![India will be in top-10 at 2028 Los Angeles Olympics - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/26/KIREN-RIJIJU-MS.jpg.webp?itok=1TQF3esT)
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్ –2028 ఒలింపిక్స్ నాటికి పతకాల జాబితాలో తొలి 10 స్థానాల్లో నిలిచేలా భారత్ గట్టి పోటీనిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం జూనియర్ స్కీమ్’ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 10–13 వయస్సున్న చురుకైన క్రీడాకారులను ఎంపిక చేసి 2028నాటికి ఒలింపియన్లుగా తయారుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోచ్లతో వారికి శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు సుశిక్షితులైన స్వదేశీ కోచ్ల పదవీకాలాన్ని పొడిగించామని పేర్కొన్నారు. భారత్ను క్రీడాశక్తిగా చూడాలనుకున్న ప్రతీ ఒక్కరి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment