ఎస్‌ఎంపురం ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంపురం ఆలయంలో చోరీ

Published Wed, Feb 26 2025 8:06 AM | Last Updated on Wed, Feb 26 2025 8:02 AM

ఎస్‌ఎంపురం ఆలయంలో చోరీ

ఎస్‌ఎంపురం ఆలయంలో చోరీ

ఎచ్చెర్ల క్యాంపస్‌: మండలంలోని ఎస్‌ఎంపురం రామాలయంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చొరబడి రెండు కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. మంగళవారం ఉదయం పురోహితులు గుడి తలుపులు తీసేందుకు వెళ్లగా తలుపు తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. అనంతరం ఆలయ సేవా కమిటీ ప్రతినిధి చౌదరి అవినాష్‌ ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వి.సందీప్‌కుమార్‌, సిబ్బంది ఆలయాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం వచ్చి వివరాలు సేకరించారు. రెండు కిలోల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement