లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో టాప్‌–10పైనే దృష్టి | India will be in top-10 at 2028 Los Angeles Olympics | Sakshi
Sakshi News home page

లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో టాప్‌–10పైనే దృష్టి

Jul 26 2020 6:38 AM | Updated on Jul 26 2020 6:38 AM

India will be in top-10 at 2028 Los Angeles Olympics - Sakshi

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజెలిస్‌ –2028 ఒలింపిక్స్‌ నాటికి పతకాల జాబితాలో తొలి 10 స్థానాల్లో నిలిచేలా భారత్‌ గట్టి పోటీనిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే ‘టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం జూనియర్‌ స్కీమ్‌’ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 10–13 వయస్సున్న చురుకైన క్రీడాకారులను ఎంపిక చేసి 2028నాటికి ఒలింపియన్లుగా తయారుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోచ్‌లతో వారికి శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు సుశిక్షితులైన స్వదేశీ కోచ్‌ల పదవీకాలాన్ని పొడిగించామని పేర్కొన్నారు. భారత్‌ను క్రీడాశక్తిగా చూడాలనుకున్న ప్రతీ ఒక్కరి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement