస్తే.. ప్రపంచకప్ గెలిచిన మూడో కెప్టెన్గా చరిత్ర పుటల్లో నిలిచే సువర్ణావకాశం.. అవును.. రో‘హిట్’ శర్మ గురించే ఇదంతా!! ఒకప్పుడు ప్రపంచకప్ జట్టులో చోటే లేని ఆటగాడు ఇప్పుడు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూ టైటిల్ గెలిచేందుకు సంసిద్ధమయ్యాడు. 1983లో కపిల్ దేవ్, 2011లో మహేంద్ర సింగ్ ధోని చేసిన అద్భుతాలను పునరావృతం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. భావోద్వేగాలపరంగా యావత్ భారతానికి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో.. నాయకుడిగా రోహిత్కు, జట్టుకు అంతే ముఖ్యం. హిట్మ్యాన్ కూడా ఇదే మాట అంటున్నాడు. మ్యాచ్ గెలిస్తే మంచిదే ‘‘భావోద్వేగాలపరంగా చూస్తే ఇది చాలా పెద్ద క్షణం అనడంలో సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో నాకు బాగా తెలుసు. కఠోర శ్రమ తర్వాత ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఈరోజు ఎంతో ప్రత్యేకమనే ఆలోచనను పక్కన పెట్టి నాతో పాటు మిగతా సహచరులంతా ఆటపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం. మ్యాచ్ గెలిస్తే మంచిదే కానీ అనవసరంగా ఒత్తిడి పెంచుకోను. అది ఇప్పుడు అనవసరం ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించా. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి బాగా ఆడటం ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్లో కూడా ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాం. మ్యాచ్ రోజున పిచ్ను చూసిన తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. 2011లో నాకు ఏం జరిగిందనేది ఇప్పుడు అనవసరం. కానీ ఈ వయసులో ఫైనల్ మ్యాచ్కు సారథిగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. ఇది సాధ్యమవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. 1983లో కపిల్ డెవిల్స్ భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఏడాది.. అప్పటివరకు అడపా దడపా క్రికెట్ మ్యాచ్లు చూసిన సందర్భాలే తప్ప ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైతే కపిల్ డెవిల్స్ జగజ్జేతగా నిలిచిందో అప్పటి నుంచి టీమిండియా భవిష్యత్తు మారిపోయింది. భారత్ క్రికెట్లో నూతన శకం మొదలైంది. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్నీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇంగ్లండ్ వేదికగా ఈ ప్రపంచకప్ టోర్నీ ప్రయాణం భారత్కు నల్లేరు మీద నడకలా సాగలేదు. అనూహ్యరీతిలో విండీస్ను చిత్తు చేసి లీగ్ దశలో అనూహ్య రీతిలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ను 34 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తర్వాత జింబాబ్వేతో మ్యాచ్లో 135 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 162 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది కపిల్ బృందం. అయితే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి మరోసారి విండీస్కు షాకిచ్చి 66 పరుగుల తేడాతో గెలిచింది మళ్లీ విజయాల బాట పట్టింది. ఆ తర్వాత జింబాబ్వేను 31 రన్స్తో ఓడించిన టీమిండియా ఆస్ట్రేలియాపై కూడా ప్రతీకారం తీర్చుకుంది. 118 పరుగుల తేడాతో ఆసీస్ను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసి సెమీస్కు చేరింది. సెమీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ను మట్టికరిపించి సత్తా చాటి ఫైనల్కు చేరింది. అయినప్పటికీ టీమిండియాను తక్కువ చేసి మాట్లాడిన వారే ఎక్కువ. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచి వెస్టిండీస్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరడంతో కపిల్ సేనను మట్టికరిపించడం ఖాయమని భావించారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. కపిల్ దేవ్ దూకుడైన విధానం, చావో రేవో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించే తీరు భారత్కు తొలి టైటిల్ అందించింది. మిస్టర్ కూల్ ధోని సేన సొంతగడ్డపై ఇక 2011లో ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగ్లాదేశ్పై (87 పరగుల తేడాతో) గెలుపుతో ఆరంభించిన ధోని సేన.. తర్వాత ఇంగ్లండ్తో మ్యాచ్ను టై చేసుకుంది. ఆ తర్వాత.. పసికూనలు ఐర్లాండ్, నెదర్లాండ్స్లను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. అనంతరం సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో గెలిచింది. అటు పిమ్మట వెస్టిండీస్ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ చేరింది. ఇక మొహాలీలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో శ్రీలంకను చిత్తు చేసి మిస్టర్ కూల్ ధోని జట్టు ట్రోఫీని ముద్దాడిన దృశ్యాలను అభిమానులెవరు మర్చిపోగలరు!! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఏకపక్షంగా ఉండదు: శిఖరాన కోహ్లి.. రోహిత్, అయ్యర్ సైతం! మరి ఆసీస్ బలం?
ICC CWC 2023 Final Ind Vs Aus: ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు విజయవంతంగా ముందుకు వేస్తే పుష్కర కాలం తర్వాత టీమిండియా వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడగలదు. సొంతగడ్డపై 2011లో ధోని సేన మిగిల్చిన మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్న అభిమానులకు మరిన్ని కొత్త అనుభూతులను అందించగలదు. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైంది. వన్డే వరల్డ్కప్-2023లో అజేయ రికార్డును కొనసాగిస్తూ విజయ లాంఛనం పూర్తి చేసేందుకు సన్నద్ధంగా ఉంది. టైటిల్ సొంతం చేసుకునేందుకు పక్కా వ్యూహాలు, ప్రణాళికలు తయారు చేసుకుంది. మరి టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా!! శిఖరాన కోహ్లి.. రోహిత్, అయ్యర్ సైతం స్వదేశంలో జరుగుతున్న ఈ ఐసీసీ టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్ల తర్వాత భారత్ తమ తుది జట్టును మార్చింది. గత ఆరు మ్యాచ్లలో అదే టీమ్ ప్రత్యర్థి జట్లను ఓడించింది. ఫలితాలు అద్భుతంగా రావడంతో పాటు ప్రతీ ఆటగాడు తనదైన రీతిలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కాబట్టి తుది జట్టును మార్చాల్సిన అవసరమే రాలేదు. బ్యాటింగ్లో విరాట్ కోహ్లి 711 పరుగులతో శిఖరాన ఉండగా, రోహిత్ శర్మ ఏకంగా 125 స్ట్రయిక్రేట్తో 550 పరుగులు చేశాడు. ఆరంభంలో తడబడిన శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత చెలరేగి 526 పరుగులు సాధించాడు. గిల్, రాహుల్ విలువైన ఇన్నింగ్స్ డెంగీ జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరమైనా... ఆ తర్వాత కూడా నాలుగు అర్ధ సెంచరీలు సాధించి వందకు పైగా స్ట్రయిక్రేట్తో ఆడుతున్న శుబ్మన్ గిల్ కూడా రోహిత్కు సరైన ఓపెనింగ్ జోడీగా నిలిచాడు. కేఎల్ రాహుల్ కీలక దశలో తన విలువేమిటో చూపించగా... సూర్యకుమార్ కూడా అవకాశం దక్కితే చెలరేగిపోగలడు. ఇలాంటి టాప్–6 బ్యాటింగ్ దళంతో టీమిండియా విజయంపై అంచనాలు పెంచుతోంది. ఆసీస్కు అంత ఈజీ కాదు ఆ ఆర్డర్ను నిలువరించడం ఆసీస్కు అంత సులువు కాదు. అందరూ వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న ఐదుగురు బౌలర్ల బృందంతో టీమిండియా మరింత బలంగా ఉంది. ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్ ఆడని షమీని ఆ జట్టు ఫైనల్లో ఏమాత్రం ఎదుర్కోగలదనేది చూడాలి. బుమ్రా, సిరాజ్ కూడా ఆరంభంలో ప్రత్యర్థిని కట్టిపడేయగలరు. ఇక రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ విసిరే స్పిన్ ప్రశ్నలకు ఆసీస్ వద్ద జవాబు దొరకడం కష్టమే. వారికి ఓపెనర్లే బలం... వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచ్లలో ఓడి పేలవంగా కనిపించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఒక్కసారిగా తమదైన శైలిలో పుంజుకుంది. వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన ఆ టీమ్ కూడా ఫైనల్కు అన్ని విధాలుగా సన్నద్ధమైంది. టాప్–3లో డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్ లు ఒకే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ చేయగల సమర్థులు కావడం జట్టు ప్రధాన బలం. పవర్ప్లేలోనే వీరు తమ ఆటతో మ్యాచ్ గమనాన్ని శాసించగలరు. పరిస్థితి మారితే జట్టును ఆదుకునేందుకు తర్వాతి స్థానాల్లో స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల స్టీవ్ స్మిత్, లబుషేన్ ఉన్నారు. బ్యాటింగ్ బలహీనతలు కనీసం 30 ఓవర్లు దాటాక క్రీజ్లోకి వస్తే మ్యాక్స్వెల్ మరింత ప్రమాదకరంగా మారిపోగలడు. అయితే గత కొంత కాలంగా కొన్ని మ్యాచ్లలో అనూహ్యంగా కుప్పకూలిన రికార్డు కూడా ఆసీస్కు ఉంది. దక్షిణాఫ్రికాతో సెమీస్లో కూడా ఆ జట్టు బ్యాటింగ్ బలహీనతలు బయట పడ్డాయి. దాంతో అంత ఆసీస్ అభేద్యమైన జట్టేమీ కాదని తేలిపోయింది. ఫైనల్లో దీనిని ఆ జట్టు సవరించుకోవాలి. బౌలింగ్లో హాజల్వుడ్ మాత్రమే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలుగుతున్నాడు. కాస్త వెనుకబడే ఉన్నా కమిన్స్ కీలక సమయాల్లో వికెట్లు తీసినా... ఆరంభంలో గతి తప్పి భారీగా పరుగులిచ్చే స్టార్క్ నియంత్రణ పాటించాల్సి ఉంది. ఆడమ్ జంపా స్పిన్ భారత్లాంటి జట్టుపై ఏమాత్రం పని చేస్తుందనేది చూడాలి. ఓవరాల్గా భారత్తో పోలిస్తే ఆసీస్ కాస్త వెనుకబడే ఉంది. కానీ అసలు సమయాల్లో తమలోని పోరాటపటిమను చూపించే తత్వమే ఆ జట్టు బలం. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. పూర్తిగా అటు బ్యాటింగ్కు గానీ, ఇటు బౌలింగ్కు కానీ ఏకపక్షంగా స్పందించని పిచ్ ఇది. నిలదొక్కుకుంటే చక్కగా పరుగులు రాబట్టవచ్చు. బౌలర్లూ ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఇదే పిచ్పై జరిగింది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. ఫైనల్కు సోమవారం రిజర్వ్ డే ఉంది. చదవండి: World Cup 2023 Final: బ్యాటింగా.. బౌలింగా? భారత్ టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి? View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 Final: చక్ దే ఇండియా... ఇప్పుడు జట్టు బలం అదే! ఒక్క అడుగు..
రోహిత్ మెరుపు ప్రదర్శనలు... కోహ్లి అద్భుత బ్యాటింగ్ విన్యాసాలు... శ్రేయస్, రాహుల్ దూకుడు... షమీ వికెట్ల వరద... జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన... గత పది మ్యాచ్లలో ఇవన్నీ అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయాయి... ఇప్పుడు మరొక్కసారి ఇలాంటి ఆట కావాలి... టోర్నీ ఆసాంతం చూపించిన ఎదురులేని ప్రదర్శనను ఇంకోసారి చూపించి మరెప్పటికీ మరచిపోలేని చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగల్చాలి. ఏకంగా పది విజయాలు... ప్రపంచకప్ లీగ్ దశలో తొమ్మిది మంది ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం... సెమీఫైనల్లోనూ అదే జోరు... ఇంత అసాధారణ ఆటతో టీమిండియా ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ రోహిత్ శర్మ బృందం దానిని చేసి చూపించింది. ఒక్క ఓటమి లేకపోవడమే కాదు...అసలు లోపమే లేని దుర్బేధ్యమైన ఈ జట్టు విశ్వ విజేతగా నిలవాలి. ఒకరు, ఇద్దరో కాదు... భారత జట్టులో ఒకరికి తీసిపోని విధంగా మరొకరి ప్రదర్శన కొనసాగింది. ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధార పడకుండా సమష్టితత్వంతో జట్టు విజయాలు అందుకుంది... అదే ఇప్పుడు జట్టు బలం... ఎవరూ విఫలమైనా నేనున్నానంటూ జట్టు కోసం తర్వాతి ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇదే ఆట ఇప్పుడు ప్రపంచకప్ గెలిపించాలి... కోట్లాది అభిమానుల ఆశలను నిజం చేయాలి. అయితే ఎదురుగా ఉన్నది మామూలు జట్టు కాదు... ఐదుసార్లు విశ్వవిజేతగా నిలవడం మాత్రమే కాదు... అంగుళం అవకాశం లేని చోట నుంచి కూడా అవకాశాలు సృష్టించుకొని ప్రత్యర్థిని పడగొట్టగల నైపుణ్యం ఉన్న ఆస్ట్రేలియా... ఈ టోర్నీలోనూ ఆరంభంలో తడబడిన ఆ జట్టు తర్వాత తనేంటో చూపించింది... ఒత్తిడి అనే పదానికి అర్థం తెలియని కంగారూలను భారత్ అడ్డుకోవాలి. చివరగా... ప్రతీకారం అనే మాటకు క్రికెట్ భాషలో అర్థం తీసుకుంటే అదే ప్రత్యర్థిని అదే తరహా వేదికపై అదే స్థాయిలో ఓడించాలి... అలా చూస్తే 2003లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిన భారత్కు 20 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశమిది... ఆసీస్ను పడగొట్టి మూడోసారి భారత్ విశ్వవిజేతగా నిలవాలని, మైదానంలో లక్ష మంది అభిమానుల సమక్షంలో రోహిత్ శర్మ జట్టు ప్రపంచకప్ను సగర్వంగా ఎత్తుకోవాలని యావత్ భారతం ఆశిస్తోంది. అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్–2023 ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్ల తర్వాత ఇప్పుడు జగజ్జేతను తేల్చే తుది పోరుకు సమయం వచ్చేసింది. సొంతగడ్డపై అసంఖ్యాక అభిమానుల ఆశల పల్లకిని మోస్తూ మూడో టైటిల్పై దృష్టి పెట్టిన భారత జట్టు ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఫేవరెట్లలో ఒకటిగా భావించిన మరో టాప్ జట్టు ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది.బలాబలాలు, ఫామ్ దృష్ట్యా సహజంగానే భారత్ వైపే మొగ్గు కనిపిస్తుండగా... నాకౌట్ మ్యాచ్లలో తమ ఆటను రెట్టింపు స్థాయికి తీసుకెళ్లే ఆసీస్ కూడా సర్వసన్నద్దమైంది. ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ విజయంతో పైచేయి సాధించినా... ఆరంభ దశలో ఆసీస్ కూడా పదునైన బౌలింగ్తో ఆధిపత్యం చూపించగలిగిందనేది వాస్తవం. అన్ని రకాలుగా హోరాహోరీగా సాగే అవకాశం ఉన్న ఈ పోరును గెలిచే వరల్డ్ చాంపియన్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 6,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యే ముఖ్య వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో జీఎస్ మాలిక్ మాట్లాడుతూ మ్యాచ్ చూడటానికి లక్ష మందికి పైగా ప్రేక్షకులు, అనేక మంది ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ , హోంగార్డులు, ఇతర సిబ్బందితో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ‘ఈ మెగా ఈవెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసేందుకు 6,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. వీరిలో దాదాపు 3,000 మంది స్టేడియం లోపల ఉంటారు. మరికొందరు ఆటగాళ్లు, ప్రముఖులు బస చేస్తున్న హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని జీఎస్ మాలిక్ వివరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల మోహరించి ఉంటుందని, నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. వీరికి 39 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 92 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు సహాయం చేస్తారని వివరించారు. మ్యాచ్లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (CBRN) అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించడానికి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను కూడా నగరంలో మోహరిస్తామని తెలిపారు. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాలు చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాంబ్ బెదిరింపులపై స్పందిస్తూ.. ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఆకతాయిగా చేసే బెదిరింపులను మీడియా హైలైట్ చేయొద్దని జీఎస్ మాలిక్ కోరారు. -
టీమిండియా-ఆసీస్ ఫైనల్ పోరు.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ మ్యాచ్కు అంతా సిద్దమైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ తుది పోరు కోసం ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. ఈ మెగా పోరు నేపథ్యంలో వన్డే వరల్డ్కప్లో భారత్-ఆస్ట్రేలియా హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 13 మ్యాచ్ల్లో ముఖాముఖి తలపడ్డాయి. అందులో ఎనిమిది సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టీమిండియా ఐదు మ్యాచ్లలో గెలుపొందింది. అయితే చివరి మూడు మ్యాచ్ల్లో రెండు సార్లు ఆసీస్పై భారత్ విజయం సాధించింది. ఈ ఏడాది టోర్నీ లీగ్ మ్యాచ్లో ఆసీస్ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. కాగా భారత్ విజయం సాధించిన ఐదు మ్యాచ్ల్లో.. మొదట బ్యాటింగ్ చేస్తూ గెలిచినవి రెండు, ఛేజింగ్ చేస్తూ మూడు మ్యాచ్ల్లో విజయభేరి మోగించింది. ఇక ఓవరాల్ వన్డేల్లో కూడా భారత్పై ఆసీస్దే పై చేయి. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా, ఇండియా 150 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 83 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 57 మ్యాచ్ల్లో టీమిండియా గెలుపొందింది. 10 మ్యాచ్ల్లో ఎటువంటి ఫలితం తేలలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆసీస్పై భారత్ పైచేయి సాధిస్తూ వస్తుంది. వరల్డ్కప్కు ముందు ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: ఆసీస్తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్ శర్మ -
క్రికెట్ వరల్డ్కప్పై సాంగ్స్.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఏది బెస్ట్ అంటే?
వన్డే వరల్డ్కప్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మొదలయ్యే భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇందులో టీమిండియా గెలుస్తుందా? మూడోసారి కప్ కొడుతుందా? అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. సరే దాని గురించి కాసేపు పక్కనబెట్టేసి ఈ వరల్డ్కప్.. వాటి థీమ్ సాంగ్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) గ్రౌండులో క్రికెట్ ఆడినా సరే మరీ సైలెంట్గా ఉంటే ఎంటర్ టైన్ మెంట్ ఉండదు కాబట్టి స్టేడియంలో పాటలు ప్లే చేస్తుంటారు. అలానే వన్డే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు నిర్వహించినప్పుడు.. దీన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు థీమ్ సాంగ్స్ లాంటివి రెడీ చేస్తుంటారు. 1992 ప్రపంచకప్ నుంచి ఈ థీమ్ గీతాల కల్చర్ మొదలైందని చెప్పొచ్చు. ప్రస్తుత వరల్డ్కప్కి కూడా 'దిల్ జస్న్ భోలె' అని ఓ పాట రెడీ చేశారు. కాకపోతే దానికి అనుకున్నంత రీచ్ రాలేదని చెప్పొచ్చు. ఇప్పటివరకు దాదాపు 9 పాటలొస్తే.. వాటిలో 2011 ప్రపంచకప్ కోసం శంకర్ ఎహసన్ లాయ్ కంపోజ్ చేసిన పాడిన 'దేఖ్ గుమాంగే'.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రపంచకప్ కోసం తయారు చేసిన మొత్తం పాటలు ఇవిగో. ఓసారి వినండి. ఏదో బెస్ట్ మీరే చెప్పండి. (ఇదీ చదవండి: వన్డే వరల్డ్కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!) 1992 ప్రపంచకప్ థీమ్ సాంగ్: హూ రూల్ ద వరల్డ్ 1996 ప్రపంచకప్ థీమ్ సాంగ్: చోక్రా 1999 ప్రపంచకప్ థీమ్ సాంగ్: లైఫ్ ఈజ్ ఈ కార్నివాల్ 2003 ప్రపంచకప్ థీమ్ సాంగ్: వెల్కమ్ టూ అవర్ హోమ్ 2007 ప్రపంచకప్ థీమ్ సాంగ్: గేమ్ ఆఫ్ లవ్ అండ్ యూనిటీ 2011 ప్రపంచకప్ థీమ్ సాంగ్: దేఖ్ గుమాంగే 2015 ప్రపంచకప్ థీమ్ సాంగ్: WDL బాబ్స్ బీట్ 2019 ప్రపంచకప్ థీమ్ సాంగ్: లోరిన్ 2023 ప్రపంచకప్ థీమ్ సాంగ్: దిల్ జస్న్ భోలే -
ఆసీస్తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్ శర్మ
క్రికెట్ అభిమానులు ఏంతో అతృతగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా తుది పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఇప్పటికే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. ఫైనల్లో కూడా తమ జోరును కొనసాగించి మరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ మీడియా సమావేశంలో పాల్గోన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని విధాల సిద్దమైనట్లు రోహిత్ తెలిపాడు. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు.. "నేను కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ఈ వరల్డ్కప్ కోసం మేము రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించాము. మూడు ఫార్మాట్లలో మేము ఒక యూనిట్గా అద్బుతంగా రాణిస్తున్నాం. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి వారి పాత్రపై ఒక క్లారిటీ ఉంది. మూడు ఫార్మాట్లలో ఆటగాళ్ల ప్రదర్శన బట్టి అవకాశాలు ఇస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శన కనబరిచాం. రేపు కూడా అదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నాను. ఇక ఆస్ట్రేలియాను మేము తేలికగా తీసుకోము. ప్రపంచక్రికెట్లో అత్యుత్తమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఈ టోర్నీలో వరుసగా 8 కి ఎనిమిది మ్యాచ్లు గెలిచి ఫైనల్కు వచ్చింది. ఆస్ట్రేలియా ఏమి చేయగలదో మాకు తెలుసు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. అయితే మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. వాటిపై మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాము. వారి ఫామ్ను చూసి మేము ఎటువంటి ఆందోళన చెందడం లేదు. మాపై చాలా అంచనాలు ఉన్నాయి. టోర్నీ స్వదేశంలో జరుగుతుంది కాబట్టి అంతే ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ వాటిన్నంటిని తట్టుకుని ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా మేము ప్రశాంతమైన వాతావారణం ఏర్పరుచుకున్నామని" రోహిత్ పేర్కొన్నాడు. బౌలర్ల గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము తొలి నాలుగు,ఐదు మ్యాచ్ల్లో ఛేజింగ్ చేసి విజయం సాధించాం. ప్రత్యర్ధి జట్లను 300 కంటే తక్కువకు పరిమితం చేయడంలో మా బౌలర్లు కీలక పాత్ర పోషించారు. పేసర్లు స్పిన్నర్లు ఇద్దరూ అదరగొట్టారు. మేము టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడంలోనూ మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. బుమ్రా, షమీ, సిరాజ్ కొత్త బంతితో అద్బుతాలు చేయగా.. మిడిల్ ఓవర్లలో స్నిన్నర్లు కూడా అత్యుత్తమంగా రాణించారు" అని చెప్పుకొచ్చాడు. -
వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్!
ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ హడావుడి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ సందడి చేశారు. 1983లో తొలిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కలిశారు. బ్యాట్ పట్టి వారితో సరదాగా క్రికెట్ ఆడారు. నాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1983 విజయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు సంకేతంగా తాను సంతకం చేసిన బ్యాట్ను లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, జిమ్మీ అమర్నాథ్, కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలకు బహూకరించారు. దీనికి సంబంధిచిన వీడియోను ఎరిక్ గార్సెట్టీ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారత్లో క్రికెట్ అభివృద్ధికి బాటలు వేశారంటూ 1983 వరల్డ్ కప్ నెగ్గిన లెజండరీ క్రికెటర్లను అభినందిస్తూ భారత్ మరోసారి ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఆడుతున్న తరుణంలో గార్సెట్టీ షేర్ చేసిన ఈ వీడియో ట్రెండింగ్లో నిలిచింది. అత్యధికంగా వ్యూవ్స్, లైక్స్ వచ్చాయి. అలాగే పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు. Met the OGs of cricket 🏏 – '83 legends @therealkapildev, Sunil Gavaskar, @iRogerBinny, @JimmyAmarnath, @KirtiAzaad, and @RaviShastriOfc! They bowled me over with their stories from India's first cricket World Cup victory! Rooting for #TeamIndia for the World Cup final on Sunday.… pic.twitter.com/71aTKDIuax — U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) November 17, 2023 -
World Cup 2023 Final: బ్యాటింగా.. బౌలింగా? భారత్ టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి?
వన్డే ప్రపంచకప్-2023లో తుది సమరానికి మరి కొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అహ్మబాద్కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వికెట్పైన మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పిచ్ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ ద్రవిడ్తో కలిసి పరిశీలించాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా స్టేడియంకు వచ్చి పిచ్ను పరిశీలించి, ఫోటోలను తన ఫోన్లో తీసుకున్నాడు. ఆ తర్వాత వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ,ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెట్టోరీ కూడా చాలా సేపు ఈ పిచ్ను చెక్ చేశారు. టాస్ గెలిస్తే తొలుత ఏమి చేయాలి..? కాగా ఈ మ్యాచ్లో టాస్ మరోసారి కీలకం కానుంది. ఈ తుదిపోరులో టాస్ గెలిచిన జట్టు తొలుత ఏమి చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోను బట్టి చూస్తే.. అహ్మదాబాద్ పిచ్ను నల్లమట్టితో తాయారు చేసినట్లు కన్పిస్తోంది. ట్రాక్పై పెద్దగా గ్రాస్(గడ్డి) కూడా లేదు. కాబట్టి కొత్త బంతితో సీమర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం పిచ్ బాగా డ్రై అవుతుంది. Captain Pat Cummins inspects the pitch ahead of the final 🔍#CWC23 #INDvAUS pic.twitter.com/ymBAK5o8x6 — ICC (@ICC) November 18, 2023 దీంతో వికెట్ కాస్త హార్డ్గా మారి స్పిన్నర్లకు అనూకూలించే ఛాన్స్ ఉంది. ప్లడ్ లైట్ల కింద పిచ్ కాస్త సీమర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది. ఏదైమనప్పటికీ మధ్యాహ్నం పరిస్థితులు బ్యాటింగ్కు అనూకూలించే అవకాశమున్నందన.. టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023 IND Vs AUS Finals: ఈ సారి వరల్డ్కప్ టీమిండియాదే.. ఎలా అంటే? -
వన్డే వరల్డ్కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!
ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్కి వెళ్లడం, ఇదే ప్రపంచకప్లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ మ్యాచ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. తెలుగు స్టార్ హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. సినిమా-క్రికెట్ని విడదీసి చూడలేం. రెండింటికి చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకు తగ్గట్లే చాలామంది తెలుగు హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కూడా. ఈ లిస్టులో ఫస్ట్ వెంకటేశ్ ఉంటాడు. ఐపీఎల్ మ్యాచ్ల దగ్గర నుంచి ఇండియా మ్యాచ్ల వరకు హైదరాబాద్లో జరిగే ప్రతి మ్యాచ్కి హాజరవుతుంటారు. ఈ వరల్డ్కప్లో అయితే మొన్నటికి మొన్న జరిగిన సెమీఫైనల్లో సందడి చేశారు. ఇప్పుడు ఫైనల్లో అంతకు మించిన ఎనర్జీతో సందడి చేయడం గ్యారంటీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) వెంకటేశ్ మాత్రమే కాదు మెగా పవర్స్టార్ రామ్చరణ్, కింగ్ నాగార్జున.. వరల్డ్కప్ ఫైనల్ చూసేందుకు అహ్మదాబాద్ రాబోతున్నారట. తెలుగు నుంచి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఆదివారం మ్యాచ్ జరిగే సమయానికి ఈ లిస్టులో ఇంకా చాలామంది చేరుతారు. మిగతా ఇండస్ట్రీల నుంచి చూసుకుంటే బాలీవుడ్ స్టార్స్ ఆల్మోస్ట్ అటెండ్ అయిపోతారు. అందులో నో డౌట్. తమిళ్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళం నుంచి మోహన్ లాల్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. మ్యాచ్ కోసం గ్యారంటీగా స్టేడియానికి వస్తారని తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే గ్రౌండ్లో టీమిండియా హడావుడి కంటే స్టాండ్స్లో స్టార్స్ హీరోల హడావుడే ఎక్కువ ఉండబోతుందనమాట. ఫైనల్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని చూసేందుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులతో పాటు ఇప్పటివరకు వరల్డ్కప్ గెలుచుకున్న జట్ల కెప్టెన్స్ కూడా హాజరు కానున్నారట. ఇదిలా ఉండగా.. ఉదయం 7 గంటల నుంచే స్టార్స్పోర్ట్స్లో లైవ్ కవరేజీ ఉండనుంది. (ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!) -
ఈ సారి వరల్డ్కప్ టీమిండియాదే.. ఎలా అంటే?
మూడో వన్డే ప్రపంచకప్ టైటిల్కు టీమిండియా మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. 20 ఏళ్ల తర్వాత ఆసీస్-భారత్ జట్లు వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. తుదిపోరులో ఆసీస్ను చిత్తు చేసి.. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన వరల్డ్కప్ ఫీవరే కన్పిస్తోంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్కప్ నేపథ్యంలో ఓ పాత సెంటిమెంట్ను అభిమానులు తెరపైకి తెచ్చారు. ఈ సారి టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే? ఫైనల్ మ్యాచ్కు ముందు భారత్-ఆస్ట్రేలియా కెపెన్లు రోహిత్ శర్మ, కమ్మిన్స్ అహ్మాదాబాద్లోని ప్రఖ్యాత అదాలజ్ స్టెప్వెల్ వద్ద ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో ట్రోఫీకి కుడివైపు రోహిత్ శర్మ ఉండటంతో.. టీమిండియాదే వరల్డ్కప్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే.. గత మూడు వరల్డ్కప్ టోర్నీల్లో కూడా ఈ విధంగా కూడివైపు ఉన్న కెప్టెన్లే తమ జట్టును విజేతగా నిలిపారు. 2011 వరల్డ్కప్ ఫైనల్కు ముందు కూడా ట్రోఫీతో కెప్టెన్లు ఫోటోలు దిగినప్పుడు భారత సారథి ఎంఎస్ ధోని.. ట్రోఫీకి కుడి వైపే నిలుచుని ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం 2015 ప్రపంచకప్లో కూడా అచ్చెం ఇదే పరిస్థితి. ట్రోఫీతో ఫోజులిచ్చేటప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా కుడివైపే ఉన్నాడు. ఆ వరల్డ్కప్లో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత చివరగా 2019 వరల్డ్కప్ ఫైనల్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ట్రోఫీకి కుడివైపే ఉన్నాడు. 2019 ప్రపంచకప్ను ఇంగ్లీష్ జట్టు ఎగరేసుకుపోయింది. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ట్రోఫీకి కుడివైపే ఉండడంతో భారత జట్టు కప్పు కొడుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. చదవండి: World Cup 2023 Final: ఆసీస్తో ఫైనల్ పోరు.. సిరాజ్కు నో ఛాన్స్!? జట్టులోకి సీనియర్ ఆటగాడు pic.twitter.com/OAmLbfmhgU — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2023 pic.twitter.com/kyoETUOS6z — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2023 -
CWC: ఏపీలో ఫ్యాన్స్కు పండగే.. 13 జిల్లాల్లో భారీ స్క్రీన్లు! ఏయే చోట అంటే..
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్ ప్రపంచం మొత్తం వరల్డ్కప్-2023 ఫీవర్తో ఊగిపోతోంది. ఈ మెగా ఈవెంట్కు వేదికైన భారత్లో.. ఊరూరా ప్రపంచకప్ సందడి మొదలైంది. సొంతగడ్డపై టీమిండియా ట్రోఫీ గెలిస్తే చూడాలనే ఆకాంక్షతో రోహిత్ సేనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అభిమానులు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించాలంటూ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అభిమానులకు మరింత వినోదం అందించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సిద్ధమైంది. భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ను పెద్ద స్క్రీన్ల (ఫేన్ ఎరీనా)పై తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్రెడ్డి వెల్లడించారు. స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్ను చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్ను అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చన్నారు. అదే విధంగా... అక్కడ ఫుడ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గోపీనాథ్రెడ్డి వెల్లడించారు. ఇక ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో.. పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసే స్థలం జిల్లాల వారీగా.. 1. విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా 2. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి) 3. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 4. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్ 5. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ 6. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ 7. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం 8. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్ 9. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం 10. శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్ 11. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్ 12. విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక 13. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం. -
ఆసీస్తో ఫైనల్ పోరు.. సిరాజ్కు నో ఛాన్స్!? జట్టులోకి సీనియర్ ఆటగాడు
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్ 19)న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ముచ్చటగా మూడో సారి టైటిల్ను ముద్దాడాలని భారత జట్టు భావిస్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం తమ వరల్డ్కప్ చరిత్రను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక ఈ తుదిపోరులో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్కు అవకాశమివ్వాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాపై అశ్విన్కు మంచి రికార్డు ఉండడంతో తుది జట్టులోకి తీసుకురావాలని హెడ్కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అశ్విన్ ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. లీగ్ దశలో చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అశ్విన్ ఆడాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. 8 ఓవర్లు వేసిన అశూ.. 34 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. దీంతో మరోసారి అతడి అనుభవాన్ని ఊపయోగించుకోవాలని టీమిండియా మేనెజ్మెంట్ ఆలోచిస్తోంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు అశ్విన్ కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్కు తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది ఆసీస్తో ఫైనల్కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చదవండి: World Cup 2023: వరల్డ్కప్ తుది పోరు రేపే.. ఫైనల్స్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే? -
వరల్డ్కప్ తుది పోరు రేపే.. ఫైనల్స్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?
క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్-2023 ఫైనల్కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో 24 గంటల్లో ఈ మెగా టోర్నీ తుది తుది సమరానికి తెరలేవనుంది. పది వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా.. ప్రత్యర్ధి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్లో మునిగి తేలుతోంది. ఇక వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్లో అడుగు పెట్టింది? ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. టీమిండియా ఎన్ని సార్లు ఫైనల్ చేరిందంటే? వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ ఏడాదితో కలిపి నాలుగు సార్లు వరల్డ్కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. 1987 వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించి తొలిసారి భారత్ ఫైనల్కు చేరింది. అనంతరం 2003 వరల్డ్కప్ సెమీస్లో కెన్యాను చిత్తు చేసి రెండో సారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఆ తర్వాత 2011 వరల్డ్కప్ టోర్నీలో సెమీస్లో దాయాది పాకిస్తాన్ను ఓడించి ఫైనల్ బెర్త్ను భారత్ ఖరారు చేసింది. ఇక ఈ ఏడాది వరల్డ్కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్పై విజయం సాధించిన తుదిపోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీ కంటే ముందు మూడు సార్లు ఫైనల్కు చేరిన టీమిండియా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. కపిల్ డేవిల్స్ అద్బుతం.. 1987 వన్డే వరల్డ్కప్లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు.. తొలిసారి ఈ మెగా టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్కు చేరడమే కాకుండా పటిష్ట వెస్టిండీస్ను ఓడించి వరల్డ్ ఛాంపియన్స్గా కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్లో బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారత్కు తొలి ప్రపంచకప్ను అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 54.4 ఓవరల్లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కృష్ణమాచారి శ్రీకాంత్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. అనంతరం 184 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. భారత బౌలర్ల దాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ తలా మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు సంధు రెండు, బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ సాధించారు. ఆసీస్ చేతిలో ఘోర పరాభావం.. 2003 వరల్డ్కప్లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా రన్నరప్గా నిలిచింది. జోహన్నెస్బర్గ్ వేదికగా ఫైనల్లో 125 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్(140 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పాంటింగ్తో పాటు డామియన్ మార్టిన్(88 నాటౌట్), ఆడమ్ గిల్క్రిస్ట్(57) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు అనంతరం 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 234 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో సెహ్వాగ్ ఒక్కడే 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో రెండో వరల్డ్కప్ ఫైనల్ను టీమిండియా ఓటమితో ముగించింది. మిస్టర్ కూల్ మాయ.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన ధోని సారథ్యంలోని భారత జట్టు.. 28ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మరోసారి వరల్డ్కప్ ట్రోఫిని ముద్దాడింది. ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో మహేలా జయవర్ధనే (88 బంతుల్లో 103, 13 ఫోర్లు) సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ ఒక్క వికెట్ సాధించాడు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (0) డకౌట్ అయ్యాడు. మరికాసేపటికే సచిన్ టెండూల్కర్ (18) అవుటయ్యాడు. దాంతో భారత్ 31 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లి (35)తో జతకట్టిన గౌతం గంభీర్ జట్టును నడిపించాడు. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లిని దిల్షాన్ పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా యువరాజ్ స్ధానంలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్కు వచ్చాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 170 బంతుల్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. గంభీర్, ధోని అద్భుతంగా ఆడుతూ భారత్ ను విజయానికి చేరువ చేశారు. అయితే 97 పరుగులతో సెంచరీకి చేరువలోన్న గౌతం గంభీర్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ధోని సిక్స్ కొట్టి జట్టును వరల్డ్ ఛాంపియన్స్గా నిలిపాడు. -
వరల్డ్కప్ ముగింపు.. ప్రత్యేక కార్యక్రమాలు! బీసీసీఐ ప్రకటన విడుదల
ICC CWC 2023 Closing Ceremony: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఘనంగా ముగింపు పలకనుంది. ఇందుకోసం.. అహ్మదాబాద్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం టైటిల్ పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఎయిర్ షోతో మొదలు ఈ క్రమంలో మధ్యాహ్నం 1:35 నిమిషాల నుంచి 1:50 నిమిషాల వరకు.. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ షోతో అలరించనుంది. ఇన్నింగ్స్ ఆరంభమైన తర్వాత మొదటి డ్రింక్స్ బ్రేక్లో ప్రముఖ గాయకుడు, పాటల రచయిత ఆదిత్య గాధ్వి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. జోనితా గాంధీ, అజీజ్ తదితరులతో ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ విరామ సమయంలో మ్యుజీషియన్ ప్రీతం చక్రవర్తి, గాయకులు జోనితా గాంధీ, నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాశ సింగ్, తుషార్ జోషీ తమ గాత్రంతో అలరించనున్నారు. అదే విధంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యేక లేజర్ లైట్ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు ముగింపు వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం విడుదల చేసింది. కాగా ప్రపంచంలోని క్రికెట్ మైదానాల్లో పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబరు 19న టీమిండియా- ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన కంగారూ జట్టు.. సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత జట్టును ఓడించడం కష్టమే అనే అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. విజేత జట్ల కెప్టెన్లకు ఆహ్వానం ఇప్పటి వరకు జరిగిన 12 వన్డే ప్రపంచకప్ టోర్నీ లలో విజేత జట్లకు కెప్టెన్లకు వ్యవహరించిన వారికి ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆహ్వానించనుంది. క్లయివ్ లాయిడ్ (వెస్టిండీస్; 1975, 1979), కపిల్ దేవ్ (భారత్; 1983), అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా; 1987), ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్; 1992), అర్జున రణతుంగ (శ్రీలంక; 1996), స్టీవ్ వా (ఆస్ట్రేలియా; 1999), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా; 2003, 2007), ధోని (భారత్; 2011), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా; 2015), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్; 2019) ఈ జాబితాలో ఉన్నారు. కాగా జైలులో ఉన్న పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఈ ఈవెంట్కు హాజరయ్యే అవకాశమే లేదు. తెర వెనుక నుంచి శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని బీసీసీఐ కార్యదర్శి జై షాపై విమర్శలు గుప్పించిన శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ కూడా ఫైనల్కు రావడం అనుమానమే. మ్యాచ్కు భారత ప్రధాని, ఆసీస్ ఉప ప్రధాని ఫైనల్ను చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ విచ్చేయనున్నారు. వీరితో పాటు బడా పారిశ్రామిక దిగ్గజాలు, పలు రంగాలకు చెందిన దిగ్గజాలు, భారతీయ సినీ రంగ ప్రముఖులంతా హాజరు కానున్న నేపథ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం గాందీనగర్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని చేతుల మీదుగా ట్రోఫీ ప్రదానం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అతిరథ మహారథులతో పాటు సాధారణ ప్రేక్షకులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు. విశ్వవిజేతగా నిలిచే జట్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ట్రోఫీని అందజేసే అవకాశముంది. చదవండి: CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి! -
అదొక్కటి తప్ప టీమిండియాను అడ్డుకునే శక్తి లేదు: యువీ
CWC 2023 Final India Vs Australia: ఆస్ట్రేలియాతో టీమిండియా వరల్డ్కప్ ఫైనల్ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వయం తప్పిదాలు తప్ప రోహిత్ సేనను ఈసారి ట్రోఫీ గెలవనీయకుండా అడ్డుపడే శక్తి వేరే ఏదీ లేదన్నాడు. అయితే, ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని.. తమదైన రోజు వాళ్లు చెలరేగడం ఖాయమని పేర్కొన్నాడు. ఆత్మవిశ్వాసం మెండుగా ఇప్పటికే ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన కంగారూలకు ఇలాంటి హైవోల్టేజీ మ్యాచ్లలో ఒత్తిడి జయించడం వెన్నతో పెట్టిన విద్య అని యువీ పేర్కొన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘ఈ వరల్డ్కప్ టోర్నీలో వాళ్ల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఫైనల్లోనూ బాగానే ఆడతారనుకుంటున్నా. కేవలం తమంతట తాము తప్పు చేస్తే తప్ప ఈసారి టీమిండియా ఓడిపోయే అవకాశాలు లేవు. అయితే, పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నందున కచ్చితంగా గెలిచి తీరతారనే అనిపిస్తోంది. 2003 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించింది. సారి టోర్నీ మొత్తంలో టీమిండియా డామినేషన్ సాగింది. కాబట్టి ఈసారి ఆసీస్ సాధారణ ప్రదర్శనతో గట్టెక్కే పరిస్థితి లేదు. అత్యుత్తమంగా రాణించకపోతే టీమిండియాను నిలువరించడం వారికి సాధ్యం కాదు. ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు తెలుసు అయితే, ఐసీసీ వంటి మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఆస్ట్రేలియన్లకు బాగా తెలుసు. ఇప్పటికే వాళ్లు చాలాసార్లు టైటిల్ గెలిచారు. సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో స్పెషలిస్టు బ్యాటర్లు అవుటైన వేళ.. బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ బ్యాట్తో పట్టుదలగా నిలబడిన తీరు అద్భుతం. ఫైనల్ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో వాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరచగలరో అంచనా వేయొచ్చు. అందుకే రోహిత్ సేన మరింత జాగరూకతతో ఉండాలి’’ అని యువీ హెచ్చరించాడు. స్పోర్ట్స్తక్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం(నవంబరు 19) వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ జరుగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి!
ఇద్దరూ కుడిచేతి వాటం క్రికెటర్లే.. అందులో ఒకరు వికెట్ కీపర్.. మరొకరు అచ్చమైన బ్యాటర్.. ఆ ఇద్దరూ గాయాల నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో పునరాగమనం చేసిన వాళ్లే.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 లాంటి కీలక టోర్నీకి ముందు ఆసియా వన్డే కప్-2023 ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఆసియా టోర్నమెంట్తో లభించిన ‘ప్రాక్టీస్’ను వికెట్ కీపర్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. మరో బ్యాటర్ మాత్రం గాయం కారణంగా మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. తిరిగొచ్చిన తర్వాత.. ప్రపంచకప్ ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, అనూహ్యంగా సెంచరీతో చెలరేగి తిరిగి గాడిలో పడ్డాడు. తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్తోనే సమాధానమిస్తూ ముందుకు సాగుతున్నాడు. అద్భుత ప్రదర్శనలతో ఈ ఇద్దరూ ఇప్పుడు వరల్డ్కప్-2023 ఫైనల్లో మరింత కీలకంగా మారారు. వాళ్లెవరో కాదు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. ఫైనల్ వరకు అజేయంగా స్వదేశంలో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచి టేబుల్ టాపర్గా సెమీస్ చేరింది. న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ గండాన్ని తుదిపోరుకు అర్హత సాధించింది. అహ్మదాబాద్ వేదికగా మిగిలిన ఆ ఇంకొక్క అడుగు విజయవంతంగా పూర్తి చేసి పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చాలని పట్టుదలగా ఉంది ఈ జెయింట్ కిల్లర్. ఇక్కడి వరకు సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణంలో కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి జోడీ శుబ్మన్ గిల్.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాపార్డర్ జబర్దస్త్గా పవర్ ప్లేలో రోహిత్ దూకుడుగా ఆరంభిస్తే.. గిల్ కాస్త ఆచితూచి ఆడి ఆ తర్వాత వేగం పెంచుతాడు. ఇక వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చే కోహ్లి.. తాను పోషించాల్సిన పాత్ర గురించి కచ్చితమైన అవగాహనతోనే మైదానంలో అడుగుపెడతాడన్న సంగతి తెలిసిందే. అయితే, అన్నివేళలా అన్నీ అనుకున్నట్లుగా జరగవు. టాపార్డర్ విఫలమైతే స్కోరు బోర్డును ముందుకు నడిపించగల బాధ్యతను మిడిలార్డర్ పూర్తిగా తీసుకోగలగాలి. ఇలాంటపుడే నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేసే బ్యాటర్ల అసలైన ప్రతిభ బయటపడుతుంది. మిడిలార్డర్లో పాతుకుపోయి.. తమకు తామే సాటి అన్నట్లు వన్డే వరల్డ్కప్-2023లో తమ పాత్రను చక్కగా పోషిస్తున్నారు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. నిజానికి 2015- 19 మధ్య టీమిండియా మిడిలార్డర్లో నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపించేది. అప్పట్లో నంబర్ 4లో కీలకమైన అంబటి రాయుడును తప్పించి త్రీడీ ప్లేయర్ పేరిట విజయ్ శంకర్ను ప్రపంచకప్-2019 జట్టుకు ఎంపిక చేశారు. కానీ అనుకున్న ఫలితాలు రాబట్టలేక సెమీస్లో ఓటమి చెంది ఇంటి బాట పట్టింది భారత జట్టు. మిడిలార్డర్లో అనిశ్చితి కారణంగా భారీ మూల్యమే చెల్లించింది. ఆ తర్వాత రాహుల్, అయ్యర్ తమ ఆట తీరుతో ఆ లోటు భర్తీ చేసే బాధ్యతను తీసుకున్నారు. గిల్ రాకతో మిడిలార్డర్కే పరిమితమైన రాహుల్.. వికెట్ కీపర్గా రాణిస్తూనే బ్యాటర్గానూ ఆకట్టుకుంటున్నాడు. వరల్డ్కప్నకు ముందు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ కర్ణాటక బ్యాటర్.. ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో అజేయ శతకంతో ఫామ్లోకి వచ్చాడు. రాహుల్ సైలెంట్ కిల్లర్ ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా వరల్డ్కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్లో రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ డకౌట్లుగా వెనుదిరిగిన వేళ.. కోహ్లి(85)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది జట్టును గెలిపించిన తీరు అద్భుతం. నాటి మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు రాహుల్. ప్రతి మ్యాచ్లోనూ బ్యాటర్గా తన వంతు సహకారం అందిస్తున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. వికెట్ కీపర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవును.. వికెట్ల వెనుక కళ్లు చెదిరే రీతిలో క్యాచ్లు అందుకోవడం సహా డీఆర్ఎస్ల విషయంలో కచ్చితత్వంతో కెప్టెన్ రోహిత్ శర్మను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. కీలక సమయాల్లో రాహుల్ మాటను నమ్మి రోహిత్ రివ్యూలో చాలా మటుకు సక్సెస్ కావడం ఇందుకు నిదర్శనం. అయ్యర్ అద్భుత బ్యాటర్ ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో అజేయ హాఫ్ సెంచరీ(53)తో మెరిశాడు. కానీ ఆ తర్వాత నామమాత్రపు స్కోర్లకే పరిమితమై వరుస వైఫల్యాలతో విమర్శల పాలయ్యాడు. అయితే, శ్రీలంకతో మ్యాచ్(82 పరుగులు)లో తిరిగి గాడిలో పడ్డ అయ్యర్.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో 77 పరుగులు సాధించాడు. ఇక నెదర్లాండ్స్లో మ్యాచ్లో ఏకంగా 128 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో సొంతమైదానం వాంఖడేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 70 బంతుల్లో 105 పరుగులు చేసి వరల్డ్కప్ నాకౌట్ దశలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్లో రాహుల్ సైతం 20 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా వీరిద్దరు మిడిలార్డర్లో నిలకడగా రాణిస్తుండటం టీమిండియా పాలిట వరంలా మారింది. కీలకమైన నాలుగు, ఐదు స్థానాల్లో అయ్యర్, రాహుల్ సక్సెస్ అవుతుండటంతో బ్యాటింగ్ ఆర్డర్ మునుపెన్నడూ లేని విధంగా మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ప్రతి మ్యాచ్లో 10 వికెట్లు టీమిండియా విజయాల్లో బ్యాటర్ల సంగతి ఇలా ఉంటే.. బౌలింగ్ విభాగం ముఖ్యంగా పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుమ్రా, సిరాజ్ వరుస అవకాశాలు దక్కించుకుంటే.. లేట్గా ఎంట్రీ ఇచ్చినా షమీ ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. షమీ బుల్లెట్ ఇప్పటి వరకు మూడు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేసి మొత్తంగా 23 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు షమీ. ఇక బుమ్రా 18, సిరాజ్ 13 వికెట్లతో వరుసగా ఆరు, పద్దెనిమిది స్థానాల్లో ఉన్నారు. అదే విధంగా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లన్నిటిలో ఏకంగా 10 వికెట్లు తీయడాన్ని బట్టి మన బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో చెప్పవచ్చు. కోహ్లి టాప్ గన్ ఇదిలా ఉంటే.. టాప్ రన్ స్కోరర్ల జాబితాలో.. 711 పరుగులతో కోహ్లి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ 550 రన్స్తో ఐదు, శ్రేయస్ అయ్యర్ 526 పరుగులతో ఏడు, కేఎల్ రాహుల్ 386 పరుగులతో పద్నాలుగవ స్థానాల్లో ఉన్నారు. -
వరల్డ్కప్ ఫైనల్.. క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త
క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే సంస్థ గుడ్న్యూస్ చెప్పింది. నవంబర్ 19న వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్కు వెళ్లే అభిమానుల రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. మూడు ముంబై నుంచి అహ్మదాబాద్కు.. మరొకటి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు రైలు సర్వీసును నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లు శనివారం సాయంత్రం ముంబై, ఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు(ఆదివారం) ఉదయం అహ్మదాబాద్కు చేరుకుంటాయని తెలిపింది. అంతేగాక అన్ని సాధారణ రైలు రిజర్వేషన్లు నిండినందున.. ప్రత్యేక రైలు టికెట్లు విమాన, మిగతా రైలు ఛార్జీల కంటే తక్కువ ధరలకే అందిస్తున్నట్లు చెప్పింది. ఈ రైలులో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ. 620.. రూ.1,525కే 3ఏసీ ఎకానమీ బెర్త్.. రూ.1,665కే స్టాండర్డ్ 3ఏసీ.. రూ.3,490కే ఫస్ట్ క్లాస్ ఏసీ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా అహ్మాదాబాద్కు ప్రస్తుతం విమాన టికెట్ ధర రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు ఉంది. అదే విధంగా మ్యాచ్ ముగిసిన తరువాత అభిమానులు ప్రత్యేక రైళ్లలో తిరిగి వెళ్లే సదుపాయం కూడా కల్పిస్తుంది రైల్వే సంస్థ. అహ్మదాబాద్లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైళ్లు బయల్దేరనున్నాయని చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లను ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తెలిపింది. చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోదీ కాగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే తుదిపోరులో టీమిండియా- అయిదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి భారత్- ఆసీస్లు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు జంట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఆసీస్-భారత జట్లు చివరగా 2003 వరల్డ్కప్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ పోరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. సహా పలువురు ప్రముఖులు ప్రత్యేక్షంగా వీక్షించనున్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ను లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూడనున్నారు. ఈ మ్యాచ్ను తిలకించేందుకు దేశంలోనే కాకుండా విదేశాల్లోని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో అహ్మదాబాద్ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయంగా మారింది. బసచేసే హోటళ్లు, తినే ఆహారం రేట్లు అన్నీ వేలు, లక్షల్లో పలుకుతున్నాయి. అసాధారణ ధరలతో ఉక్కిరి బిక్కిరవుతున్న క్రికెట్ అభిమానులకు రైల్వే ప్రకటించిన సదుపాయం కాస్తా ఊరటనిచ్చే అంశంగా మారింది. చదవండి: CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే! -
CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే!
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు తలపడటం సంతోషంగా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సెమీస్లో సత్తా చాటిందన్న ఈ మాజీ ఓపెనర్.. పడిలేచిన కెరటంలా ఆస్ట్రేలియా తుదిమెట్టుకు చేరుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు ఈ రెండు జట్లు వందకు వందశాతం అర్హత కలిగినవే అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదని రోహిత్ సేనను హెచ్చరించాడు. పట్టువదలని విక్రమార్కుల్లా ఆఖరి వరకు పోరాడే ఆటగాళ్లున్న ఆస్ట్రేలియాతో పోటీ అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్-2023 టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కంగారూ జట్టుతో పోటీకి సిద్ధమైంది. కాగా ఆరంభ మ్యాచ్లలో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించింది. ముఖ్యంగా అఫ్గనిస్తాన్తో లీగ్ మ్యాచ్లో ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో.. ఆ జట్టు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీతో.. అనూహ్య విజయం అందించాడు. ఇక సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ బ్యాట్తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో ఇలా ఎవరో ఒకరు అద్భుత ఆట తీరుతో గట్టెక్కించి ఆస్ట్రేలియాను ఇక్కడి దాకా తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఆసీస్.. ఆరో టైటిల్ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఇండియా టుడే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్ ఫేవరెట్గా ఉంది. కానీ ఆస్ట్రేలియన్లు అంత తేలికగ్గా తలవంచేవాళ్లు రకం కాదు. గ్లెన్ మాక్స్వెల్ ఆరోజు ఎలా ఆడాడో చూశాం కదా! ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించుకున్నాడు. దేశం కోసం గెలవాలన్న కసి వారిలో ఎంతగా ఉంటుందో మరోసారి నిరూపించాడు. కాబట్టి ఆసీస్ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్.. పీసీబీతో కూడా చెప్పాను!
Pakistan Cricket Captains: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ల మార్పుపై మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. టీ20 కెప్టెన్గా షాహిన్ షా ఆఫ్రిది నియామకంలో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు. తన అల్లుడి కోసం ఎలాంటి లాబీయింగ్ చేయలేదని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. షాహిన్ కెప్టెన్ కావాలని కోరుకోలేదు ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. టెస్టు పగ్గాలను షాన్ మసూద్కు అప్పగించింది. ఈ క్రమంలో టీ20 సారథిగా షాహిద్ నియామకంలో మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రమేయం ఉందనే వదంతులు వ్యాపించాయి. తన అల్లుడి కోసం ఆఫ్రిది పీసీబీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆఫ్రిది.. ‘‘నేను అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చను. షాహిద్తో నాకున్న బంధుత్వం కారణంగా ఇలాంటి మాటలు వినిపిస్తాయని నాకు తెలుసు. ఒకవేళ నేను లాబీయింగ్ చేసే వాడినే అయితే.. పీసీబీ చైర్మన్ను ఎందుకు విమర్శిస్తాను? నేను ఏ రోజూ కూడా షాహిన్ను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేయలేదు. మహ్మద్ రిజ్వాన్తో బాబర్ ఆజం నిజానికి అతడు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలనే కోరుకున్నా. అయితే, షాహిన్ను సారథిగా నియమించాలన్నది పూర్తిగా పీసీబీ చైర్మన్, మహ్మద్ హఫీజ్ నిర్ణయం. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్ బాబర్ ఆజంనే కెప్టెన్గా కొనసాగించాలని పీసీబీ చైర్మన్తో గతంలో చెప్పాను. ఒకవేళ అతడు తప్పుకోవాలని భావిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్ను కెప్టెన్గా చేయాలని.. టెస్టుల్లో మాత్రం బాబర్నే కొనసాగించాలని పీసీబీకి చెప్పాను’’ అని సామా టీవీ షోలో పేర్కొన్నాడు. కాగా షాహిద్ ఆఫ్రిది పెద్ద కుమార్తె అన్షాను షాహిన్ వివాహమాడిన విషయం తెలిసిందే. చదవండి: CWC 2023: ద్రవిడ్తో కలిసి పిచ్ పరిశీలించిన రోహిత్! క్యూరేటర్ చెప్పిందిదే! -
CWC 2023: ద్రవిడ్తో కలిసి పిచ్ పరిశీలించిన రోహిత్! క్యూరేటర్ చెప్పిందిదే!
పుష్కరకాలం తర్వాత.. అదీ సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ఓటమన్నదే ఎరుగక ముందుకు సాగిన రోహిత్ సేన తుదిపోరులోనూ అజేయంగా నిలవాలనే సంకల్పంతో ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కంగారూలతో పోటీకి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషించి అందుకు తగ్గట్లుగా తమను తాము సన్నద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు శుక్రవారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే మైదానానికి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపు రోహిత్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు.. జడేజా, ఇషాన్ నెట్స్లో బ్యాటింగ్ చేశారు. అనంతరం.. రోహిత్ శర్మ ద్రవిడ్తో కలిసి అహ్మదాబాద్ పిచ్ను పరిశీలించాడు. బీసీసీఐ క్యూరేటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్ జయేశ్ పటేల్తో చర్చించాడు. కాగా ప్రపంచకప్-2023 లీగ్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇక్కడ బ్లాక్ సాయిల్(నల్ల మట్టి)తో కూడిన పిచ్ను రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. భారత్- ఆస్ట్రేలియా ఫైనల్కు కూడా ఇదే రకమైన పిచ్ను వాడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన పిచ్ క్యూరేటర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ మేరకు.. ‘‘బ్లాక్ సాయిల్ స్ట్రిప్ ఉన్న పిచ్పై హెవీ రోలర్ ఉపయోగిస్తే.. స్లో బ్యాటింగ్ ట్రాక్ తయారు చేసే వీలుంటుంది. ఇక్కడ 315 పరుగులన్నది కాపాడుకోగలిగిన లక్ష్యమే. లక్ష్య ఛేదన(సెకండ్ బ్యాటింగ్)కు దిగే జట్టుకు మాత్రం కష్టాలు తప్పవు’’ అని పీటీఐతో పేర్కొన్నారు. ఇక ఐసీసీ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ ఇండియాలోనే ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చారు. కానీ గ్రౌండ్ను పరిశీలించలేదు. అయితే, శనివారం అందుబాటులో ఉంటారు’’ అని పేర్కొన్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 Final : భారత్, ఆస్ట్రేలియా ఫైనల్కు సర్వం సిద్ధం (ఫోటోలు)
-
CWC 2023 Final: ఆకాశనంటుతున్న ధరలు.. హోటల్ గదికే రూ. 2 లక్షలు!
క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ జరుగనుంది. తుదిపోరులో పటిష్ట టీమిండియా- మేటి జట్టు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇరవై ఏళ్ల తర్వాత టీమిండియా- ఆసీస్లు మరోసారి ప్రపంచకప్ ఫైనల్లో తలపడటం మరో విశేషం. ఈ నేపథ్యంలో దారులన్నీ అహ్మదాబాద్ వైపే సాగుతున్నాయి. దీంతో వ్యాపార వర్గాలు వరల్డ్కప్ ఫీవర్ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. విమాన టిక్కెట్ల ధరలతో పాటు హోటల్ గదుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా అహ్మదాబాద్లో సాదాసీదా డార్మెటరీ, మోస్తరు గదులున్న హోటళ్లలో రేట్లు కేవలం రూ.1000, మహా అయితే రూ. 3000 ఉండేవి. కానీ... క్రికెట్ అభిమానుల తాకిడి నేపథ్యంలో ఈ రేట్లు అమాంతం రూ. 20 వేలు, నుంచి 50 వేలకు పెరిగిపోయాయి. ఏసీ, లగ్జరీ సదుపాయాలంటే ఆ రేటు ఇక చెప్పాల్సిన పనేలేదు. లక్షకు అటు ఇటుగానే ఉండనుంది. అలాగే అత్యంత పరిమితంగా 5000 అటు ఇటుగా ఉన్న త్రీస్టార్, ఫైవ్స్టార్ హోటళ్లలో బస చేయాలంటే రూ. 2 లక్షలదాకా వెచ్చిం చాల్సిందే. నిజం చెప్పాలంటే ఫైనల్ జరుగుతుంది ముంబైలో కాదు... అహ్మదాబాద్లో కాబట్టి చిన్నా, చితక హోటళ్లు, డార్మెటరీ బెడ్లు అన్నీ కలుపుకున్నా 10 వేలకు మించవు. కాబట్టే రేట్లు రాకెట్లలా దూసుకెళ్తున్నాయి. అదీ సంగతి.. మరి క్రికెట్ వన్డే వరల్డ్కప్ ఫైనల్ను నేరుగా వీక్షించాలంటే జేబుకు ఆ మాత్రం చిల్లుపడాల్సిందే అంటారా?! ఈ విషయం గురించి గుజరాత్ ఫెడరేషన్ ఆఫ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర సోమాని పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ ఫీవర్ కేవలం ఇండియాకే పరిమితం కాదు కదా! దుబాయ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి విదేశాల నుంచి కూడా అభిమానులు ఇక్కడికి వస్తున్నారు. అహ్మదాబాద్లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్లో కలిపి దాదాపు 5 వేల గదులు అందుబాటులో ఉన్నాయి. చిన్నాచితకా హోటళ్లన్నీ కలుపుకొని మొత్తం 10 వేల వరకు ఉంటాయి. మరి నరేంద్ర మోదీ స్టేడియంలో సీట్ల సామర్థ్యమేమో లక్షా ఇరవై వేల వరకు ఉంటుంది. కాబట్టే పరిస్థితి ఇలా ఉంది’’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అటెన్షన్ ప్లీజ్! అహ్మదాబాద్కు విమానంలో అయితే అర లక్ష!
యువర్ అటెన్షన్ ప్లీజ్! అహ్మదాబాద్ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయం. తినాలనుకుంటే రేట్లు చూసిన వెంటనే కడుపు నిండిపోయే ‘మెనూ’లున్నాయి. బస చేయాలంటే సాధారణ హోటళ్లలోనే వేల రూపాయలు, స్టార్ హోటళ్లలో రూ. లక్షలు... ఫైనల్ ఆట కంటే ముందే ‘హాట్ హాట్’ టాపిక్లయ్యాయి. అహ్మదాబాద్: తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కానీ యావత్ దేశం మాత్రం భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్ పోరాటాన్ని చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతోంది. ప్రయాణ టికెట్లు వేలకు వేలైనా ... తినుబండారాలు ఖరీదైనా... హోటల్ గదులు ఎన్ని వేల రూపాయలైనా సరే భారత అభిమానులు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు. లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూసే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ కోసం ఖర్చులు బారెడైనా... కళ్లు కాయలు కట్టుకొని మరీ చూసేందుకు ఎదురు చూస్తున్నారు.ఆ్రస్టేలియా రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైనా... 2003 ఫైనల్ బూచీ వెంబడిస్తున్నా... టీమిండియా అజేయ జైత్రయాత్రపైనే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. మూడు రోజుల క్రితం న్యూజిలాండ్ జట్టుపై గత ప్రపంచ కప్ సెమీఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకున్న భారత్... 20 ఏళ్ల క్రితం ఆ్రస్టేలియా చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమి ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటుందని సగటు అభిమానులంతా ఆశిస్తున్నారు. విమానం ఎక్కితే... అహ్మదాబాద్ వెళ్లే విమానం ఎక్కితే దేశంలో ఎక్కడి నుంచైనా దాదాపు రూ. 5 వేల నుంచి 9 వేల లోపే ఉంటుంది. నెలముందు బుక్ చేసుకుంటే సగం రూ. 3 వేల లోపే అందుబాటులో ఉంటాయి. కొన్ని సంస్థ ప్రొమో కోడ్లతో 500 వందలైనా తగ్గేవి. కానీ అలా చూసుకుంటే రూ. 2500 టిక్కెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 25 నుంచి 35 వేల మధ్యకు పెరిగింది. ఇది నిన్నటి (శుక్రవారం) ధరలు. శనివారం బుక్ చేసుకుంటే మాత్రం అర లక్షయినా ఆశ్చర్యం కలుగక మానదు. పలు విమానయాన సంస్థలు ఆ రూట్లో ప్రత్యేకంగా ఫ్లైట్లు అందుబాటు లో పెడుతున్నా అవేవీ ప్రయాణికుల రద్దీని తట్టుకో లేకపోతున్నాయని టికెట్ ఏజెంట్స్ చెబుతున్నారు. విన్యాసాలకు రిహార్సల్స్ భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఫైనల్కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోతో కనువిందు చేయనుంది. ఇందుకోసం శుక్రవారం ఈ టీమ్ స్టేడియంపై వైమానిక విన్యాసాలను రిహార్సల్స్ చేసింది. -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. చీఫ్ సెలక్టర్గా దిగ్గజ బౌలర్
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్గా మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. ఇంజమామ్-ఉల్-హక్ స్ధానాన్ని రియాజ్ భర్తీ చేయనున్నాడు. వన్డే వరల్డ్కప్-2023కు ముందు పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఇంజమామ్.. వ్యక్తిగత కారణాలతో టోర్నీ మధ్యలోనే తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే రియాజ్కు పీసీబీ సెలక్షన్ కమిటీ చైర్మెన్ బాధ్యతలు అప్పగించింది. వచ్చె నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్తో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్గా రియాజ్ ప్రయాణం ప్రారంభం కానుంది. అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్లకు జట్టును ఎంపిక చేయనుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం తర్వాత విదేశీ కోచ్లను పీసీబీ తొలిగించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ డైరక్టర్గా పనిచేసిన మిక్కీ అర్ధర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కిల్పై వేటు వేసింది. దీంతో తమ జట్టు క్రికెట్ డైరక్టర్ బాధ్యతలు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్కు పీసీబీ అప్పగించింది. బౌలింగ్ కోచ్గా ఉమర్ గుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్.. వక్ర బుద్ధి చూపించిన పాక్ క్రికెటర్ Wahab Riaz opens up about his appointment as chief selector and outlines his priorities in this role 🎙️🏏 More details ➡️ https://t.co/3uhDwHUhIB pic.twitter.com/qfuv0Y9Bdm — Pakistan Cricket (@TheRealPCB) November 17, 2023 -
ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్కు అంపైర్లు ఖరారు.. లిస్ట్లో ఐరన్ లెగ్ అంపైర్
వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న తుదిపోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్కు సీనియర్ అంపైర్లు రిచర్డ్ కెటిల్బరో, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇక థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్గా క్రిస్ గఫానీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్ అయితే ఈ లిస్ట్లో ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఉండడం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచుల్లో టీమిండియా గెలవలేదు. ముఖ్యంగా అతడు అంపైరింగ్ చేసిన నాకౌట్, ఫైనల్ మ్యాచ్ల్లో గత 9 ఏళ్ల నుంచి భారత్ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేదు. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్లోనూ భారత్కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది. అదే విధంగా 2016 టీ20 వరల్డ్కప్లో జట్టును దురదృష్టం వెంటాడింది. స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్కప్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్.. సెమీస్లో వెస్టిండీస్ చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్కూ కెటిల్ బరోనే అంపైర్గా ఉన్నాడు. ఆ తర్వాత అతడు అంపైర్గా వ్యవహరించిన ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లోనూ పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అతడు అంపైరింగ్ చేసిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్లోనూ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2021, 2023 ఫైనల్స్లోనూ భారత్ ఓటమి పాలైంది. ఈ రెండు ఫైనల్స్కు అతడు థర్డ్ అంపైర్గా వ్యవహరించాడు. అయితే ఈ సారి కూడా ఫైనల్కే ఈ ఐరెన్ లెగ్ అంపైర్ రావడంతో అభిమానులలో ఆందోళన నెలకొంది. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్.. వక్ర బుద్ధి చూపించిన పాక్ క్రికెటర్ -
ఆస్ట్రేలియాతో ఫైనల్.. వక్ర బుద్ధి చూపించిన పాక్ క్రికెటర్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ మరోసారి భారత జట్టుపై తన అక్కసు వెళ్లగక్కాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా ఛాంపియన్స్గా నిలుస్తుందని మాలిక్ జోస్యం చెప్పాడు. ఫైనల్స్లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉందని, మరోసారి అదే రిపీట్ అవుతుందని మాలిక్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఏ స్పోర్ట్స్ టీవీ షోలో మాలిక్ మాట్లాడుతూ.. "ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి ఆస్ట్రేలియాకు అన్ని రకాల అర్హతలున్నాయి. వసీం(వసీం అక్రమ్) భాయ్ కూడా అదే చెప్పారు . ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలుస్తుందని నాకు నమ్మకం ఉందని" అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పగటికలకు కనకు.. అక్కడ ఉంది పాకిస్తాన్ కాదు.. టీమిండియా అంటూ నెటిజన్లు మాలిక్కు కౌంటిరిస్తున్నారు. కాగా ఈ వరల్డ్కప్లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. చదవండి: WC 2023 IND Vs AUS Final: 20 ఏళ్ల తర్వాత ఆసీస్తో ఫైనల్ పోరు.. టీమిండియా బదులు తీర్చుకుంటుందా? -
వరల్డ్కప్ ఫైనల్.. రిహార్సల్స్ మొదలెట్టేసిన సూర్యకిరణ్ టీమ్! వీడియోలు వైరల్
వన్డే వరల్డ్కప్-2023లో తుది సమరానికి రంగం సిద్దమైంది. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా- భారత జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఈ రెండు జట్లు తలడనునున్నాయి. ఆసీస్-భారత జట్లు చివరగా 2003 వరల్డ్కప్ ఫైనల్లో తలపడ్డాయి. అప్పుడు అనూహ్యంగా టీమిండియా.. ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తతం భారత జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన టీమిండియా.. ఆసీస్ను కూడా చిత్తుచేసి 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ ప్రత్యేక్షంగా వీక్షించనున్నారు. వీరితో పాటు పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. సహా పలువురు ప్రముఖులు మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఈ క్రమంలో వరల్డ్కప్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది. తుది పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు మోడీ స్టేడియంపై సూర్యకిరణ్ ఎయిర్క్రాఫ్ట్లు ఆకాశంలో అద్భుత విన్యాసాలతో అలరించనున్నాయి. ఇందులో మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు పాల్గోనున్నట్లు తెలుస్తోంది. Indian Air Force will perform an air show ahead of the World Cup final 2023. Preparations have started.#INDvsAUS #CWC23 #AirIndia #AUSvsSA #NarendraModiStadium#RohitSharma𓃵 #ViratKohli𓃵pic.twitter.com/Nv1kv8W4TE — CrickSachin🛡 (@Sachin_Gandhi7) November 17, 2023 ఏరోబాటిక్ టీమ్ రిహార్సల్స్.. ఈనేపథ్యంలో ఏరోబాటిక్ టీమ్ తాజాగా రిహార్సల్స్ ను మొదలు పెట్టేసింది. శుక్రవారం స్టేడియంపై యుద్ధ విమానాల చక్కర్లు కొడుతూ సందడి చేశాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: WC 2023: 20 ఏళ్ల తర్వాత ఆసీస్తో ఫైనల్ పోరు.. టీమిండియా బదులు తీర్చుకుంటుందా? -
20 ఏళ్ల తర్వాత ఆసీస్తో ఫైనల్ పోరు.. టీమిండియా బదులు తీర్చుకుంటుందా?
వన్డే ప్రపంచకప్-2023లో తుది సమరానికి సమయం అసన్నమైంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ పోరులో కంగారూలను చిత్తు చేసి 2003 వరల్డ్కప్ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఎలాగైనా టీమిండియాను ఓడించి ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలవాలని వ్యూహాలు రచిస్తోంది. కాగా ఇప్పటివరకు వన్డే వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు ఒకే ఒకసారి తలపడ్డాయి. వన్డే వరల్డ్కప్ 2003లో జోహన్నెస్బర్గ్ వేదికగా ఫైనల్లో టీమిండియా- ఆసీస్ జట్లు పోటీ పడ్డాయి. వరల్డ్కప్ 2003 ఫైనల్లో ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్(140 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పాంటింగ్తో పాటు డామియన్ మార్టిన్(88 నాటౌట్), ఆడమ్ గిల్క్రిస్ట్(57) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకంగా 8 మంది బౌలర్లు ఊపయోగించినప్పటికీ.. ఆసీస్ జోరును ఆపలేకపోయాడు.. హర్భజన్ సింగ్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. స్టార్ బౌలర్ జవగాల్ శ్రీనాథ్ అయితే ఏకంగా 87 పరుగులు సమర్పించుకున్నాడు. వీరేంద్రడి మెరుపులు.. అనంతరం 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను గ్లెన్ మెక్గ్రాత్ ఔట్ చేశాడు. అయినప్పటికీ మరో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రతర్ధి బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం సెహ్వాగ్ చేశాడు. అయితే వరుస క్రమంలో సౌరవ్ గంగూలీ (24), మహ్మద్ కైఫ్ వికెట్లను భారత్తో కోల్పోవడంతో మళ్లీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ తమ అద్బుత ఇన్నింగ్స్లతో మ్యాచ్పై మళ్లీ ఆశలు రేపారు. కానీ 82 పరుగులతో అద్బుతంగా బ్యాటింగ్ చేస్తున్న సెహ్వాగ్.. లెహామన్ సంచలన త్రోకు రనౌటయ్యాడు. దీంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. అయితే సెహ్వాగ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్, అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న రాహుల్ ద్రవిడ్ ఏమైనా అద్బుతాలు చేస్తారని అంతా భావించారు. కానీ ద్రవిడ్ను ఆండీ బిచెల్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. వెంటనే యువరాజ్ కూడా పెవిలియన్కు చేరాడు. దీంతో భారత్ అభిమానుల భారత్ అభిమానుల వరల్డ్కప్ ఆశలు ఆవిరయ్యాయి. చివరికి 234 పరుగులకే ఆలౌటైన భారత్.. 125 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ బౌలర్లలో మెక్గ్రాత్ 3 వికెట్లతో దెబ్బతీయగా.. సైమెండ్స్, బ్రెట్ లీ రెండు, బిచెల్, హాగ్ తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లో సెహ్వాగ్ 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు వెళ్లొద్దంటూ బిగ్బీకి స్వీట్ వార్నింగ్
ప్రస్తుతం యావత్ భారత్ కోరుకుంటోంది ఒక్కటే.. వరల్డ్ 'కప్పు'. ఇప్పటికే ఒక్కో ఆట గెలుచుకుంటూ వచ్చి ఫైనల్లో అడుగుపెట్టింది భారత క్రికెట్ జట్టు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడనుంది. కోట్లాది మంది ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ గెలుపు కోసం శతకోటి ప్రార్థనలు చేస్తున్నారు. నేను చూడకపోతే భారత్ గెలిచింది ఈ క్రమంలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ మ్యాచ్ చూడటానికి రాకూడదంటూ కొందరు నెటిజన్లు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీనిపై అమితాబ్ ఎక్స్(ట్విటర్)లో స్పందిస్తూ.. 'నేను చూడకపోతే ఇండియా మ్యాచ్ గెలిచింది' అని రాసుకొచ్చాడు. ఇంకేముంది.. అసలే సెంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే జనాలు బిగ్బీని ఫైనల్కు రావొద్దని కోరుతున్నారు. ఈసారి కూడా మ్యాచ్ చూడొద్దు.. ప్లీజ్ ఆయన మ్యాచ్ చూడకపోతే భారత్ గెలుపు తథ్యమని భావిస్తున్న కొందరు.. 'ఈ ఒక్కసారి మాకోసం త్యాగం చేయండి', 'ఆదివారం జరిగే ఫైనల్స్కు దూరంగా ఉండండి.. లేదంటే మేము మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లి బంధించేస్తాం..' అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన బిగ్బీ.. 'ఇప్పుడు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా' అని మరో ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు మరింత కంగారుపడుతూ ఆ పని మాత్రం చేయొద్దు.. అంటూ ఏకంగా దండాలు పెట్టేస్తున్నారు. మరి ఫైనల్స్కు బిగ్బీ వెళ్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. T 4831 - when i don't watch we WIN ! — Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023 T 4832 - अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ ! — Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023 చదవండి: యాంకర్ సుమ ప్రశ్నలు.. కౌంటర్లిచ్చిన హీరో.. పరువు పాయే.. -
కోహ్లి, రోహిత్, గిల్ కాదు.. అతడే గేమ్ ఛేంజర్: గంభీర్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. నవంబర్ 19న అహ్మదాదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో ఆసీస్ను చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్పై మాజీ ఓపెనర్, ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్తో జరగనున్న ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ మరోసారి అదరగొడతాడని గంభీర్ జోస్యం చెప్పాడు. కాగా శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్ ఆడిన అయ్యర్.. 75.14 సగటుతో 526 పరుగులు చేశాడు. "ఈ ఏడాది వరల్డ్కప్లో నా వరకు అయితే శ్రేయాస్ అయ్యర్ బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్. అతడు ఈ టోర్నీకి ముందు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఈ తరహా ప్రదర్శన చేయడం అంత ఈజీకాదు. న్యూజిలాండ్ వంటి జట్టుపై సెమీఫైనల్లో కేవలం 70 బంతుల్లో సెంచరీ చేయడం అయ్యర్కే సాధ్యమైంది. అతడు టీమిండియాకు చాలా కీలకమైన ఆటగాడు. ఆసీస్తో ఫైనల్లో మరోసారి తన మార్క్ను చూపిస్తాడని భావిస్తున్నాను. మిడిల్ ఓవర్లలో జంపా, మాక్స్వెల్ను ధీటుగా అయ్యర్ ఎదుర్కొంటాడని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: CWC 2023: టీమిండియాతో ఫైనల్.. ఏకపక్షంగా ఉంటుంది: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ -
ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. అహ్మదాబాద్కు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. తుది పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడో సారి టైటిల్ను సొంతం చేసుకోవాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్లో అడుగుపెట్టింది. గురువారం రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్కు చేరకుకుంది. అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. జట్టు బస చేయనున్న హోటల్ సిబ్బంది భారత ఆటగాళ్లకు నుదుట తిలకం దిద్ది మరీ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆల్ ది బెస్ట్ టీమిండియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు శుక్రవారం సాయంత్రం తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. చదవండి: ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్ A beautiful welcome of team India in Ahmedabad. pic.twitter.com/Qh4lGHHp5c — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 -
IND vs AUS: అంతిమ సమరం కోసం అహ్మదాబాద్కు భారత్ జట్టు (ఫోటోలు)
-
ఒక్క అడుగు... ఒకే ఒక్క అడుగు!
అవును. 2023 ప్రపంచ వన్డే క్రికెట్ కప్కూ, భారత క్రికెట్ జట్టుకూ మధ్య మిగిలిన దూరం ఇక ఒకే ఒక్క అడుగు. 2011లో ఆఖరుసారిగా కప్ గెలిచిన తర్వాత మళ్ళీ పన్నెండేళ్ళకు తొలిసారిగా భారత జట్టు ప్రపంచకప్ ఫైనల్స్కు చేరడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపుతోంది. లక్ష్యం చాలా చేరువగా కనిపిస్తుండడంతో అందరిలో ఆశలు రేపుతోంది. బుధవారం ముంబయ్లోని వాంఖెడే స్టేడియమ్లో భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక దశ వరకు పోటాపోటీగా సాగిన తొలి సెమీ ఫైనల్లో మన జట్టు విజయం సాధించిన తీరు మునుపెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచకప్లో అప్రతిహతంగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఆదివారంఅహ్మదాబాద్లో మరొక్కసారి చేసే ఫైనల్ ఇంద్రజాలానికై అందరూ ఎదురుచూస్తున్నారు. 2011లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి చూస్తే గడచిన 2015, 2019 టోర్నీల్లో కన్నా ఈసారే భారత జట్టు విజయావకాశాలు మెరుగ్గా, అధికంగా ఉన్నాయని మొదటి నుంచి క్రికెట్ పండితుల మాట. నిరుడు టీ–20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ నుంచి అవమానకరమైన రీతిలో వెనుదిరిగిన జట్టు ఏడాది తిరిగేసరికల్లా ఇంత బలమైన జట్టుగా రూపొందడం ఒక రకంగా అనూహ్యమే. ఆ ఘోర ఓటమి తర్వాత జట్టును పటిష్ఠంగా తీర్చిదిద్దడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుదల, కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి, ఆటగాళ్ళ నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. మునుపటి రెండు కప్ల కన్నా ఈసారి భారత జట్టు మరింత స్థిరంగా, నిలకడగా కనిపిస్తోంది. ఆటగాళ్ళందరూ కలసి కట్టుగా సాగుతూ, వ్యక్తులుగా కన్నా ఒక జట్టుగా ప్రతిభా ప్రదర్శన చేయడం కలిసొస్తోంది. జట్టు సారథిగా రోహిత్ శర్మ ఆ విషయంలో అందరికీ ఆదర్శమయ్యాడు. ఈ టోర్నీలో కనీసం 3 సందర్భాల్లో వ్యక్తిగత మైలురాళ్ళకు దగ్గర ఉన్నా, దాని కన్నా జట్టు ప్రయోజనాల కోసం వేగంగా పరుగులు చేయడం మీదే దృష్టి పెట్టి, ఆ క్రమంలో ఔటవడమే అందుకు ఉదాహరణ. ఓపెనర్గా పరుగుల వరదతో ప్రత్యర్థి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని చిత్తు చేసి, భారీ ఇన్నింగ్స్కు ఆయన పునాది వేస్తూ వస్తున్నారు. ఈ టోర్నీలో రోహిత్ శతకాలేమీ సాధించకపోయి ఉండవచ్చు. 124.15 స్ట్రైకింగ్ రేట్తో 550 పరుగులు చేసి, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నిలవడం విశేషం. సాధారణంగా వ్యక్తిగత విజయాలు, ప్రతిష్ఠను ఆశించే, ఆరాధించే చోట ఇది అసాధారణం. జట్టులో ఎవరి పాత్ర వారికి నిర్దిష్టంగా నిర్వచించడంలోనూ తెలివైన వ్యూహం, లక్ష్యంపై గురి కనిపిస్తున్నాయి. బుధవారం నాటి సెమీస్ అందుకు మంచి ఉదాహరణ. ఓపెనర్లు వేసిన పునాదిని పటిష్ఠం చేయడంలో కోహ్లీ, శరవేగంతో పరుగుల వరద పారించడంలో శ్రేయాస్ అయ్యర్, కొనసాగింపుగా రాహుల్, బౌలింగ్లో ప్రత్యర్థుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్ల త్రయం, స్పిన్నర్లుగా కుల్దీప్, జడేజాలు సమర్థంగా పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తుండడం విశేషం. శుభ్మన్ గిల్ లాంటి వారి పాత్ర తక్కువేమీ కాదు. బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయాస్లు వరుసగా సెంచరీల మీద సెంచరీలు కొడుతు న్నారు. సెమీస్లోనే వన్డేల్లో శతకాల అర్ధ సెంచరీ పూర్తి చేసి, బ్యాట్స్మన్ల కింగ్ కోహ్లీ అయ్యాడు. ఆరాధ్య దైవమైన సచిన్ చూస్తుండగా, అతని రికార్డును అధిగమిస్తూ ఈ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈసారి భారత బౌలర్ల అమోఘ ప్రతిభా ప్రదర్శన మళ్ళీ 1983 నాటి కపిల్ డెవిల్స్ను తలపిస్తోంది. ఈ వరల్డ్ కప్లో మొదటి 4 మ్యాచ్ల తర్వాత ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన పేస్బౌలర్ షమీ ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టి, వికెట్ల వేటగాడిగా నిలిచాడు. వికెట్లలో అర్ధశతకం పూర్తిచేశాడు. ప్రపంచ కప్ చరిత్రలో మరి ఏ ఇతర భారతీయ ఆటగాడికీ లేని రీతిలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి, నంబర్ 1గా నిలిచాడు. లయ తప్పకుండా, పిచ్ మీద వికెట్ల గురి తప్పకుండా, పరుగు వేగం తగ్గకుండా ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతున్న షమి ఈ భారత జట్టు అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం. ఈ 19న జరిగే ఫైనల్లో షమీ ఇలాగే విజృంభిస్తే మనం కప్పు కొట్టడం కష్టమేమీ కాదు. గురువారం నాటి రెండో సెమీఫైనల్లో ఎప్పటిలానే సెమీస్ శాపం తప్పించుకోలేక సౌతాఫ్రికా బ్యాటింగ్లో తడబడింది. ఈ టోర్నీలో మొదట తడబడినా తర్వాత నిలబడిన ఆస్ట్రేలియా ఆఖరికి తక్కువ పరుగుల లక్ష్యాన్ని సైతం శ్రమించి, గెలిచింది. ఓడితేనేం పోరాటస్ఫూర్తిలో సౌతాఫ్రికా జనం మనసు గెలిచింది. అయిదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ప్రయోగం చేస్తున్న భారత్, అయిదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన బలమైన ఆసీస్తో మహాయుద్ధానికి సమస్త శక్తియుక్తులూ కేంద్రీకరించాలి. అయితే, ఇప్పటికే భారత టాప్ 5 బ్యాట్స్మన్లు 65.8 సగటుతో 2570 పరుగులు సాధించారు. 2007 నాటి ఆసీస్ జట్టు బ్యాట్స్మన్ల సగటు కన్నా ఇది ఎక్కువ. అలాగే ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లలో ఓడిన ఆసీస్ ఆటను గమనిస్తే ఆ జట్టు మరీ అజేయమైనదేం కాదనీ అర్థమవుతుంది. అందుకే, వరల్డ్ కప్ వేదికపై 1983లో అనామకంగా వెళ్ళి అద్భుతం చేసిన∙కపిల్ సేన, 2011లో ఒత్తిడిని తట్టుకొని అంచనాలందుకున్న ధోనీ అండ్ కో తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ టీమ్ ఆ ఘనత సాధిస్తే ఆశ్చర్యం లేదు. పుష్కరకాలం నిరీక్షణ ఫలిస్తే శతకోటి భారతీయులకు అంతకన్నా ఆనందమూ లేదు. అనూహ్య ఘటనలు జరిగితే తప్ప ఆతిథ్య దేశమైన మనమే ఈ ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ అందుకోవచ్చు. ఎందుకంటే– ప్రతిసారి కన్నా భిన్నంగా ఈసారి మనది వట్టి ఆశ, అభిమానుల ప్రార్థన కాదు... అంతకు మించిన ప్రతిభా ప్రదర్శన, ఆత్మవిశ్వాస ప్రకటన! -
World Cup 2023: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. ఫైనల్కు చేరిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్కప్-2023లో దక్షిణాఫ్రికా పోరాటం ముగిసింది. మరోసారి నాకౌట్స్ దశను సౌతాఫ్రికా దాటలేకపోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఆఖరివరకు సఫారీ బౌలర్లు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఎనిమిదో సారి వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వీరితో పాటు టెయిలెండర్లు ప్యాట్ కమ్మిన్స్(14), స్టార్క్(16) కూడా ఆసీస్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు ఆసీస్ ఆల్రౌండర్ ట్రావిస్ హెడ్కు దక్కింది. ఇక నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్ కప్లో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. రెండో క్రికెటర్గా
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023లో 10 మ్యాచ్లు ఆడిన 528 పరుగులు చేశాడు. తద్వారా వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో వరుసగా రెండు సార్లు 500కు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా వార్నర్ రికార్డులకెక్కాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో వార్నర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్కప్లోనూ వార్నర్ 647 పరుగులు చేశాడు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వార్నర్ కంటే ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2019 వరల్డ్కప్లో 500కు పైగా పరుగులు చేసిన హిట్మ్యాన్.. ఈ ఏడాది వరల్డ్కప్లో కూడా 550 పరుగులు చేశాడు. చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే! -
అప్పుడు ఆసీస్.. ఇప్పుడు దక్షిణాఫ్రికా! 1999 వరల్డ్కప్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను మిల్లర్(101) అద్బుత సెంచరీతో అదుకున్నాడు. దీంతో ప్రోటీస్ ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల టార్గెట్ను ఉంచగల్గింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. అయితే ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి సఫారీలు ఇంకా పోటీలో ఉన్నారు. 1999 వరల్డ్కప్లో షేన్ వార్న్ మ్యాజిక్.. కాగా 1999 వరల్డ్కప్ సెమీఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లో స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ మ్యాజిక్ చేసి మ్యాచ్ను డ్రాగా ముగించారు. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. ఆ తర్వాత షేన్ వార్న్ మళ్లీ తన స్పిన్ మయాజాలంతో కల్లిస్ను ఔట్ చేశాడు. వెంటనే రోడ్స్ కూడా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్కు త్రో చేశాడు. గిల్క్రిస్ట్ను స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే రన్రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్కు క్వాలిఫై అయింది. ఎందుకంటే అప్పటిలో సూపర్ ఓవర్ రూల్ ఇంకా అమలులో లేదు. ఈ లోస్కోరింగ్ మ్యాచ్లో షేన్ వార్న్ తన 10 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బౌలింగ్ కోటాలో 4 మెయిడన్లు ఉండడం గమనార్హం. ఇప్పుడు వార్న్ లాంటి మ్యాజిక్ ప్రోటీస్ స్పిన్నర్లు ఎవరైనా చేస్తారో లేదో వేచి చూడాలి. చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే! -
దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే!
వన్డే వరల్డ్కప్-2023లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో బావుమా డకౌట్గా వెనుదిరిగాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్టార్క్ వేసిన ఓ అద్భుత బంతికి బావుమా వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాగా ఈ మ్యాచ్లో డకౌటైన బావుమా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో డకౌట్గా వెనుదిరిగిన నాలుగో కెప్టెన్గా బావుమా నిలిచాడు. 40 ఏళ్ల వరల్డ్కప్ చరిత్రలో బావుమా కంటే ముందు ముగ్గురు కెప్టెన్లు సెమీఫైనల్స్లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1996 వరల్డ్కప్ ఎడిషన్లో కోల్కతా వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అజారుద్దీన్ డకౌటయ్యాడు. అజారుద్దీన్ తర్వాతి స్ధానాల్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోంజే, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇక సెమీస్ ఫైనల్లో మాత్రం దక్షిణాఫ్రికా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: 'కోహ్లి, షమీ, అయ్యర్ హెడ్లైన్స్లో ఉంటారు.. కానీ అతడే రియల్ హీరో' -
'కోహ్లి, షమీ, అయ్యర్ హెడ్లైన్స్లో ఉంటారు.. కానీ అతడే రియల్ హీరో'
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు ఫైనల్కు దూసుకువెళ్లింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగగా.. శుబ్మన్ గిల్(80) పరుగులతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ 7 వికెట్లతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంగ్లండ్ మాజీ సారథి నాజర్ హుస్సేన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. కోహ్లి, షమీ, అయ్యర్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రోహిత్ శర్మనే రియల్ హీరో అని హుస్సేన్ కొనియాడాడు. న్యూజిలాండ్పై మ్యాచ్ గెలిచిన అనంతరం స్కై స్పోర్ట్స్తో నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. "రేపటి హెడ్లైన్స్ మొత్తం కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ షమీ గురించే ఉంటాయి. కానీ ప్రస్తుత భారత జట్టు రియల్ హీరో మాత్రం రోహిత్ శర్మనే. అతడు భారత జట్టు స్ధితిని మార్చాడు. మా కామెంట్రరీ బాక్స్లో దినేష్ కార్తీక్ ఉన్నాడు. టీ20 వరల్డ్కప్-2023లో భాగంగా సెమీఫైనల్లో ఇంగ్లండ్తో భారత్ తలపడింది. ఆడిలైడ్లో జరిగిన మ్యాచ్కూ డికేతో కలిసి మేము వ్యాఖ్యాతలగా వ్యవహరించాము. ఆ రోజు భారత్ బ్యాటింగ్లో తీవ్ర నిరాశపరిచింది. భయపడి ఆడుతూ తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. కానీ ఈ రోజు మాత్రం ఇండియా ఎటువంటి భయం లేకుండా ఆడింది. అందుకు కారణం రోహిత్ శర్మనే. అతడు మొదటే మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు. కచ్చితంగా ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి "అని చెప్పుకొచ్చాడు. -
IND Vs NZ: అది వాడిన పిచ్.. అయినా సరే: విలియమ్సన్
ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్ సందర్భంగా ‘పిచ్ మార్పు’పై చెలరేగిన వివాదంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. అది వాడిన పిచ్ అని పునర్ఘాటించిన కేన్.. తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వినియోగించిన పిచ్ అయినప్పటికీ చాలా బాగుందని కితాబునిచ్చాడు. కాగా తొలి సెమీస్లో టీమిండయా- న్యూజిలాండ్ ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. శుబ్మన్ గిల్(80-నాటౌట్), విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్(105) అద్భుత ఇన్నింగ్స్తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 70 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్ను ఆఖరి నిమిషంలో మార్చి భారత జట్టుకు అనుకూలం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి.. ఇలాంటి టోర్నీల్లో పిచ్ మార్పు సర్వసాధారణమని స్పష్టం చేసింది. వాంఖడే క్యూరేటర్ సిఫారసు మేరకు.. ఐసీసీ స్వతంత్ర పిచ్ సలహాదారుతో సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ సైతం ఈ వివాదం నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అది ఇది వరకు వాడిన పిచ్. కానీ చాలా బాగుంది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో టీమిండియా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. అయినా.. పరిస్థితులకు అనుగుణంగా పిచ్ మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. భారత జట్టు చాలా బాగా ఆడింది. అయినా ఆఖరి వరకు మేము పోరాడి ఓడిపోయాం. అయితే, మేటి జట్టుకు మాత్రం గట్టి పోటీనివ్వగలిగాం. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ జట్టు. ప్రస్తుతం వాళ్లు ఉత్తమ దశలో ఉన్నారు’’ అని విలియమ్సన్ పిచ్ మార్పు వివాదాన్ని కొట్టిపారేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. మహ్మద్ హఫీజ్కు ప్రమోషన్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్గా హాఫీజ్ను పీసీబీ నియమించింది. ఇప్పటివరకు ఆ జట్టు డైరెక్టర్గా పనిచేసిన మిక్కీ ఆర్థర్ స్ధానాన్ని హాఫీజ్ భర్తీ చేయనున్నాడు. కాగా ప్రపంచకప్లో ఘోర వైఫల్యంతో విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలిగించింది. ఇప్పటికే మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా మిక్కీ ఆర్థర్పై పీసీబీ వేటు వేసింది. ఈ క్రమంలోనే టెక్నికల్ కమిటీలో సభ్యునిగా ఉన్న హాఫీజ్కు టీమ్ డైరెక్టర్గా పీసీబీ ప్రమోషన్ ఇచ్చింది. అదేవిధంగా కొత్త కోచింగ్ స్టాప్ను పీసీబీ త్వరలోనే ప్రకటించనుంది. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. పాకిస్తాన్ కోచింగ్ స్టాఫ్ పోర్ట్ఫోలియోను పీసీబీ మార్చింది. ప్రస్తుతం ఉన్న కోచ్లు అందరూ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తారు. వారిలో కొంతమందిని జట్టు కోసం ఎంపిక చేస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు త్వరలోనే మా కొత్త కోచింగ్ స్టాప్ను ప్రకటించనున్నామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్ల్లో కలిపి 12,780 పరుగులు చేయడంతోపాటు 253 వికెట్లు కూడా సాధించాడు. కాగా ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. టీ20ల్లో పాకిస్తాన్ కొత్త కెప్టెన్గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. టెస్టు సారథిగా షాన్ మసూద్ నియమితుడయ్యాడు. కాగా ఈ ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే హెడ్కోచ్ లేకుండానే ఆసీస్ పర్యటను పాక్ జట్టు వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టు డైరక్టర్గా ఉన్న హఫీజ్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్ -
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు కీలక నిర్ణయం..
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 సీజన్ నుంచి బ్రూక్ వైదొలిగాడు. తన జాతీయ జట్టు విధుల కారణంగా బ్రూక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్కు బ్రూక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ జట్టు ఈ ఏడాది డిసెంబర్లో వైట్బాల్ సిరీస్ల కోసం వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ కరేబియన్ టూర్లో భాగంగా ఆతిథ్య విండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ రెండు సిరీస్లకు వెర్వేరు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. అయితే ఈ రెండు జట్లలోను హ్యారీ బ్రూక్ సభ్యునిగా ఉన్నాడు. ఈ క్రమంలో రాబోయే బిగ్ బాష్ లీగ్ సీజన్కు దూరంగా ఉండాలని అతడు నిర్ణయించకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. అదే విధంగా ఇంగ్లండ్ కరేబియన్ టూర్ డిసెంబర్ 3న మొదలు కానుంది. వెస్టిండీస్ పర్యటన ముగిసినంతరం ఇంగ్లీష్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుంది. చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్ -
ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్
వరల్డ్ క్రికెట్లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా నిజం చేసంది. వన్డే వరల్డ్కప్-2023లో ఈడెన్గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల్లాడుతున్నారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్లో ప్లేలో అయితే సౌతాఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. లీగ్ మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మెరుపులు మెరిపించిన దక్షిణాఫ్రికా.. సెమీస్లో మాత్రం కంగారుల ముందు తలవంచింది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, హాజిల్వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఏడాది వరల్డ్కప్ లీగ్ మ్యాచ్ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా.. కీలకమైన సెమీస్లో మాత్రం చేతులెత్తేసింది. చదవండి: MS Dhoni: ఉత్తరాఖండ్లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి.. -
CWC 2023: కెప్టెన్గా ఇప్పటివరకు హిట్టే! బ్యాటర్గా ఫట్టు.. ఇలా అయితే ఎలా?
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్కప్-2023లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 145 పరుగులు చేశాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. తాజాగా కీలక సెమీ ఫైనల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొట్టింది సౌతాఫ్రికా. శ్రీలంకపై భారీ విజయంతో ఈవెంట్ను ఆరంభించిన సఫారీ జట్టు.. లీగ్ దశలో తొమ్మిదింట ఏడు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తుగా ఓడించిన సఫారీలు భారీగా రన్రేటు మెరుగపరుచుకున్నారు. లీగ్ దశలో ఏడు విజయాలతో సెమీస్కు పాకిస్తాన్పై ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కిన ప్రొటిస్ జట్టు.. అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో ఏంకగా 243 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఇక అఫ్గనిస్తాన్పై విజయంతో లీగ్ దశను ముగించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడ వంటి కీలక ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించడంతో సౌతాఫ్రికా మరోసారి సెమీస్లో అడుగుపెట్టగలిగింది. కెప్టెన్గా ఇలా హిట్టయినప్పటికీ బ్యాటర్గా మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు తెంబా బవుమా. View this post on Instagram A post shared by ICC (@icc) ఆసీస్ పేసర్ల దెబ్బకు సఫారీల విలవిల ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో నెట్టింట అతడిపై ట్రోలింగ్ మొదలైంది. కాగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించిన సఫారీలు తుదిజట్టులో అదనపు స్పిన్నర్ను చేర్చుకున్నారు. కేశవ్ మహరాజ్తో పాటు తబ్రేజ్ షంసీని ఆడించేందుకు సిద్ధమైంది మేనేజ్మెంట్. అయితే, పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటం ఆస్ట్రేలియాకు వరంగా మారింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి బవుమాను పెవిలియన్కు పంపిన మిచెల్ స్టార్క్.. హిట్టర్ ఎయిడెన్ మార్కరమ్(10) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పేసర్ జోష్ హాజిల్వుడ్ క్వింటన్ డికాక్(3), రాస్సీ వాన్ డర్ డస్సెన్(6) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 14వ ఓవర్ వద్ద ఆట నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. Temba Bavuma contribution for South Africa throughout the ODI world cup 2023 😂#SAvsAUS #Bavuma #Chokers #Proteas pic.twitter.com/HEXXvqJNtr — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) November 16, 2023 Temba Bavuma gone for a duck in Semifinal 🔥 The man the myth the legend Brigadier Temba Bavuma 👏#SAvsAUS pic.twitter.com/uUhxYkbS67 — Radhika Chaudhary (@Radhika8057) November 16, 2023 -
CWC 2023: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia: వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తద్వారా 8వ సారి వరల్డ్కప్ ఫైనల్ బెర్త్ను ఆసీస్ ఖారారు చేసుకుంది. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ కొట్టి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్ను బ్యాక్ఫుట్లో ఉంచారు. కానీ చివరకి విజయం మాత్రం కంగారులనే వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఆక్టోబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇంగ్లీష్ ఔట్.. తిరిగి గేమ్లోకి దక్షిణాఫ్రికా 193 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన ఇంగ్లీష్ను కొయెట్జీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ప్రోటీస్ తిరిగి మళ్లీ పోటోలోకి వచ్చింది. ఆసీస్ విజయానికి 19 పరుగులు కావాలి. విజయం దిశగా ఆసీస్.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆసీస్ గెలుపుకు 72 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(27), మిచెల్ స్టార్క్(6) ఉన్నారు. ఉత్కంఠగా సెమీఫైనల్-2 ఈడెన్గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న స్టీవ్ స్మిత్ను కొయెట్జీ పెవిలియన్కు పంపాడు. దీంతో సఫారీలు మళ్లీ మ్యాచ్లోకి వచ్చారు. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(19), మిచెల్ స్టార్క్(1) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ దక్షిణాఫ్రికా స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. డేంజరస్ మాక్స్వెల్ను తబ్రేజ్ షంషి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ విజయానికి 25 ఓవర్లలలో 72 పరుగులు కావాలి. క్రీజులో స్మిత్, ఇంగ్లీష్ ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన లబుషేన్.. షంస్సీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి 79 పరుగులు కావాలి. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులతో అద్బుతంగా ఆడుతున్న ట్రెవిస్ హెడ్ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి లబుషేన్ వచ్చాడు. ఆసీస్ విజయానికి 35 ఓవర్లలో 104 పరుగులు కావాలి. దక్షిణాఫ్రికాతో సెమీస్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 92/2 రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కమ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 61 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 61/2 తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. మార్క్రమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 60/1 దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(11), హెడ్(9) పరుగులతో ఉన్నారు. మిల్లర్ విరోచిత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 213 పరుగులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు డేవిడ్ మిల్లర్ సెంచరీ దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్ మిల్లర్ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 203/9 ఎనిమిదో వికెట్ డౌన్.. 191 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కేశవ్ మహారాజ్.. స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. 47 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 196/8 ఏడో వికెట్ డౌన్.. 172 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ.. కమ్మిన్స్ బౌలింగ్లో పెవిలయన్కు చేరాడు. 44 ఓవర్లు దక్షిణాఫ్రికా స్కోర్: 174/7 40 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156/6 మిల్లర్ 67, కోయెట్జీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 149-6 మిల్లర్ 66, కోయెట్జీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిల్లర్ హాఫ్ సెంచరీ 31.3: మాక్స్వెల్ బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిల్లర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 30.5: హెడ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మార్కో జాన్సెన్. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. కొయోట్జీ క్రీజులోకి వచ్చాడు. క్లాసెన్ బౌల్డ్ 30.4: నిలకడగా సాగుతున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు ట్రవిస్ హెడ్ బ్రేక్ వేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న క్లాసెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దీంతో ప్రొటిస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. కాగా మిల్లర్తో కలిసి క్లాసెన్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌతాఫ్రికా స్కోరు: 27 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 95/4 ►26.4: మరో సిక్స్ కొట్టిన క్లాసెన్ ►26.3: జంపా బౌలింగ్లో సిక్సర్ బాదిన క్లాసెన్ సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి ప్రొటిస్ ఇలా క్లాసెన్, మిల్లర్ 79 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లాసెన్ 22, మిల్లర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 79/4 నిలకడగా ఆడుతున్న క్లాసెన్, మిల్లర్ ►21 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 68/4 (21) ►డేవిడ్ మిల్లర్ కాస్త దూకుడు పెంచాడు. 19వ ఓవర్ ముగిసే సరికి 28 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్లో క్లాసెన్ నిలకడగా ఆడుతూ 13 పరుగుల వద్ద ఉన్నాడు. స్కోరు: 62-4 మళ్లీ మొదలైన ఆట వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 46-4 వర్షం కారణంగా ఆగిన ఆట వర్షం రావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. వరణుడి ఆగమానికి ముందు సౌతాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు చేసింది. క్లాసెన్ 10, మిల్లర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్లు స్టార్క్, హాజిల్వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. సౌతాఫ్రికాకు షాకుల మీద షాకులు 11.5:హాజిల్వుడ్ బౌలింగ్లో డస్సెన్ అవుట్. డస్సెన్(6) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. మిల్లర్, క్లాసెన్ క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 10.5: స్టార్క్ బౌలింగ్లో మార్కరమ్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇప్పటికే బవుమా, డికాక్ వికెట్లు కోల్పోయిన ప్రొటిస్.. మార్కరమ్ రూపంలో మరో కీలక వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. క్లాసెన్, డస్సెన్(5) క్రీజులో ఉన్నారు. 10.1: ప్రొటిస్ ఇన్నింగ్స్లో తొలి బౌండరీ స్టార్క్ బౌలింగ్లో ఫోర్ బాదిన మార్కరమ్ పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 18/2 పవర్ ప్లేలో సౌతాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. ►తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 17/2 ►6, 7 ఓవర్లను మెయిడిన్ చేసిన హాజిల్వుడ్, స్టార్క్. సౌతాఫ్రికా స్కోరు: 8/2 (7) 5.4: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా హాజిల్వుడ్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక ఆరంభంలోనే బవుమా వికెట్ తీసి స్టార్క్ షాకివ్వగా.. కీలక వికెట్ పడగొట్టి హాజిల్వుడ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. మార్కరమ్, డస్సెన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 8-2(6). కట్టుదిట్టంగా ఆసీస్ బౌలింగ్ బౌలింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సఫారీలను కట్టడి చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయిన ప్రొటిస్ జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 2/1 (2) ►రాస్సీ వాన్ డర్ డస్సెన్ 0, డికాక్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్తో సెమీస్.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►0.6: తొలి ఓవర్లోనే సౌతాఫ్రికాకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. కెప్టెన్ తెంబా బవుమాను డకౌట్గా వెనక్కి పంపాడు. ►టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) తుదిజట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. -
భారత్ గెలుస్తే అంటూ..'బోల్డ్ ఆఫర్' ఇచ్చిన వైజాగ్ అమ్మాయి రేఖా భోజ్ (ఫోటోలు)
-
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం...జయహో టీం ఇండియా (ఫొటోలు)
-
వన్డే ప్రపంచకప్ ఫైనల్కు చేరిన భారత్...అభిమానులు సంబరాలు (ఫోటోలు)
-
చరిత్ర సృష్టించిన షమీ.. తొలి బౌలర్గా! ఎవరికీ సాధ్యం కాలేదు
వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్లతో షమీ చెలరేగాడు. ఈ వరల్డ్కప్లో షమీ ఐదుకు పైగా వికెట్లు సాధించడం ఇది మూడో సారి. అంతకుముందు న్యూజిలాండ్, శ్రీలంకపై ఫైవ్ వికెట్ల హాల్ షమీ సాధించాడు. ఇక మ్యాచ్లో ఓవరాల్గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో దుమ్ములేపిన షమీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. షమీ సాధించిన రికార్డులు ఇవే.. ♦ వన్డే వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్గా షమీ నిలిచాడు. షమీ ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు. ♦ ఓవరాల్గా వన్డే వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ నమోదు చేసిన బౌలర్గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్లో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2019 వరల్డ్కప్లో కూడా షమీ ఒక ఫైవ్ వికెట్ల హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. ♦ అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా షమీ నిలిచాడు. ఈ మ్యాచ్లో 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బిన్నీ బంగ్లాదేశ్పై 4 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో బిన్నీ ఆల్టైమ్ రికార్డును షమీ బ్రేక్ చేశాడు. ఫైనల్కు చేరిన టీమిండియా.. వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీలో ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. నాకౌట్ మ్యాచ్ల్లో కివీస్ను భారత్ ఓడించడం ఇదే తొలిసారి. View this post on Instagram A post shared by ICC (@icc) -
7 వికెట్లతో చెలరేగిన షమీ.. కివీస్పై గ్రాండ్ విక్టరీ! ఫైనల్లో టీమిండియా
వన్డేప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ను 70 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. వరల్డ్కప్ 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(134) విరోచిత శతకంతో పోరాడినప్పటికీ.. తన జట్టును ఫైనల్కు చేర్చలేకపోయాడు. మిచెల్తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్(69) పర్వాలేదన్పించాడు. 7 వికెట్లతో చెలరేగిన షమీ.. భారత బౌలర్లలో మహ్మద్ షమీ అద్భుమైన ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్గా 9.5 ఓవర్లు వేసిన షమీ.. 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. షమీ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మొదటిలో ఓపెనర్లను ఔట్ చేసి కివీస్ను ఒత్తిడిలోకి నెట్టిన షమీ.. అనంతరం సెకెండ్ స్పెల్లో విలియమ్సన్ను ఔట్ చేసి మలుపు తిప్పాడు. ఇక షమీతో పాటు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ(47) సూపర్ ఇన్నింగ్స్కు తోడు మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం(80-నాటౌట్)తో రాణించాడు. ఇక విరాట్ కోహ్లి(117) రికార్డు సెంచరీతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించగా.. శ్రేయస్ అయ్యర్(105) తనదైన శైలిలో చెలరేగి శతకం బాదాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీకి మూడు, ట్రెంట్ బౌల్ట్కు ఒక వికెట్ దక్కింది. కాగా వరల్డ్కప్ నాకౌట్స్లో తొలిసారి న్యూజిలాండ్ను భారత్ ఓడించింది. 2019 వరల్డ్కప్లో సెమీఫైనల్స్లో ఓటమికి భారత్ బదులు తీర్చుకోంది. చదవండి: పాకిస్తాన్ టీ20 కెప్టెన్గా షాహీన్ అఫ్రిది.. టెస్టు సారధి ఎవరంటే? -
వన్డే వరల్డ్కప్-2023లో భారీ సిక్సర్.. వీడియో వైరల్
వన్డే వరల్డ్కప్-2023లో భారీ సిక్సర్ నమోదైంది. వాంఖడే వేదికగా టీమిండియాతో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాడు డార్లీ మిచెల్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్ 27 ఓవర్లో జడేజా వేసిన ఐదో బంతిని లాంగాన్ మీదగా భారీ సిక్సర్ బాదాడు. అతను కొట్టిన షాట్కి బంతి 107 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ 106 మీటర్ల సిక్స్ కొట్టాడు. తాజా మ్యాచ్తో శ్రేయస్ రికార్డును మిచెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా మిచెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన న్యూజిలాండ్ ఆటగాడిగా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఈ ఏడాది వరల్డ్కప్లో 18 సిక్స్లు కొట్టాడు. అంతకు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ బ్రాండెన్ మెకెల్లమ్(17) పేరిట ఉండేది. చదవండి: CWC 2023: హృదయాన్ని తాకావు.. నా రికార్డు బ్రేక్ చేయడం సంతోషం: సచిన్ ట్వీట్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత ఆటగాడే నా రికార్డు బ్రేక్ చేయడం సంతోషం: సచిన్ ట్వీట్ వైరల్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఆట పట్ల కోహ్లి నిబద్ధతకు ఫిదా అయ్యానని తెలిపాడు. ఏదేమైనా తన ఆల్టైమ్ రికార్డును భారత ఆటగాడే బద్దలు కొట్టడం రెట్టింపు సంతోషాన్నిస్తోందని పేర్కొన్నాడు. కాగా రికార్డుల రారాజు కోహ్లి అంతర్జాతీయ వన్డేల్లో 50వ శతకం సాధించాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్ సందర్భంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ముంబైలోని వాంఖడే వేదికగా కోహ్లి రికార్డు సెంచరీని ప్రత్యక్షంగా వీక్షించిన సచిన్ టెండుల్కర్.. చప్పట్లతో తనకు అభినందనలు తెలిపాడు. అదే విధంగా ఎక్స్(ట్విటర్) వేదికగానూ స్పందించాడు. ఈ మేరకు.. ‘‘తొలిసారి ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో నిన్ను కలిసినపుడు.. నా పాదాలు తాకావు. అపుడు నీ సహచర ఆటగాళ్లంతా నిన్ను ఆటపట్టించారు. నేను కూడా రోజు నవ్వు ఆపులేకపోయాను. అయితే, ఆట పట్ల నీ అంకితభావం, అద్భుతమైన నైపుణ్యాలతో అనతికాలంలోనే నా హృదయాన్ని తాకావు. అప్పటి ఆ కుర్రాడు ఇప్పుడు ‘విరాట్’గా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా రికార్డును ఓ భారత ఆటగాడు బద్దలు కొట్టినందుకు ఎంతో సంతోషపడుతున్నా. అది కూడా వరల్డ్కప్ సెమీ ఫైనల్ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో.. అదీ నా హోం గ్రౌండ్లో.. అది కూడా ఇంత సునాయాసంగా!!’’ అంటూ కోహ్లిని ఆకాశానికెత్తాడు. సచిన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. కివీస్తో సెమీ ఫైనల్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(47), శుబ్మన్ గిల్(80- నాటౌట్) రాణించగా... కోహ్లి (117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో మెరిశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి టీమిండియా 397 పరుగులు చేసింది. The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player. I… pic.twitter.com/KcdoPwgzkX — Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023 -
CWC 2023: ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ.. కష్టంగా ఉంది: కోహ్లి
ICC WC 2023- Ind vs NZ- Virat Kohli 50th ODI Century: ‘‘కోల్కతాలో కూడా చెప్పాను కదా!.. ఓ గొప్ప వ్యక్తి నన్ను అభినందించారు. ఇప్పుడు కూడా ఇదంతా ఓ కలలానే ఉంది. నిజానికి కల నిజమైనట్లు ఉంది. ఏంటో నాకే కొత్తగా ఉంది. ఈరోజు కూడా కీలక మ్యాచ్.. ఇందులో నా వంతుగా ఏం చేయాలో అది చేశాను. సింగిల్స్, డబుల్స్.. ఏదైనా జట్టు కోసమే నా సహచర ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అన్నీ అనుకూలించి ఈరోజు మేము భారీ స్కోరు చేయగలిగాం. జట్టును గెలిపించాలన్నదే నా అంతిమ లక్ష్యం. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. సింగిల్స్, డబుల్స్.. బౌండరీలు.. ఏదైనా జట్టు నా నుంచి ఆశిస్తున్న ప్రదర్శనకు అనుగుణంగానే ఆడతాను. నా శక్తిసామర్థ్యాల మేరకు అత్యుత్తమ ఆట తీరుతో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రీజులో కుదురుకున్న తర్వాత బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఉంటా. ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్ పాజీ ఇక ఈరోజు నా సెలబ్రేషన్స్ గురించి చెప్పాలంటే.. అనుష్క, సచిన్ పాజీ ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఈ ఫీలింగ్ను ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ నేను ఓ పరిపూర్ణ ఛాయాచిత్రం గీయాలనుకుంటే.. బహుశా అది ఇదేనేమో! నేను అత్యంత ప్రేమించే వ్యక్తి.. నా జీవిత భాగస్వామి అనుష్క.. నా హీరో సచిన్ టెండుల్కర్.. వీళ్లిద్దరి ముందు నేను వన్డేల్లో 50వ శతకం సాధించగలగడం.. అది కూడా చారిత్రాత్మక వాంఖడేలో.. ఇంతకంటే అత్యద్భుతం ఏముంటుంది?! అందరూ బాగా ఆడినందు వల్లే ఈరోజు మేము నాకౌట్ మ్యాచ్లో 400 పరుగుల స్కోరుకు చేరువగా వచ్చాం. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.. షాట్లు బాదాడు.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక టాప్లో శుబ్మన్, రోహిత్ అద్భుతం చేశారు. కేఎల్ రాహుల్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు’’- వన్డేల్లో 50 సెంచరీల వీరుడు, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాగా వన్డే వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్తో తలపడుతోంది. ముంబైలోని వాంఖడేలో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్లో ఓపెనర్లు రోహిత్ శర్మ(47), శుబ్మన్ గిల్(80- నాటౌట్).. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డు సెంచరీతో మెరిశాడు. సచిన్ రికార్డు బద్దలు ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ గండాన్ని దాటి 117 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా 80వ శతకం సాధించాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 50వ సెంచరీ. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఫైనల్కు చేరువయ్యేందుకు మరోవైపు.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ సైతం శతకం(105) బాదాడు. ఐదో నంబర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రోహిత్ సేన 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. తన రికార్డు సెంచరీ సమయంలో కలిగిన భావోద్వేగాలు, జట్టు భారీ స్కోరు సాధించిన విధానం గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
కోహ్లి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమిది
వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ వేదికగా విరాట్ కోహ్లి సాధించిన అర్థ శతక సెంచరీ ఫీట్పై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. క్రీడా అభిమానులతో పాటు క్రీడాయేతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కోహ్లికు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడి ఘనత అందుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి అభినందనలు తెలుపుతూ ఓ సందేశం ఉంచారు. ఇవాళ కోహ్లి 50వ శతకం సాధించడమే కాదు.. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్టతను, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడు. ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. కోహ్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్ తరాలకు బెంచ్మార్క్ నెలకొల్పడం కొనసాగిస్తూనే ఉంటాడు.. Today, @imVkohli has not just scored his 50th ODI century but has also exemplified the spirit of excellence and perseverance that defines the best of sportsmanship. This remarkable milestone is a testament to his enduring dedication and exceptional talent. I extend heartfelt… pic.twitter.com/MZKuQsjgsR — Narendra Modi (@narendramodi) November 15, 2023 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోహ్లిని ఎక్స్ వేదికగా అభినందించారు. వెల్డన్ కింగ్కోహ్లీ. హాఫ్ సెంచరీ శతకాలు అనే అద్భుతమైన ఫీట్.. అదీ వరల్డ్కప్ సెమీఫైనల్లో. టేక్ ఏ బో అంటూ ట్వీట్ చేశారు. Supremely Well done King Kohli @imVkohli 🎉 on Half-century of Centuries 👏 What an amazing feat to achieve and that too in the semi final of the World Cup Take a Bow 🙏 #ViratKohli𓃵 — KTR (@KTRBRS) November 15, 2023 తన సెంచరీల ఫీట్ను అధిగమించడంపై కోహ్లిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా అభినందించగా.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆ ట్వీట్ను రీపోస్ట్ చేసి మరీ కోహ్లిని అభినందించారు. ఒక దిగ్గజం నుంచి స్నేహపూర్వక సందేశం.. నిజంగా అభినందనీయం. మీ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కోహ్లి, సచిన్ను ఉద్దేశించి పోస్ట్ చేశారాయన. ఆప్ జాతీయకన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చారిత్రక మైలురాయిని అధిగమించిన విరాట్ కోహ్లికి శుభాకాంక్షలు. ఒక నిజమైన దిగ్గజమే రికార్డులను తిరగరాస్తారు. భావితరాలలో స్ఫూర్తిని నింపుతారు అంటూ సందేశం ఉంచారు. Congratulations to Virat Kohli on achieving a historic milestone with his 50th ODI century against New Zealand in the World Cup semifinal. A true legend rewriting records. Keep on inspiring the generations to come. pic.twitter.com/tLaKWv7fNq — Arvind Kejriwal (@ArvindKejriwal) November 15, 2023