Dog racing: దౌడు తీస్తుంటే ‘భౌ’గుంది | Dog running race competition in aija Gadwal | Sakshi
Sakshi News home page

Dog racing: దౌడు తీస్తుంటే ‘భౌ’గుంది

Nov 23 2024 10:09 AM | Updated on Nov 23 2024 10:11 AM

Dog running race competition in aija Gadwal

గట్టు (జోగుళాంబ గద్వాల జిల్లా): జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని భవానీమాత జాతర సందర్భంగా శుక్రవారం శునకాలకు పరుగు పందెం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 20 శునకాలు పోటీల్లో పాల్గొన్నాయి. కుచినేర్లకు చెందిన వెల్డింగ్‌ రాముడి శునకం మొదటిస్థానంలో నిలిచి రూ.10 వేలు దక్కించుకుంది. 

బల్గెరకు చెందిన మల్లయ్య శునకం రెండోస్థానంలో నిలిచి రూ.6 వేలు, కర్ణాటకలోని కడ్లురుకు చెందిన గౌరేశ్‌ శునకం మూడో స్థానంలో నిలిచి రూ.4 వేలు, పులికల్‌ రాజాపురానికి చెందిన మల్లయ్య శునకం నాలుగో స్థానంలో నిలిచి, రూ.2 వేలు దక్కించుకున్నాయి. విజేతలకు పీఏసీఎస్‌ అధ్యక్షుడు వెంకటేశ్, కాంగ్రెస్‌ నాయకులు రామకృష్ణారెడ్డి, బజారి, సుదర్శన్‌రెడ్డి, ప్రాణేశ్‌లు బహుమతులు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement