విషాదం.. భార్య సీమంతం రోజునే భర్త మృతి | - | Sakshi
Sakshi News home page

విషాదం.. భార్య సీమంతం రోజునే భర్త మృతి

Published Tue, Oct 15 2024 12:28 AM | Last Updated on Tue, Oct 15 2024 8:25 AM

-

కదిరి అర్బన్‌: లారీని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మండలంలో పట్నం గ్రామానికి చెందిన భాస్కర్‌ (24) అనంతపురంలో పాల వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. భార్య లక్ష్మి తొమ్మిది నెలల గర్భంతో ఉంది. దీంతో ఆమెకు కుటుంబసభ్యులు సీమంతం చేయాలంటే రెండు రోజలు క్రితం స్వగ్రామానికి పిలుచుకువచ్చాడు. ఆదివారం సీమంతం జరిగింది. 

వేడుక అనంతరం రాత్రికి తాను ఇంటికి వస్తానని తెలిపి సోమవారం ఉదయం భార్యను అనంతపురానికి పంపాడు. స్థానికంగా పనులు చక్కబెట్టుకున్న తర్వాత రాత్రికి ద్విచక్రవాహనంపై అనంతపురానికి బయలుదేరిన భాస్కర్‌... పట్నం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement