ఎస్ఎంపురం ఆలయంలో చోరీ
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఎస్ఎంపురం రామాలయంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చొరబడి రెండు కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. మంగళవారం ఉదయం పురోహితులు గుడి తలుపులు తీసేందుకు వెళ్లగా తలుపు తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. అనంతరం ఆలయ సేవా కమిటీ ప్రతినిధి చౌదరి అవినాష్ ఎచ్చెర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వి.సందీప్కుమార్, సిబ్బంది ఆలయాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. రెండు కిలోల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment