వినయ్‌భానురెడ్డి యాదిలో.. | - | Sakshi
Sakshi News home page

వినయ్‌భానురెడ్డి యాదిలో..

Published Mon, Mar 17 2025 10:44 AM | Last Updated on Mon, Mar 17 2025 10:36 AM

వినయ్‌భానురెడ్డి యాదిలో..

వినయ్‌భానురెడ్డి యాదిలో..

బొమ్మలరామారం : మండల కేంద్రానికి చెందిన దివంగత లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఉప్పల వినయ్‌భానురెడ్డి ద్వితీయ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మలరామారంలోని గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న వినయ్‌ భానురెడ్డి విగ్రహానికి కుటుంబ సభ్యులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్‌ భానురెడ్డి సతీమణి స్పందనారెడ్డి, తల్లిదండ్రులు ఉప్పల నర్సింహారెడ్డి, విజయలక్ష్మి, దంతపల్లి వంశీరెడ్డి పాల్గొన్నారు.

ఒంటిపూట బడుల

వేళల్లో మార్పు

సూర్యాపేట టౌన్‌: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.05 గంటలకు రెండో గంటతో పాటు ప్రార్థన చేసి 8.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని మొదట ఆదేశాలు ఇచ్చింది. ఈ వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. ఉదయం 7.45కు మొదటి గంట, 7.50కి రెండో గంటతో పాటు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు నిర్వహించిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సవరించిన వేళలను అమలు చేయాలని డీఈఓ అశోక్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement