ఆరబోసిన ధాన్యం నీటిపాలు | Grain washed away in a flood in a market yard | Sakshi
Sakshi News home page

ఆరబోసిన ధాన్యం నీటిపాలు

Oct 23 2024 4:12 AM | Updated on Oct 23 2024 4:12 AM

Grain washed away in a flood in a market yard

చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వరదలో కొట్టుకుపోయిన ధాన్యం

సకాలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం

చౌటుప్పల్‌: సకాలంలో ప్రభుత్వం వరి కొను­గోలు కేంద్రాలు ప్రారంభించకపోవ­డంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలు చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. 

ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని తిరిగి కుప్పలు పోసుకు­నే సమయంలో వర్షం రావడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులుపె­ట్టారు. అప్పటికప్పుడు ధాన్యాన్ని కుప్పలు­గా పోసుకున్నారు. పట్టాలు కప్పుకున్నారు. పెద్ద ధాన్యం కుప్పలను ట్రాక్టర్లతో దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా వర్షం భారీగా కురవడంతో వరద నీటి ప్రవాహంలో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement