grain
-
కొనుగోలు కేంద్రాలు క్లోజ్!
సాక్షి, అమరావతి: ఇటు మద్దతు ధరలు లేవు.. అటు కొనుగోలు చేసే నాథుడు లేడు! ధాన్యం రైతులను టీడీపీ కూటమి సర్కారు ముప్పుతిప్పలు పెడుతోంది. రైతు సేవా కేంద్రాల్లో కేవలం పేరుకు మాత్రమే సేకరణ చేస్తూ అన్నదాతల కష్టాన్ని దళారులు, మిల్లర్లకు దోచిపెడుతోంది. సంక్రాంతి తర్వాత నూర్పిడులు చేసిన ధాన్యం రాసులు ఇప్పటికీ శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుప్పలుగా పంట పొలాల్లోనే కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ముందస్తు దిగుబడి అంచనాలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం దారిదాపుల్లో కూడా లేదు. రబీ సాగు ఊపందుకున్నా.. పౌరసరఫరాల శాఖ మంత్రి జిల్లాల పర్యటనకు వెళ్లే సమయాల్లో లక్ష్యం తగ్గిపోతూ వచ్చింది. అతి కష్టంమీద 33. లక్షల టన్నులను సేకరించారు. గోదావరి జిల్లాల్లో జనవరి నెలాఖరు నుంచి కొనుగోళ్లు క్రమంగా నిలిపివేశారు. రబీ సాగు ఊపందుకున్న తరుణంలో ఇప్పటికీ ఖరీఫ్ రెండో ముందస్తు అంచనాలతోనే కొట్టుమిట్టాడుతోంది. ఖరీఫ్లో సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వ్యవసాయ శాఖ అక్టోబర్ ముందస్తు అంచనాల ప్రకారం 84 లక్షల టన్నుల దిగుబడి, జనవరి రెండో ముందస్తు అంచనా ప్రకారం 79 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. విపత్తులతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఇందులో ఎంత కాదనుకున్నా సుమారు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంచనాలకు ఆమడ దూరంలో కొనుగోళ్లు వైఎస్సార్ జిల్లాలో 1.71 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా ప్రభుత్వం కొనుగోలు చేసింది 18 వేల టన్నుల ధాన్యం మాత్రమే. పల్నాడులో 2.25 లక్షల టన్నులు దిగుబడి అంచనా అయితే కొన్నది 12 వేల టన్నులే. బాపట్లలో దిగుబడి అంచనా 5.54 లక్షల టన్నులు అయితే 87 వేల టన్నులే కొనుగోలు చేశారు. గుంటూరులో 3.69 లక్షల టన్నులకు గాను 36 వేల టన్నులు కొన్నారు. అనకాపల్లిలో 2.70 లక్షల టన్నుల దిగుబడి రానుందని అంచనా వేస్తే 30 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఫైన్ వెరైటీలకు మార్కెట్లో పెద్దగా రేటు రాకపోవడంతో అన్నదాతలు కుదేలయ్యారు. రైతు సేవా కేంద్రాల వారీగా టార్గెట్లు ధాన్యం కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాల వారీగా ప్రభుత్వం టార్గెట్లు విధించింది. టార్గెట్ పూర్తయిన చోట ధాన్యం విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గత నెలలో కృష్ణా జిల్లాలో, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సిండికేట్గా మారిన మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వకపోవడంతో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం సేకరించడం లేదు. కనీసం ఆన్లైన్లో కూడా నమోదు చేయడం లేదు. ధాన్యం కొనుగోలు షెడ్యూల్ ఇస్తే గోతాలు వస్తాయి. వాటిల్లో పంటను భద్రపరిచి జాగ్రత్త చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దళారులు, మిల్లర్ల కనుసన్నల్లో సేకరణ జరుగుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. మధ్యవర్తులు, దళారులు, కమీషన్ ఏజెంట్లు నిర్దేశించిన రేటుకే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.బస్తాకు రూ.400–500 నష్టం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల దోపిడీని ప్రోత్సహించింది. 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్కు రూ.1740గా మద్దతు ధర ప్రకటించింది. కానీ తేమ శాతం పేరుతో రైతుల నడ్డి విరిచేశారు. దీంతో రైతులు ఒక్కో బస్తా రూ.400 – 500 నష్టానికి విక్రయించిన దుస్థితి. దీంతో టన్నుకు సుమారు రూ.6 వేలకుపైగా నష్టం వాటిల్లింది. ఈ లెక్కన ప్రభుత్వం కొనుగోలు చేసిన రూ.7,790 కోట్ల విలువైన 33.80 లక్షల టన్నుల్లో రైతులకు దక్కాల్సిన సుమారు రూ.2 వేల కోట్లకు పైగా మద్దతు ధరను మధ్యవర్తులు, మిల్లర్లు మాటున దోచేశారు. మిల్లరు కనుసైగ చేస్తే తప్ప కల్లాల్లో నుంచి ధాన్యం కదలని పరిస్థితి. పోనీ జీఎల్టీ వస్తుంది కదా అని రైతు సొంతంగా వాహనం సమకూర్చుకుని ధాన్యం తరలిద్దామనుకుంటే దించేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కుప్పల్లో.. కల్లాల్లోనే ధాన్యం శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి తర్వాతే పంట విక్రయానికి వస్తుంది. ఖరీఫ్లో 4.90 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు తాత్కాలిక టార్గెట్ ఇచ్చారు. ఇక్కడ 7.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా. ప్రభుత్వం కావాలనే తక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుప్పల్లో, కల్లాల్లో సుమారు 1.50 లక్షల టన్నుల వరకు ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. మరోవైపు ధాన్యం ఉన్న చోట్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నారు. ఇచ్చాపురం, కవిటి, కంచలి, పలాస, రణస్థలం, లావేరు, ఎచెర్ల, తదితర మండలాల్లో 118 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేశారు. 20 – 30 రోజులు గడిచినా సొమ్ము ఖాతాల్లోకి జమ కావడం లేదని రైతులను వాపోతున్నారు. ఇదే అదనుగా దళారీలు 75 కిలోల బస్తాకు మద్దతు ధర కంటే సుమారు రూ.400–300 వరకు తగ్గించి కొంటున్నారు. నెల్లూరులో ఇప్పుడిప్పుడే పంట కోతకు రావడంతో తాత్కాలికంగా 20 వేల టన్నుల కొనుగోలుకు టార్గెట్ ఇచ్చారు. నాడు కట్టడి.. నేడు ఇష్టారాజ్యం.. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్లు దందాను కట్టడి చేసింది. ప్రభుత్వమే సంపూర్ణ మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. బహిరంగ మార్కెట్లో సైతం ధాన్యం రేట్లు పెరిగాయి. తొలిసారిగా దొడ్డు బియ్యానికి మంచి గిరాకీ లభించింది. తాము తక్కువ రేటు ఇస్తే రైతులు ప్రభుత్వానికే పంటను విక్రయిస్తారని గ్రహించిన దళారులు సైతం మద్దతు ధరకు మించి పంటను కొనుగోలు చేసిన సందర్భాలు తొలిసారిగా కనిపించాయి. కూటమి ప్రభుత్వం రాగానే మొత్తం పరిస్థితి తలకిందులైంది. సాధారణ రకాలకు మద్దతు ధర లేకపోగా బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నాలకు (ఫైన్ వెరైటీలు) ధర పడిపోయింది. గోదావరి డెల్టాలో బీపీటీ సాంబ మసూరి రకాన్ని పండించిన రైతులకు దళారులు చుక్కలు చూపించారు. 75 కిలోల బస్తా రూ.2,500 పలుకుతుందని రైతులు ఆశించగా రూ.1,400 – రూ.1,500కి మించి కొనలేదు. కడప ప్రాంతంలోనూ సన్నాలకు ధర లేక రైతులు అవస్థలు పడ్డారు. కృష్ణా డెల్టాలో అధికంగా పండించే ఎంటీయూ–1262, ఎంటీయూ–1318 సూపర్ ఫైన్ వెరైటీ రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. -
నడి రోడ్డుపై అన్నదాతకు అవమానం
పది మందికి అన్నం పెట్టే అన్నదాతను అగచాట్లకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం నడి రోడ్డుపై అవమానించింది. నూతన సంవత్సరం వేళ మిల్లర్లతో కలిసి అన్నదాతలతో ఆడుకుంది. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారంలో బుధవారం జరిగిన ఈ ఘటన రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.పోలాకి: ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ధాన్యం రంగుమారింది. ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వదిలేసింది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు అక్రమాలకు తెగబడుతున్నారు. తేమ పేరిట రైతులను నిలువునా దగా చేస్తున్నారు. అధికారులూ మిల్లర్లకే అమ్మాలని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం, మిల్లర్లు కలిసి ఆడుతున్న ఈ ఆటలో రైతులు నలిగిపోతున్నారు. బుధవారం పొలాకి మండలం ప్రియాగ్రహారంలో 20 మంది అన్నదాతలు నడిరోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రియాగ్రహారానికి చెందిన రైతులు బుధవారం రైతు సేవా కేంద్రానికి వెళ్లి ధాన్యానికి ట్రక్షీట్ వేయాలని కోరారు. ధాన్యం శాంపిల్ చూసిన సిబ్బంది.. తాము తేమ శాతం మాత్రమే నిర్థారించగలమని, రంగు మారినట్లు కనిపిస్తున్నందున మిల్లర్ను సంప్రదించాలని చెప్పారు. రైతులు మిల్లర్ దగ్గరకు వెళ్లగా.. మద్దతు ధర ఇవ్వలేనంటూ కరాఖండిగా చెప్పేశారు. కొద్దిసేపటికి మిల్లర్ తరపున దళారీ ఎంటరయ్యాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (80 కేజీలు) రూ.1,840 కాగా.. రైతు సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లు వద్ద చేర్చేలా రూ.1,700కు దళారీ రేటు మాట్లాడాడు. గత్యంతరం లేక రైతులు అంగీకరించారు. ధాన్యం ట్రాక్టర్లకు లోడ్ చేశారు. ఇంతలో మిల్లర్ మళ్లీ మాటమార్చేశాడు. ఆ ధాన్యం తమకు వద్దని, రూ.1,500 మాత్రమే ఇస్తామని, లేదంటే అసలు తీసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో రైతులు నిర్ఘాంతపోయారు. సొంత ఖర్చులతో ధాన్యం తెచ్చిన తర్వాత తీసుకోకపోతే ఎలా అంటూ రోడ్డపైన ఆందోళనకు దిగారు. రైతంటే ఇంత చిన్నాచూపా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మండలం అంతా ఉందని రైతులు తెలిపారు. బియ్యం బాగున్నా కొనరెందుకు?ధాన్యం పైకి రంగు మారినట్లు కనిపిస్తున్నా, లోపల బియ్యం బాగుందని రైతులు చెబుతున్నారు. రంగు మారిన ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని వారు చూపించి, నాణ్యత ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. అయినా ఎందుకు కొనడంలేదని నిలదీశారు. రైతులకు జరిగిన అవమానాన్ని, వారి ఆవేదనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మిల్లర్లకు నచ్చజెప్పారు. మిల్లర్లు చెప్పిన ధరకు, మద్దతు ధరకు మధ్యస్తంగా మరో ధరకు రైతులను బలవంతంగా ఒప్పించారు.అవగాహన కల్పిస్తాంధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానందున మిల్లర్లు కొనడంలేదు. తుపాను ప్రభావం నేపథ్యంలో రైతుల వద్ద ఉన్న రంగు మారిన ధాన్యంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత రైతులకు తెలియజేస్తాం. – ఎం.సురేష్కుమార్, తహశీల్దార్, పోలాకిరైతులను వంచించారువర్షంతో పంట నేలవాలి అనేక గ్రామాల్లో ధాన్యం రంగు మారటంతో రైతులంతా నష్టపోయారు. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం మమ్మల్ని వంచించింది. నూతన సంవత్సర ఆరంభం రోజున నడిరోడ్డుపై నిలబెట్టింది. అధికారులు మా సమస్య పరిష్కరించకుండా నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు లైన్లో నిలబడ్డారు. – దుర్రు యర్రయ్య, రైతు, ప్రియాగ్రహారంమళ్లీ దళారుల రాజ్యమే..పంట కొనుగోలులో మళ్లీ దళారుల రాజ్యం వచ్చింది. చాలాచోట్ల మిల్లర్లు దళారులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రైతులను నిలువునా ముంచుతున్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ పూర్తయ్యేలా కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించి, ఎంపిక చేసిన వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. వాస్తవానికి ఆ రైతులు ధాన్యం నూర్పిడి కూడా చేయడంలేదు. ఇది ముమ్మాటికీ మోసమే. ఇలాంటి వాటిపై ప్రతి మండలంలో మిల్లర్ల వారీగా అధికారులు సూక్ష్మ పరిశీలన చేయాలి. – కరిమి రాజేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ -
రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో రైతుకు తీరని అన్యాయం జరుగుతోంది. అలా అనడం కంటే ప్రభుత్వమే రైతుకు అన్యాయం చేస్తోందని చెప్పడం కరెక్ట్. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కల్లాల్లో ధాన్యం పెట్టుకొని ధాన్యం విక్రయించడానికి ఎదురుచూసు్తన్న రైతు బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోకపోగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మిల్లర్లు, దళారులతో కలిసి ధాన్యం రైతులకు దక్కాల్సిన సొమ్ములో నేరుగా 30% తినేస్తోంది. మిల్లర్లు–దళారుల దోపిడీని నిలువరించాల్సిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార ఆర్భాటానికి ధాన్యం సేకరణ అంశాన్ని ఉపయోగించుకుని జబ్బలు చరుచుకుంటున్నారు. దోపిడీ సాగుతున్న తీరు ఇలా..మద్దతు ధరలోనూ 30–40 శాతానికి పైగా లూటీరైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరలో 30–40 శాతానికి పైగా లూటీ అవుతోంది. ఖరీఫ్ సీజన్లో 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. దాన్ని ఇటీవలే 37 లక్షల టన్నులకు పెంచారు. ఇప్పటివరకు 22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మరో 15 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే 5.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 2.50 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో లక్ష టన్నులు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1.50 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 90 శాతానికి పైగా రైతుల పేరిట దళారులే సేకరించారు. ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి పైగా స్వాహా అయినట్టు తెలుస్తోంది.మిల్లర్లతో కుమ్మక్కుమిల్లర్లతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతానికి అమ్మించేలా మిల్లర్లను ఒప్పించాల్సింది పోయి, మిల్లర్లు నిర్ధారించిన తేమ శాతానికి అమ్ముకోవాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్ఎస్కేల్లో 17 శాతం ఉందని నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లు దగ్గరకు తీసుకెళితే ధాన్యంలో ధూళి, దుమ్ము ఉందనే సాకుతో 18–20 శాతంగా నమోదు చేస్తున్నారు. దోపిడీ కోసమే ఇలా పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చే మిల్లర్లు సైతం 16–17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని 18–21 శాతం వరకు నిర్ధారించి మీకు నచ్చితే లోడింగ్ చేస్తాం, లేకుంటే పట్టుకెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు.దళారులు పంపిస్తే గంటలోనే అన్లోడింగ్దళారులు ప్రారంభంలో రైతులకు మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,350 నుంచి రూ.1,500 మధ్య చెల్లించేవారు. ప్రస్తుతం కాస్త పెంచి రూ.1,500 నుంచి రూ.1,600 మధ్య చెల్లిస్తున్నారు. అదే ఎంటీయూ 1262, 1318 రకం ధాన్యానికైతే నేటికీ రూ.1,100 నుంచి రూ.1,300 మధ్యే చెల్లిస్తున్నారు. ఫలితంగా 75 కేజీల బస్తా దగ్గరే 125 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు, మిల్లర్ల వేధింపులు తట్టుకోలేక చివరకు దళారులకే ధాన్యాన్ని ఇచ్చి మిల్లులకు పంపిస్తున్నారు. కాగా.. దళారులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు గంటలోనే అన్లోడ్ చేసుకుంటున్నారు. అదే రైతు నేరుగా తీసుకెళ్తే అన్లోడింగ్కు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. మొహం చాటేస్తున్న మిల్లర్లువర్షాలతో ధాన్యంలో తేమ శాతం పెరిగిపోతోంది. ఎంత ఆరబెట్టినా మిల్లు వద్ద 25 శాతం కన్నా తక్కువ తేమ చూపడం లేదు. తేమ శాతం వంకతో మిల్లర్లు కొనేందుకు కూడా మొహం చాటేస్తున్నారు. ధాన్యం వ్యాపారులు 75 కేజీల బస్తాకు రూ.1,100.. మహా అయితే రూ.1,200కు మించి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతులు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం సొమ్ములు గంటలోనే జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ సాంకేతిక కారణాల సాకుతో 15 నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.పక్కదారి పడుతోందిలా..సాధారణంగా రైతులు కోసిన ధాన్యాన్ని 40 కేజీల చొప్పున బస్తాలలో కాటా వేస్తారు. గోనె సంచి బరువు మరో 500 గ్రాములు కలిపి 40.50 కేజీల చొప్పున కాటా వేయాలి. కానీ.. 41.50 కేజీల వరకు కాటా తూస్తున్నారు. అంటే కేవలం 40 కేజీల కిట్టీ దగ్గరే ఏకంగా కిలో చొప్పున టన్నుకు 25 కేజీలకుపైగా నష్టపోతున్నారు. అంటే కిలోకు రూ.23 చొప్పున 25 కిలోలకు రూ.575 చొప్పున ప్రతి టన్నుకూ రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఇక తేమ శాతం విషయానికి వస్తే 17 శాతం వరకు తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర (క్వింటాకు రూ.2,300) చొప్పున చెల్లించాలి. కానీ.. బూతద్దం పెట్టి వెతికినా పూర్తిస్థాయి మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. నిబంధనల ప్రకారం తేమ 17 శాతం ఉన్నా 75 కేజీల బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల చొప్పున తరుగు మినహాయిస్తున్నారు. అంటే ఇక్కడ టన్నుకు 35–40 కేజీలు చొప్పున రూ.920 నష్టపోతున్నాడు. తేమ శాతం 17 దాటితే ఒక్కో శాతానికి రెండున్నర కేజీల వరకు తరుగు మినహాయిస్తున్నారు. 25 శాతం తేమ ఉంటే బస్తాకు 8–12 కేజీల చొప్పున కోత పడుతోంది. ఈ విధంగా టన్నుకు 140 కేజీల చొప్పున రూ.3,864 మేర రైతులకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా సరే టన్నుకు రూ.1,495 నష్టపోతుంటే.. తేమ శాతం గనుక 17–25 మధ్య ఉంటే టన్నుకు రూ.5,355 వరకు నష్టపోతున్నారు. అంటే టన్నుకు రూ.23 వేలు దక్కాల్సిన రైతులకు కేవలం సుమారు రూ.17 వేలు మాత్రమే దక్కుతోంది. మిగిలిన మొత్తం దళారులు, మిల్లర్లు స్వాహా చేస్తున్నారు. వారినుంచి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు ముడుతున్నాయి.తేమ శాతంలో పొంతన లేని లెక్కలుధాన్యం కొనుగోలులో దోపిడీకి కూటమి ప్రభుత్వమే దగ్గరుండి ద్వారాలు తెరిచింది. దళారులు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గడచిన ఐదేళ్లుగా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగితే.. ప్రస్తుతం మిల్లర్ల కనుసన్నల్లోనే «కొనుగోళ్లు జరిగే పరిస్థితి నెలకొంది. తొలుత 25 శాతం వరకు తరుగు లేకుండానే తీసుకుంటామని తొలుత చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చి 17 శాతం దాటితే ఐదు కేజీలు తరుగుతో తీసుకుంటామని ప్రకటించింది. చివరకు నిబంధనల మేరకు 17 శాతం తేమ ఉన్నా సరే పూర్తి మద్దతు ధర చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ శాతమే ఫైనల్. అదే తేమ శాతానికి మద్దతు ధర లెక్కగట్టి రైతులకు జమ చేసేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)తో పాటు మిల్లుల వద్ద కూడా తేమ శాతాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ రెండుచోట్ల నిర్ధారిస్తున్న తేమ శాతానికి పొంతన లేకుండా పోతోంది.కాళ్లా వేళ్లా పడినా కొనడం లేదు ఈ రైతు పేరు గుడవర్తి వెంకట సుబ్బరాజు. బాపట్ల జిల్లా మంతెనవారిపాలేనికి చెందిన సుబ్బరాజు పదెకరాల్లో ఎంటీయూ–1262 రకం సాగు చేశారు. ఈ నెల 16న కోయగా.. ఎకరాకు 35 బస్తాల చొప్పున 350 బస్తాల దిగుబడి వచ్చింది. 8 రోజులు ఆరబెట్టి.. 24వ తేదీన రైతు సేవా కేంద్రంలో తేమ పరిశీలిస్తే 23 శాతం వచ్చింది. బాపట్ల ఉప్పరపాలెం రైసుమిల్లుకు అదే రోజున 100 బస్తాలను తోలితే 23 శాతం తేమ ఉందని 5 కేజీల తరుగుతో తీసుకున్నారు. బుధవారం మరో 200 బస్తాలు తీసుకెళ్తే 27 శాతం తేమ ఉంది. మీ ధాన్యం మాకొద్దని తెగేసి చెప్పారు. ‘తరుగు ఎంతైనా తీసుకోండి. మీకు నచ్చిన ధర ఇచ్చి ధాన్యం దింపుకోండ’ని కాళ్లావేళ్లా పడినా మిల్లు యాజమాన్యం పట్టించుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. మిల్లర్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నారు. వాతావరణం చూస్తే గంటకోలా మారుతోంది. చేసేది లేక టార్పాలిన్లు అద్దెకు తెచ్చి మిల్లు ఎదుటే ట్రాక్టర్లో ఉన్న ధాన్యం బస్తాలపై కప్పి అక్కడే పడిగాపులు పడుతున్నాను. ఉదయం నుంచి తిండీ తిప్పల్లేవు. ఏంచేయాలో పాలుపోవడం లేద’ని సుబ్బరాజు కన్నీరుమున్నీరయ్యారు.బస్తాకు రూ.1,470కు మించి ఇవ్వడం లేదు ఈ రైతు పేరు కొండవీటి వెంకటసుబ్బారావు. కృష్ణా జిల్లా మంతెనకు చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో ఎంటీయూ–2077 వరి సాగు చేసారు. బుడమేరు ముంపు వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. రైతు సేవా కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లి తేమ శాతం చూడమంటే.. ‘అవసరం లేదు నేరుగా మిల్లుకు తీసుకుపొండి..అక్కడ వాళ్లు చెప్పిన తేమ శాతమే ఫైనల్’ అని కొనుగోలు కేంద్రం సిబ్బంది బదులిచ్చారు. దీంతో దాములూరులోని బాలాజీ రైస్మిల్లుకు 213 (ఒక్కొక్కటీ 40 కేజీల) బస్తాలు తీసుకెళితే 24 శాతం తేమ వచ్చింది. రెండో రోజు మరో 105 బస్తాలు తీసుకెళితే 26 శాతం వచ్చిందని చెప్పారు. దాదాపు 8 కేజీలు తరుగు తీసేశారు. 75 కేజీల బస్తాకు రూ.1,470 చొప్పున ఇస్తామన్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు’ అని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.పొంతన లేని తేమ లెక్కలు ఈ రైతు పేరు గుడిపూడి అవినాశ్. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన ఈయన ఐదెకరాల్లో ఎంటీయూ–1318 రకం సాగు చేశారు. ఎకరాకు 33 బస్తాల దిగుబడివచ్చింది. 18న కోత కోయగా.. 23న రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చింది. అదే రోజున మారుతి మిల్లుకు 154 బస్తాలు తరలిస్తే.. అక్కడ తేమ శాతం 19గా చూపించారు. 75 కేజీల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా.. రూ.1,650 చొప్పున ఇచ్చారు. రైతు సేవాకేంద్రంలో చెబుతున్న తేమ శాతానికి మిల్లులో చెబుతున్న తేమ శాతానికి పొంతన ఉండడం లేదు. ఇదేమిటని అడిగితే మీకు నచ్చకపోతే తీసుకెళ్లిపోవచ్చని మిల్లర్ చెబుతున్నారు. -
చకచకా కోత.. ఆరబోతకు వెత
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎకరం వరి పొలాన్ని ఒకే రోజులో కోయాలంటే గతంలో పన్నెండు మంది కూలీలు అవసరమయ్యేవారు. ఇలా కోసిన పంటను కుప్ప వేసి తూర్పారబట్టడం వరకు కనీసం రెండు వారాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు హార్వెస్టర్ ఎకరం పొలాన్ని గంటలోనే కోసి ధాన్యం, గడ్డిని వేరు చేసి ఇస్తోంది.దీంతో రెండు వారాల్లో చేయాల్సిన పని ఒక గంటలోనే పూర్తవుతోంది. ఇదంతా పైకి బాగున్నట్టే కనిపిస్తున్నా ధాన్యం ఆరబెట్టేందుకు అవస్థలు తప్పడం లేదు. రాష్ట్రంలో నానాటికీ వరి సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆరబోత అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. తేమ చిక్కులు వరి కోసినప్పుడు సాధారణంగా 35 శాతం నుంచి 40 శాతం మధ్య ధాన్యంలో తేమ ఉంటుంది. ఈ తేమ 17 శాతం ఉంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. గతంలో కొడవళ్లతో కోసి, తూర్పారబట్టే వరకు ధాన్యం పంట పొలాల్లోనే ఎండి సాధారణ స్థాయికి తేమ చేరేది. అయితే హార్వెస్టర్ కోత కావడంతో ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటోంది. దీనిని తగ్గించేందుకు రైతులు ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెడుతున్నారు. కూలీలను పెట్టి ప్రతీ అరగంటకు ఓసారి నెరుపుతున్నారు. దీంతో రైతులకు ఖర్చు పెరుగుతోంది. ధాన్యం ఆరబోత యంత్రాలు ధాన్యాన్ని ఆరబెట్టే మొబైల్ ప్యాడీ డ్రయర్ మిషన్లు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. మోడళ్ల ఆధారంగా వీటిæ ధర రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంది. గంట వ్యవధిలో ఒక ఎకరం పొలంలో పండిన ధాన్యాన్ని ఆరబెట్టడమే కాక తాలును వేరు చేస్తుంది. కోతల సమయాన హార్వెస్టర్ మాదిరే ఈ యంత్రాలతోనూ ప్రయోజనాలు ఉన్నాయి. మొబైల్ ప్యాడీ డ్రయర్ మిషన్లకు రాష్ట్ర రైతు సంక్షేమ శాఖ పరిధిలోని యాంత్రీకరణ– సాంకేతిక విభాగం 2023 జనవరి 23న ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 60 శాతం సబ్సిడీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీ అందించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం వెలువడి దాదా రెండేళ్లు కావొస్తున్నా యంత్రాలు విరివిగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. పది రోజులుగా ఇక్కడే... కల్లాల్లో ధాన్యం ఆరబోసి ఎప్పుడు అమ్ముడవుతుందా అని చూడాల్సి వస్తోంది. పది రోజులుగా కల్లాల దగ్గరే రాత్రీపగలు కాపలా ఉంటున్నాం. తేమ శాతం 17కు ఎప్పుడు చేరుతుందా అని ఎదురుచూస్తున్న. ఈ సమయంలో మబ్బులు పడితే భయం పుడుతోంది. – తడికల నర్సింగరావు, కుదునూరు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్నది శ్మశానం.ఇల్లెందు మండలం కొమురారం గ్రామానికి చెందిన రైతులు రెండు, మూడు వారాల పాటు రేయింబవళ్లు ఇక్కడే ఉంటున్నారు. ఇదేమీ గ్రామ ఆచారం కాదు. ధాన్యం ఆరబెట్టేందుకు ఖాళీ స్థలం లేక శ్మశానమే వేదికగా మారింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదురునూరులో కొనుగోలు కేంద్రం. మబ్బులు పట్టి చినుకులు కురుస్తుండడంతో అప్రమత్తమైన రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా పేరుస్తూ కవర్లుకప్పేస్తున్నారు. -
ధాన్యం వర్షార్పణం
దాచేపల్లి(పల్నాడు జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నడికుడి వ్యవసాయ మార్కెట్యార్డులోని ఫ్లాట్ఫారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. పలువురు రైతులు పొలంలో పండించిన వరి పంటని యంత్రాల ద్వారా కోసి నడికుడి మార్కెట్యార్డుకి ఆరబోసేందుకు తీసుకొచ్చారు. సుమారు మూడు వేలకుపైగా ధాన్యపు బస్తాలను సిమెంట్ ఫ్లాట్ఫారాలపై రైతులు ఆరబోశారు. ఆకస్మాత్తుగా తెల్లవారుజామున వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షపు నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల వద్ద నుంచి రైతులు యార్డుకు చేరుకునేలోపే ధాన్యం వర్షంలో తడిసింది. వర్షపునీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు అతికష్టం మీద ఒబ్బిడి చేసుకున్నారు. ఫ్లాట్ఫారంపై ఉన్న ధాన్యపు బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందామని ఆశపడిన అన్నదాత తడిసిన ధాన్యం చూసి నీరుగారిపోయాడు. యార్డులో ఆరబోసిన ధాన్యం సైతం తడిసిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ధాన్యం దళారీగా సర్కారు
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వం ధాన్యం దళారీగా మారింది. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యం ఇచ్చేయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర దక్కడంలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు’.. అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన రెండ్రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్బీకేలు, రైతుక్షేత్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశుల ఎదుట నిరసనలు వ్యక్తంచేసిన రైతులు బుధవారం విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, వివిధ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..మంత్రి చిటికలేసినా ధాన్యం కదల్లేదు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికి కల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని నాలుగు రోజుల క్రితం అధికారులకు చిటకలేసి మరీ చెప్పారు. రోజులు గడుస్తున్నా గింజ ధాన్యం కూడా కాటా వేయలేదు. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. వాళ్లు పర్యటించిన చోట కూడా ధాన్యం కాటా వేయడం కానీ, మిల్లులకు తోలడంగానీ జరగడంలేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ‘మద్దతు’ దక్కడంలేదు..తేమ శాతం ఎంతున్నా కొంటామంటున్నారు. ఆ తర్వాత 17 శాతం దాటితే ఐదు కేజీల కోత వేసి మిగిలిన ధాన్యాన్ని కొంటామన్నారు. పూర్తిస్థాయి మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వమే తరుగు మినహాయించి కొంటామని చెప్పడం దారుణం. తుపాను, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేమ శాతం 20 నుంచి 24 శాతం వస్తోంది. రెండు శాతమో, ఐదు శాతమో కట్ చేసి మిగిలిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం లెక్కిస్తే 75 కేజీల బస్తాకు రూ.1,670 చొప్పున ఇవ్వాలి. కానీ, రూ.1,470–1,500కు మించి ఇవ్వడంలేదు. పైగా.. ధాన్యం బాగోలేదంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఎంటీయూ 1,262, 1,318 వంటి ఫైన్ వెరైటీ ధాన్యానికి కూడా మద్దతు లభించని దుస్థితి ఏర్పడింది.రైతులకు–మిల్లర్లకు మధ్య బ్రోకర్లుగా మారారు..నిజానికి.. రైతుసేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించాలి. అక్కడ నిర్ధారించే దానినే ప్రామాణికంగా తీసుకుని ధరను నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ఎక్కడా ఆ పరిస్థితిలేదు. ఆర్ఎస్కేలకు వెళ్తుంటే తేమ శాతం కూడా చూడడంలేదు. ఏ మిల్లుకు వెళ్తారని అడిగి అక్కడకు పంపించేస్తున్నారు. మిల్లు వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది రైతాంగాన్ని మిల్లర్లు దోచుకునేందుకు ఉపయోగపడే పద్ధతే తప్ప రైతులకు మేలుచేసే విధానం కాదు. ఇక వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో మీ ధాన్యం కొనేస్తామంటున్నారు. కానీ, ఆచరణలో ఇదెక్కడా అమలుకు నోచుకోవడంలేదు.ఒక్క ప్రైవేటు వ్యాపారిపైనైనా కేసు పెట్టారా?ఇక ప్రైవేటు వ్యాపారులు కొనే ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో అర్థం కావడంలేదు. తక్కువ ధరకు కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని చెప్పారుగానీ.. రాష్ట్రంలో ఒక్క ధాన్యం వ్యాపారిపైనైనా కేసు పెట్టారా? ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోనీ ప్రభుత్వమైనా కొంటుందా అంటే అదీలేదు. గతేడాది కోసిన ధాన్యాన్ని కోసినట్లుగానే తీసుకెళ్లారు.. ప్రతీ రైతుకూ మద్దతు ధర లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలేదు. ధర్నాలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ లక్ష్మణస్వామి, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. శివనాగేంద్ర, పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావాలి..ఏడెకరాల్లో వరి వేశాం. పంట కోసి 15 రోజులైంది. తేమ 17 శాతం ఉంది. 20 శాతమైనా తీసుకుంటామన్నారు. కానీ తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు రూ.1,450 ఇస్తామన్నారు. మా రైతు రూ.1,740 చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి. పైగా పంటను కాపాడుకునేందుకు పరదాలకు రోజుకు రూ.2వేలు ఖర్చవుతోంది. డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావడం తప్ప వేరే దారిలేదు.– పొద్దుటూరు ప్రసాద్, గొడవర్రు. కంకిపాడు మండలం, కృష్ణాజిల్లాఇలా అయితే కౌలు రైతులు బతికేదెలా?నేను మూడెకరాల్లో వరి వేశాను. గతేడాదితో పోలిస్తే ఎకరాకు ఐదు బస్తాలు తగ్గింది. తేమ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రకం ధాన్యాన్ని కొనడంలేదు. ఆర్బీకేల్లోనే 20–25 శాతం ఉంటే 1,450 ఇస్తామంటున్నారు.బయట వాళ్లు కొనడం లేదు. పంటను కాపాడుకునేందుకు పరదాల కోసం రోజుకు ఎకరాకు రూ.300–500 చొప్పున చెల్లిస్తున్నాం. ఇలా అయితే కౌలురైతులు బతికేదెలా? కోసూరి శివనాగేంద్ర, గడ్డిపాడు, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లాగతేడాది మద్దతు ధర వచ్చింది..ఎనిమిది ఎకరాల్లో వరికోసి 10 రోజులైంది. తేమ 15.5 శాతం ఉంది. మిల్లుకు పంపిస్తామన్నారు. కానీ ఎవరూ రాలేదు. మళ్లీ వెళ్లి అడిగితే మిల్లు దగ్గరకు వెళ్లండి అంటున్నారు. బేరగాళ్లు రూ.1,400 ఇస్తామంటున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదు. గతేడాది కోసిన వెంటనే 75 కేజీల బస్తాకు రూ.1,630కు కొన్నారు. ఈ ఏడాది కొనేవాడులేడు. 10 రోజులుగా రోడ్డుపైనే ధాన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గెద్దా నరేంద్ర, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లానష్టానికి తోలాల్సి వస్తోంది..ఐదెకరాల్లో వరివేసా. ఎకరాకు 30 బస్తాలొచ్చింది. గొడవర్రు ఆర్ఎస్కు తీసుకెళ్తే 15.4% తేమ వచ్చింది. రేటు చెప్పలేదు. 90 బస్తాలు మిల్లుకు తోలారు. అక్కడ 75 కేజీల బస్తాకు రూ.1,600 కు మించి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆర్ఎస్కే సిబ్బందికి చెబితే పట్టించుకోలేదు. చేసేది లేక బస్తాకు రూ.130 చొప్పున నష్టానికి మిల్లుకు తోలాల్సి వచ్చింది.– గెడ్డం రాజా, గొడవర్రు, కృష్ణాజిల్లా -
దళారికి రొక్కం.. రైతుకు దుఃఖం
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలకు కష్టకాలం దాపురించింది. చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధరను దక్కించుకోలేని దుస్థితిలో రైతాంగం విలవిల్లాడిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలకు మించి ‘దోపిడీ విపత్తు’ కర్షకులను ముంచేస్తోంది. పంట చేతికొచ్చిందన్న సంతోషం క్షణకాలంలో ఆవిరై పోతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ‘దళారీ రాజ్యం’ రాజ్యమేలుతోంది.రైతులకు మద్దతు ధర దేవుడెరుగు.. చెప్పిన రేటుకు ధాన్యం ఇవ్వకుంటే కల్లంలో నుంచి సరుకు బయటకు వెళ్లే పరిస్థితే కనిపించడం లేదు. పేరుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనేది దళారులే. ప్రభుత్వానికి రైతుల పేరుతో ధాన్యం విక్రయించేదీ దళారులే. సంపూర్ణ మద్దతు ధర అందించాల్సిన కూటమి ప్రభుత్వం.. మిల్లర్లు, వ్యాపారుల దందాకు గేట్లు తెరిచి రైతుల నోట్లో మట్టి కొడుతోంది.పంపాన వరప్రసాదరావు, వీఎస్వీ కృష్ణ కిరణ్ (సాక్షి, అమరావతి) : రాష్ట్రంలో కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోలేక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ గ్రేడ్కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1,725, ఏ గ్రేడ్కు రూ.1,740 చొప్పున మద్దతు ధర చెల్లించాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఏలుబడిలో 75 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.325 వరకు రైతులు నష్టపోతున్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల ప్రారంభం నుంచే ఈ దోపిడీ పర్వం ఊపందుకుంది. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ప్రోద్బలంతోనే దళారులు చక్రం తిప్పుతున్నారు. పైకి మాత్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది.రైతుల ఖాతాల్లో పూర్తి మద్దతు ధర జమ చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తోంది. కానీ, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతుల్లో నూటికి 90 శాతం మంది బస్తాకు రూ.150 నుంచి రూ.325 నష్టాన్ని మూటగట్టుకుని అమ్ముకున్న దుస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. ఏలూరు జిల్లా నల్లజర్ల, భీమడోలు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు తీరును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఈ పరిశీలనలో మిల్లర్ల దందా, దళారుల దోపిడీతో రైతులు పడుతున్న వెతలు వెలుగు చూశాయి. సిండికేట్గా మారిన మిల్లర్లు ⇒ రైతులకు మేలు చేసేందుకే అంటూ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ఎత్తేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం మిల్లర్లు, దళారుల నెత్తిన పాలు పోసినట్టయ్యింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు/వ్యాపారులు సిండికేట్ అయ్యారు. జట్టు కూలీల (హమాలీలు)ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కోత కోసిన తర్వాత పంటను బస్తాల్లోకి నింపి వాహనాల్లో ఎక్కించాలంటే కూలీలు అవసరం. కానీ రైతులు జల్లెడపట్టినా కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది.⇒‘దళారీ మాకు ముందుగానే రూ.10 వేలు ఇచ్చారు. ప్రభుత్వానికి పని చేస్తే డబ్బులు ఎప్పుడో వస్తాయి. మా ఇబ్బందులు మాకుంటాయి. అందుకే వెంటనే కూలి వచ్చేచోటే పనికి వస్తున్నాం’ అంటూ ఓ హమాలీ చెప్పుకొచ్చారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుందామంటే కనీస సౌకర్యాల్లేక రైతులకు దిక్కుతోచడం లేదు. రోడ్లపై ఆరబెట్టుకుందామంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం తరఫున పని చేసేందుకు కూలీలు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. దీంతో చేసేది లేక ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నష్టానికే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.పెట్టుబడి సాయం అందక అప్పులు⇒ గత ఐదేళ్లలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మేలో తొలి విడత పెట్టుబడి సాయం రూ.7,500 చొప్పున రైతుల ఖాతాకు జమ అయ్యేది. అలాగే పంటల బీమా పరిహారం కూడా రైతుల ఖాతాలో జమ చేసేవారు. ఖరీఫ్ పంట సాగులో దుక్కి పనులతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఈ సొమ్ము ఎంతగానో అక్కరకు వచ్చేది. ⇒ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా రూపాయి కూడా జమ చేయలేదు. దీంతో ఈ ఏడాది పెట్టుబడి పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు నానా అగచాట్లు పడ్డారు. ⇒ అత్యధిక శాతం మంది రైతులు ధాన్యం వ్యాపారుల (దళారులు) వద్ద చేబదులు తీసుకొని సాగు చేస్తే, మరికొంత మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3–5తో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పంట సాగు చేశారు. మరో వైపు విత్తు నుంచి కోత వరకు రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో విజృంభించిన తెగుళ్లు, చీడపీడల దాడికి దిగుబడులు కాస్త తగ్గిపోయాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోసిన తర్వాత తేమ లేకుండా ఆరబెట్టి, కేంద్రానికి తీసుకెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు. ⇒ ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. పంట ఆరబెట్టుకునేందుకు కూలీల ఖర్చు భారంగా మారుతోంది. సరైన టార్ఫలిన్లు, ఫ్లాట్ఫారాలు లేక పోవడంతో పంటను జాగ్రత్త చేసి మంచి రేటుకు అమ్ముకునే గత్యంతరం లేక నష్టమని తెలిసినా తక్కువ రేటుకే దళారులకు తెగనమ్ముకుంటున్నారు. రూ.1,480 కోట్ల దోపిడీకి ప్లాన్!⇒ ఖరీఫ్లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యంగా ప్రకటించింది. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. అయితే రైతులు కోసిన పంటను బస్తాల్లో నింపి, మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి రైతుల పంటను మిల్లులకు తరలించేందుకు కమీషన్ల పేరిట భారీ దోపిడీకి తెరదీశారు.⇒ ప్రస్తుత సీజన్లో కోసిన పంటను కోసినట్టే విక్రయిస్తే దళారులు 75 కేజీల బస్తాకు రూ.1,400కు బేరం కుదుర్చుకుంటున్నారు. కొంత ఆరిన పంటకు రూ.1550 – రూ.1600 లెక్కగడుతున్నారు. ఇలా టన్నుకు ఒక్కో రైతు సుమారు రూ.2,100 నుంచి రూ.4 వేల వరకు నష్టపోతున్నాడు. ఈ లెక్కన 37 లక్షల టన్నుల సేకరణకు రూ.6,382 కోట్లు మద్దతు ధర రైతులుకు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో సుమారు రూ.1,480 కోట్ల మేర మిల్లర్లు, దళారులు కలిసి బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది.గత ప్రభుత్వంలో దళారులకు ముకుతాడు⇒ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రస్తుతం కోతలు ప్రారంభం అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి మిగిలిన జిల్లాల్లో కోతలు ఊపందుకుంటాయి. డిసెంబర్లో పూర్తి స్థాయిలో ధాన్యం ఉత్పత్తులు వస్తాయి. అయితే ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ రూ.50.90 కోట్లు విలువైన 22,122 టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ, ఇప్పటికీ ధాన్యం విక్రయించిన వారిలో చాలా మంది రైతులకు రెండు రోజులు దాటినా మద్దతు ధర జమ కాలేదు. ⇒ గత ప్రభుత్వంలో రైతులకు వాస్తవ మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ట్రక్ షీట్ జనరేట్ చేసే సమయంలోనే ఏ మిల్లుకు లోడు వెళ్తుందో తెలిసేది. దీంతో దళారులు ముందుగా రైతులను మభ్యపెట్టే, బెదిరించే ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రైతులు సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తోలుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్టు(జీఎల్టీ) చార్జీలు ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సుమారు రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. దాదాపు 39 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించింది.కోతకు రెట్టింపు ఖర్చయ్యిందినేను ఆరు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. రెండు రోజుల కిందటే పంటను (సంపత్ స్వర్ణ) కోశాను. తేమ శాతం ఎక్కువగా ఉంటే సరైన ధర దక్కట్లేదు. అందుకే దేవుడిపైనే భారం వేసి రోడ్డు పక్కన ఆరబోస్తున్నా. ఇటీవల వర్షానికి చేను వాలిపోయింది. అందుకే మిషన్పై ఎకరా పంటను గంటలో కోయాల్సి ఉండగా రెండున్నర గంటలు పట్టింది. ఎకరా కోతకు రూ.3 వేలు అవుతుంటే.. నాకు మాత్రం రూ.7 వేలు దాటింది. ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.26 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఆ స్థాయిలో మాత్రం మాకు మద్దతు ధర దక్కట్లేదు. – మర్రిపూడి నాగరాజు, అచెన్నపాలెం, ఏలూరు జిల్లాపెట్టుబడి సాయం అందలేదు1.80 ఎకరాల్లో ఎంటీయూ 7029 రకం వరి వేశాను. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చయ్యింది. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వచ్చింది. ఈసారి పెట్టుబడి లేక చాలా అగచాట్లు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు కోసిన పంటను అయినకాడకి అమ్ముకోవాల్సి వస్తోంది. – చావా నాగేశ్వరరావు, నల్లజర్ల, ఏలూరు జిల్లాఆరబెట్టుకునే అవకాశం లేదునేను ఐదెకరాల్లో వరి సాగు చేశా. ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ధాన్యం షావుకారు(వ్యాపారి) వద్ద చేబదులు తీసుకున్నాం. ఆరబెట్టుకునేందుకు అవకాశం లేక వ్యాపారికే అమ్మేసుకున్నా. ప్రభుత్వం వసతులు కల్పించి ఉంటే మాకు మంచి ధర దక్కేది. – ప్రగడ సురేష్, గౌరీపట్నం, పశ్చిమగోదావరి జిల్లాఆరబెట్టుకోలేకే అమ్ముకుంటున్నాం⇒ ఏలూరు జిల్లా నల్లజర్ల మండలం మారెళ్లమూడికి చెందిన రైతు రామాంజనేయులు 3 ఎకరాల్లో పీఆర్ 126 రకం వరి వేశాడు. 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో బెంగళూరు నుంచి వచ్చే యంత్రాల సాయంతో కోత కోశారు. గంటకు రూ.3 వేలు తీసుకున్నారు. ‘కోసిన ధాన్యాన్ని ఆరబెడితే కానీ తేమ శాతం తగ్గదు. తేమ శాతం తగ్గితే కానీ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర ఇవ్వరు. ఆరబెట్టేందుకు గ్రామాల్లో కనీస సౌకర్యాల్లేవు. చేసేది లేక ధాన్యం షావుకారుకు బస్తా రూ.1,400 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ ఇంకా డబ్బులు చేతికి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో రైతు కమిటీలకు ట్రాక్టర్లు, హార్వస్టర్లు, కల్టివేటర్లు ఇచ్చారు. అదే విధంగా డ్రైయర్లు, టార్పాలిన్లు ఇస్తే ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. తేమ శాతం తగ్గాక మద్దతు ధరకు అమ్ముకోగలుగుతాం’ అని చెప్పుకొచ్చాడు.గతిలేక షావుకారికి అమ్మేశా⇒ ఈ రైతు పేరు మొన్ని శ్రీను. ఏలూరు జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన ఈయన ఖరీఫ్లో రెండెకరాల్లో సంపత్ స్వర్ణ రకం వరి సాగు చేశాడు. ఈసారి పెట్టుబడి సాయం అందక షావుకారుల దగ్గర చేబదులు తీసుకున్నాడు. ఎకరాకు 37 బస్తాల దిగుబడి వచ్చింది. ‘కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్నా. కొనుగోలు కేంద్రంలో అమ్ముకుంటే బస్తా (75 కేజీలు)కు రూ.1,725 వస్తుంది. కానీ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు.పైగా పట్టుబడి పట్టే వాళ్లు (హమాలీలు) అందరూ షావుకారుల దగ్గరే ఉన్నారు. అందుకే షావుకారుతో మాట్లాడాను. తేమ శాతం ఎక్కువగా ఉందన్న కారణంతో బస్తాకు రూ.1,400 చొప్పున ఇస్తానన్నారు. అది కూడా 15 రోజులకో.. 20 రోజులకో ఇస్తారు. నష్టపోతున్నామని తెలుసు. కానీ వాళ్లకు అమ్మడం తప్ప మాకు వేరే దారి లేద’ని ఆవేదన వ్యక్తం చేశాడు. -
పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రాష్ట్రంలో ఈసారి 60.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. దీంట్లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారముందని చెప్పారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్గా క్వింటాల్కు రూ.500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గుచూపినట్టు తెలిపారు. ఈ మొత్తం ధాన్యం సేకరణకు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, అందులో ఇప్పటికే రూ.20 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. 10 నెలల వ్యవధిలోనే పౌరసరఫరాల సంస్థకు ఉన్న రుణంలో రూ.11,537.40 కోట్ల భారాన్ని తగ్గించుకున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బియ్యానికి బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎలాంటి అవాంతరాలు సంభవించినా, అధిగమించేందుకు అధికారులను సన్నద్ధం చేయాలని పౌర సరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్.చౌహాన్ను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిబంధనల మేరకే బ్యాంకు గ్యారంటీలను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా వ్యవహరించవద్దని ఆయన అధికారులకు సూచించారు. ధాన్యం కొను గోళ్ల విషయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా ఉండేలా చూడాలని ఉద్బోధించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగో ళ్లపై పౌరసరఫరాల కార్యాలయం నుంచి మంత్రి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కోటి న్నర మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. ఇందుకోసం రూ.30 వేల కోట్లు అవసరమ వుతాయని ఆయన తెలిపా రు. ఇప్పటికే రాష్ట్ర ప్ర భుత్వం రూ.20 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల కోసం కేటా యించిందని, అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని చెప్పారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు అందించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ధాన్యం కొను గోళ్లలో మిల్లర్ల సహకారం తప్పనిసరిగా ఉండాల న్నారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలపై ఆందోళన చెందాల్సి న అవసరం లేదని, ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీలను వాపస్ చేయ నున్నట్లు చెప్పారు. మిల్లర్ల కోరిక మేరకు ధాన్యం మిల్లింగ్ చార్జీలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతులు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్లు ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.యస్ చౌహాన్, కమిషనర్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకా అలా, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిభూదాన్పోచంపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా భూదాన్పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారిస్తూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ...రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడిచినా తూకం వేయడం లేదన్నారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూదాన్పోచంపల్లి పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి, నాయకులు, రైతులు రావుల శేఖర్రెడ్డి, సామ రవీందర్రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరబోసిన ధాన్యం నీటిపాలు
చౌటుప్పల్: సకాలంలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలు చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మంగళవారం సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని తిరిగి కుప్పలు పోసుకునే సమయంలో వర్షం రావడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులుపెట్టారు. అప్పటికప్పుడు ధాన్యాన్ని కుప్పలుగా పోసుకున్నారు. పట్టాలు కప్పుకున్నారు. పెద్ద ధాన్యం కుప్పలను ట్రాక్టర్లతో దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా వర్షం భారీగా కురవడంతో వరద నీటి ప్రవాహంలో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు. -
చిన్న రైతులకు అ‘ధన’పు తోడ్పాటు
చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయడంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సహకారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో రైతులకు ఉత్పత్తుల నిల్వ, మార్కెట్తో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతులకు ఎలాంటి సేవలు అందిస్తోంది.. టెక్నాలజీ పరంగా పెరిగిన సౌలభ్యాలు.. తదితర అంశాలపై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్ చట్టనాథన్ దేవరాజన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య.ఏజీని ప్రారంభించాం. మొదట నష్టాల్లో ఉన్న ఆర్య కొలేటరల్స్ అనే సంస్థను కొనుగోలు చేశాం. తర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా పని చేస్తుంది?నాథన్: మా సంస్థ ప్రధానంగా మూడు విభాగాలుగా పనిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ సమ్మిళితం చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.సాక్షి: రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?నాథన్: దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్రధాన సమస్య దిగుబడిని నిల్వ చేయడం. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేర్హౌస్లను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబడులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఈలోపు అవసరమున్న రైతులకు దిగుబడులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.సాక్షి: ఎలాంటి దిగుబడులకు స్టోరేజ్ కల్పిస్తున్నారు.. సామర్థ్యం ఎంత?నాథన్: మాది ప్రధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్ఫామ్. అంటే అన్ని రకాల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్, మార్కెటింగ్, ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. సీజన్ను బట్టి దేశవ్యాప్తంగా 3000 వేర్హౌస్లను నిర్వహిస్తున్నాం. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్ సదుపాయం కల్పిస్తున్నాం.సాక్షి: ఎక్కడెక్కడ మీ కార్యకలాపాలు ఉన్నాయి?నాథన్: కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రభుత్వాల సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నాం. -
ధాన్యం బకాయిలివ్వరా?
సాక్షి, అమలాపురం: భారీ వర్షాలు.. వరదలతో వరి చేలు చెరువులుగా మారిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందలేదు. ఇంకోవైపు రబీకి సంబంధించి ధాన్యం బకాయిలు సైతం రెండు, మూడు నెలలుగా జమ కావడం లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు సోమవారం అమలాపురం కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా చేశారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్కు వచి్చన జేసీ నుపూర్ అజయ్ కారును పది నిమషాల పాటు అడ్డుకున్నారు. మూడు మండలాల నుంచి తరలివచ్చి.. అల్లవరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి మండలాలకు చెందిన సుమారు 60 మంది రైతులు కలెక్టరేట్కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. మే నెలలో అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటికీ సొమ్ములు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. తమకు రావాల్సిన సొమ్ములు కోసం జిల్లా ఉన్నతాధికారులకు, గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులకు రూ.154 కోట్ల వరకు ధాన్యం సొమ్ములు చెల్లించాల్సి ఉంది. డీఆర్వో వి.వెంకటేశ్వర్లు రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కలెక్టర్ వరద పర్యటనలో ఉన్నందున జేసీ నుపూర్ కార్యాలయానికి వచ్చి ఐదుగురు రైతులు మాట్లాడాలని డీఆర్వో సూచించారు. దీంతో రైతులు వాగి్వవాదానికి దిగారు. రైతులంతా వస్తామని పట్టుబట్టారు. ఆయన వెంట ప్రధాన గేట్లును నెట్టుకుంటూ కార్యాలయం వైపు చొచ్చుకురాగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ అజయ్ రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సొమ్ములు నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. జేసీ హామీతో రైతులు వెనుదిరిగారు. ఆత్మహత్యలే శరణ్యం ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మే నెలలో ధాన్యం విక్రయించగా అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం సొమ్ము చెల్లించడానికి వీలు కాలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం అమ్మకాలు చేసి 70 రోజులు అవుతున్నా సొమ్ములు ఖాతాల్లో జమ చేయకపోవడంతో నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని, నెలాఖరు నాటికి ధాన్యం సొమ్ములు ఇవ్వకుంటే సాగు సమ్మె చేపడతామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో సకాలంలో సొమ్ములు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ములు 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమయ్యేవి. గత ఏడాది ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు చేసిన వారంలోనే సొమ్ములు పడడాన్ని రైతులు గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు సొమ్ములు కూడా మొదట్లో సకాలంలో వేశారు. అదేవిధంగా మే 24, 25 తేదీలలో రెమాల్ తుపాను సమయంలో వర్షాలు కురుస్తుండగా రైతుల వద్ద నుంచి ఏకంగా 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత ఒకసారి రూ.117 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులకు చెల్లింపులు చేయలేదు.మే మొదటి వారంలో అమ్మాం నేను మే మొదటి వారంలో ధాన్యం విక్రయించాను. రూ.1.20 లక్షల వరకు సొమ్ములు రావాల్సి ఉంది. రబీ కోతలకు మెషీన్ ఖర్చులు నుంచి కూలీలు, ఖరీఫ్ విత్తనాలు, దమ్ములు వరకు అప్పులు చేశాను. 70 రోజులు దాటుతున్నా సొమ్ములు ఇవ్వకపోవడం అన్యాయం. – చొల్లంగి రామకృష్ణ, దేవగుప్తం గ్రామంఆత్మహత్యలే శరణ్యం ధాన్యం అమ్మిన సొమ్ముల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇలాగే ఉంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. జేసీ మేడమ్ శనివారం చివరిలో సొమ్ములు మా ఖాతాలో పడతాయని చెప్పారు. అలా జరగకపోతే నిరాహార దీక్షలు చేపడతాం. – కర్రి రాములు, జనుపల్లి గ్రామం -
బ్లాక్లిస్టులో మిల్లులు.. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022–23 రబీ సీజన్లోని 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) ధాన్యాన్ని సీఎంఆర్ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కొరడా ఝుళిపించనుంది. మిల్లర్ల విషయంలో ఉదాసీనత గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంభించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022–23 రబీ (యాసంగి) సీజన్కు సంబంధించిన 35 ఎల్ఎంటీల ధాన్యం రికవరీ బాధ్యతలను.. ప్రభుత్వం టెండర్ల ద్వారా నాలుగు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచినా 35 ఎల్ఎంటీల్లో 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022–23 యాసంగి సీజన్లో మిల్లుల్లో నిల్వ చేసినట్లుగా చెపుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్టు సంస్థలకు అప్పగించకపోతే.. వాటిని డిఫాల్ట్ మిల్లులుగా పేర్కొంటూ బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. 2022–23 యాసంగి ధాన్యంపైనే రచ్చ ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధరకు కొని..సీఎంఆర్ కోసం మిల్లులకు పంపడం జరుగుతుంది. ఖరీఫ్ ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి సీఎంఆర్ కింద అప్పగించే మిల్లర్లు, రబీ ధాన్యాన్ని మాత్రం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)గా ఎఫ్సీఐకి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలుగా విరిగిపోతాయి. ఈ నేపథ్యంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బాయిల్డ్ రైస్ను సీఎంఆర్గా తీసుకునేది లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత ప్రతి ఏటా 10 నుంచి 15 ఎల్ఎంటీల బియ్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్గా తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో 2020– 2021, 2021–2022లలో మిల్లర్లు రబీ ధాన్యాన్ని కూడా ముడిబియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించారు. కాగా 2022–23 రబీ సీజన్లో 65 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం యధావిధిగా మిల్లులకు అప్పగించింది. అయితే మిల్లర్లు ప్రభుత్వం వెసులుబాటు ఇచి్చన విధంగా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్గా మిల్లింగ్ చేసి, మిగతా ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్లకు పరిమితం చేశారు. అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, తాము యాసంగి బియ్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించలేమని మిల్లర్లు తెగేసి చెప్పారు. దీంతో పౌరసరఫరాల శాఖ మిల్లుల్లోని ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించగా ఏడు సంస్థలు క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,860 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ధర తక్కువగా రావడంతో ఆ బిడ్లను రద్దు చేసిన అధికారులు మళ్లీ టెండర్లను పిలిచారు. ఈసారి 10 వేల టన్నుల కెపాసిటీ గల మిల్లర్లంతా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. అంటే ఏ మిల్లులో ఉన్న ధాన్యం ఆ మిల్లరే కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఈ టెండర్లు ఆగిపోయాయి. కొత్త టెండర్లు.. స్కామ్ ఆరోపణలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే మిల్లుల్లో ఉన్న 2022–23 రబీ ధాన్యాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టింది. కానీ ఈ ధాన్యాన్ని ఇంతవరకు ఎందుకు మిల్లింగ్ చేయలేకపోయారనే అంశంపై శ్రద్ధ పెట్టలేదు. ఎప్పటిలాగానే మిల్లర్లకు భారం కాకుండా నిబంధనలను మార్చి మిల్లుల్లో ఉన్నట్టు చెబుతున్న 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు ధాన్యం కొనుగోలుకు ముందుకు రాగా, మూడు నెలల క్రితం నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. క్వింటాలు ధాన్యానికి సగటున రూ.2,007 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 90 రోజుల్లోగా అంటే ఈనెల 23వ తేదీ లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ 4 సంస్థలు కలిపి ఇప్పటివరకు 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లోపు విపక్షాలు ఈ తతంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణా్రస్తాలు సంధించడం మొదలు పెట్టాయి. మిల్లుల వద్ద ధాన్యానికి బదులు క్వింటాలుకు రూ.2,223 చొప్పున కాంట్రాక్టు సంస్థలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఈ ధాన్యం వేలం ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిరుటి 35 ఎల్ఎంటీల రబీ ధాన్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 4 సంస్థలకు మరో 3 నెలల గడువు ఇవ్వడంతో పాటు అప్పటికి ధాన్యం అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లలో జవాబుదారీతనం పెంచేలా.. మిల్లర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఇకపై వారివద్ద సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ధాన్యం అప్పగించేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేస్తే మిల్లర్లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైగా రైస్ మిల్లులు ఉండగా, ఒక్కో మిల్లర్ నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నా రూ.3,500 కోట్లకు పైగా జమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 100% సెక్యూరిటీ డిపాజిట్ ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్ అమల్లో ఉంది. అంటే మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం ప్రభుత్వం అప్పగిస్తుందన్నమాట. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. అంటే మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు. -
ధాన్యం.. దయనీయం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. గత రెండురోజులుగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి.ఇంతకుముందు వర్షానికి తడవడంతో ఆరబోసుకున్న వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షం కారణంగా రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.ఉమ్మడి కరీంనగర్లోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు మండలాల్లో క్వింటాళ్ల కొద్దీ వడ్లు తడిచిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి కాయలు రాలిపోయాయి. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. -
ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
ఈ చిత్రంలోని రైతు దంపతులు మీసా పరుశరాములు, రేణుక (రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్) 2.20 ఎకరాల సొంత భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పండిన ధాన్యాన్ని 17 రోజుల క్రితం ముస్తాబాద్లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. కానీ ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. అప్ప ట్నుంచి ఇప్పటివరకు మూడుసార్లు వర్షాలతో ధాన్యం తడిసింది. ఇప్పుడు 17% తేమ వచ్చే వరకు కొనలేమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, ఈలోగా మళ్లీ వర్షం పడటం, మళ్లీ ఆరబెట్టడం నిత్యకృత్యంగా మారడంతో ఈ దంపతులు లబోదిబోమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: తడిచిన ధాన్యాన్ని సైతం కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇచి్చన హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 17 శాతం తేమ వచ్చేదాకా ధాన్యం కాంటా వేయలేమని కరాఖండిగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఇప్పటికే చాలాసార్లు తడిచింది. ధాన్యం తడవడం, రైతులు ఆరబెట్టేందుకు అష్టకష్టాలూ పడటం నిత్యకృత్యమైంది. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేస్తున్న సూచనలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 45 రోజుల్లో 27 ఎల్ఎంటీలే సేకరణ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతుల పంటను నీళ్లపాలు చేస్తున్నాయి. వర్షం పడిన ప్రతిసారీ పౌరసరఫరాల శాఖ తడిచిన ధాన్యం కొంటామనే హామీ ఇవ్వడమే తప్ప అమలుపై శ్రద్ధ చూపించడం లేదు. దీంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతుల వడ్లు పలుమార్లు నీళ్లలో తడిశాయి. చాలాచోట్ల ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది.ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, ఇప్పటివరకు 27 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సైతం కోతలు దాదాపుగా ముగిశాయి. వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కోతలు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే వరి కోసి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు అక్కడే ఆరబెట్టి, తమ వంతు వచ్చేంత వరకు కాంటా కోసం వేచిచూస్తున్నారు.రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నంబర్తో లింక్ అయితేనే కొనుగోళ్లు జరుపుతుండడంతో కొందరు రైతులతో పాటు కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా తేమ 17 శాతానికి చేరుకునే వరకు వేచి ఉండాలని చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.మిల్లర్ల కొర్రీలు మరోవైపు కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉన్నా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత ధాన్యం రంగు మారినా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. అలాంటి ధాన్యం లోడ్లు మిల్లులకు వస్తే నేరుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు ఫోన్లు చేసి పచ్చి ధాన్యాన్ని తీసుకోబోమని తేల్చిచెబుతున్నారు. తీసుకునే పక్షంలో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీయాల్సి ఉంటుందంటూ మెలిక పెడుతున్నారు.ధాన్యం కాంటాకే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పినట్లు వింటూ దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఈ అంశంపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో తడిచిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం. – ఇటీవల హైదరాబాద్లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
రైతన్నకు అకాల నష్టం
నిజామాబాద్/కామారెడ్డి నెట్వర్క్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని వారం ఉదయం 10 గంటల వరకు కురిసిన అకాల వర్షానికి కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయింది. పలుచోట్ల వర్షపు నీటి ప్రవాహంలో వడ్లు కొట్టుకుపోయాయి. చేతికందిన పంటను అమ్ముకు నే సమయంలో వర్షం దెబ్బతీయడంతో రై తులు కంటతడి పెడుతున్నారు. ఆర్మూరు, ఆలూర్, ఎడపల్లి, వర్ని, చందూర్, మోస్రా, సాలూర, రుద్రూర్, కోట గిరి, పొతంగల్, రెంజల్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల్లో రైతుల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, లింగంపేట, పి ట్లం, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలా ల్లో రోడ్లపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ధాన్యం రాశుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో పోలీసుస్టేషన్ సమీపంలో రోడ్లపై ఉన్న ధాన్యం రాశుల మధ్య నీరు భారీగా చేరడంతో మోటార్ల సహాయంతో తొలగించారు. వర్షాలతో అంతటా వరి కోతలకు బ్రేక్ పడింది. -
వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు
తిరుమలగిరి (తుంగతుర్తి)/జనగామ: వానల్లేక, సాగునీరు అందక చాలా చోట్ల వరి పంట దెబ్బతి న్నది. మిగిలిన చోట రైతులు వరికోతలు పూర్తి చేసి.. వ్యవసాయ మార్కెట్లకు తెస్తున్నారు. కానీ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తుండటం, అదీ సరిగా సాగకపోవడంతో.. పడిగాపులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తిరు మలగిరి, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. భారీగా పోటెత్తిన ధాన్యం: శనివారం తిరుమ లగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 47,660 బస్తాల ధాన్యం వచ్చింది. యాసంగి సీజన్ మొదలై నప్పటి నుంచి ఇంత భారీగా ధాన్యం రావడం ఇదే మొదటిసారి. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. వాతావరణంలో మార్పులతో రైతులు యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే మార్కెట్లోకి ధాన్యం ట్రాక్టర్లను అనుమతించాల్సి ఉండగా.. శనివారం తెల్లవారు జాము వరకు పంపలేదు. దీనితో రోడ్డు పైనే వందలకొద్దీ ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాగా ట్రేడర్లు ధాన్యానికి క్వింటాల్కు కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,980 ధర చెల్లించారు. జనగామలో కొనుగోళ్లు నిలిపేసిన ట్రేడర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళ న, ముగ్గురు ట్రేడర్లపై కేసుల నమోదు నేపథ్యంలో.. జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో మార్కెట్కు వరి ధాన్యం, మక్కలు, చింతపండు, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లను తీసుకువచ్చిన రైతులు వాటిని అమ్ముకో వడా నికి పడిగాపులు పడుతున్నారు. ఇక మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజునా యక్ శనివారం జనగామ మార్కెట్ కార్యాలయంలో.. ట్రేడర్లు, అడ్తిదారులతో రెండు గంటల పాటు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేట్ మార్కె ట్లోనూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని రాజునాయక్ కోరగా.. అది సాధ్యం కాదని ట్రేడర్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లేని నిబంధనలను జనగామ మార్కెట్పై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఈ మార్కెట్లో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్/ జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన అంశంపై సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అద నపు కలెక్టర్ రోహిత్ సింగ్కు నా అభినందనలు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. ముగ్గురు ట్రేడర్లపై కేసులు జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తు న్నారంటూ రైతులు బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ రోహిత్సింగ్.. మార్కెట్ కార్యదర్శి భాస్క ర్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకున్నాక కార్యదర్శిపై చర్యలు చేపడతామన్నారు. మరోవైపు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ రఘు పతిరెడ్డి తెలిపారు. ప్రైవేటు మార్కెట్లో ధాన్యానికి రూ.1,800కన్నా ఎక్కువ ధర ఇవ్వాలని అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు కేవలం రూ.30 పెంచి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్సీఐకి అప్పగించడం... ఎఫ్సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్గా ఎఫ్సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
Fact Check: రైతులకే ప్రా‘ధాన్యం’...'పచ్చ'రాతల్లోనే దైన్యం!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014–15లో రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లించింది. ఇక్కడ సగటున ఒక రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా కొనుగోలు చేశారన్నది ఎవరికైనా కలిగే సందేహం. అంటే ఇక్కడ దళారులు, మిల్లర్లు కొందరు రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లో సగటున ఒక రైతు నుంచి 24 టన్నుల ధాన్యం సేకరించినట్టు చూపారు. ఇక్కడ కూడా మద్దతు ధర మధ్యవర్తులే కాజేశారని తెలుస్తోంది కదా... దీనిని బట్టి టీడీపీ హయాంలో ధాన్యం దోపిడీ ఎంతగా సాగిందో అర్థమవుతోంది. కానీ నాడు కళ్లకు గంతలు కట్టుకున్న ఈనాడుకు ఇవేవీ కనిపించలేదు. ఇప్పుడు పారదర్శకంగా సేకరణ జరుగుతున్నా... లేనిపోని ఏడుపుగొట్టు రాతలు. సాక్షి, అమరావతి: రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టడం తెలుగుదేశం సంస్కృతి. వారి హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరించేది. కొనేదంతా మిల్లర్లు, దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200ల వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. కానీ, సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రతి సీజన్లోనూ ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట కొనుగోలు చేపట్టడంతో వాస్తవ రైతుకు పూర్తి మద్దతు ధర దక్కుతోంది. దీంతో తమ దళారుల దోపిడీ వ్యవస్థను నాశనం చేశారన్న ఆక్రోశం రామోజీ రాతల్లో నిలువెల్లా కనిపిస్తోంది. వాస్తవానికి రైతుకు మద్దతు ధరతో పాటు గన్నీ, లేబర్, రవాణా చార్జీలను సొంతంగా పెట్టుకున్న రైతుకు టన్నుకు రూ.2,523ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంట విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బయట మార్కెట్లోని వ్యాపారుల్లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. చేసేదేమీ లేక వారు సైతం ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మించి చెల్లిస్తూ కల్లాల్లోంచే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందువల్ల రైతులు మంచి రేటు వస్తున్న చోటే ధాన్యం అమ్ముకుంటున్నారు. అంత మాత్రాన ప్రభుత్వ సేకరణ తగ్గిందనడం ఎంతవరకు సమంజసం. ఈ వాస్తవాన్ని మరుగునపెట్టి రామోజీ రైతులపై కపట ప్రేమను ఒలకబోయడం చూస్తే జాలేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువలైన 2.65 కోట్ల టన్నులను ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచింది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 20లక్షల మంది అదనంగా రైతులు సంపూర్ణ మద్దతు ధరను అందుకున్నారు. ఆశాజనకంగా దిగుబడులు గత ఖరీఫ్లో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది చివరల్లో మిచాంగ్ తుఫాన్ కొంత ఇబ్బంది పెట్టినా ఎకరాకు అత్యధికంగా 40–42 బస్తాల దిగుబడి వచ్చింది. జనవరి పండుగ సీజన్ కావడం, పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు బియ్యం అవసరం పెరగడంతో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు మించి(సాధారణ రకానికి రూ.100కు పైగా ఫైన్ వెరైటీలకు రూ.200–500లకు పైగా) చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం. ఇదే క్రమంలో ఆర్బీకే ద్వారా 29.58లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ లెక్కన 44.58 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి బయటకు వెళ్లిపోయింది. అంటే దాదాపు ఈఖరీఫ్లో పంట మొత్తం విజయవంతంగా కొనుగోలు చేశారు. ఇంతటి ఫలితాన్ని రామోజీ కలలోకూడా ఊహించి ఉండరు. కానీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు అడ్డగోలు అభాండాలు వేశారు. కేంద్ర నిబంధనలు రామోజీకి తెలియవా... కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కట్లేదని గుండెలు బాదుకున్న రామోజీకి.. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు విధిస్తుందన్న విషయం తెలీదా? ఆ ప్రకారం తేమ 17శాతం మించితే కొనుగోలుకు ఎక్కడైనా అభ్యంతరం చెబుతారు కదా? ఇదే ఆసరాగా చేసుకుని టీడీపీ హయాంలో బస్తాలకు బస్తాలు అదనంగా రైతు నుంచి దోచేసినప్పుడు ఈనాడు గొంతెందుకు మూగబోయిందన్నది ఇక్కడి ప్రశ్న. అధికారంలో మనవాడు లేకుంటే దుమ్మెత్తి పోయడమే వారికి తెలిసిన న్యాయం. కానీ, సీఎం జగన్ రైతుకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేసి డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. ప్రకృతి వైప రీత్యాల సమయంలోనూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ♦ ఇక దుడ్డు రకాలు(జయ రకం ధాన్యం) కేరళకు ఎగుమతి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకుంది. అందువల్ల గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపారు. గతేడాది తుఫాన్ కంటే ముందే అక్కడ కోతలు పూర్తవడం, ప్రభుత్వం కంటే ముందుగా బయట వ్యాపారులు వచ్చి మంచి రేటు ఇచ్చి పంట కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి సేకరించే అవకాశం రాలేదు. దీనిని కూడా ఈనాడు వక్రీకరించింది. ♦ ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వమే కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తోంది. అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని బఫర్ గొడౌన్లు, మండల నిల్వ కేంద్రాలకు తరలించాలి. వీటిన్నింటికీ ప్రతి స్టేజీలో వేర్వేరు రవాణా వ్యవస్థలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంతాల్లో సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించింది. దానిపై దీనిని ఈనాడు ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగిస్తున్నారంటూ అబద్దపు ప్రచారం చేస్తోంది. -
నేటితో ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న 2022–23 రబీ సీజన్కు సంబంధించిన 35 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)ల ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగియనుంది. గత రబీలో సేకరించిన ధాన్యాన్ని రా రైస్గా మిల్లింగ్ చేయడానికి మిల్లర్లు ఆసక్తి చూపని విషయం తెలిసిందే. రబీలో సేకరించిన 66.84 ఎల్ఎంటీల ధాన్యం నుంచి బాయిల్డ్ రైస్కు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఇచ్చిన టార్గెట్ ప్రకారం సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) కింద ఎఫ్సీఐకు అప్పగించాలని నిర్ణయించారు. మిగతా ధాన్యాన్ని ముడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటంతో వారు ససేమిరా అన్నారు. దీంతో గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం కోసం బిడ్లు ఆహ్వానించినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ రద్దయింది. దీంతో గత నెలలో గ్లోబల్ టెండర్ నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు వేలంలో పాల్గొనే బిడ్డర్లతో ఇటీవల సమావేశం జరగగా, వేలం నిబంధనల్లో కొన్ని సవరణలను సూచించారు. ఈ మేరకు నిబంధనలను మారుస్తూ బిడ్లు దాఖలు చేసేందుకు గడువును శుక్రవారం వరకు పొడిగించారు. -
ఆ వడ్లకు పైసలిచ్చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు పంపిన 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏమైందో లెక్క తెలియడం లేదని సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్ పౌరసరఫరాల సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించి రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్లలో చోటు చేసుకున్న అవకతవకలే అందుకు కారణమని, మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు కూడా లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సర్కార్ ధాన్యం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకముందే రాజీ చేసుకోవాలని భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యం నిల్వ విలువను ఖర్చులతో కలిపి ప్రభుత్వానికి చెల్లించాలని ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గత సంవత్సరం రబీ(యాసంగి)లో సేకరించిన 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ముడిబియ్యంగా మిల్లింగ్ చేసేందుకు పనికిరాదని, బాయిల్డ్ రైస్గా మాత్రమే మిల్లింగ్ చేయడానికి వీలవుతుందని మిల్లర్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుల్లోనే నిల్వ చేసినట్లు లెక్కలు చూపించారు. ఇదే కాకుండా గత సంవత్సరం వానకాలానికి సంబంధించిన మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేసి, ఎఫ్సీఐకి సీఎంఆర్ అప్పగించడంలో మిల్లర్లు విఫలమయ్యారు. ఈ మొత్తం 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ సుమారు రూ. 18 వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. సంస్థకున్న రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఈ రూ.18 వేల కోట్లు చెల్లిస్తే తప్ప మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద ఉన్నట్లు చెపుతున్న 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై కీలక నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్ కుమార్, ఇతర అధికారులు ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మిల్లర్లు స్వయంగా ధాన్యం విలువ చెల్లించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కనీస మద్ధతు ధరకు తోడు, రవాణా, నిర్వహణ ఖర్చులన్నీ మిల్లర్ల నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వేలం ప్రయత్నాలు విఫలం.. మిల్లర్లు సీఎంఆర్కు తిరస్కరించిన యాసంగి ధాన్యాన్ని విక్రయించాలని గత ప్రభుత్వం ఆగస్టు నెలలో నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని అమ్మేందుకు బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లకు 10 సంస్థలే అర్హత సాధించడంతో పాటు ధాన్యం క్వింటాలుకు సగటు ధరను రూ.1865 గా కోట్ చేయడంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ప్రభుత్వం అక్టోబర్లో రెండో దఫా టెండర్లను ఆహ్వానించింది. నిబంధనలను సడలించి సాధారణ మిల్లర్లు కూడా బిడ్డింగ్లో పాల్గొనేలా టెండర్లను ఆహ్వానించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు దీరినప్పటికీ, పాత టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ, అందులో సగానికి పైగా విక్రయించినట్లు పౌరసరఫరాల సంస్థ ఇప్పటికే గుర్తించింది. కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ధాన్యాన్ని, బియ్యాన్ని విక్రయించినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల నుంచి ధాన్యం విలువకు సమానమైన మొత్తాన్ని ( క్వింటాలుకు రూ. 2,350) చొప్పున ముక్కు పిండి వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో మిల్లుల్లో ఉన్న ధాన్యంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
ఆర్ఎన్ఆర్ ధాన్యం @ రూ.3,545
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టించింది. క్వింటాల్ ధర రూ.3,545 పలికింది. మహబూబ్గర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయి లో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత్రమే పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,203 ఉండగా... మార్కెట్లో రూ. వెయ్యి నుంచి రూ.1,200 అధికంగా వస్తున్నది. బీపీ టీని అంతగా సాగు చేయకపోవడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోంది. అన్ని మార్కెట్లలోనూ పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరకే ఈ సీజన్లో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్కు క్యూ కట్టారు. దీంతో మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున అమ్మకానికి వస్తోంది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్ఎన్ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనె శాతం తక్కువ, షుగర్ పేషంట్లకు బాగుంటుందని డిమాండ్ పెరింగింది. గతంలో వేసే బీపీటీ (సోనా రకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు డిమాండ్ అధికంగా వస్తున్నది. అయితే యాసంగిలో ఎక్కువశాతం 1010 దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వచ్చే సీజన్ను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. -
ఉదారంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఇటీవల తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి వారిలో భరోసా నింపాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుపానుతో పంట నష్టం, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు.. కొన్ని నిబంధనలు సడలించైనా సరే రైతులకు న్యాయం చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు జరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి అప్పటికప్పుడే ఆదేశాలు జారీచేశారు. నష్టపోయిన రైతన్నలకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పంట నష్టపోయిన వారికి వైఎస్సార్ ఉచిత బీమా కింద వారికి పరిహారం అందించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థంగా చేపట్టి ఆదుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్పై ఆరా రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ (పంట నష్టం అంచనాలు) ప్రక్రియను ప్రారంభించారా? అని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి మొదలైన ఎన్యూమరేషన్ 18 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. 19వతేదీ నుంచి 22 వరకు సామాజిక తనిఖీల కోసం జాబితాలను ఆర్బీకేలలో అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఆ తరువాత అభ్యంతరాల స్వీకరణ, సవరణల అనంతరం ఈ నెలాఖరుకు జిల్లా కలెక్టర్లు తుది జాబితాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సంక్రాంతి లోగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి జోగి రమేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ దిగుబడులు...144 లక్షల టన్నులు
సాక్షి, అమరావతి: ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులపై ఆశాజనకంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఖరీఫ్ సీజన్లో సాధారణ విస్తీర్ణం 84.98 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 89.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దిగుబడులు 164 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 74 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. దిగుబడులు 144 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. అయితే, రెండో ముందస్తు అంచనా నివేదికలో దిగుబడులు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జూలైలో అధిక, సెప్టెంబర్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవగా, జూన్, ఆగస్టు నెలల్లో కనీస వర్షపాతం నమోదుకాక రైతులు ఇబ్బందిపడ్డారు. సగటున 593 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 493.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ ప్రభావం ఖరీఫ్ పంటల సాగుపై పడింది. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే, దిగుబడులు మాత్రం ఆశాజనకంగా ఉంటాయని రైతులు అంచనా వేస్తున్నారు. పంటల అంచనాలు ఇలా.. మొదటి ముందస్తు అంచనా దిగుబడుల నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆహార పంటలు 47లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 73.89లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రధానంగా వరి గత ఏడాది 40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 74.81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది 36.55 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 67.43 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చెరకు 24.43లక్షల టన్నులు, పామాయిల్ 22.87లక్షల టన్నులు, మొక్కజొన్న 4.88లక్షల టన్నులు, వేరుశనగ 2.32లక్షల టన్నులు, అపరాలు 2.17లక్షల టన్నులు చొప్పున దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రతికూల వాతావరణంలో సైతం మిరప రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాలకు పైగా సాగవగా, 12 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కాగా, పత్తి 12.85లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. -
ధర వరించేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 3,500 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్బీకేల్లో ఈ–క్రాప్ సోషల్ ఆడిట్ పూర్తయిన వెంటనే షెడ్యూల్ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరించనుంది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలకు ఎటువంటి లక్ష్యం నిర్ధేశించకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లోనూ మంచి ధర ఖరీఫ్లో 67.43 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 50 శాతం వరకు ఏ–గ్రేడ్ (ఫైన్ వెరైటీలు) ఉండటం విశేషం. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పంజాబ్ రైస్–126 రకాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం దిగుబడుల్లో విత్తనాలకు, గృహ అవసరాలతోపాటు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా.. 50–60 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఫైన్ వెరైటీలతోపాటు సాధారణ ధాన్యం రకాలను కూడా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు ఆరి్థక భారాన్ని తగ్గిస్తూ రవాణా, హమాలీ, గన్నీ చార్జీల కింద టన్నుకు రూ.2,523 అందిస్తోంది. తద్వారా బయటి వ్యాపారులు తమకు కావాల్సిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పకడ్బందీగా రవాణా ఏర్పాట్లు రవాణా శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్ల సమన్వయంతో జాప్యం లేకుండా కళ్లాల్లోని ధాన్యాన్ని తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆర్బీకే పరిధిలో 10–15 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చి ధాన్యం రవాణాను పర్యవేక్షించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో నవంబర్ తొలి రెండు వారాల్లో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. మూడవ వారంలో ఎన్టీఆర్, నాలుగో వారంలో పార్వతీపురం మన్యం, చివరి వారంలో శ్రీకాకుళం, విజయనగరంలో పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో విశాఖపట్నం, అనకాపల్లితో పాటు డిసెంబర్ నెలాఖరు నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. చాలా ప్రాంతాల్లో లేట్ ఖరీఫ్తో కోతలు ఆలస్యం అవుతున్నాయి. దళారులతో పని లేకుండా.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థను రూపుమాపి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల ప్రమేయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. 21 రోజుల్లోనే మద్దతు ధర జమ చేసేలా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలను వివరిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది. రైతులు ఆర్బీకేలో ధాన్యం ఇచ్చిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీవో) వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అందులో ధాన్యం వివరాలు, ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర నమోదై ఉంటాయి. ఎఫ్టీవో జనరేట్ అయితే రైతుకు, ధాన్యానికి సంబంధం ఉండదు. పూర్తి మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రవాణా, దిగుమతి, మిల్లర్కు సరుకు వచ్చినట్టు ఇచ్చే క్లియరెన్స్ను మిల్లుల వద్ద ప్రభుత్వం నియమించే కస్టోడియన్ (డిప్యూటీ తహసీల్దార్ స్థాయి) అధికారులు చూసుకుంటారు. తేమ, ఇతర నాణ్యత విషయంలో ఆర్బీకేలో ధ్రువీకరించిన ప్రమాణాలను మిల్లరు ఫైనల్గా పరిగణించాల్సిందే. రైతులకు మిల్లర్ నుంచి ఎటువంటి ఒత్తిడి/డిమాండ్ వచ్చినా ప్రభుత్వ కాల్సెంటర్ 1967కు సంప్రదిస్తే వెంటనే చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొనుగోళ్లకు సిద్ధం గోదావరి జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. వచ్చే వారంలో 150 ఆర్బీకేల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట రైతులు పంటను ఆరబెడుతున్నారు. మార్కెట్లో ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. అందుకే గోదావరి జిల్లాల్లో ఫైన్ వెరైటీలతో పాటు సాధారణ రకాలను కూడా ప్రైవేటు వ్యాపారులు మంచి ధరకు కొంటున్నట్టు తెలుస్తోంది. రైతుకు పూర్తి మద్దతు ధర అంటే ఎక్కువ రేటు తీసుకురావడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పెద్ద మిల్లుల్లో ధాన్యం ఆరబోతకు డ్రయర్లు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాం. తొలుత వంద మిల్లుల్లో పెట్టాలని కోరాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత పంట ఉత్పత్తులు బాగుండటంతో మార్కెట్లో ధర కూడా బాగా పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చినా తీసుకుంటాం. రైతులు ఆర్బీకేల్లో ధాన్యం ఇచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా అవసరమైన సంచులను అందుబాటులో ఉంచాం. సీఎంఆర్ కేటాయించిన ప్రకారం మిల్లర్లు సంచులు అందిస్తారు. ధాన్యం రవాణా కోసం ముందస్తుగానే వాహనాలను రిజిస్ట్రేషన్ చేశాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ మద్దతు ధరల చెల్లింపు ఇలా.. ఏ–గ్రేడ్ ధాన్యం: రూ.2,203 (క్వింటాల్కు) రవాణా, హమాలీ, గన్నీ చార్జీలు:రూ.2,523 (టన్నుకు) సాధారణ రకాలకురూ.2,183 (క్వింటాల్కు) -
ఆకస్మిక వర్షం.. తడిసిన ధాన్యం
శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో సుమారు పది వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. వీటిలో సుమారు 1.20 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం రాశులు, ఆరబోసిన వడ్లు ఉండగా.. వేలాది క్వింటాళ్లు తడిసిపో యాయి. ఆయా కేంద్రాల్లో లోతట్టు ప్రాంతంలో పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శాలిగౌరారంలోని వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణ సీసీ ప్లాట్ఫాం కావడంతో ధాన్యం అత్యధికంగా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన, నీటిలో ఉన్న ధాన్యం రాశులను బయటకు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. -
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్టాపిక్గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
ధాన్యం రవాణాకూ జీపీఎస్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం పక్కదారులు పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిఘా చర్యలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బియ్యం రవాణా వాహనాలకే పరిమితమైన జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని ధాన్యం రవాణా విషయంలోనూ పాటించాలని నిర్దేశించింది. రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్దేశించిన ‘మినిమం త్రెషోల్డ్ పారామీటర్స్ – ఎంటీపీస్’లో భాగంగా ధాన్యం రవాణా వాహనాలన్నింటినీ జీపీఎస్తో అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ వానాకాలం సీజన్లో వచ్చే పంట నుంచే ఈ విధానం అమలు చేసేందుకు విధివిధానాలను కేంద్రం తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు పంపింది. దీంతో ధాన్యం వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చించారు. మిల్లులకు తీసుకెళ్లే వాహనాలన్నింటికీ... రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక తూకం వేసి రైస్మిల్లులకు పంపిస్తారు. ఈ ధాన్యం రైస్మిల్లులకు వెళ్లాక మిల్లింగ్ అయి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రూపంలో ఎఫ్సీఐ గోదాములకు తరలుతుంది. ఈ క్రమంలో తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో మిల్లులకు ఎంత ధాన్యం వస్తోంది? మిల్లుల నుంచి బియ్యం రూపంలో గోదాములకు ఎంత పరిమాణంలో తిరిగి వెళ్తోందనే అంశంపై నిఘా కోసం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని జీపీఎస్తో అనుసంధానించాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రతి సీజన్లో సుమారు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఒక్కో కేంద్రం నుంచి మిల్లుల లభ్యతను బట్టి పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు కూడా పంపుతున్నారు. సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు.. బియ్యం లారీలు గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు... అక్కడి నుంచి పౌరసరఫరాల దుకాణాలకు చేరేందుకు 2016లోనే జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్గా సీవీ ఆనంద్ ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికీ సక్రమంగా అమలు కావట్లేదు. దీన్ని పర్యవేక్షించే యంత్రాంగం కూడా లేదు. బియ్యం లారీల కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించి ప్రతినెలా బియ్యం పంపిణీ జరుపుతుండగా దీన్నే తూతూమంత్రంగా అమలు చేస్తున్న పౌరసరఫరాల సంస్థ... ధాన్యం సేకరణలో జీపీఎస్ ట్రాకింగ్ చేయడం కష్టమేనని చెబుతోంది. ఎందుకంటే ప్రతి సీజన్లో రెండు నెలలపాటు సాగే ధాన్యం రవాణాకు అందుబాటులో ఉన్న అన్ని లారీలతోపాటు గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లను వినియోగిస్తారు. రాష్ట్రంలోని 130కిపైగా ఉన్న సెక్టార్ల నుంచి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వచ్చే ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపేటప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు తేల్చినట్లు సమాచారం. అయితే కేంద్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో వానాకాలం సీజన్ నుంచే ఎలా అమలు చేయాలనే దానిపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగే కార్యదర్శుల సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. -
అదనపు ధాన్యమంతా ఎగుమతులకే
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... ‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరే... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో మిలు్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. నిర్దేశత సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఎఫ్సీఐ కొర్రీలు పెడుతోంది. దాదాపు 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. -
పెట్టుబడిదారులకు మిల్లింగ్లో విస్తృత అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ పరిశ్రమలో విస్తృత అవకాశాలున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఇందులోభాగంగానే ప్రభుత్వమే సొంతంగా రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. మంత్రి బుధవారం పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్, ఎస్పీపీజెడ్ అధికారులు, జపాన్ సటాకె కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రాష్ట్రంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందుకే రూ.రెండువేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మిల్లింగ్ పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం మిల్లింగ్తోపాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక తదితరాలు ప్రాసెసింగ్ చేసేందుకు ప్రత్యేక జోన్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సటాకే, సైలో తదితర ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సటాకె కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతికతను మంత్రికి వివరించారు, గంటకు 20 నుంచి 1,200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని వారు చెప్పారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పి స్తామని గంగుల తెలిపారు. ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా రూ.100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. కాగా, పౌరసరఫరాల శాఖలో ప్రజలకు సేవల్ని మరింత కచ్చితంగా, పారదర్శకంగా అందించేందుకు టెక్నాలజీ సంబంధిత అంశాలపై గంగుల ప్రత్యేకంగా సమీక్షించారు, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు మొదలు బియ్యం పంపిణీ వరకు వివిధ దశల్లో వృధా లేకుండా సాంకేతికతను అప్గ్రెడేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టెక్నాలజీ అప్గ్రేడేషన్, నెట్వర్కింగ్, శాటిలైట్ టెక్నాలజీలో పనిచేస్తున్న మలోల ఇన్నోవేషన్స్, సీఎస్ఎం, ఐబీఐ, ప్లానెట్ ఎం తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
వరి @ రూ.3,010
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధాన్యానికి (ఆర్ఎన్ఆర్ పాతరకం) రికార్డుస్థాయిలో ధర రూ. 3,010లు పలికింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి ధాన్యానికి అత్యధికంగా ధర పలకడం ఇదే తొలిసారి. మద్దతు ధర రూ.2,060 ఉండగా, మద్దతుకు మించే ధర రావడం విశేషం. కాగా, మార్కెట్ కు బుధవారం 1,778 బస్తాల ధాన్యం అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.3,010, కనిష్ట ధర రూ.2,219 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
సిద్దిపేట జిల్లాలో ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోళ్లు...
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఒడిదుడుకుల మధ్య ముగిసింది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో జిల్లా యంత్రాంగం 416 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. బుధవారంతో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిశాయి. సీజన్ ప్రారంభంలో 5లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని జిల్లా యంత్రాంగం అంచనా వేశారు. ఈ సారి యాసంగిలో కోతల సమయంలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గింది. కొందరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసువచ్చిన తర్వాత సైతం వర్షాలు కురవడంతో రైతులు యాసంగి ధాన్యాన్ని అమ్మడం కోసం అష్టకష్టాలు పడ్డారు. తడిసిన వడ్లకు కాంట పెట్టకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తీసుకున్నారు. తగ్గిన ధాన్యం జిల్లాలో యాసంగిలో 3.31లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోత దశలో వడగళ్లు, అకాల వర్షాలతో దిగుబడి పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 416 కొనుగోలు కేంద్రాల ద్వారా 85,411 మంది రైతుల దగ్గరి నుంచి రూ.732.15కోట్ల విలువ చేసే 3,55,413 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ● గతేడాది కంటే యాసంగి సీజన్లో సాగు పెరిగినప్పటికీ దిగుబడి తగ్గింది. గతేడాది 2.62లక్షల ఎకరాలు సాగయితే 3.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సారి 37,055 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. రూ.111 కోట్లు పెండింగ్ ధాన్యం కొనుగోలు చేసిన పది నుంచి 15రోజులకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డబ్బులు చేతిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ● రూ.732.15 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేయగా రూ.720.66కోట్ల విలువ చేసే ధాన్యం ట్యాబ్ ఎంట్రీ అయ్యాయి. ట్రక్ షీట్లు రూ.678.92కోట్ల విలువ చేసే ధాన్యంకు జనరేట్ అయ్యాయి. రూ.678.92 కోట్ల విలువ చేసే ధాన్యంకు మిల్లర్లు ఒకె చెప్పారు. ఇప్పటి వరకూ రైతులకు రూ.620.85కోట్లను చెల్లించారు. ఇంకా రూ.111.30కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. విజయవంతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. మంత్రి హరీశ్ రావు, కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశాం. పెండింగ్లో ఉన్న ధాన్యం డబ్బుల చెల్లింపులు రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి అవుతుంది. – హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
అరవై ఏళ్లు.. 239 రకాలు..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మందికి ఈ విశ్వవిద్యాలయం అన్నం పెడుతోంది. అంటే.. ఆ వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలనే దేశంలో మూడోవంతు ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అదే మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) ప్రత్యేకత. దేశంలోనే పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఈ వర్సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ వర్సిటీ సాధించిన విజయాలెన్నో.. ఎన్నెన్నో. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త వరి రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడమే కాదు.. సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ సృష్టించిన రకాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలో సాగయ్యే వరిలో మూడోవంతు.. దేశంలో వరి సాగవుతున్న 46 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ‘ఆంగ్రూ’ రకాలే సాగవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ వర్సిటీ రైతుల మన్ననలు చూరగొందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జాతీయ స్థాయి వరి ఉత్పత్తి (131 మిలియన్ టన్నులు)లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రకాలే కావడం గమనార్హం. సగటు దిగుబడి జాతీయ స్థాయిలో హెక్టార్కు 2,832 కిలోలు.. ఏపీలో హెక్టార్కు 5,048 కిలోలు ఉంటే, ఈ వర్సిటీ రూపొందించిన రకాలు ఏకంగా హెక్టార్కు 5,669 కిలోల దిగుబడినివ్వడమే కాదు జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. 60 ఏళ్లలో 239 రకాల సృష్టి.. 1964 జూన్ 12న ఏర్పాటైన ఈ వర్సిటీ.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడంలో నిరంతరం కృషిచేస్తోంది. 60 ఏళ్లలో 123 అధిక దిగుబడినిచ్చే వరి రకాలతో పాటు 47 రకాల పప్పు ధాన్యాలు, 29 రకాల నూనె గింజలు, 21 రకాల వాణిజ్య పంటలు, 19 రకాల చిరుధాన్యాలను ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసింది. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి. వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా, తెగుళ్లు, చీడపీడలు, కీటకాలను ఎదుర్కొనే రకాలను అభివృద్ధి చేయడంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబా మసూరి) వరి రకాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే మొట్టమొదటి బూజు తెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య)తో పాటు ప్రసిద్ధి చెందిన కే6, నారాయణి, లేపాక్షి వంటి వేరుశనగ రకాలు సైతం వర్సిటీ అభివృద్ధి చేసినవే. ఆంగ్రూ రకాలతో రూ.25వేల కోట్ల ఆదాయం.. ♦ ఆంధ్రలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో వర్సిటీ సృష్టించిన వరి రకాలే సాగవుతున్నాయి. ♦ సాగు విస్తీర్ణంలో 72.63 శాతం, ఉత్పత్తిలో 87.27 శాతం వర్సిటీ రకాలే. ♦ పప్పు ధాన్యాల సాగులో 35.63 శాతం, ఉత్పత్తిలో 32.16 శాతం వర్సిటీ రూపొందించినవే.. ♦ వేరుశనగ ఉత్పత్తిలో 94.03 శాతం వర్సిటీ రకాలే. ఒక్క కే6 రకమే 82 శాతం అందిస్తోంది. ♦ నువ్వుల సాగులో కూడా 87.50 శాతం ఆంగ్రూ రకాలదే కావడం విశేషం. ♦ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనెగింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి.. మొత్తం రూ.25వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాష్ట్ర రైతులు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.8వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం.. ఇక ఎగుమతుల్లో బాస్మతేతర బియ్యం రకాలదే సింహభాగం. వీటిలో మూడోవంతు ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసినవే. ఉదా.. దేశం నుంచి 2021–22లో బియ్యం ఎగుమతుల ద్వారా రూ.46,914.28 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చింది. ఈ బియ్యం ఎగుమతుల్లో 33 శాతం (రూ.15,481.71కోట్లు) ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలకు చెందిన బియ్యమే. అలాగే, మిగతా కాలంలో ఏటా ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా సగటున రూ.8,073 కోట్ల ఆదాయం సమకూరుతోందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతోంది. 12న మెగా సీడ్ మేళా.. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో ‘మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం’ అనే నినాదంతో విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగయ్యే, వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచుతూ రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెట్టుబడికి ఢోకాలేదు ఆంగ్రూ అభివృద్ధి చేసిన వివిధ రకాల సాగుతో పెట్టుబడికి ఢోకాలేదని నిరూపితమైంది. ఇటీవలే ఆంగ్రూ రకాల రాబడి–ఖర్చులను విశ్లేíÙంచాం. ఖరీఫ్ కంటే రబీలో నికర రాబడులు ఎక్కువగా ఉన్నాయి. సాగుకోసం రైతులు ఖర్చుచేసే ప్రతీ రూ.100కు, వరికి రూ.103, మినుముకి రూ.132, కందికి రూ.133, మిరపకి రూ.160, శనగకి రూ.102, వేరుశనగకి రూ. 124ల చొప్పున ఆదాయం వస్తోందని గుర్తించాం. – డాక్టర్ జి. రఘునాథరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ పరిశోధనా స్థానం, లాం సీజన్ ఏదైనా మన రకాలదే ఆధిపత్యం.. ప్రధాన పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేయడంలో ‘ఆంగ్రూ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ఆంగ్రూ’ వరి రకాలు హెక్టారుకు 5,669 కిలోల దిగుబడిని సాధిస్తుండగా, ఇది రాష్ట్ర సగటు దిగుబడి (హెక్టారుకు 5,048 కిలోలు) కంటే ఎక్కువ. వరిలోనే కాదు అపరాలు, నూనె గింజల సాగులో కూడా ఆంగ్రూ రకాలదే సింహభాగం. దాదాపు రెండు సీజన్లలోనూ వర్సిటీ రకాలకున్న డిమాండ్ ఇతర రకాలకు లేదనే చెప్పాలి. – డాక్టర్ ఎల్. ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు ఏటా రూ.2,967 కోట్ల లాభాలు.. జాతీయ స్థాయి వరి ఉత్పత్తిలో మూడో వంతు ఆంగ్రూ రకాలదే. అలాగే, జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఈ రకాలనే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ రైతు ఈ వర్సిటీ రకాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సంప్రదాయ వరి రకాల కంటే ఆంగ్రూ రకాల సాగువలన ఏటా రూ.2,967 కోట్ల లాభాలను రైతులు ఆర్జిస్తున్నారు. – డాక్టర్ ఆదాల విష్ణువర్థన్రెడ్డి, వైస్ చాన్సలర్ -
వాంగ్మూలపత్రం రాసిస్తేనే ధాన్యం కాంటా..!
నల్లబెల్లి: ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా రైతుల ధాన్యానికి కోతలు పెట్టడం సాగుతుంటే.. ఇప్పుడు ఏకంగా సంతకాలు తీసుకుని మరీ కోతలు పెడుతున్న పరిస్థితి మొదలైంది. ‘‘నేను నా ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జల్లెడ పట్టి ఇతరత్రా చెత్త, మట్టిని క్లీన్ చేయకుండా పీపీసీ సెంటర్కు అమ్ముతున్నాను. నిబంధనల ప్రకారం నా ధాన్యం లేనందున మిల్లర్ తెలిపిన తరుగుదలకు నా ఇష్టపూర్తిగా అంగీకరిస్తున్నాను’’అని రైతుల నుంచి వాంగ్మూలపత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. సంతకం చేయని వారి ధాన్యం కాంటా వేయట్లేదు. వరంగల్ జిల్లా నల్లబెల్లి, అర్శనపల్లి కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. నల్లబెల్లి మండలంలో పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని ఒక్కోబస్తా 40 కిలోలు చొప్పున తూకం వేయాల్సి ఉంది. వానలు పడితే ధాన్యం తడుస్తుందని రైతుల్లో ఉన్న భయాన్ని అదునుగా తీసుకుని నిర్వాహకులు ఒక్కో బస్తాను 43 కిలోల వరకు తూకం వేస్తున్నారు. దీనికి అదనంగా తాలు, తేమ పేరుతో మిల్లర్లు అభ్యంతరం తెలిపితే.. మరింత కోత ఉంటుందంటూ రైతుల నుంచి బలవంతంగా వాంగ్మూలపత్రం తీసుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ధాన్యాన్ని కాంటా వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై కొందరు రైతులు నిర్వాహకులను నిలదీశారు. తాను వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరిస్తే కాంటా పెట్టలేదని నల్లబెల్లికి చెందిన రైతు ఉడుత వీరన్న పేర్కొన్నాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేశాడు. -
మళ్లీ అకాల వర్ష బీభత్సం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాన
వరంగల్/ జగిత్యాల/ మోత్కూరు/ ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు ప్రభావం చూపించాయి. శనివారం వివిధ జిల్లాల పరిధిలో తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. వర్షం తక్కువే కురిసినా.. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల ఇళ్లు, రేకుల షెడ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్లో అతలాకుతలం.. శనివారం సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. వరంగల్ నగరంలో ఈదురుగాలుల ధాటికి సుమారు వంద ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఓ జిన్నింగ్ మిల్లు రేకులు లేచిపోయాయి. హనుమకొండ జిల్లా శాయంపేటలో మామిడికి నష్టం వాటిల్లింది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేటలో చెట్లు విరిగిపడ్డాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి, లెంకాలపల్లి, నందిగామ, రేలకుంట, రు ద్రగూడెం, శనిగరం గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. జగిత్యాల, యాదాద్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో.. జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, తీవ్ర ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. మినీస్టేడియం గోడ కూలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వాన ధాటికి కొట్టుకుపోయింది. తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆగమాగమైంది. పలు మండలాల్లో అరగంట పాటు వర్షంతో పాటు వడగళ్లుపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడ్డారు. పిడుగుపాటుకు ఇద్దరు మృతి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భోజ్యనాయక్తండాకు చెందిన బానోతు సుమన్ పిడుగుపాటుతో మృతిచెందగా.. బానోతు భద్రు, బానోతు రమ, అజ్మీరా శశిరేఖలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవుపేటలో మేకల కాప రి క్యాతం రాజయ్య (65) పిడుగుపాటుకు మృతిచెందాడు. బుగ్గారం మండలం సిరికొండలో పిడుగుపడి మరో మేకలకాపరి మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. -
మెచ్చేలా.. ముచ్చటగా.. అటు ఇంటికి అలంకరణ, ఇటు ఉపాధి
సాక్షి, అమలాపురం: పంటభూమిలో ఆరుగాలం చెమట చిందించి, పండించే ధాన్యాన్ని రైతు ఎంతో అపురూపంగా భావిస్తాడు. రెక్కల కష్టంతో దక్కిన ఫలితంలో కొంత భాగాన్ని దేవునికి పరమ భక్తితో నివేదిస్తాడు. తన కుటుంబ జీవనానికి ఊతంగా నిలిచి.. సిరులు కురిపించే వరి కంకులతో ఇళ్లను ముచ్చటగా.. చూసిన వారు మెచ్చేలా.. ముస్తాబు చేసుకుని మురిసిపోతాడు. వరి కంకులను అందంగా అల్లి తయారు చేసే ధాన్యం కుచ్చులను వీధిలో వేలాడదీసే వారు కొందరైతే... తోరణాలుగా చేసి సింహద్వారానికి అలంకరించే వారు మరికొందరు. దేవాలయాల్లో సైతం ఇలా కుచ్చులు కట్టడం, ఆలయ సింహద్వారాలకు తోరణాలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఏటా సంక్రాంతి సమయంలో పచ్చని కోనసీమలో జరిగే తీర్థాలకు భక్తుల భుజస్కంధాలపై వెళ్లే ప్రభలకు సైతం ధాన్యం కుచ్చులు తగిలించి, తాము పండిచిన ధాన్యాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పిస్తూంటారు. ప్రకృతి ప్రేమికులు సైతం ధాన్యం కుచ్చులను వీధుల్లో ఉంచి, పక్షులకు ఆహారంగా అందిస్తూంటారు. పక్షులకు ఆహారంగా.. పక్షులకు ఆహారంగా అందించేందుకు సైతం పలువురు ధాన్యం కుచ్చులను ఇళ్లు, ఆలయాలు, పంట పొలాల వద్ద ఉండే రైతుల ఇళ్ల (మకాం) వద్ద విరివిరిగా ఏర్పాటు చేస్తున్నారు. కొందరు ప్రకృతి ప్రేమికులు పక్షుల సందడి అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఉంచుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన పెనుమాక మహాలక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఆయన ఆరు దశాబ్దాల పాటు పక్షులకు ఆహారంగా ధాన్యం కుచ్చులను అందుబాటులో ఉంచారు. ఊళ్లోని ఆలయాలకు, చెట్లకు, నాలుగు రోడ్ల కూడళ్లలోని స్తంభాలకు, ఎత్తయిన భవనాలకు కుచ్చులు కట్టి, పక్షులకు ఆహారంగా అందించేవారు. ‘ఊపిరి ఉన్నంత వరకూ కుచ్చులు కట్టి, పక్షులకు ఆహారం అందిస్తాను’ అని ఆయన తరచూ అనేవారు. ఆ మాటను అక్షరాల నిజం చేశారు. చేయి తిరిగిన వారే చేయగలరు రబీ వరి కోతలు జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వరి కుచ్చులు తయారు చేస్తూ పలువురు బిజీ అయిపోయారు. వీటిని తయారు చేయడం అంత సులువేమీ కాదు. గతంలో వీటిని తయారు చేయడానికి ప్రత్యేకంగా కొందరు ఉండేవారు. ఆ తరం దాదాపు తగ్గిపోవడంతో కొన్నాళ్లు కంకుల కుచ్చులు కూడా కనుమరుగయ్యాయి. కానీ ఇప్పుడు తిరిగి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీంతో పలువురు పెద్ద తరం వారి వద్ద నేర్చుకుని వరి కుచ్చులు, తోరణాల తయారీ విరివిగా చేపడుతూ ఉపాధిగా పొందుతున్నారు. కోత కోసిన తరువాత ధాన్యం పరకలను ప్లాస్టిక్ తాడు లేదా పురికొసకు ఒకదాని తరువాత ఒకటిగా వేలాడదీస్తూ కడతారు. తరువాత అన్నిటినీ కలిపి గుండ్రంగా చుట్టడం ద్వారా ధాన్యం కుచ్చు తయారు చేస్తారు. ఇది పూర్తయిన తరువాత గడ్డి చూరులు లేదా పురికొసను తాడుగా తయారు చేసి ధాన్యం కుచ్చులను ముస్తాబు చేస్తారు. ప్రస్తుతం వరి కుచ్చులను ఇంటి ముందు పెట్టాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికీ విపరీతంగా పెరిగింది. పల్లెల కంటే పట్టణ వాసులే ధాన్య కుచ్చులపై ఆసక్తి చూపుతూండటం విశేషం. పలు ప్రాంతాల్లో ధాన్యం కుచ్చులు, తోరణాలు తయారు చేసి రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకూ ఆదాయం పొందుతున్నారు. కొంతమంది వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు తీసుకు వెళ్తున్నారు. కుచ్చులతో ఉపాధి అంబాజీపేట మండలం జి.అగ్రహారానికి చెందిన ఆకుమర్తి వేమ సుందరరావు ధాన్యం కుచ్చులు, పండ్లకు బుట్టలు కట్టి ఉపాధి పొందుతున్నారు. అంతకు ముందు దినసరి కూలీగా ఉండే సుందరరావు ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. తరువాత ఇంటి వద్దనే ఉంటూ ఈ పని చేస్తున్నారు. ‘వరి పనలు తెచ్చి చాలా మంది నా వద్ద కుచ్చులు తయారు చేయించుకుంటారు. సైజును బట్టి రూ.150 నుంచి రూ.500 వరకూ ఇస్తుంటారు’ అని సుందరరావు చెప్పారు. -
రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత సీఎం జగన్దే
తణుకు అర్బన్/అత్తిలి : ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ లేకుండా రైతుకు గిట్టుబాటు ధరను నేరుగా అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి గింజనూ కొనుగోలు చేసి వారి బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసిన ఘనత కూడా సీఎం జగన్కే దక్కుతుందన్నారు. తన ధాన్యం కొనలేదు.. గిట్టుబాటు ధర ఇవ్వలేదు.. అని ఏ ఒక్క రైతూ అననప్పటికీ తగుదునమ్మా అని తణుకులో చంద్రబాబు నిర్వహించిన రైతు పోరుబాట పాదయాత్ర, సభ జనాదరణ లేక అట్టర్ ఫ్లాప్ షో అయ్యాయని చెప్పారు. తన సామాజికవర్గానికి చెందిన తణుకు టీడీపీ నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలనే తపనతో ఏదోరకంగా జాకీ లేసి పైకి లేపేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై నాలుగేళ్లపాటు మాట్లాడని చంద్రబాబు.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతో తణుకుకు రెండుసార్లు వచ్చాడని దుయ్యబట్టారు. చంద్రబాబు యాత్రలో రైతులు లేకపోగా దూరప్రాంతాల నుంచి తీసుకొచ్చిన జనంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. బీసీలను ఓటు యంత్రంగా వాడుకునే చంద్రబాబుకు రానున్న రోజుల్లో బీసీలే తగిన పాఠం చెబుతారని హెచ్చరించారు. జనం లేని సభలో టీడీపీ నాయకులు మీడియాపై కూడా దాడులకు దిగే హీనస్థితికి దిగజారిపోయారని మంత్రి కారుమూరి మండిపడ్డారు. చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం పబొ మగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన రైతు పోరుబాట యాత్రలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ.. మంత్రికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం అత్తిలి, తణుకులో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్సీపీ బీసీ సెల్ అత్తిలి మండల అధ్యక్షుడు రంభ సూరిబాబు, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ తదితరులు చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు. అత్తిలి బస్స్టేషన్ సెంటర్లో, తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి చంద్రబాబు దిష్టి»ొమ్మలను దహనం చేశారు. -
Telangana: తడిసిన ధాన్యం కొంటలేరు!
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని సైతం మామూలు ధాన్యం ధరకే కొంటామని... రైతులు ఆందోళన చెందొద్దని సీఎం కేసీఆర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తిస్థాయిలో భరోసా లభించట్లేదని తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాలతోపాటు మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి సుముఖత చూపడం లేదు. త డిసిన ధాన్యాన్ని 17 శాతంలోపు తేమ ఉండేలా ఆరబెట్టి తీసుకొస్తేనే కాంటా వేస్తా మని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఒకవేళ అటువంటి ధాన్యాన్ని ఎక్కడైనా సేకరించినా మిల్లర్లు మాత్రం ఆ ధాన్యాన్ని తీసుకొనేందుకు ససేమిరా అంటున్నారు. నిబంధనల పేరుతో మిల్లర్లు ససేమిరా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాక మిల్లింగ్ చేస్తే వచ్చే ముడి బియ్యం రంగు మారడమేగాక, నూ కల శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే తడిసిన బియ్యాన్ని బాయిల్డ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యంలోంచి తొలి విడతగా 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ కింద ఆయా జిల్లాలకు కేటాయించింది. మంత్రి గంగుల అధికారులు, మిల్లర్లతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. అయితే బాయిల్డ్ రైస్ కింద కూడా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని రైస్ మిల్లులు సేకరించడం లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా 17 శాతంలోపు తేమ ఉండేలా ఆరబెట్టాకే పంపాలని చెబుతున్నారు. లేకపోతే ఎఫ్సీఐ ఆ బియ్యం తీసుకోదంటున్నారు. 11.72 ఎల్ఎంటీ మాత్రమే కొనుగోలు రాష్ట్రంలో ఇప్పటివరకు 5,716 కొనుగోలు కేంద్రాలను తెరవగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం, ఆరబెట్టిన ధాన్యం మళ్లీ తడవడం వంటి పరిణామాల నేపథ్యంలో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 1.58 లక్షల మంది రైతుల నుంచి కేవలం 11.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ ఈ యాసంగిలో కొనుగోలు అంచనాను 1.02 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 80.46 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించగా అంత మొత్తంలో ధాన్యం సేకరించడం కూడా అనుమానమేనని అధికారులు చెబుతున్నారు. అన్నిచోట్లా అదే తీరు ఖమ్మం జిల్లా వైరా మండలంలోని దాచాపురం గ్రామానికి చెందిన కొందరు రైతులు గత నెల 30 న ధాన్యాన్ని గరికపాడు సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రంలో 738 బస్తాలను విక్రయించారు. నిర్వాహకులు ఈ ధాన్యాన్ని ఈ నెల ఒకటిన నేరెడలోని ఓ రైస్మిల్లుకు పంపగా ధాన్యం తడిచిందనే సాకుతో 3 రోజుల తరువాత ఆ బస్తాలను వెనక్కు పంపారు. రైతులు గొడవకు దిగడంతో ఆరబెట్టి తీసుకురావాలన్నాడు. కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఓ రైస్మిల్లు తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అక్కడ జరుగుతున్న జాప్యాన్ని తప్పుబట్టారు. రైస్మిల్లు గుమాస్తాపై చేయిచేసుకున్న ప్రభుత్వ విప్ సాక్షి, కామారెడ్డి/భిక్కనూరు: తేమ పేరుతో ధాన్యం బస్తాలు దించుకోని రైస్మిల్లు గుమా స్తాపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులోని పూర్ణిమ రైస్ మిల్లుకు రైతులు ట్రాక్టర్లపై ధాన్యం శుక్రవారం తీసుకెళ్లారు. అక్కడి గుమాస్తా ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ బస్తాలను దించుకోలేదు. దీంతో రైతులు పెద్దమల్లారెడ్డి పర్యటనలో ఉన్న గంప గోవర్ధన్ దృష్టికి ఫోన్లో తీసుకెళ్లారు. ఆయన వెంటనే అధికారులతో కలసి రైస్ మిల్లు వద్దకు చేరుకున్నారు. ధాన్యం ఎందుకు తీసుకోలేదని మిల్లు యజమానిని అడగ్గా తాను ఆ సమయంలో లేనని చెప్పాడు. దీంతో గుమాస్తాను ప్రశ్నించగా ధాన్యంలో తేమ 18–20 శాతం వరకు ఉందని ఓసారి, 16 శాతం వచ్చిందని మరోసారి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గోవర్ధన్ గుమాస్తా చెంప చెళ్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో శనివారం ఉదయం నుంచి జిల్లాలోని రైస్ మిల్లర్లు అన్లోడింగ్ నిలిపివేశారు. అయితే జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ శనివారం మధ్యాహ్నం వారితో సమావేశమై రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించడంతో సాయంత్రం 4 గంటల నుంచి తిరిగి అన్లోడింగ్ మొదలుపెట్టారు. ఈ ఉదంతంపై గంప గోవర్ధన్ స్పందిస్తూ తేమ శాతం ఎంత వచ్చిందని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పడంతోపాటు మిస్గైడ్ చేయడంతోనే గుమాస్తాపై కోపగించానన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే కొర్రీలు పెట్టడం సరికాదని హెచ్చరించారు. రైతుల ఘోష వినపడదా? సాక్షిప్రతినిధి, ఖమ్మం: ధాన్యం, మొక్కజొన్న రైతుల కళ్లల్లోని ఆనందం ప్రభుత్వ నిర్వాకంతో ఆవిరై పోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల ఘోష వినపడకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఖమ్మంలో శనివారం రైతుభరోసా ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వినతిపత్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్కు అందజేశారు. శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో 80 లక్షల టన్నుల ధాన్యం, సుమారు 32 లక్షల టన్నుల మక్కలు పండితే ఇప్పటివరకు 10 లక్షల టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారన్నారు. మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ హామీ నెరవేరలేదన్నారు. పొంగులేటి పోరుబాట మాజీ ఎంపీ పొంగులేటి రాజకీయంగా దూకుడు పెంచారు. ఇకపై ప్రతీ సోమవారం ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయాలని కూడా పొంగులేటి నిర్ణయించి, తొలిలేఖ వచ్చే సోమవారం రాయనున్నారు. ఈ నెల 14న ఖమ్మం నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తర్వాత ఉమ్మడి జిల్లాలో పొంగులేటి పాదయాత్రకు కార్యాచరణ రూపొందించు కుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలు మండలాల్లో పాదయాత్ర చేస్తారని తెలిసింది. కాగా, నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీనేత చకిలం అనిల్కుమార్ పొంగులేటితో రెండు గంటలపాటు భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలు కూడా ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. -
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్లోని సనత్నగర్ ఎఫ్సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్కు వెళ్లి అక్కడి ఎఫ్సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్కు తరలించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
తడిసిన ధాన్యం కొంటాం..
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందులో భాగంగా వానకు తడిసిన ధాన్యంతో బాయిల్డ్ రైస్ తయారు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోతోందని, దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అత్యవసరంగా బాయిల్డ్ రైస్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశామని, ధాన్యం సేకరణలో మరింత వేగం పెంచుతామని స్పష్టం చేశారు. సోమవారం మంత్రి సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన నల్లగొండ జిల్లాలో 22 వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో 14,706 మెట్రిక్ టన్నులు, నిజమాబాద్లో 14,700, కరీంనగర్లో 7,350, యాదాద్రి, జగిత్యాలలో 5,000 మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ రైస్ కోసం ధాన్యం సేకరణకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి గంగుల వెల్లడించారు. ఇప్పటివరకు గత యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని వివరించారు. గతేడాది ఇదే రోజునాటికి 3.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగా.. ఈ సారి 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామన్న మంత్రి, రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, వీటి విలువ రూ.1,543 కోట్లని తెలిపారు. నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టంచేశారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆందోళనలో అన్నదాత
సాక్షి, నెట్వర్క్: వరుసగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. చాలాచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. ఏంచేయాలో రైతులకు పాలుపోవడంలేదు. జగిత్యాల జిల్లా మల్యాల మార్కెట్ యార్డులో విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం మొలకెత్తింది. వందల క్వింటాళ్లు మొలకెత్తడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కథలాపూర్, జగిత్యాల రూరల్, మెట్పల్లి తదితర మండలాల్లో ఆదివారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. మామిడికాయలు రాలిపోయాయి. నువ్వు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, రామగుండం, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి తదితర మండలాల్లో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. రాజన్న సిరిసిల్లజిల్లాలోని రుద్రంగి మండలంలో వడగళ్లవానకు కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కొట్టుకుపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నకిరేకల్, తిరుమలగిరి, రహీంఖాన్పేటలోని మార్కెట్లలో రైతులు ఆరబోసుకున్న ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. కామారెడ్డి జిల్లాలో బిచ్కుందలోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం భారీవర్షానికి కొట్టుకుపోయి సమీపంలోని డ్రెయినేజీలో కలిసింది. శ్మశానంలోనూ ధాన్యం ఆరబోత పాల్వంచరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తామని చెప్పినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొన్నిచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా మిల్లులకు తరలింపులో జాప్యం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించాల్సిన చోట రైతులు 20 రోజుల క్రితం ధాన్యం తెచ్చి ఆరబోశారు. ఎప్పటికప్పుడు కొనుగోళ్లు చేపట్టి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే మిగతా రైతులకు చోటు దక్కేది. కానీ కొనుగోళ్లే మొదలు కాకపోవడంతో నిర్దేశిత ప్రాంతం నిండిపోగా.. ఆనుకుని ఉన్న శ్మశానం (వైకుంఠధామం)లోనూ ధాన్యం ఆరబోసి రాత్రింబవళ్లు కాపలా ఉంటున్నారు. ఆకాశం మేఘావృతం కావడమే కాక చిరుజల్లులు కురుస్తుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. -
మార్కెట్లో ధాన్యం రాశులు.. జాడలేని కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరికోతలు ఊపందుకుంటున్నా సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. పలు జిల్లాల్లో వరికోతలు మొదలై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు 1,150 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్ వంటి పలుజిల్లాల్లోనే ఈ సెంటర్లను ప్రారంభించారు. ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ధాన్యాన్ని సెంటర్లకు తీసుకువస్తున్నా.. కొనుగోళ్లు లేక రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం ఆరబెడుతూ.. ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేసే పరిస్థితి ఉండటంతో రైతులు కొన్నేళ్లుగా.. వరి కోతలు కాగానే ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. అయితే అధికారులు గత యాసంగి నుంచి కోసిన పంటను సొంత కల్లాల్లో ఆరబెట్టుకుని, ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచిస్తున్నారు. సొంత భూముల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో.. కొందరు రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. చాలా మంది పొలాల్లో తాత్కాలిక కల్లాలను ఏర్పాటు చేసుకొని ధాన్యం ఆరబెడుతున్నారు. ఇలా ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చినా.. కొనుగోళ్ల కోసం రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి మాత్రం మారలేదు. ఈ యాసంగిలోనైనా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 7,029 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.20 కోట్ల టన్నులకుపైగా వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సొంత అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా కోటి టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,028 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో ఇంకా కోతలు మొదలవకపోవడం, కోతలు జరుగుతున్న నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొందరు రైతులు మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తుండటంతో.. ఇప్పటికిప్పుడే కొనుగోలు కేంద్రాల అవసరం లేదని భావిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని అంటున్నారు. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ధాన్యం ఇది. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఏకంగా 868 మంది రైతులు 45,253 బస్తాల ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు క్వింటాల్ ధాన్యానికి రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ధర చెల్లిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. – సూర్యాపేట సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రాశులు ఇవి. శుక్రవారం ఒక్కరోజే 29,300 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నామని రైతులు చెప్తున్నారు. – తిరుమలగిరి (తుంగతుర్తి) ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం కరీంనగర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. మంత్రి శుక్రవారం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, 90 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను అందుబాటులో ఉంచామన్నారు. -
ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు
సాక్షి, అమరావతి: గతంలో విత్తుకునే సమయంలో ఉండే ధర పంటలు కోతకోసే నాటికి ఉండేది కాదు. దీంతో కాస్త మంచిరేటు వచ్చేవరకు మార్కెట్ గోదాముల్లో నిల్వచేసుకుని, ‘రైతుబంధు’ పథకం కింద రుణాలు తీసుకుని సాగుకోసం పెట్టిన అప్పులను తీర్చుకునేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పండే ప్రధాన వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంలో ఎన్నడూలేని రీతిలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు మించి మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. కల్లాల నుంచి నేరుగా కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ఫలితంగా తాము పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు గోదాముల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. రుణాలు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా ఈనాడు కట్టుకథలను అచ్చేస్తూ నిత్యం అభాసుపాలవుతోంది. ఏటా బడ్జెట్ కేటాయింపులు.. కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులకు మంచి ధర లభించేంత వరకు వారికి అండగా నిలిచేందుకు ఉద్దేశించిందే రైతుబంధు పథకం. మార్కెట్ గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు అందించే రుణంపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత 181వ రోజు నుంచి 270 రోజుల వరకు 12శాతం చొప్పున వడ్డీ వసూలుచేస్తారు. ఈ పథకానికి 2019–20లో రూ.70 కోట్లు, 2020–21లో రూ.70 కోట్లు, 2021–22లో రూ.80 కోట్లు కేటాయించగా, గడిచిన 2022–23లో ఏకంగా రూ.90 కోట్లు కేటాయించింది. 2019–20లో ఈ పథకం కింద తమ పంట ఉత్పత్తులను నిల్వచేసుకోవడం ద్వారా 1,826 మంది రూ.17.23 కోట్ల రుణాలు పొందగా, 2020–21లో 517 మంది రూ.71లక్షలరుణాలు పొందారు. ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు సీఎం యాప్ ద్వారా గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఎమ్మెస్పీకి మించి ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుంటూ ధరలు పెరిగేలా చేస్తోంది. సాధారణ, గ్రేడ్–ఏ రకం ధా న్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఫలితంగా ఇతర పంట ఉత్పత్తులకు కూడా మంచి రేటు పలుకుతోంది. కోతల దశలోనే ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతుండడంతో మంచి ధర కోసం పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వచేసుకోవడం, రైతుబంధు పథకం కింద రుణాలు పొందాలన్న ఆసక్తి రైతుల్లో కనిపించడంలేదు. కళ్లెదుట వాస్తవాలిలా ఉంటే.. రైతుబంధు పథకాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసినట్లు, పంట నిల్వచేసుకునే రైతులకు రుణాలివ్వడానికి ప్రభుత్వం ముఖం చాటేసినట్లుగా ఈనాడు విషప్రచారం చేస్తుండడంపట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధుకు ఏటా కేటాయింపులు మార్కెట్లో మించి ధరలు లభిస్తుండడంవల్లే గోదాముల్లో దాచుకునేందుకు రైతులు ముందుకు రావడంలేదు.అలాగే రైతులెవ్వరూ రైతుబంధు పథకం కింద రుణం పొందేందుకు ముందుకు రావడం లేదు. దీనిని రద్దు చేయడంగానీ, ఏటా నిధుల కేటాయింపులు ఆపడంగానీ చేయలేదు. రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రాహుల్ పాండే, కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ -
ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్ఫోర్స్ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్ కెపాసిటీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్ గోదాంలు ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన హుజూరాబాద్ నియో జకవర్గం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు. -
సీఎంఆర్ ధాన్యం మాయం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మిల్లులకు ఇచ్చిన వడ్లను సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మరాడించి ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఆరెపల్లెలో ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్లో రూ.27.76కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్కు 2021–22 యాసంగిలో 5,989 మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలంలో 5,437 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 11,426 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇప్పటివరకు 1,400 ఎంటీల ధాన్యం మరాడించి ఇవ్వగా ఇంకా 10,026 ఎంటీల ధాన్యం నిల్వ ఉండాలి. ఈ నెల 1న మిల్లులో విజిలెన్స్ దాడులు చేయగా 504 ఎంటీల ధాన్యం మాత్రమే ఉంది. యాసంగి ధాన్యం 4,135 మెట్రిక్ టన్నులు, వానాకాలం 5,387 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఆనంద్దాస్ రాంమోహన్తోపాటు తిరుమల, అనురాధపై కేసు నమోదు చేశారు. యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అధికారులు డబ్బులను రికవరీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మిల్లు యజమానులు, కుటుంబసభ్యుల మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా దాడులు జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు విజిలెన్స్ దాడులు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. మరిన్ని మిల్లుల అక్రమాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2021–22 యాసంగిలో 3,61,437 మెట్రిక్ టన్నుల ధాన్యం 133 మిల్లులకు కేటాయించారు. 2,44,943 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, 1,88,151 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. ఇంకా 63 మిల్లుల నుంచి 56,792 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. క్వింటాల్ వడ్లకు రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ అయితే 68 కేజీలు సీఎంఆర్ చేసి అందించాలి. 2022–23 వానాకాలంలో 3,62,193 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 146 మిల్లులకు అప్పగించారు. సీఎంఆర్ కింద 2,42,669 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా మిల్లర్లు 8,903 టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,33,766 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు తనిఖీలకు రాకముందే రేషన్ బియ్యం కొనుగోలు చేసి తెప్పించేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో ధాన్యం మాయమవుతున్నా జిల్లా అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
మిల్లర్ల నిర్లక్ష్యం..సర్కార్పై రూ.1,257 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడితో రైతుల కన్నా అధికంగా లాభాలు ఆర్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన రూ.వేల కోట్ల బియ్యం సొమ్ము రాకుండాపోతోంది. ఇదే క్రమంలో 2021–22 వానాకాలం సీజన్కు సంబంధించి 3.93 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఫిబ్రవరి నెలాఖరులోగా ఎఫ్సీఐకి అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోనెల గడువు కోరినా కేంద్రం ససేమిరా అనడంతో ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడినట్లయింది. 47.04 ఎల్ఎంటీ బియ్యంలో ఇచ్చింది 43 ఎల్ఎంటీ.. 2021–22 వానకాలం సీజన్కు సంబంధించి 70.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 47.04 ఎల్ఎంటీ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్గా ఎఫ్సీఐకి డెలివరీ చేయాలని నిర్దేశించింది. అయితే ఏడాది గడిచినా కేవలం 43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించారు. ఇంకా 3.93 లక్షల మెట్రిక్ టన్నులు పెండింగ్లో ఉన్నాయి. దీని విలువ రూ.1,257 కోట్లు. మిల్లర్ల నుంచి 3.93 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐ తీసుకోకపోతే, ఆ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీసుకొని రాష్ట్ర అవసరాల కోసం స్టేట్ పూల్ కింద వినియోగించుకోవలసి ఉంటుంది. అయితే మిల్లర్లు రీసైక్లింగ్, ఇతర అక్రమ పద్ధతుల ద్వారా ఇచ్చే నాణ్యత లేని బియ్యాన్ని కార్పొరేషన్ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిరిగి రేషన్ దుకాణాలకు పంపించే అవకాశం ఉంది. 2021–22 యాసంగి సీఎంఆర్కు ఈనెలాఖరు వరకు గడువు గత 2021–22 యాసంగి సీజన్కు సంబంధించి ఈ నెల 31లోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి జై ప్రకాశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యాసంగి సీఎంఆర్ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని, తరువాత గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. గత యాసంగికి సంబంధించి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 34.06 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్సీఐకి సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.45 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 12.61 ఎల్ఎంటీ బియ్యం పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇచి్చనప్పటికీ, రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తే తప్ప నెలాఖరుకు లక్ష్యం చేరుకోలేమని, అందుకు అనుగుణంగా మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ శనివారం అధికారులను ఆదేశించారు. గత యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మొత్తం సీఎంఆర్లో 14 ఎల్ఎంటీ మేర బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచి్చనప్పటికీ, మిల్లర్లు ఇంకా 6.64 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ పెండింగ్లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యాపేట, వనపర్తి, మహబూబ్నగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సీఎంఆర్ పెండింగ్ అధికంగా ఉండటంపట్ల రవీందర్ సింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీఎం జగన్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
-
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి: కేరళ ప్రజలు తమ ఆహారంలో ఎంతో ఇష్టంగా తినే ఎంటీయూ–3626 జయ రకం ధాన్యం (బోండాలు), బియ్యం కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్తో కూడిన కేరళ ఉన్నతాధికారుల బృందం మంత్రి కారుమూరితో భేటీ అయింది. తమకు కావాల్సిన సరుకుల సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం మంత్రి కారుమూరి మాట్లాడుతూ లక్ష టన్నుల ధాన్యం, 60 వేల టన్నుల బియ్యం కావాలని కేరళ ప్రభుత్వం అడగటం శుభపరిణామమని పేర్కొన్నారు. నెలకు 550 టన్నుల ఎండుమిర్చి, కంది, పెసర, మినుములు సైతం సరఫరా చేయాలని కోరిందని తెలిపారు. ఈ నెల 21న మరోసారి సమావేశమై ధరలు నిర్ణయిస్తామన్నారు. ధరలు రైతులకు లాభదాయకంగా ఉంటే ఈ నెల 27న కేరళలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్ అరుణ్కుమార్, డైరెక్టర్ విజయ సునీత, ఏపీ ఎస్సీఎస్సీఎల్ ఎండీ వీరపాండియన్, సహకార సంఘాల కమిషనర్ ఎ.బాబు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో రూ.30 కోట్లు కొట్టేశారు టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పౌర సరఫాల శాఖ నిధులు రూ. 30 కోట్లు కొల్లగొట్టారని మంత్రి కారుమూరి చెప్పారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రాథమికంగా ఐదుగురి తప్పు తేలడంతో వారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. నిందితుల ఆస్తులను అటాచ్ చేశామని, మొత్తం వసూలు చేస్తామన్నారు. తప్పుడు పత్రాలతో చెరువులు, కాలువలు, తోటలను వరి పొలాలుగా చూపి ఈ–క్రాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై ధాన్యం నగదుతో పాటే రవాణా చార్జీలనూ రైతుల అకౌంట్లో వేస్తామన్నారు. -
భారీ వర్షంతో తడిసిన ధాన్యం
సుభాష్నగర్ (నిజామాబాద్ అర్బన్)/సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ నగరం గూపన్పల్లిలో అత్యధికంగా 57.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో వర్షం కారణంగా ధాన్యం తడిసింది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, నస్రుల్లాబాద్, బాన్సువాడ, రాజంపేట, బీర్కూర్, కామారెడ్డి, మాచారెడ్డి తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. రైతులు వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పే ప్రయత్నం చేసినా చాలాచోట్ల వడ్లు తడిసి పోయాయి. కొన్ని చోట్ల భారీ వర్షం వల్ల వడ్లు కొట్టుకుపోయాయి. -
మిల్లర్లకు ధాన్యం బంద్..!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత రెండు మూడు సీజన్లలో సకాలంలో సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమైన 80% డిఫాల్టర్ మిల్లులకు భవిష్యత్తులో మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. మిల్లర్లకు శ్రమ లేకుండా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి పంపుతున్నా, దాన్ని సకాలంలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేసి ఎఫ్సీఐకి అప్పగించడంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వానాకాలం సీజన్ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లులకు బదులు పొరుగు రాష్ట్రాల్లోని మిల్లులకు పంపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్కుమార్, ఇతర అధికారులు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మిల్లుల్లో 75 ఎల్ఎంటీల నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్మిల్లుల్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం నిల్వ ఉంది. గత వానాకాలం సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. 47 ఎల్ఎంటీ సీఎంఆర్కు గాను ఇప్పటివరకు 30 ఎల్ఎంటీ కూడా ఇవ్వలేదు. ఇంకా 25 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. అలాగే మొన్నటి యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం కూడా మిల్లుల్లోనే ఉంది. మరో రెండు నెలల్లో ఈ వానాకాలం ధాన్యం రాబోతోంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా, ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రైవేట్ గోడౌన్లు వంటి మిడిల్ పాయింట్లలో నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ఈ మిల్లుల నుంచి డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం పంపకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. మిల్లర్ల తీరుకు తోడు కేంద్రం వైఖరితో.. రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తోంది. సెంట్రల్ పూల్ కింద ఎఫ్సీఐ నేరుగా మిల్లుల నుంచి బియ్యాన్ని (సీఎంఆర్) తీసుకుంటోంది. ఎఫ్సీఐకి బియ్యం వెళ్లిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించిన మద్దతు ధరను కేంద్రం రీయింబర్స్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లిస్తోంది. అయితే గత రెండేళ్లుగా పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్ విషయంలో మరింత ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు గడువు ముగిసిన తర్వాత సీఎంఆర్ను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. గత వర్షాకాలం సీజన్ సీఎంఆర్కు ఈ నెలాఖరు వరకు గడువు కాగా, ఇప్పటివరకు ఎఫ్సీఐ గడువు పెంచలేదు. మిల్లర్ల ఆలస్యం కారణంగా 2019–20, 2020–21 యాసంగి సీజన్కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల భారం పౌరసరఫరాల శాఖపై పడింది. ఇలావుండగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదలు బీజేపీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదని, మిల్లర్ల ఆగడాలకు సహకరిస్తోందని విమర్శిస్తూ జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేయడం, కేంద్రం సీఎంఆర్ గడువు పెంచే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీరియస్ రాష్ట్రంలోని మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, తద్వారా ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంటున్న అంశంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపించి, మిల్లింగ్ చేయించి ఎఫ్సీఐకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎఫ్సీఐ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సోమవారం జరిగే పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
రూ.46 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యానికి, మిల్లింగ్ అయిన ధాన్యానికి, నిల్వ ఉన్న వడ్లకు లెక్క సరిపోలేదు. రూ.46 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయం అయినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) రెండు విడతల తనిఖీల్లో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ధాన్యం మాయమైన మిల్లులు,తమ బృందాలకు సహకరించని మిల్లర్లపై చర్యలకు ఎఫ్సీఐ సిఫార సు చేసింది. ఆయా మిల్లులు నుంచి కస్టమ్ మిల్లింగ్రైస్ (సీఎంఆర్) కానీ, డీసీపీ బియ్యం కానీ తీసుకోవద్దనిప్రభుత్వాన్ని కోరింది. చుక్కలు చూపించిన మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో సరిగా ఉన్నాయా? ఎంత పరిమాణంలో మిల్లింగ్ చేశారు? ఇచ్చిన సీఎంఆర్కు, నిల్వ ఉన్న ధాన్యానికి లెక్క సరిపోతోందా? అనే విషయాలపై ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు గత మార్చి, మే నెలల్లో రైస్ మిల్లులకు వెళ్లిన ఎఫ్సీఐ అధికారులకు మిల్లర్లు ధాన్యానికి బదులు ‘చుక్కలు’చూపించిన సంగతి తెలిసిందే. మొదటి విడత తనిఖీల సమయంలో చాలాచోట్ల అడ్డదిడ్డంగా ఉన్న బస్తాలను లెక్కించడానికి వీలు కాలేదు. తర్వాత ‘తనిఖీలకు వస్తున్నాం... ధాన్యం సంచులను లెక్కించేందుకు వీలుగా అందుబాటులో ఉంచండి’అని సమాచారం ఇచ్చినా... 593 మిల్లుల యజమానులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. ‘అన్ కౌంటబుల్’(లెక్కించడానికి వీల్లేని స్థితిలో) ధాన్యం నిల్వలను రాశులు పోసిన మిల్లర్లు అక్రమాలు బయట పడకుండా చేశారు. అయితే మొత్తం మీద రూ.46 కోట్ల విలువైన ధాన్యం మాయం అయినట్లు ఎఫ్సీఐ వర్గాలు వెల్లడించాయి. తొలివిడతలో రూ.35 కోట్లు.. మలివిడతలో రూ.11 కోట్లు రాష్ట్రంలోని 3,278 మిల్లుల్లో 2020–21 యాసంగి, గత (2021–22) వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ లెక్కలు తేల్చేందుకు రైస్మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేయా లని ఎఫ్సీఐ గడచిన మార్చి లో నిర్ణయించింది. అప్పట్లో 958 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. 40 మిల్లుల్లో రూ.35.58 కోట్ల విలువైన 18,156 టన్నుల ధాన్యం గాయబ్ అయినట్లు గుర్తించారు. మిగతా 2,320 మిల్లుల్లో గత నెలలో ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు నిర్ణయించి, పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. 62 బృందాలను ఏర్పాటు చేసి 124 మందితో తనిఖీలు జరిపించారు. అయితే ఈ తనిఖీలకు అనేకచోట్ల మిల్లర్లు సహకరించలేదు. కాగా 63 మిల్లుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఎఫ్సీఐ అధికారులు ధ్రువీకరించారు. రూ.11 కోట్ల విలువైన 5,515 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్క తేలకుండా పోయింది. నిరుటి యాసంగికి సంబంధించిన ధాన్యం బస్తాలు లెక్కించడానికి వీల్లేకుండా 101 మంది మిల్లర్లు సహాయ నిరాకరణ చేయగా, గత వానాకాలం ధాన్యానికి సంబంధించి మరో 492 మిల్లులు సహకరించలేదు. మిల్లర్లు సహకరించడంతో పాటు ధాన్యం లెక్కించేందుకు వీలుగా ఉండి ఉంటే మరిన్ని అక్రమాలు వెలుగు చూసి ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మిల్లర్లపై చర్యలు తీసుకోండి ధాన్యం మాయం చేసిన మిల్లులతోపాటు, ఎఫ్సీఐకి సహకరించని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఎన్.అశోక్ కుమార్ మంగళవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష తనిఖీల్లో సరైన విధానంలో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా మిల్లర్లను ఆదేశిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని లేఖలో ఎఫ్సీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మిల్లుల నుంచి సీఎంఆర్ కింద సెంట్రల్ పూల్కు ఇచ్చే బియ్యం కానీ, డీసీపీ కింద రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే బియ్యం గానీ తీసుకోవద్దని çసూచించింది. ఒకవేళ డీసీపీ పద్ధతిలో వాడుకున్నా, తాము సెంట్రల్ పూల్ లెక్కల్లోకి తీసుకోమని çసూచించింది. -
ధాన్యం నానిపోయి.. రైతన్న కుంగిపోయి.. కష్టం నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఎండనకా వాననకా పండించిన రెక్కల కష్టం కళ్లముందే కొట్టుకుపోయింది. ఆ ధాన్యాన్ని ఏరుతూ, ఎత్తుతూ అన్నదాతల కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో విరుచుకుపడ్డ వాన పలు జిల్లాల్లో రైతులను నిలువునా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లలో జాప్యంతో తాము నిండా మునిగామని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళనలు.. ►నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్, ఇందల్వాయి, నందిపేట, ఆర్మూర్, కమ్మర్పల్లి, నిజామాబాద్ రూరల్, నవీపేట, రెంజల్, ఎడపల్లి మండలాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పలుచోట్ల కేంద్రాల్లో నిలిచిన నీటిని మోటార్లు పెట్టి తోడేయాల్సి వచ్చింది. కమ్మర్పల్లి మండలం కోనసముందర్, ఉప్పుటూరు గ్రామాల్లో సజ్జ పంట నేలకొరిగింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆర్మూర్లో రైతులు 63వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నందిపేటలో ధర్నా చేశారు. ►కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, గాంధారి, సదాశివనగర్, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, రాజంపేట, బాన్సువాడ, మాచారెడ్డి, సదాశివనగర్ తదితర మండలాల్లో వర్షంతో భారీగా ధాన్యం తడిసి, కొట్టుకుపోయింది. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ.. తిమ్మానగర్ రహదారిపై రైతులు ధర్నా చేశారు. సదాశివనగర్ ధర్మారావ్పేట్, అడ్లూర్ ఎల్లారెడ్డి,, మర్కల్, పద్మాజివాడి తదితర గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ►నిర్మల్ జిల్లాలో భారీవానకు ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, లోకేశ్వరం, లక్ష్మణచంద తదితర మండలాల్లో వరికి నష్టం వాటిల్లింది. కడెం, లోకేశ్వరం మండలాల్లో ధాన్యం తడిసి, కొట్టుకుపోయింది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో 850 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ►మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్, దేవునిగూడ, పొనకల్, తపాలపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ధాన్యం తడిసింది. ►మెదక్ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. కాంటా వేసిన బస్తా లు సైతం తడిసిపోయాయి. చిన్నశంకరంపేట రైతులు మెదక్ – చేగుంట ప్రధాన రహదారిపై తడిసిన ధాన్యం బస్తాలతో రాస్తారోకో చేశారు. ►రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ చందుర్తి, సిరిసిల్ల, ముస్తాబాద్లో రైతులు రాస్తారోకోలు చేశారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ►జగిత్యాల జిల్లా మల్యాల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, రాయికల్, జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కోతకు వచ్చిన వరి నేలవాలింది. ►కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పౌరసరఫరాల భవన్లో పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ తరపున ముందే విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పౌరసరఫరా ల శాఖ మంత్రి ఇటీవల మాట్లాడుతూ తూకం వేశాక ఒక్క గ్రాము తరుగు తీసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారని, కానీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై తరుగు తీసుకుంటున్నారని అన్వేష్రెడ్డి తెలిపారు. వానలు మొదలైతే ఎలా? నైరుతి రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో వాన లు పడుతున్నట్టు వాతావరణశాఖ సోమవారం ప్రకటించింది. మరికొద్దిరోజుల్లోనే వర్షాలు ఊపందుకోవచ్చని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రవ్యా ప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి ఉంది. దీనితో రైతుల్లో తీవ్ర ఆందో ళన వ్యక్తమవుతోంది. ధాన్యంపై కప్పడానికి టా ర్పాలిన్లు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం చె ప్తుంటే.. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా ఇవ్వడం లే దని రైతులు వాపోతున్నారు. బస్తాలు, ప్లాస్టిక్ సం చులతో కుట్టిన కవర్లతోనే ధాన్యాన్ని కప్పుతున్నా రు. అవి వానకు నిలవడం లేదు. ఈదురుగాలుల కు కొట్టుకుపోతున్నాయి. పైగా కింద నుంచి వరద పోటెత్తుతుండటంతో ధాన్యం తడిసిపోతోంది. నత్తనడకన కొనుగోళ్లు! రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై నెల దాటింది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 16 లక్షల టన్నులు మాత్రమే. గత సంవత్సరం యాసంగిలో ఇదే సమయానికి ఏకంగా 36 లక్షల టన్నులకుపైగా కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 6,834 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 6,117 కేంద్రాలను తెరిచారు. అందులోనూ 4,695 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. వరంగల్, భూపాలపల్లి, ములుగు, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, ఖమ్మం, భద్రాచలం, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తక్కువ సంఖ్యలో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వరి కోతలు ఊపందుకోనందునే కేంద్రాలను ప్రారంభించలేదని అధికారులు చెప్తుండగా.. కోతలు పూర్తయినా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. -
తెలంగాణ కేబినెట్ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మే 20 నుంచి జూన 5వరకూ పల్లె, పట్టణ ప్రగతి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
నూకలు తినాలన్న వాళ్లకు నూకలు చెల్లేలా బుద్ధి చెప్పాలి
గజ్వేల్: ‘ఎండాకాలంలో పండే ధాన్యం నూకలైతది. అది మేం కొనలేం.. అవి మీ ప్రజలే తినేవిధంగా అలవాటు చెయ్యండి’అని గోయల్ హేళనగా మాట్లాడటం తగదని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. నూకలు తినాలని చెబుతున్న కేంద్రానికి నూకలు చెల్లేలా బుద్ధిచెప్పాల్సిన అవసరముందన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలసి హరీశ్రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందన్నారు. మెడికల్ కళాశాలలు అడిగినా, ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగినా ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం వడ్లు కొనడం కూడా కేంద్రానికి చేతకాదా? అని ప్రశ్నించారు. మరోపక్క గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచు తూ సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకొని చేతనైతే ధరలు తగ్గించేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లో సింగిల్ యూస్ డయాలసిస్ సిస్టమ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండగా.. వాటిని నేడు 102కు పెంచబోతున్నామన్నారు. -
30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన పంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్లో పోటీపడతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క విశాఖలో సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 30 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 15 వేల కుటుంబాలు ఆర్గానిక్ రుచులను మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఏటా ఆర్గానిక్ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండి పదార్థాలు ఉండే బియ్యం కంటే, పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్స్ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా? డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు కోటీశ్వరుల నిత్య జీవితంలో ఆహారమయ్యాయి. ఫాస్ట్ఫుడ్ యుగంలో ఈ చిరుధాన్యాలేంటనుకుంటున్నారా..! నగరంలో చాలా మంది వీటినే ఆరాధిస్తున్నారు. ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే.. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిస్తున్నాయి. ఆరోగ్య సిరులు కురిపిస్తున్నాయి. రెండు పూటలా వరి అన్నమే ప్రధాన ఆహారంగా తీసుకునే నగర వాసులు.. ఇప్పుడు ఒక్క పూట అన్నానికే పరిమితమవుతున్నారు. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి ఉదయం, సాయంత్రం కొర్రలు, రాగులు, అరికెలు, ఊచలు, జొన్నలు, వరిగెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే భుజిస్తున్నారు. ముప్పై ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, షుగర్, ఆర్థరైటీస్ వంటి వివిధ రకాల వ్యాధులు నగరవాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు..అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమంటున్నారు. నగరంలో పెరుగుతున్న మిల్లెట్స్ వినియోగంపై సాక్షి ప్రత్యేక కథనం.. సహజ ఆహారమే ఎందుకు ప్రస్తుత కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 36 ఏళ్ల కిందటే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్సీ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు నగరాల్లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయస్సులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై రకరాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచుపదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు. అన్ని ఆహార ఉత్పత్తులు రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలా మంది అటువైపే చూస్తున్నారు. పాతవైపు..కొత్త చూపు.. ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియాని ఘుమఘుమలు, వెరైటీ వెజ్, నానవెజ్తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరం ఆహరమే ముద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యామైన డిమాండ్ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పించడంలో దోహదం చేసే రాగులకు స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటికి.. ఒంటికి కూడా.. సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, సబ్బులు, షాంపులు, వంట నూనెలు, కాస్మోటిక్స్ కూడా చేరాయి. పలు వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్మాల్ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలతో మహా నగరానికి పల్లెకు, మధ్య బాటలు వేశాయి. సూపర్ మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్లైన్ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సాత్విక ఆహారంతో పాటు చిరుధాన్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకుంటున్నారు. వాటితో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమిస్తున్నారు. –గట్రెడ్డి రమాదేవి, గృహిణి ఒత్తిడితో ఉన్నవారికి చిరుధాన్యాలు అవసరం నిత్యం పని ఒత్తిడిలో ఉన్న వారికి బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాగి అంబలి, దంపుడు బియ్యం, కొర్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిరుధాన్యాల ప్రాధాన్యం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. –బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ -
రైతుల ఖాతాల్లోకి రూ.2,329 కోట్లు రావాలి
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం సీజన్ ధాన్యం అమ్మకాల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12.78 లక్షల మంది రైతులు 69.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వి క్రయించారు. దీని విలువ రూ.13,670 కోట్లు కా గా.. 8,71,920మంది రైతులఖాతాల్లో రూ.11,341 కోట్ల సొమ్మును ప్రభుత్వం జమచేసింది. ఇంకా సుమారు 4 లక్షల మంది రైతులకు రూ.2,329 కోట్లు అందాల్సి ఉంది. 4 లక్షల మంది రైతుల్లో ధాన్యం అమ్ముకుని 20–25 రోజులు గడిచిన వారూ ఉన్నారు. వీరంతా ఖాతాల్లో ఎప్పుడు డబ్బు జమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తూకంవేసి, రసీదు ఇస్తే వారంలో బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చేవి. కానీ ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు, డబ్బు చెల్లింపు ప్రక్రియ సుదీర్ఘంగా మారింది. వడ్ల తూకం వేయాలంటే తొలుత పట్టా పాస్పుస్తకంతో ఆధార్, ఫోన్నంబర్ను లింక్ చేయాలి. అలాచేసిన రైతుకు ఉన్న పొలం విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలో నిర్దేశిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయడంతోనే సరిపోదు. మిల్లింగ్కు పంపించే వరకు రైతుదే బాధ్యత. ఆపై రసీదు ఇచ్చే పరిస్థితి ఉంది. తూకం వేసిన ధాన్యం మిల్లుకు వెళ్లాక మిల్లర్ వచ్చిన ధాన్యం నాణ్యతను బట్టి కోతపెట్టి ఎంత కొనుగోలు చేశాడో చెబుతాడు. రైతు నుంచి మిల్లరు ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పిన లెక్కకు అనుగుణంగా ఐకేపీ సెంటర్ నుంచి రసీదు వస్తుంది. ఆ తర్వాతే ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలోకి రైతు విక్రయించిన ధాన్యం వివరాలు నమోదవుతాయి. దానికి అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ ధాన్యం సొమ్మును ఆయా జిల్లాల ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపుతుంది. దీని వల్లే ధాన్యం సొమ్ము ఇంకా వారి ఖాతాల్లోకి రాలేదు. -
రూ.18 వేల కోట్ల కుంభకోణం.. విచారణ జరపాలి: మధుయాష్కీ
సాక్షి, ఢిల్లీ: కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు లేక.. అకాల వర్షంతో రైతులు రూ.1300, రూ.1400కే వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు అమ్ముకున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ఈ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోందన్నారు. చదవండి: 'తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రిని అడుక్కోవడానికి రాలేదు' రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.1940తో కొనుగోలు చేసింది. రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి మూడు, నాలుగు వందల రూపాయల తక్కువ ధరకు తీసుకుందని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే రూ.18 వేల కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ నాయకులు తెలంగాణ రైతుల కష్టార్జితాన్ని రూ.18వేల కోట్లను మెక్కినట్లుగా తెలుస్తోందని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. -
రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల ప్రమేయం తగ్గించామని పేర్కొన్నారు. అధిక వర్షాలతో కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకూ 2,36,880 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 7వేలకు పైగా ఆర్బీకేలలో ధాన్యం సేకరణ ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: మాయలేడి: ఇంట్లోకి వచ్చి ఎంత పని చేసిందంటే..! -
ధాన్యం ఎగుమతి చేయాలి: కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగినందున సేకరణ విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని, ధాన్యం ఎగుమతి అంశా లను పరిశీలించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కోరా రు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై సోమ వారం మధ్యాహ్నం కేసీఆర్ మరోసారి గోయల్తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇప్పటికే వివిధ రకాల ప్రత్యామ్నాయ పంటల సాగును రాష్ట్ర ప్రభు త్వం ప్రోత్సహించినా, 55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని కేసీఆర్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో 145 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పెరిగిన దిగుబడి కారణంగా ప్రస్తుత సీజన్లో కనీసం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలన్నారు. ఆదివారం చర్చల సందర్భంగా కేంద్రమంత్రి అడిగిన అదనపు సమాచారాన్ని సీఎం కేసీఆర్ అందించారు. దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు వరి పండిస్తున్నాయని, దీంతో 4 ఏళ్లకు సరిపడ నిల్వల్ని ఇప్పటికే కేంద్రం సేకరించిందని గోయల్ తెలిపారు. తెలంగాణకు సేకరణ కోటాను పెంచితే, ఇతర రాష్ట్రాల నుంచి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి నట్లు సమాచారం. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. విదేశాలకు ధాన్యం ఎగుమతిపై కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి తెలిపినట్లు సమాచారం. సమస్య పరిష్కారానికి సీఎం కృషి... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. కేంద్రమంత్రితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ సమయంలో రైతులు పండించిన పంటను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిందలు పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు సాగు విస్తీర్ణం చూస్తే పరిస్థితి అర్థం అవుతుందని ఆయన చెప్పారు. శాసనసభ జరుగుతున్నా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండి.. రెండుసార్లు కేంద్రమంత్రిని కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలు సొంతంగా విదేశీ మార్కెట్లో అమ్ముకునే అవకాశం లేదని, అందుకే కేంద్రం ఆ అంశాన్ని పరిశీలించాలని కేంద్రమంత్రిని కేసీఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, నామా నాగేశ్వర్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రైతులపై కపట ప్రేమ చూపడం మానుకోవాలని సీఎం కేసీఆర్కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యం బకాయిలు ఇంకా రూ.600 కోట్లు చెల్లించాలని బహిరంగ లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని లేఖలో ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఎడ్చినా రాజ్యం ఎప్పటికీ బాగుపడదు.. కాబట్టి ఇక నైనా రైతులు కన్నీరు పెట్టుకునే చర్యలను మానుకోవాలని సూచించారు. వానకాలం పంట పనులు ప్రారంభమై రైతులు నాట్లు వేసుకుంటున్న ఇంకా వరి ధాన్యం కొనుగోలు బకాయి బిల్లులు చెల్లించడం లేదన్నారు. దీని వల్ల దాదాపు లక్ష మంది వరకు రైతున్నలు డబ్బులు రాక ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఇకనైనా కళ్లు తెరిచి రైతులకు రావాల్సిన డబ్బులను మంజూరు చేయాలన్నారు. కేసీఆర్ కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఆగమేఘాల మీద నిధులు విడుదల చేసి.. రైతుల విషయంలో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసలు మీకు రైతులంటే ఎందుకు అంతా చిన్నచూపు.. దేశానికి పట్టెడన్నం పెడుతున్నందుకా..? లేదా మీరు ఎం చేసిన రైతన్న ఎదురు తిరగడు కాబట్టా...? అని ప్రశ్నించారు. వెంటనేరైతులకు బకాయిపడ్డ రూ. 600 కోట్లు నిధులు విడుదల చేయాలని లేదంటే రైతన్నలను వెంటబెట్టుకుని ప్రగతి భవన్ను కాంగ్రెస్ పార్టీ తరపున ముట్టడి చేస్తామని ఆల్టిమేటం జారీ చేశారు. -
పొలం గట్టుపై నుంచి మంత్రితో మాట్లాడిన సీఎల్పీ నేత
సాక్షి, ఖమ్మం: కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కాంటాలు వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని కోరారు. చింతకాని మండలం తిమ్మినేని పాలెం పొలం గట్టు మీద నుంచి వ్యవసాయశాఖామంత్రి నిరంజన్ రెడ్డితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కొన్ని రోజుల తరబడి వడ్లు కొనకుండా, మిల్లులు అలాట్ కాకుండా, లారీలు రాకుండా గత కొన్ని రోజులుగా పొలంలో తడుస్తున్న ధాన్యం గురించి వ్యవసాయ శాఖామంత్రికి చెప్పి దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.. అలాగే తరుగు కూడా 6 కిలోల నుంచి 8 కిలోల వరకూ తీస్తున్నారని, అంత మొత్తంలో తరగు తీయకుండా చూడాలని మంత్రికి చెప్పారు. గత కొన్ని రోజులుగా ఎర్రుపాళెం, మధిర, చింతకాని, బోనకల్, ముదిగొండ తదితర మండలాల్లోని పొలాల్లో ఉన్న ధాన్యాన్ని చూసి, సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. జిల్లా అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని సీఎల్పీనేతకు హామీ ఇచ్చారు. అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల గురించి పలు మండలాల్లో సీఎల్పీ నేత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చింతకాని మండలంలోని తిమ్మినేని పాళెం, తిరుమలాయపాళెం, జగన్నాథపురం, పందిళ్ల పళ్లి, రామక్రిష్ణాపురం వంటి పలు గ్రామాల్లో ఈ రోజు ఆయన పర్యటించారు. ఈ మేరకు పీపీఎస్ఈ కొ-ఆపరేటివ్ సొసైటీ కింద నాగులవంచ కొనుగోలు కేంద్రానికి మిల్లును అలాట్ చేయలేదని రైతులు తమ గోడును సీఎల్పీ నేత వద్ద వెళ్లబోసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొప్పుల గోవింద రావు, పందిళ్లపల్లి ఎంపీటీసీ వీరభద్రం, సొసైటీ డైరెక్టర్లు తూము కోటేశ్వర రావు, రామారావు, మండల కాంగ్రెస్ నాయకులు బసవయ్య, కోరపాటి రాము తదితరుల పాల్గొన్నారు. చదవండి: వైరల్: కానిస్టేబుల్ మానవత్వం.. సలామ్ కొడుతున్న నెటిజన్లు -
సన్నాలపై మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది భారీగా దిగుబడి వస్తున్న సన్నరకం ధాన్యానికి బోనస్ లేదా అదనపు ప్రోత్సాహకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బోనస్ లేదా ప్రోత్సాహకాలతో తమకు సంబంధం ఉండదని, అదనపు భారాన్ని పూర్తిగా రాష్ట్రాలే భరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. అదనంగా రూ. 100 లేదా రూ. 200 ప్రకటిస్తే ఎంత భారం పడుతుందన్న దానిపై వ్యవసాయ, పౌర సరఫ రాలు, ఆర్థిక శాఖలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనిపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధిక ధర కోసం డిమాండ్.. తెలంగాణలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా 34.45 లక్షల ఎకరాల్లో సన్నాలను పండిం చారు. ఈ లెక్కన 50 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్న ధాన్యం సేకరిం చాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం గ్రేడ్–1 ధాన్యానికి రూ. 1,888, కామన్ రకానికి రూ. 1,868 మేర చెల్లిస్తున్నారు. సన్నాలకు ప్రత్యేక ధర ఏదీ నిర్ణయించకున్నా కామన్ రకం ధరలతోనే కొనుగోలు చేస్తున్నారు. నిజానికి గతేడాది బీపీటీ, జైశ్రీరాం, జయశ్రీ, చింటూ, శ్రీరామ్గోల్డ్, 1008, జీలకర్ర సోనా వంటి ధాన్యం రకాలకు రైతుల వద్దకే వెళ్లి నేరుగా కొన్న సమయాల్లోనూ క్వింటాల్కు రూ. 2,200కన్నా తక్కువకు అమ్ముడుపోలేదు. అదే మిల్లర్ల వద్దకే తీసుకొని అమ్ముకుంటే రైతులకు రూ. 2,500 వరకు ధర పలికింది. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మిల్లర్లు సన్న రకాలకు రూ. 1,700 నుంచి రూ. 1,800 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. దీంతో కనిష్టంగా రూ. 500 వరకు రైతులు ధర కోల్పోతున్నారు. ముఖ్యంగా సన్నరకం అధికంగా సాగు చేసిన నల్లగొండ, కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల రైతులు ప్రస్తుతం మార్కెట్లోని ధరల తీరుతో భారీగా నష్టపోతున్నారు. అయితే ప్రభుత్వం 17 శాతం వరకే తేమ శాతాన్ని నిర్ణయించగా, 30 శాతం వరకు తేమ ఉన్నా తాము కొనుగోలు చేస్తున్నామని మిల్లర్లు అంటున్నారు. దొడ్డు రకానికంటే సన్నరకం ధాన్యం పంటకు చీడపీడల బాధ, పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. దొడ్డు ధాన్యంతో పోలిస్తే సన్నాలకు దిగుబడి కూడా తక్కువే. దొడ్డు రకం అయితే ఎకరానికి 40–45 బస్తాలు పండుతాయి. అదే సన్నాలయితే ఎకరాకు 25–30 బస్తాలకు మించి పండదు. అయినప్పటికీ రైతులు సన్నాలకు అధిక ధర వస్తుందని ఈ పంట సాగు చేస్తున్నా దొడ్డురకం ధాన్యంతో సమానమైన ధరే లభిస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాలకు అధిక ధర ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోంది. -
విత్తన నిల్వకు సరికొత్త పద్ధతి
సాక్షి, హైదరాబాద్: ఆకలి కేకలు, అన్నదాతలకు నష్టాలు తగ్గేదిశగా హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్) శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. విత్తనాలను దీర్ఘకాలంపాటు సురక్షితంగా నిల్వ చేసేందుకు సరికొత్త పదార్థం కనుగొన్నారు. ప్లాస్టిక్కు వేపనూనె జతచేసి నానో స్థాయి ప్లాస్టిక్ పదార్థం రూపొం దించారు. ఈ నానో ప్టాస్టిక్ పోగులతో తయారైన సంచుల్లో ఉంచిన విత్తనాలు 75 రోజుల తరువాత కూడా తాజాగానే ఉంటాయని ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంచుల్లో విత్తనాలు ఇదే కాలవ్యవధికి 70 శాతం మాత్రమే తాజాగా మిగులుతుండగా, కొత్త రకం సంచుల్లో ఇది 90 శాతం వరకూ ఉండటం విశేషం. అధిక ఉష్ణోగ్రతలను అడ్డుకొనేలా.. నానో ప్లాస్టిక్ పదార్థం శక్తిమంతమైందే కాకుం డా.. అధిక ఉష్ణోగ్రతలు లోనికి చేరుకోకుండా అడ్డుకోగలదు. ఇక పురుగు, పుట్ర నివారణకు వేపనూనె ఎంత ఉపయోగకరం. వేపనూనెలోని నింబిన్, అజాడిరక్టిన్ వంటి ట్రిటెర్పినాయిడ్లు బూజును దరిచేరనివ్వవు. క్రిమికీటకాల ఎదుగుదలనూ అడ్డుకుంటాయి. వేపనూనె ద్వారా 200 రకాల కీటకాలను అడ్డుకోవచ్చు. ఈ లక్షణాలన్నింటినీ ఒకదగ్గరకు చేర్చడం ద్వారా విత్తన నిల్వల నష్టాన్ని తగ్గించేందుకు పరిశోధనలు చేసినట్లు ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ శర్మ తెలిపారు. నానోప్లాస్టిక్ పదార్థంతో తయారుచేసిన సంచుల్లో విత్తనాలను సాధారణ ఉష్ణోగ్రతల వద్దనే నిల్వ చేయొచ్చని వివరించారు. ధాన్యం వృథాను అరికట్టేలా సంప్రదాయ పద్ధతులు వాడినా, ఆధునిక విధానంలో భాగంగా రకరకాల రసాయనాలు ఉపయోగించినా ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 130 కోట్ల టన్నుల ధాన్యం పనికిరాకుండా పోతోందని అంచనా. ఇంత మొత్తం ధాన్యంలో కొంతైనా రక్షించుకోగలిగితే రైతులకు నష్టాలు తగ్గడమే కాకుండా చాలామంది ఆకలి కూడా తీరుతుంది. -
కొందరు తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు: కాకాణి
సాక్షి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరసగా రెండో ఏడాది జలాశయాలకు పుష్కలంగా నీరు వచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నదులు పొంగి ప్రవహిస్తున్నాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎంతో సంతోషంగా రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో కూడా దిగుబడి సాధించారని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. అధికారుల సమన్వయ లోపం వల్ల రైతులు ఆందోళనకు దిగారని తెలిపారు. (చదవండి: సీఎం జగన్ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని) రైతులపై కేసులు పెట్టడం సరికాదని, వెంటనే కేసులు ఎత్తివేయాలని కోరారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న దళారులు, మిల్లర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ధాన్యం రంగు మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్యలను అధికారులు అర్థం చేసుకుని స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్ల గడువును పెంచే విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: శాఖ బాబుది.. సంతకం చినబాబుది) -
పరలోకపు తండ్రి చేసేది వ్యవసాయం!!
యేసుప్రభువు వ్యవసాయ పరిభాషను తన బోధల్లో విస్తృతంగా వాడాడు. ఆయన బోధలు ప్రజల్లో అందుకే అంత బలంగా నాటుకున్నాయి. సిలువ శిక్షకు తాను సిద్ధపడుతూ తదనంతర పరిణామాలకు తన శిష్యులను కూడా సిద్ధం చేస్తున్న కీలక సమయంలో ‘నా తండ్రి వ్యవసాయదారుడు’ అంటూ ఒక అద్భుతమైన పరలోక వివరణను యేసుప్రభువిచ్చాడు(యోహాను15:1). పగలనక, రాత్రనక తాను ఎందుకు అంతగా శ్రమిస్తున్నాడో ఆ ఒక్క మాటలో యేసుక్రీస్తు వివరించాడు. ఆధునికత ఎంతగా ప్రబలినా, మనిషికి ఆకలెయ్యక మానదు, దాన్ని తీర్చే ధాన్యాన్ని రైతు పండించకా తప్పదు. అందువల్ల రైతు లేని ప్రపంచాన్ని ఇంకొక లక్ష ఏళ్ళ తర్వాత కూడా మనం ఉహించుకోలేం. కష్టాలు, కన్నీళ్లు, శ్రమ, త్యాగం లేని రైతు నిస్వార్థ జీవితాన్ని కూడా మనం ఉహించుకోలేము. ఈ లోకంలో రైతుకొక్కడికే అందరిలాగా వారాంతపు సెలవులుండవు, నిర్ణీత పనివేళలూ ఉండవు. అతని ఆరోగ్యానికి భరోసా ఉండదు, కాయకష్టానికి పరిమితులుండవు, పొలంలో రాత్రిపూట విషసర్పం కాటేసినా పట్టించుకునే నాథుడుండడు. ఎండా, వానా, చలి, వరదలు, భూకంపాల పేరిట అంతటా, అందరికీ సెలవులుంటాయి, ఒక్క రైతుకు తప్ప. చంటి బిడ్డలను రెండేళ్లు జాగ్రత్తగా సాకితే, పెరిగి ప్రయోజకులై తమకు ఆసరాగా ఉంటారన్న భరోసా తల్లిదండ్రులకు ఉండొచ్చు. రైతుకా భాగ్యం లేదు. దుక్కి, దున్ని, విత్తనం వేసిన నాటి నుండి, కోతలు ముగిసి ధాన్యం ఇంటికి చేరేదాకా, అంటే మొదటి నుండి చివరి దాకా నిద్రాహారాలు మానేసి రైతు తన పంటను చంటి బిడ్డ లాగా సాకవలసిందే. ఇంత కష్టపడ్డా, పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం, వరదలొస్తే, భోరున ఏడవాల్సిందే. చేసిన అప్పు తీర్చలేక, మరోవైపు లోకమంతటికీ అన్నం పెట్టేవాడై ఉండీ, తన ఇంట్లోనే భార్యా పిల్లలు పస్తులుండటం చూడలేక కుమిలిపోతూనే, మరో పంట కోసం శ్రమించేందుకు రైతు సిద్ధపడాల్సిందే!! ‘నేను నా పరలోకపు తండ్రి అలాంటి రైతులం, కాబట్టి నా నామాన్ని ధరించిన మీరంతా రైతులే!! అన్నది విశ్వాసులకు ప్రభువు ఆనాడు చేసిన బోధ సారాంశం. ఎందుకంటే, తమ రక్షకుడి లాగే, ఆయన శిష్యులు కూడా రైతుల్లాగా కష్టపడకపోతే, ‘ప్రేమసువార్త’ భూదిగంతాలకు చేరదు. పంటను కాపాడుకోవడానికి రైతు ఎంతటి త్యాగానికైనా, శ్రమకైనా సిద్ధపడినట్టే, ఈ లోకాన్ని శాంతితో, సదాశయాలతో నిండిన పరలోకానికి సాదృశ్యమైన దేవుని రాజ్యంగా మార్చడానికి తన కుమారుడైన యేసుప్రభువును ఈ లోకానికి పంపేందుకు పరమతండ్రి త్యాగం చేసినట్టే, పాపుల కోసం సిలువలో తన ప్రాణాన్నే బలియాగంగా సమర్పించే త్యాగం చేసి రక్షకుడైన యేసుక్రీస్తు తన ప్రేమను చాటుకున్నాడు. ఎటొచ్చీ ఈ రైతులిద్దరిలాగే, నిండా త్యాగాలుండా ల్సిన విశ్వాసులు, పరిచారకుల జీవితాలు, పరిచర్యలు ఈ రోజుల్లో విలాసాలు, భోగాల్లో మునిగి తేలుతు న్నాయి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి కాని నాకు తల దాచుకోవడానికి కూడా స్థలం లేదని ఎంతో సంతృప్తి, ఆత్మానందం, జీవన సాఫల్యంతో గౌరవప్రదంగా, పారదర్శకంగా ప్రకటించిన యేసుప్రభువు అనుచరులుగా చెప్పుకునే వాళ్ళు. ఈనాడు కోట్లకు పడగెత్తుతూ, వస్త్రధారణలో, జీవన శైలిలో, ధనార్జనలో పోటీపడుతూ ‘టచ్ మీ నాట్’ అన్నట్టు తారల్లాగా వ్యవహరించడం ఎంతో బాధ కలిగించే విషయం. ఇలాంటి వాళ్ళతో ప్రకటించబడేది దేవుని రాజ్యమా, శత్రువు రాజ్యమా? శ్రమ తెలియకుండా తమ కోసం తామే స్వార్థంగా బతికే సెలెబ్రెటీలకు, ‘నేను’ ‘నా’ అనే మాటలే ఉండకూడని దేవుని సేవకులకు పోలిక ఏమైనా ఉందా?? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ ఈ మెయిల్: prabhukirant@gmail.com -
పంట పండింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాలు, నిండిన చెరువులు, ప్రాజెక్టుల నుంచి నీటి విడు దల నేపథ్యంలో మార్కెట్లలోకి ధాన్యం పోటెత్తనుంది. ప్రస్తుత సీజన్లో ఏకంగా 26.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడంతో అందుకు తగ్గట్లే ఈ ఏడాది ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. గతేడాది ఖరీఫ్తో పోలిస్తే ఈ ఏడాది 15 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా అంటే మొత్తం 55 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 15 నుంచి కొనుగోళ్లు ఆరంభం కానుండటంతో అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ధాన్యం విక్రయంలో రైతులకు అవగాహన కల్పిస్తూ క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖను భాగస్వామ్యం చేసింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఏఈఓను ఇన్ఛార్జిగా నియమించింది. 15న మూడు జిల్లాలతో ఆరంభం.. ఖరీఫ్లో ధాన్యం పోటెత్తే అవకాశాల నేపథ్యంలో రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలను గతంలోనే ఆదేశించారు. దీంతో ఇప్పటికే ఆయా శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే 2019–20 ఏడాదిలో మొత్తంగా 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఖరీఫ్లో 55 లక్షల టన్నులు, రబీలో 37లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయించారు. ఖరీఫ్ కొనుగోళ్ల కోసం 2,544 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి దాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. క్వింటాలు గ్రేడ్–ఏ వరి ధాన్యానికి రూ.1,835, కామన్ వెరైటీకి రూ.1,815 చొప్పున అందిస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. గత ఏడాది ఖరీఫ్లో 40.41లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ప్రస్తుతం వరి సాగు పెరిగిన నేపథ్యంలో మరో 15 లక్షల టన్నుల మేర పెరిగే అధికంగా ఉండనుంది. గత ఏడాది ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లకు రూ.13,300 కోట్ల మేర వెచ్చించగా, ఈ ఏడాది అది మరో రూ.5 వేల కోట్ల మేర అదనంగా కలిపి రూ.18 వేల కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. మొదటగా కామారెడ్డి, నిజామాబాద్, జనగాం జిల్లాలో 15 నుంచి ధాన్యం సేకరణను ఆరంభించనున్నారు. అనంతరం వరి కోతను బట్టి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద ఈ– అకౌంటింగ్ నిర్వహించేలా, ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపరిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం మరుగుదొడ్లు, షెల్టర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన ప్లాడీ క్లీనర్లు, విన్నోవింగ్ మిషన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కావాల్సిన 12 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచనున్నారు. సీఎంఆర్ ఇవ్వకుంటే కఠిన చర్యలే.. నాణ్యత పరిశీలన కోసం కార్పొరేషన్ టెక్నికల్ స్టాప్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన థర్డ్పార్టీ బృందంతో కూడా తనిఖీలు చేయనున్నారు. ధాన్యం అందించిన 15 రోజుల్లో మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించాలని మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే ఆ మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గడువులోగా మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకపోతే ఆర్ఆర్ యాక్టు ప్రయోగిస్తామని పేర్కొంది. మిల్లింగ్ కెపాసిటీని బట్టే ధాన్యాన్ని కేటాయించాలని, దీన్ని డీసీఎస్వోలు పర్యవేక్షించాలని సూచించింది. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా పోలీసు ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. ధాన్య సేకరణ కమిటీలు.. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ చైర్మన్గా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, పోలీస్శాఖ నుంచి ఒకరు, సీడబ్లు్యసీ రీజినల్ మేనేజర్, ఎస్డబ్ల్యూసీ మేనేజింగ్ డైరెక్టర్, సెర్ప్ సీఈఓ, కో–ఆపరేషన్ కమిషనర్, ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈసారి జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్, జిల్లా లేబర్ ఆఫీసర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లు కొత్తగా సభ్యులుగా చేర్చడం జరిగింది. -
అనుగ్రహం
అది.. సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీక అయిన ఇస్లామీయ చక్రవర్తి హజ్రత్ ఉమర్ షారుఖ్ (ర) పరిపాలనా కాలం. రెండు మూడు సంవత్సరాలుగా వర్షాలు కురియక రాజ్యంలో ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. చక్రవర్తి వెంటనే రాజ్యంలోని వ్యాపారస్తులందరిని సమావేశపరిచి, మీరు కోరినంత ధర ఇస్తాను. మీ దగ్గర ఉన్న ధాన్యం మొత్తం తీసుకుని రమ్మని చెప్పాడు.‘‘ఓ చక్రవర్తి! ఇది నిజంగా మాకు మంచి తరుణం. ఒకటికి పది రెట్లు అధికంగా లాభం పొందే అవకాశం. కాని మా దౌర్భాగ్యం మేము మా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం హజ్రత్ ఉస్మాన్ (ర)కి ముందే అమ్మేసాం’’ అన్నారు. చక్రవర్తి హజ్రత్ ఉమర్ షారుఖ్ (ర), హజ్రత్ ఉస్మాన్ (ర) దగ్గరకు వెళ్లి.. ‘‘ఓ ఉస్మాన్ (ర), రాజ్యంలో కరువు తాండవిస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా. మీ దగ్గర ఉన్న ధాన్యం మాకు ఇస్తే దానికి బదులుగా మీరు కోరినంత విలువ ఇస్తాను’’ అన్నారు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు నేను నా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం ఈ ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేని ధరకు అమ్మి వేసాను’’ అని అన్నాడు.‘అయ్యో! నా ప్రజలకు సహాయం చేయలేకపోతున్నానే’ అన్న నిరాశ, నిస్పృహలతో అక్కడి నుండి వెళ్తూ, వెళ్తూ చెట్టు నీడన కూలబడ్డాడు హజ్రత్ ఉమర్.కాసేపటికి తరువాత జనాలు బస్తాల కొద్దీ ధాన్యం మొసుకొని వెళ్లడం గమనించి, ఎంత ధరకైనా కొందామన్నా లభించని ధాన్యం వీళ్లకు ఎలా లభించిందబ్బా, అని వాకబు చేయగా, ఉస్మాన్ (ర) ఉచితంగా పంచుతున్నాడని తెలిసింది. హజ్రత్ ఉస్మాన్ (ర) దగ్గరకు వెళ్లి, ‘‘ఓ ఉస్మాన్! నేను నువ్వు కోరినంత ధర ఇస్తాను అన్నా అమ్మను అన్నావు. మరి ఇదేమిటి ఇలా ఉచితంగా పంచుతున్నావు?’’ అని అడిగాడు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు! మీరు మహ అంటే వంద రెట్లు అధికంగా ఇస్తారేమో. కాని పరలోకంలో నా ప్రభువు ఇచ్చినంత ఇవ్వలేరుగా. అందుకే నేను నాకు ఈ అనుగ్రహం ప్రసాదించిందిన అల్లాహ్ కే తిరిగి అమ్మేసాను’’ అన్నాడు.యదార్థం ఏమిటంటే, విశ్వాసుల నుండి అల్లాహ్ వారి ప్రాణాలనూ, వారి సిరి సంపదలనూ స్వర్గానికి బదులుగా కొన్నాడు. మరీ ముఖ్యంగా రంజాన్ మాసంలో అల్లాహ్ మార్గంలో చేసే ప్రతి కర్మకు మిగతా మాసాల్లో చేసే కర్మలకన్నా 70 రెట్లు అధికంగా దైవం ప్రసాదిస్తాడని ప్రవక్త (స) తెలిపారు. – షేక్ అబ్దుల్ బాసిత్ -
తొలకరి
మణెమ్మ ఉదయం పది గంటలైనా పక్కమీద నుంచి లేవలేక పోతోంది. డిసెంబర్ నెల పైగా రేకుల గది. లేచి మాత్రం ఏమి చెయ్యాలి కనుక. ఇద్దరు కోడళ్లు నెలకొకరు చొప్పున్న ఇంత ముద్ద పడేస్తే తినటం తప్ప. వేడి వేడి టిఫిన్ తిని ఎన్ని రోజులైనదో. అడిగే వాడు లేడు . డెబ్భై ఏళ్లకే సరైన పోషణ లేక శరీరం నీరసించి పోతున్నది రోజు రోజుకి.‘వుందా పోయిందా ముసల్ది? పదైనా లేవలేదు‘ గది బయట పెద్ద కోడలి గొంతు వినపడింది. ‘లేస్తున్నానమ్మా,‘ బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది మణెమ్మ, ‘లే,లే... లేచి మొహం కడుగు’.నీళ్ల టీ పాత బల్ల మీద పెట్టి వెళ్లి పోయింది. లేచి మొహం కడుక్కొని వచ్చేసరికి టీ చల్లారి పోయింది. అదే గొంతులో పోసుకొని చద్దన్నం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంకో అరగంటకి చద్దన్నం, పాత చింతకాయ పచ్చడి ప్లేటులో వేసి పోయింది కోడలు.రోజూ అదే అన్నం, ఎదో ఒక పచ్చడి. తిని తిని విసుగు వస్తోంది. అయినా చేసేదేమీ లేదు. ఎవరూ అడిగేవారు లేరు. ముసలి మనిషిని ఎవరు భాద్యత తీసుకుంటారు? ఒక్క వృద్ధాప్య పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక కొడుకు వంతులేసుకొని డ్రా చేసిన డబ్బు జేబులో వేసుకోవటమే తప్ప నెలకొకసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు. మణెమ్మ నిట్టూర్చి స్నానానికని లేచింది. వేడినీళ్లు ఏనాడూ నోచుకోలేదు. ఎండలో బకెట్ నీళ్లు ఉంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది. రేకులు ఊడి వేలాడుతుంటాయి ఆ రేకు తలుపుకి. అది ఎక్కడ గీసుకుంటుందేమోనని భయం మణెమ్మకి. ఒక శీల కొట్టియ్యమని ఎన్నిసార్లడిగినా వినిపించుకున్న పాపాన పోరు ఎవరూ. నెలకొక ఒంటి సబ్బు, ఒక బట్టల సబ్బు ఇస్తారు. అంతే అంతకు మించి ఏమి విదల్చరు. జీవితమంటే విరక్తి కలుగుతోంది. చావు రాదేమి? యాతన లేని నిద్రలోనే ప్రాణం పోయేలా చూడమని దేవుని కోరుకొని రోజులేదు. మణెమ్మ జీవితం భర్త వున్నంత కాలం బాగానే గడిచింది. అరెకరాల భూమిని ఆయనే చేసేవాడు. పాడి పంట జీవితం ఉన్నంతలో బాగానే గడచి పోయింది. ఇద్దరు కొడుకులని బాగా చదివించాలని చాల ఆశపడేవాడు రమణయ్య. ఆయన ఆశ నెరవేరలేదు. పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు. రెండోవాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు. కోడళ్లు మామగారు వున్నంత కాలం నోరు మెదపలేదు. క్రమంగా మణెమ్మ స్థానం వేప చెట్టు కింద రేకుల గదిలోకి మారింది. ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు. నలుగురు మనవలున్నా వాళ్లని చేరదీయటానికి ప్రయత్నిస్తే ఊరకుక్కల తంతు. పిల్లలకు ‘ముసల్దానా‘ అని వెక్కిరించడం నేర్పారు.మణెమ్మ కొడుకులైనా కొంచం ప్రేమ చూపిస్తారేమోనని ఆశ పడేది. అది ఎంత దురాశో ఆమెకి తెలిసి వచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకొంది. స్నానం కానిచ్చి బయట అరుగుమీద కూర్చుని వచ్చే పోయేవాళ్ళని చూస్తూ కూర్చుంటుంది. అదే ఆమెకి కాలక్షేపం. ‘అమ్మమ్మ‘ అన్న పిలుపు విని కళ్ళు చికిలించి చూసింది. విజయ, మునసబు కోడలు. తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి. ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఎదో ఒకటి తినటానికి ఇస్తుంటుంది. రెండు బొబ్బట్లు కాగితంలో చుట్టి మణెమ్మకి తెచ్చిచ్చింది. అడపాదడపా విజయే దేవుడి ప్రసాదమంటూ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది.ఆత్రంగా రెండు బొబ్బట్లు తిన్నది మణెమ్మ. విజయ గ్రామ పెద్ద కోడలు కాబట్టి కోడళ్లు ఏమీ మాట్లాడరు, ‘అమ్మమ్మ, చాల ఏళ్ల క్రితం వాసు అని ఒక పదేళ్ల అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు, గుర్తుందా?’ మణెమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అవును, ఇరవై ఏళ్ళ క్రితం వాసు తన ఇంటి పక్క పోర్షన్లో వుండేవాడు. పదేళ్లు వుంటాయేమో వాడికి. సన్నగా పొడవుగా మౌనంగా ఉండేవాడు. వాసు తలితండ్రులు బస్సు యాక్సిడెంట్లో పోయారు. వాసు తండ్రికి వచ్చిన కంపెన్సేషన్ తీసుకొని వాడిని తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ల బాబాయి. వాసు పిన్నికొక చిన్న బాబు ఉండేవాడు. వాసుని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడతను. వాసు పిన్ని పుట్టిల్లు అదే వూరు. తరచు పుట్టింటికి వెళ్లిపోయేది. వాసు బాబాయ్, పిన్ని వాణ్ణి ఒక్కడినే ఇంట్లో వదిలేసి పోయేవాళ్లు. వాడికి డబ్బులు ఇచ్చేవాళ్లు కాదు. లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజూ ఒక్కసారి వండుకొనేవాడు. మణెమ్మ కొన్నిరోజులు వాడి అవస్థ చూశాక మూడుపూటలా వాడికి అన్నం పెట్టేది. వాసు వద్దనేవాడు కానీ ఆమె ఊరుకొనేది కాదు. వాళ్ళ పిన్ని ఇంట్లో వున్నా ఆమెకి తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకొనేది. రెండేళ్ల తర్వాత వాసు మేనమామ వాడిని చూట్టానికి వచ్చాడు.వాడెంత దుర్దశలో వున్నాడో చూసి తనతోపాటు వాడిని తీసుకెళ్లి పోయాడు. వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు. విజయ ద్వారా ఆమెకి తెలిసిందేమిటంటే వాసు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు. మేనమామే అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. వాసు మామగారితో కలసి ఉంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు. వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా చాల పేరు సంపాదించాడు.‘అమ్మమ్మ, నీ గురించి అంతా చెప్పాను. విని చాలా బాధ పడ్డాడు. వీలుచూసుకొని వస్తానని చెప్పాడు’ అని చెప్పింది విజయ.మణెమ్మ వాసు కోసం ఎదురు చూడసాగింది. వాసుని చూడాలని ఒక కోరిక, అంతే. అంతకు మించి ఏ ఆశా లేదు. ఆలా వారం గడిచింది. ఒకరోజు మణెమ్మ చద్దన్నం కంచంలో పెట్టుకొని దిగాలుగా కూర్చుని వున్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు. పక్కన విజయ వుంది.‘అమ్మమ్మ, ఎవరు వచ్చారో చూడు...’‘ఎవరమ్మా, ఎవరు వచ్చారు?’ అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాలిని ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు. ఏ ఉపొద్ఘాతం లేకుండా ఆమె పక్కన కూర్చుని ‘నేనమ్మా! వాసుని’ అంటూ ‘నాతో వస్తావా పెద్దమ్మ’ అని అడిగేశాడు. మణెమ్మ ముఖం వెలిగిపోయింది. అంతలోనే దిగాలుగా చూస్తూ ‘ఎందుకూ పనికిరాని ఈ ముసల్దాన్ని ఏమి చేసుకుంటావు నాయనా! చూపు కూడా ఆనట్లేదు’.. ఆమె కంటినిండా నీళ్లు చెంపల మీదుగా కారసాగాయి. వాసుకి కూడా కంటనీరు వచ్చింది. ఆ రేకుల గది, తీగకు వేలాడుతున్న పాతబట్టలు, పచ్చడి మెతుకులతో వున్న ప్లేట్ అవన్నీ చూసి అతని మనసు కదలిపోయింది. వాసు ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా విజయతో అన్నాడు ‘నేను పెద్దమ్మని నాతో తీసుకెళతానమ్మా’ అంటూ లేచి బయటకు వెళ్ళాడు.గుమ్మం దగ్గిర ఆగి తన చేతిలో వున్న ప్యాకెట్ విజయకు అందిస్తూ ‘ఇంకా ఇక్కడ వస్తువులు ఏమీప్యాక్ చేయకండి. నేను వాళ్ళ కొడుకులను అడిగి వస్తాను.’ విజయ ‘అమ్మమ్మ, లే, లేచి చీర మార్చుకో’ మణెమ్మకి అంతా కలలా వుంది. ‘వెళ్లు అమ్మమ్మ, నీ కష్టాలు తీరినట్టే. ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు.’ మణెమ్మ ఒక్క నిమిషం అనుకుంది తనలో తాను. ‘వెళతాను, ఇంత దుర్భర జీవితం కంటే వెళ్లిపోవడమే నాకు విముక్తి. వాసు ఇంట్లోనే వున్న కొడుకులను పిలిచాడు బయటకు. తనని తాను పరిచయం చేసుకొని అన్నాడు, ‘నేను పెద్దమ్మను నాతో మా వూరు తీసుకెళదామని అనుకుంటున్నాను. మీకేమీ అభ్యతరం లేదుగా’‘ఎన్నిరోజులు’ పెద్దకొడుకు ధిలాసాగా అడిగాడు.‘మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను.’‘మళ్ళీ ఎందుకు మాకీ సంత, మీరే చూసుకోండి సచ్చిందాకా’ చిన్న కోడలు అన్నది. వాసు ఆ నలుగురుకేసి చూశాడు. ఒక వృద్ధురాలి పట్ల వాళ్లు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి ‘రాక్షసులు ఎక్కడో వుండరు’ అనుకొంటూ ‘చాల థాంక్సండీ’ అంటూ మణెమ్మ దగ్గరికి వెళ్లాడు. అప్పటికి ఆమె రెడీ అయింది.ఇన్నోవాలో ఆమెను సౌకర్యంగా కూచోబెట్టి, డోర్ వేశాడు. విజయ వైపు తిరిగి నమస్కరిస్తూ ‘మీ సహాయానికి చాలా థాంక్స్ అమ్మా! మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి’ అంటూ కారులో కూర్చున్నాడు. దూసుకుపోతున్న కారును చూస్తూ ‘ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది’ నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు, కోడళ్ళు. జీవితంలో కారెక్కి ఎరుగదు మణెమ్మ . ‘పడుకుంటావా అమ్మ’ అన్న వాసుతో ‘లేదు నాయనా కూర్చుంటా‘ అని జవాబిచ్చింది. ‘ముందు టిఫిన్ చేద్దాం’ అరగంట తరువాత మంచి హోటల్ ముందు అపి ఆమె దిగటానికి సాయం చేశాడు. రెస్ట్ రూమ్ దగ్గరవున్న ఆమెకి డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడు. ‘అమ్మా! ఏం తెప్పిచమంటావు?’ ‘నీ ఇష్టం నాయనా’ రెండు ఇడ్లీ, దోస, వడ ఇద్దరికీ తెప్పించాడు. ఎన్ని రోజులైందో అటువంటి టిఫిన్ తిని ఆమె తినే విధానమే చెబుతోంది. టీ తాగాక ప్రయాణం మొదలైంది, మణెమ్మ నిద్రలోకి జారుకుంది. ఎన్ని గంటలు గడిచాయో కారు వాసు ఊళ్లోకి ఎంటర్ అయ్యాక మెలకువ వచ్చింది మణెమ్మకి. అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరుగదు. కారు వాసు ఇంటిముందు ఆగింది. తడబడుతూ దిగుతుండగా లలిత వచ్చి ‘నెమ్మదిగా దిగండి అత్తయ్య‘ అంటూ చేయి అందించింది. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ మండువా లోగిలి ఎంతో అందంగా వుంది. మెట్లు ఎక్కేముందు కాళ్లు కడుక్కోటానికి పంపు వుంది. శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది. ఆమెని సోఫాలో కూర్చోబెట్టి మంచి నీళ్లు తేవడానికి లోపలి వెళ్లింది లలిత. ఆమె తల్లి తండ్రి వాళ్లని వాళ్లు పరిచయం చేసుకున్నారు. వాళ్లు ఎంతో ఆదరంగా ‘మీకిక్కడ ఏ ఇబ్బందీ ఉండదు. మేము మీకు తోడుగా ఉంటాం’ అన్నారు. అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్ని ఏళ్లు గడిచాయో! మణెమ్మని హాలుకి ఆనుకొని వున్న గదిలోకి తీసుకెళ్లింది లలిత. ‘ఈ రోజు నుంచి ఇది మీ గది అత్తయ్య! మీరు కొంచంసేపు రెస్ట్ తీసుకోండి. నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను’ అంటూ వెళ్లింది. మణెమ్మ గది అంతా కలయ చూసింది. నీటుగా ఉన్న పక్క, దాని పక్కనే బాటిల్తో నీళ్లు, గ్లాసు వున్నాయి. బాత్రూం తలుపు తీసి చూసింది. ఎంతో నీటుగా వుంది. జయమ్మ వచ్చింది. ‘నా పేరు జయమ్మ, మిమ్మల్ని కనిపెట్టుకొని వుండమన్నారమ్మా వాసు సర్.. అమ్మా! రండి, భోజనానికి’ అంటూ కిచెన్ పక్కన వున్న పెద్ద హాల్లోకి దారితీసింది. వాసు మణెమ్మ పక్కన కూర్చొని ఆమె మొహమాటపడకుండా చూశాడు.భోజనాలు అయ్యాక .లలిత మణెమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్లింది. ‘అత్తమ్మా! ఆటచ్డ్ బాత్రూం వుంది. మీ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు వుంది. మీరు ప్రతిసారీ లేవకుండా మీ అబ్బాయి ఈ ఏర్పాట్లు చేశారు. బాగా అలిసిపోయింటారు, రెస్ట్ తీసుకోండి‘.. మణెమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలచుకుంటూ మంచం మీద పడుకుంది. అయినవాళ్లు దురాగతానికి పదేళ్లుగా గాయపడిన ఆమెకి శారీరకంగా, మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరచుకోగా, మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఏ కలతలేని ప్రశాంతమైన నిద్ర. చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది. పనమ్మాయి జయమ్మ వచ్చి ‘లేచారమ్మా! రండి మొహం కడుక్కుందురుగాని’ అంటూ మొహం తుడుచుకోవటానికి టవల్ అందించింది. పొగలు గక్కుతున్న టీ లలిత తెచ్చిఇచ్చి పక్కనే కూర్చుని, ‘బాగా అలిసిపోయినట్టున్నారు అత్తమ్మా! కాసేపాగి వేన్నీళ్లతో స్నానం చేయండి. అలసట పోతుంది.. జయమ్మ, కాసేపాగి అమ్మ స్నానం చేస్తారు. దగ్గరు వుండు’ అని చెప్పింది. మణెమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటయింది. ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానం, ముఖ్యంగా తనను సొంత తల్లిలా వాసు చూసే విధానం , కోడలు, ఆమె తల్లి తండ్రులు చూపే గౌరవం ఇదంతా కలో నిజమో అన్న సందేహం కలిగేది. పదే పదే పిల్లలు చాల ప్రేమతో ‘నానమ్మ’ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది. మణెమ్మకి కొత్త జీవితం మొదలైంది. పదిహేను రోజుల తర్వాత ఆమెకి కొంత బలం వచ్చిందని అనిపించాక రెండు కళ్లకి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించాడు వాసు. జయమ్మని పూర్తిగా ఆమె సేవ కోసం నియమించాడు. ఆమెకి బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత లలిత తీసుకుంది. ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రేమ, ఆదరం అన్నీ ఆ ఇంట్లో లభించాయి. మణెమ్మలో చాలా మార్పు వచ్చింది. శారీరకంగా, మానసికంగా కూడా.మణెమ్మకి రోజులు హాయిగా గడిచి పోతున్నాయి ఆ మధ్య రెండు వెడల్పాటి బంగారు గాజులు, మెళ్ళోకి ఒక గొలుసు చేయించాడు వాసు. ‘వద్దు నాయనా! నాకెందుకీ ఖరీదైన నగలు’ అని వారించినావినకుండా లలిత చేత ఆమె మెళ్లో వేయించాడు. అప్పుడప్పుడు మణెమ్మకి మళ్లీ వాసు తనని ఆ రేకుల గదికి పంపించినట్టు పీడకలలు వస్తుండేవి. అది కల నిజం కాదు అని సమాధాన పడేది. వాసు ఎప్పుడు పొలం పనులలో తీరిక లేకుండా ఉండేవాడు. ఒక్కోరోజు అందరూ కలసి ఆటవిడుపుగా పొలంలో భోజనాలు చేసేవారు. పొలంలోనే ప్రత్యేకంగా నిర్మించిన పర్ణశాలలాంటి పాక దగ్గిర గడిపేవాళ్లు.ఆ రోజు మాత్రం ఉదయం పది గంటలప్పుడు ఇంట్లోనే వున్నాడు వాసు. వంటింట్లో జయ వాళ్లు కూరలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చుని కబుర్లు చెబుతూ కూర్చోడం అలవాటయింది. తన అనుభవాన్ని ఎంతో గౌరవించే లలిత అంటే మణెమ్మకి ఎంతో ఇష్టం. వాసు, లలిత హాలులో తన గురించి మాట్లాడుకోవడం వినిపించి, ఆలకించసాగింది.‘అమ్మతో జర్నీ గురించి చెప్పావా’ ‘లేదు, నాకంటే మీరు చెప్తేనే బావుంటుందేమో’‘సరే, సాయుంత్రం నేనే చెబుతాను. కావాల్సిన బట్టలు, ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు, సరేనా’లలిత సరేనంది. ‘అన్నీ లిస్ట్ రాసి పెట్టా , అలాగే సర్దుతాను’...వాసు బయటకు వెళ్ళాడు. వాళ్ళ మాటలు విన్న మణెమ్మ కలవరపడిపోయింది. నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది. ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది. ఆలోచిస్తూ పడుకుంది.. అవును, వాళ్లు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు? తన ఆరోగ్యం బాగు చేశారు. కళ్లకు ఆపరేషన్ చేయించి కళ్లు కనపడేలా చేశారు. ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలనీ ఆశపడటం దురాశ కాదా? మణెమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి. అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది. లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది. తన మనసులోని భావాలని బయటపడకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తూ, పదే పదే ఆ ఇంటి పరిసరాలను, మనుషులను తరచి తరచి చూడసాగింది. ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తాను ఇక ఈ చరమ దశలో చూడలేదు కనుక. భోజనానికని వచ్చిన వాసుని తదేకంగా, తనివితీరా చూడసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వెళ్లిపోయింది మణెమ్మ. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకొంటోంది. వాసు లోపలికి వచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. లలిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నిల్చుంది. ‘అమ్మా! నీతో కొంచం మాట్లాడాలమ్మా!’ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు. ‘ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా, జర్నీ చేయగలవు కదా? వచ్చే కన్నీరుని ఆపుకొంటూ కళ్ళుదించుకొనే తలవూపింది మణెమ్మ. ‘అయితే టికెట్స్ కన్ఫర్మ్ చేస్తాను’ ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక ‘అలాగే నాయనా..’ అని అటుండగానే ఆమె కండ్ల వెంట నీరు కారసాగింది. భార్యాభర్తలిద్దరూ కంగారుపడిపోయారు , ‘ఎందుకమ్మా, ఏమైంది? నీ కిష్టం లేకపోతే వద్దు’... ‘లేదు నాయనా, వెళతాను. ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు’ వాసుకి అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. నవ్వుతూ ఆమె పక్కన కూర్చుని.. ‘నేను మామయ్య అత్తయ్య వాళ్లోతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటానికి అడిగాను’.. ‘కాశీకా?..’ నమ్మలేనట్టుగా అతనికేసి చూస్తూ అడిగింది.‘అవును, నిన్ను ఎప్పుడూ ఆ రేకుల గదికి , ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను. నువ్వు కోరుకుంటే తప్ప’.మణెమ్మ కదిలిపోయింది నిలువెల్లా, ‘నేను నీకేమి చేశానని నాకింత అదృష్టం కలగచేశావు నాయనా?’‘అమ్మా! నిన్ను తీసుకు రావటం చాల ఆలస్యం చేశాను.. అమ్మా, ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ, పెట్టిన అన్నమే నన్ను బతికించింది. నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డానంటే అది నీకు, తర్వాతమామయ్యకు, లలితకు మాత్రమే..’ .మణెమ్మ తన ముడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకొంది. భార్యాభర్తలిద్దరికీ కనుల నీరు వచ్చింది. వాసు అన్నాడు ‘అమ్మ, ఈ రోజు చెబుతున్నాను.. నువ్వు నాకు బరువుకాదు. నీకుసేవ చేసే అదృష్టం నాకు కలిగించు’.. రెండు చేతులూ జోడించి అంటున్న భర్తలోని మానవీయతను చూస్తూ పులకించిపోయింది లలిత. -
పాత(ర) ధాన్యం... పోషకం
‘పాతర’ అనే మాట నేటి తరానికి కొత్తగా అనిపించినా, తరతరాల నుండి వినిపిస్తున్న పాత మాటే. భూమిని తవ్వి అందులో ధాన్యాన్ని లేదా ఏదైనా వస్తువును పెట్టి మళ్లీ మట్టిని కప్పేదాన్ని ‘పాతర’ అని అంటారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటను కళ్లాల్లోకి తెచ్చి నూర్పులు చేస్తారు. ఏడాది పొడుగునా కుటుంబం తినేందుకు సరిపడే ధాన్యం దాచుకునేందుకు, పెళ్లీ, పేరంటాలు, గ్రామదేవతా ఉత్సవాలు వంటి శుభ కార్యాలలో బియ్యం కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాతర వేసి ధాన్యం నిల్వ ఉంచుకుంటారు. సంక్రాంతి అనంతరం కళ్లాల్లోని ధాన్యలక్ష్మిని పూజించి ఇంటికి తెచ్చి వాటిని పాతర వేస్తారు. అలా మే నెలాఖరు వరకు పాతర్లలో ధాన్యం నిల్వ చేస్తారు. అనంతరం బయటకు తీసిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి మిల్లు చేస్తారు. ఇలా పాతర వేసిన బియ్యం నాణ్యంగా, ఆరోగ్యకరమైన పోషక విలువలుండేలా, రుచికరంగా ఉంటాయని పాత తరం వారు చెబుతున్నారు. సంక్రాంతి నుండి నెల రోజుల పాటు నిత్యం పాతరను ఆవుపేడతో ఆవుపేడతో అలుకుతారు. ఉదయం, సంధ్యవేళల్లో రంగురంగుల ముగ్గులతో అలకంరించి, వాటిపై గొబ్బెమ్మలు పెట్టి ధాన్యలక్ష్మీ అవతారంగా భావించి దీపారాధన చేస్తారు. పాతర వేయడంలో ఆంతర్యం ఇదే... పాతర ధాన్యం తిన్న పాపలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ప్రచారంలో ఉంది. ఈ ధాన్యం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా భూస్వాముల ప్రతిష్టకు గౌరవం తెచ్చేవిగా చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు అధికంగా పూరింట్లో నివాసం ఉండేవారు. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇళ్లల్లో దాచిన సమయాల్లో అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇళ్ల ముందు గొయ్యి తీసి అందులో ధాన్యం ఉంచడం వల్ల అవి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. మే నెలలో అధికంగా వివాహాలు, గ్రామదేవత ఉత్సవాలు రోజుల తరబడి నిర్వహించే నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు, బంధువులకు మూడు పూటలా భోజనాలు అవసరమైనపక్షంలో వెంటవెంటనే పాతర్ల నుండి అవసరం మేర ధాన్యం తీసి వినియోగించేవారు. అంతేకాకుండా కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో పాతర్లలో ధాన్యం వినియోగించేవారు. – మద్దిలి కేశవరావు, సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ పాతర ఎత్తును బట్టి... గ్రామాల్లో రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే ఆతను ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అంతేకాదు, సదరు రైతు హుందాకు చిహ్నంగా పాతరను చెప్పవచ్చు. ఆ ఏడాది పొడవునా అన్నదాతగా ఆ రైతుకు గౌర మర్యాదలు దక్కేవి. -
అరికల వంటలు
అరికలు (Kodo Millet) నియాసిన్ (Niacin)mg (B3) 2.0 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.09 థయామిన్(Thiamine) mg (B1) 0.33 ఐరన్ (Carotene)ug 0 కాల్షియం (Calcium)g 0.04 ఫాస్పరస్ (Phosphorous)g 0.24 ప్రొటీన్ (Protein)g 6.2 ఖనిజాలు (Minerals) g 2.6 పిండిపదార్థం(Carbo Hydrate) g 65.6 పీచు పదార్థం (Fiber) g 9.0 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.28 కొర్ర బ్రెడ్ కావలసినవి: కొబ్బరి పాలు – అర కప్పుకొర్ర పిండి – ఒక కప్పుఈస్ట్ – అర టీ స్పూను, నీళ్లు – అర కప్పుబెల్లం పొడి – 2 టీ స్పూన్లు.ఉప్పు – తగినంతబ్రెడ్ ఇంప్రూవర్ – 0. 05 గ్రా. గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి, బ్రెడ్ ఇంప్రూవర్ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెన్ను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్ పాన్ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రే లో ఉంచి, అవెన్లో పెట్టి పావు గంట సేపు బేక్ చేసి తీసేయాలి. అరికల అట్టు కావలసినవి: అరికలు – అర కప్పు, కంది పప్పు – పావు కప్పు, పచ్చి సెనగ పప్పు – పావు కప్పు, పెసర పప్పు – ఒక టీ స్పూను, మినప్పప్పు – ఒక టీ స్పూను, ఎండు మిర్చి – 2 సోంపు – ఒక టీ స్పూను, ఉల్లి తరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను, పుదీనా తరుగు – ఒక టేబుల్ స్పూను ఉప్పు – తగినంత తయారీ: ఒక పెద్ద గిన్నెలో అరికలు, కంది పప్పు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, పెసర పప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో ఎండు మిర్చి, సోంపు జత చే సి మరోమారు గ్రైండ్ చేసి, ఇడ్లీపిండికి, దోసెల పిండికి మధ్యరకంగా రుబ్బి, పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు జత చేసి, మూత పెట్టి సుమారు గంటసేపు పిండిని నాననివ్వాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా నూనె వేసి కాగాక, గరిటెతో పిండి తీసుకుని పెనం మీద దోసె మాదిరిగా వేయాలి. అంచులు గోధుమరంగులోకి వచ్చాక ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి అలంకరించి దోసెను మధ్యకు మడత వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో వేడివేడిగా అందించాలి. అరికల పులావు కావలసినవి: అరికల బియ్యం – ఒక కప్పు, ఉల్లి తరుగు – ఒక కప్పు, నిలువుగా తరిగిన పచ్చి మిర్చి – 4అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు, కూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బఠాణీ, బీన్స్, క్యాప్సికమ్)షాజీరా – అర టీ స్పూను, ధనియాల పొడి – ఒక టీ స్పూను, నిమ్మ రసం – ఒక టీ స్పూను నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు, షాజీరా – అర టీ స్పూను, పుదీనా తరుగు – పావు కప్పుఉప్పు – తగినంత, బిర్యానీ మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క లవంగాలు – 4, ఏలకులు – 2, మిరియాలు – అర టీ స్పూను సోంపు – అర టీ స్పూను, జాపత్రి – కొద్దిగా తయారీ: అరికల బియ్యాన్ని రెండుమూడు సార్లు కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో నెయ్యి/నూనె పోసి వేడి అయిన తరవాత షాజీరా, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కూరగాయ ముక్కలు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చి వాసన పోయేవరకు కలియబెట్టాలి. వడకట్టుకున్న నీళ్లు, ఉప్పు జత చేసి మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరికల బియ్యంలో నీళ్లు ఒంపేసి, అరికలను మరుగుతున్న నీటిలో వేసి మూతపెట్టి, సన్నటి మంట మీద పులావు వండుకోవాలి. మధ్యలో ఒకటిరెండుసార్లు గరిటñ తో కలిపి మూత ఉంచి ఉడికించాలి. దించే ముందు ధనియాల పొడి, నిమ్మ రసం, నెయ్యి వేసి పూర్తిగా కలియబెట్టి దింపేయాలి. పుదీనా చల్లి, వేడివేడిగా అందించాలి. -
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది ఖరీఫ్లో పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే రెట్టింపుస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఖరీఫ్లో 2,716 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.17 లక్షలమంది రైతుల నుండి 18.24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతుధర (గ్రేడ్–ఎ క్వింటాల్కు రూ.1,770, సాధారణ రకం– క్వింటాల్కు రూ.1750)కు 6.71 లక్షలమంది మంది రైతుల నుండి 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నుంచి మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కొత్తగా ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు నిరంతరం విద్యుత్ సరఫరా, రైతుబంధు వంటి కార్యక్రమాలతో రైతులు పెద్దఎత్తున వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్లో 8 లక్షల హెక్టార్లలో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది 10 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈసారి పురుగులు(దోమకాటు), ఇతర రోగాలు లేకపోవడంతో గతంలో కంటే ఎకరానికి 10 క్వింటాళ్లు అధికంగా దిగుబడి పెరిగింది. రైతులకు కనీసమద్దతు ధర లభించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో దళారుల జోక్యానికి అడ్డుకట్ట పడింది. పంటకు కనీస మద్దతుధర గ్యారంటీగా లభిస్తుందనే భరోసా రైతుల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్లో 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,71,286 మంది రైతుల నుండి రూ.6,055 కోట్ల విలువ చేసే 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేశారు. ఇప్పటివరకు రూ.5,213 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుఖాతాలోకి జమ చేయగా, మిగిలిన మొత్తం కూడా ట్రాక్షీట్ జనరేట్ అయిన వెంటనే జమ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేశాం రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా జిల్లాల కలె క్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ఖరీఫ్లో 25 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 34 లక్షల టన్నులు సేకరించాం. 36 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నాం. దీని ప్రభావం రైతులపై పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయగలిగాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
రోడ్డెక్కుతారా.. తోలు తీస్తా...
నల్లగొండ అగ్రికల్చర్: ధాన్యం కొనాలంటూ ధర్నా చేసిన రైతులపై పోలీసులు లాఠీ ఝలిపించారు. ‘రోడ్డెక్కుతారా కొడకల్లారా.. తోలు తీస్తా’అంటూ నల్లగొండ టూటౌన్ సీఐ ఊగిపోతూ బూతు పురాణం అందుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన పలువురు రైతులపై పిడిగుద్దులు కురిపించి సుమోలోకి ఎక్కించి స్టేషన్కు తరలించారు. దీంతో మిగతా రైతులు భయపడి పరుగెత్తి బీట్ మార్కెట్ యార్డులో దాక్కున్నారు. మంగళవారం స్థానిక నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. మూడ్రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో యార్డులో పెద్దఎత్తున ధాన్యం రాశులు నిలిచిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగిన రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా చేస్తారా అంటూ రైతులపై విరుచుకుపడి లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
అతిధి
ఇద్దరు వ్యక్తులు కొండెక్కి రావడం గమనించాడు టీచర్ దారూ. ఒకడు గుర్రం మీదా, మరొకడు నడిచి వస్తున్నారు. మంచులో ప్రయాణం కష్టమే. అతికష్టం మీద ఒక్కొక్క అడుగేస్తూ రొప్పుతూ నెమ్మదిగా కదులుతున్నారు. వాళ్లిక్కడికి చేరటానికి కనీసం మరో అరగంటైనా పడుతుంది. ఎముకలు కొరికేస్తున్న చలి. స్వెట్టర్ కోసం వెనక గదిలోకెళ్లాడు.ఎనిమిది నెలల తర్వాత వర్షానికి కూడా తెరిపివ్వకుండా అక్టోబర్లో మంచు కురిసింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ఇరవైమంది పిల్లలు రావటం లేదు. ఆ బిల్డింగ్లోని ఒక్క గదిని మాత్రమే హీట్ చేశాడు దారూ. కొండవైపు కిటికీ ఉన్న క్లాస్రూం బాగా చల్లగానే ఉంది.తిరిగివచ్చి చూస్తే వాళ్లు కనిపించలేదు. అంటే కొండ శిఖరానికి దిగువన ఉన్నారన్నమాట. మసక చీకటిగా ఉంది. మిట్ట మధ్యాహ్నమైనా నల్లటి మేఘాలింకా తొలగిపోలేదు.మంచు, చలిగాలితో శరీరం గడ్డకట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ తాడ్జిడ్ నుంచి వచ్చిన డెలివరీ ట్రక్కు తనకు రెండు రోజుల రేషన్ దినుసులు సరఫరా చేసిపోయింది. స్కూలుకొచ్చిన పేదపిల్లల కుటుంబాలకు పంచటానికి గోధుమ బస్తాలు ఒక గదిలో పేర్చి ఉన్నాయి. ఏ ఉపద్రవం సంభవించినా నష్టపోయేది పేదలే. వచ్చిన వాళ్లందరికీ రోజూ ధాన్యం పంచాడు. గత మూడు రోజుల స్టాకు నిల్వ ఉంది. మంచు కాస్త తెరిపిచ్చింది గనక, తమ కోటా ఇవ్వమని ఈరోజు ఎవరో వస్తారు, మళ్లీ కోతల దాకా ఇదే ధాన్యంతో సరిపెట్టుకోవాలి. ఫ్రాన్సు నుంచి ఓడలు వస్తూనే ఉన్నాయి. ఆకలి చావులు ఉండకపోవచ్చు. కానీ పేదల మొహాల్లోని దైన్యాన్ని మరచిపోవడం కష్టం. ఇంతటి దుర్భర దారిద్య్రం మధ్య తను స్కూల్లో ఇంచుమించు సుఖంగా బతికినట్లే. సన్యాసి లాగ ఒంటరి జీవితం అయితేనేం.. శుభ్రమైన ఇల్లు. దారూ ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి.స్కూలు డాబా పైకెక్కి చూశాడు. ఆ ఇద్దరూ సమీపిస్తున్నారు. గుర్రం మీదున్న వాడు పోలీస్ కానిస్టేబుల్ బాల్డచ్చి. తాడుతో బంధించి ఒక అరబ్బువాణ్ణి లాక్కొస్తున్నాడు. దగ్గ్గరగా వచ్చేశారు.‘‘మూడు కిలోమీటర్లు రావడానికి గంటపట్టింది’’ అంటూ అరిచాడు బాల్డచ్చి.‘‘లోపలకి వచ్చి ఒళ్లు కాచుకోండి’’ అంటూ ఆహ్వానించాడు దారూ. కళ్లెం తీసుకుని గుర్రాన్ని వెనక కట్టేసి వచ్చి, ‘‘క్లాస్రూం కూడా హీట్ చేస్తాను ఇక్కడే కూర్చుందాం’’ అన్నాడు దారూ.బాల్డచ్చి చేతికి కట్టుకున్న తాడు విప్పి అరబ్బును తాత్కాలికంగా బంధ విముక్తుణ్ణి చేశాడు. ‘‘పక్కగదిలోకెళ్లు. నీకోసం పుదీనా టీ చేస్తాను’’ అన్నాడు దారూ. దారూ టీ తెచ్చేసరికే, బాల్డచ్చి పిల్లల డెస్కు మీదా, అరబ్బూ అతడి కాళ్ల దగ్గర కూర్చుని ఉన్నారు. అతడి చేతికున్న కట్లుచూస్తూ ‘‘కాసేపు విప్పొచ్చేమో!’’ అన్నాడు దారూ సందేహంగా. ‘‘ఆ.. ఇప్పుడేమీ భయం లేదు. ప్రయాణంలో మాత్రమే చేతులు కట్టెయ్యాలి’’ అన్నాడు బాల్డచ్చి. టీ గ్లాసు పక్కన పెట్టి దారూ కట్లు విప్పగానే మొదట రెండు చేతులూ రుద్దుకుని, టీ గ్లాసు పెదాలకు ఆనించుకున్నాడు అరబ్బు.‘‘ఇంతకూ ఎక్కడికి ప్రయాణం?’’ దారు అడిగాడు. ‘‘ఇక్కడికే’’ అన్నాడు బాల్డచ్చి. ‘‘స్కూలుకొచ్చే పిల్లలు మీలాగా కూడా ఉంటారన్నమాట. ఇంతకూ రాత్రి ఇక్కడే గడుపుతారా ఏమిటి?’’ అంటూ నవ్వాడు దారూ.‘‘లేదు. నేను కాసేపట్లో ఎల్ అమీర్ వెళ్లి పోతాను. ఈ అరబ్బును మీరు టింగిట్ వద్ద అప్పజెప్పాలి. పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి అధికారులు అక్కడికి వస్తారు’’. దారూకు ఈ కేసేమిటో అర్థం కాలేదు – ‘‘నాకేం సంబంధం?’’.‘‘నన్నేం చెయ్యమంటారు? అది పైనుంచి వచ్చిన ఆర్డర్’’ – ‘‘నేను టీచర్ని’’.‘అయితే ఏంటి? యుద్ధకాలంలో అందరూ అన్ని పనులూ చెయ్యాలి. నాకు వచ్చిన ఆర్డర్స్ గురించి చెప్పాను. శాంతిభద్రతల పరిస్థితులు మారుతున్నాయి. తిరుగుబాటు జరిగే అవకాశముందని సంకేతాలు వచ్చాయి..’’ఇదంతా నమ్మలేనట్టుగా చూశాడు దారూ.‘‘తొందర పడకు. అన్నీ నెమ్మదిగా అర్థం చేసుకో. గస్తీ తిరగటానికి ఎల్ అమీర్ వద్దకు డజను మందిమి మాత్రమే ఉన్నాం. నేను త్వరగా వెళ్లాలి. వీణ్ని నీకప్పజెప్పి వెంటనే తిరిగి రావాలని ఆర్డర్స్. అసలు ఇక్కడికెందుకు తెచ్చాననుకుంటున్నారు? ఊళ్లో కాస్త ఉద్రిక్తంగా ఉంది. బందీని విడిచిపెట్టాలని గోల చేస్తున్నారు. ఇక్కణ్నించి టింగిట్ ఇరవై కిలోమీటర్లే గదా. మీ వంటి వస్తాదు ఆ మాత్రం నడవలేడూ!’’.పెరట్లో గుర్రం సకిలించింది. కిటికీలోంచి చూశాడు దారూ. కాస్త వెలుగొచ్చింది. తర్వలో మంచు కరుగుతుంది. ‘‘ఏం చేశాడతడు? ఫ్రెంచివచ్చా?’’ ‘‘ఒక్క ముక్క కూడా రాదు. నెల రోజులుగా వీడికోసం గాలించాం. మిత్రులూ, బంధువులూ దాచిపెట్టారు. తన కజిన్ను చంపాడు’’‘‘ఇతడు మనకు శత్రువా?’’‘‘కాకపోవచ్చు. కానీ ఏమో ఎలా చెప్పగలం?’’‘‘ఎందుకు చంపాడు?’’‘‘కుటుంబ కలహం. ఒకడు మరొకడికి ధాన్యం బాకీ ఉన్నాడట. అసలు విషయమేమిటో స్పష్టంగా తెలియదు. గొర్రెల్ని కొక్కానికి వేళ్లాడదీస్తామే, దాంతో చంపాడు’’బాల్డచ్చి వైపు భయంగా చూశాడు అరబ్బు. దారూ అసహ్యంగా తలాడించాడు. ‘‘వెళ్లొస్తాను మరి’’ అంటూ బాల్డచ్చి లేచి, తాడు తీసుకుని అరబ్బువైపు నడిచాడు.‘‘ఎందుకది?’’‘‘మీ ఇష్టం. దగ్గిర రివాల్వరుందా?’’‘‘ఏదో ఒకటుందిలే’’– ‘‘ఎక్కడ?’’‘‘ట్రంకులో’’– ‘‘తీసి దగ్గిర పెట్టుకోవాలి’’‘‘భయపడాల్సిందేముంది?’’‘‘తిరుగుబాటే గనక జరిగితే ఎవరూ ఎవర్నీ రక్షించలేరు. ఆత్మరక్షణ ఒక్కటే మార్గం’’‘‘ఈ ఇల్లు కొండ మీదుందిగదా, వాళ్లు రావటం నాకు కనిపిస్తుందిలే’’ – ‘‘అది ఆత్మవిశ్వాసం కాదు. అతి నమ్మకం. నా దగ్గర రెండు రివాల్వర్లున్నాయి. ఒకటి తీసుకోండి’’ అన్నాడు బాల్డచ్చి. నల్లటి పెయింట్తో టేబుల్ మీద నిగనిగా మెరిసింది రివాల్వర్. ‘‘బాల్డచ్చీ, నా మాట విను. ఇతణ్ని చూస్తే నాకు అసహ్యమే. కానీ నా చేతుల్తో మళ్లీ పోలీసులకు మాత్రం అప్పగించను. యుద్ధం వస్తుందంటావా? అవసరమైతే నేనూ పోరాడుతాను. కానీ మనుషుల్ని పోలీసులకు పట్టివ్వడం పిరికిపంద లక్షణం’’‘‘నువ్వో మూర్ఖుడివి. మనుషుల్ని అదుపులో ఉంచటమే నేరమనుకుంటావు. కొందర్ని బంధించక తప్పదు. అందుకు మనం సిగ్గు పడాల్సిందేం లేదు’’‘‘నేను ఇతణ్ని ఎవరికీ అప్పగించే ప్రసక్తి లేదు’’‘‘దిసీజ్ ఏన్ ఆర్డర్. రిపీట్ చెయ్యమంటావా?’’‘‘నేను నీకు చెప్పిందాన్ని వాళ్లకు రిపీట్ చెయ్యి. మళ్లీ చెబుతున్నాను. ఇతణ్నెవరికీ అప్పగించను’’‘‘ఓకే, నేనెవరికీ ఏం చెప్పను. ఇతణ్ని నీకు హేండోపర్ చేశాను. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఆ తర్వాత నీ ఇష్టం’’‘‘అక్కర్లేదు. నువ్వు నాకప్పగించావని అవసరమైనప్పుడు వాంగ్మూలమిస్తాను. సరేనా?’’‘‘నీ నిజాయితీ గురించి సందేహం లేదు. కానీ సంతకం చెయ్యక తప్పదు. దటీజ్ ది రూల్’’ ‘‘ఇలా ఇవ్వు’’. దారూ సంతకం పెట్టిన రసీదు మడిచి జేబులో పెట్టుకున్నాడు బాల్డచ్చి. అరబ్బు వైపు చూసి గుమ్మం దాటాడు బాల్డచ్చి. ముందుకు వెళ్లినవాడు కాస్తా, సడెన్గా వెనక్కు వచ్చి, కిటికీలోంచి చూసి వెళ్లాడు. మంచులో అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. గుర్రమెక్కి, కళ్లెం పట్టుకుని మరోసారి లోపలికి తొంగిచూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా కొండదిగి అదృశ్యమయ్యాడు.మంచం మీద పడుకుని, నిశ్శబ్దాన్ని వింటూ ఆలోచించాడు దారూ. యుద్ధం తర్వాత తానిక్కడికొచ్చిన కొత్తలో ఈ నిశ్శబ్దాన్ని భరించలేక గిలగిలా కొట్టుకున్న రోజులెన్నో! కొండ దిగువన, చిన్న గ్రామంలో ఏదైనా ఉద్యోగం కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. మైదానానికీ, కొండ ప్రాంతానికీ ఉన్న సరిహద్దు అయింది. ఎటు చూసినా రాళ్లూ రప్పలు తప్ప మనుషుల జాడే లేదు. అక్కడక్కడా నాగటిచాళ్లు కనిపించాయి. కానీ, ఆ దున్నినవాళ్లు పంటలకోసం కాక, ఇల్లు కట్టడానికి అవసరమైన రాళ్ల కోసమే ఇంత కష్టపడినట్టుంది. ఇళ్లలో జనపదాలు వెలిశాయి. ఎక్కడినుండో మనుషులు గుంపులు గుంపులుగా వచ్చారు. సంసారాలు చేశారు. పిల్లల్ని కన్నారు. ఒకర్నొకరు చంపుకున్నారు. వేలాది మైళ్లు వ్యాపించిన ఈ ఏడాదిలో అందరూ ఇసుక రేణువుల్లాంటివారే. తనైనా తన అదుపులో ఉన్న ఈ అతిథైనా! కానీ.. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడిన మనుషులు మరోచోట బతకగలరా? లేచి కూర్చున్నాడు దారూ. పక్కగదిలో ఏ కదలికా లేదు. ఇదే అదనుగా అతడు పారిపోతే తన సమస్య తీరుతుంది. తొంగి చూశాడు. అక్కడే పడుకున్నాడు అరబ్బు. ‘‘ఇటురా, ఆకలిగా ఉందా?’’ అంటూ పిలిచాడు దారూ.ఆ ఆహ్వానం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా గబుక్కున లేచాడు అరబ్బు. టేబుల్ మీద ఇద్దరికోసం పళ్లాలు అమర్చి పిండిలో నూనె కలిపి, రొట్టె చేసి, గ్యాస్ స్టవ్ వెలిగించాడు దారూ. జున్ను, గుడ్లు, ఖర్జూరాలు, పాలూ తెచ్చాడు. అరబ్బు ఇదంతా ఆసక్తిగా గమనించాడు. ఆమ్లెట్ వేసి, తన అతిథిని ‘రా’ అంటూ ఆహ్వానించాడు. మర్యాదగా ఉంటుందనుకున్నాడేమో, రివాల్వర్ తీసి డ్రాయర్లో పెట్టాడు – ‘‘తిను’’.‘‘మీరూ తినండి’’ అన్నాడు అరబ్బు.‘‘తర్వాత’’. భయంగా, అనుమానంగా చూస్తూ, ‘‘కేసు విచారించే జడ్జ్ మీరేనా?’’ అడిగాడు అరబ్బు. ‘‘లేదు. రేపటిదాకా నిన్నిక్కడ ఉంచుకోవాలి. అంతే’’.ఒక ఫోల్డింగ్ కాట్ వేసి, దానిమీద రెండు బ్లాంకెట్లు పరిచాడు దారూ. పడుకుంటే, అతడికి కాపలా కాయడం తప్ప యింక చెయ్యాల్సిందేమీ లేదు. ‘‘ఎందుకు చంపావు?’’ అనడిగాడు దారూ.అరబ్బు ఉలిక్కిపడ్డాడు. ‘‘అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటాడి చంపక తప్పలేదు. నన్నేంచేస్తారు?’’‘‘భయపడుతున్నావా?’’అరబ్బు మాట్లాడలేదు.‘‘చేసిన పనికి విచారిస్తున్నావా?’’అరబిక్లోనే అడిగినా ఆ మాట అర్థం కానట్టుగా చూశాడు.‘‘ఇక్కడ పడుకో’’కాసేపాగి, ‘‘రేపు నా కోసం పోలీసులొస్తారా?’’ అని అడిగాడు అరబ్బు.‘‘తెలియదు’’‘‘నా వెంట మీరు కూడా వస్తారా?’’‘‘ఎందుకు?’’‘‘రండి’’∙∙ అర్ధరాత్రి దాటింది. దారూకు నిద్రపట్టలేదు. అరబ్బు పక్కకు ఒదిగి పడుకున్నాడు. నిలకడగా ఉన్న ఊపిరిని బట్టి అతడు నిద్రపోతున్నాడని తెలిసింది. దారూకు కొత్తగా ఉంది. ఏడాదిగా ఈ గదిలో తను ఒంటరిగా పడుకున్నాడు. ఈనాడు ఒక అనుకోని అతిథి తోడుగా ఉన్నాడు. తనూ ఇక్కడివాడే. అంటే తమిద్దరూ సోదరుల్లాంటి వాళ్లు. కానీ... సౌభ్రాతృత్వ భావనకది సమయం కాదు. అరబ్బు కదిలాడు. ఊపిరి బిగపట్టాడు దారూ. నిశ్శబ్దంగా లేచాడు. తలుపుతీసి అడుగులో అడుగు వేసుకుంటూ నిద్రలో నడుస్తున్నట్లు బయటికెళ్లాడు అరబ్బు. ‘పారిపోతున్నట్టున్నాడు. పీడ వదిలింది’ అనుకున్నాడు దారూ. పెరట్లో నీళ్ల చప్పుడు వినిపించింది. మరి కాసేపటికి ఖైదీ లోపలికి వచ్చి మంచం మీద వాలాడు.కలకూ, వాస్తవానికీ తేడా తెలియని స్థితిలో ఉన్నాడు దారూ. మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. అరబ్బు గాఢ నిద్రలో ఉన్నాడు. నోరు తెరుచుకుని ఉంది. కాఫీ తాగే టైమైంది. నెమ్మదిగా అతిథిని తట్టి లేపాడు. ఉలిక్కి పడినట్లుగా లేచాడు అరబ్బు.‘‘భయపడకు. లే’’.కేకు తిని, కాఫీ తాగారిద్దరూ. కుళాయి దగ్గర కాళ్లూ, చేతులూ కడుక్కున్నాడు అరబ్బు. ఆ తర్వాత బ్లాంకెట్లు తీసి, మంచం మడిచి గోడకు పెట్టాడు. ఎండలో మంచు మెరుస్తోంది. డాబాపైకెక్కి ఎడారిని పరిశీలించి చూశాడు దారూ. బాల్డచ్చికి కోపం వచ్చినట్టే ఉంది అనుకున్నాడు. అరబ్బు దగ్గుతున్నాడు. ఎంత ఆలోచించినా, తన ఖైదీ అంత మూర్ఖమైన నేరం ఎందుకు చేశాడో అంతుబట్టలేదు దారూకు. పైగా, అవకాశమిచ్చినా పారిపోడేం?కింద షెడ్డులో వంగి, వేళ్లతో పళ్లు తోముకుంటున్నాడు అరబ్బు. కిందికి దిగివచ్చి అతడు డ్రెస్సు వేసుకునే దాకా నిరీక్షించాడు దారూ. కాసిని రస్కులు, ఖర్జూరాలు, చక్కెర ఓ పాకెట్లో వేసుకుని తన అతిథిని తీసుకుని ‘పద’ అంటూ ముందుకు కదిలాడు.గంటసేపు నడిచి ఓ సున్నపురాయి పక్కన కూర్చున్నారిద్దరూ.ఎండ చిటపటలాడుతోంది. కరిగిన మంచు ఇట్టే ఆవిరైపోతోంది. కింద నేల రాయిలాగ గట్టిపడింది. కనుచూపుమేరలో మరో మనిషి జాడలేదు. ఒంటరిపక్షి ఆకాశంలో అరుస్తూ వలయాలు తిరిగింది. స్వచ్ఛమైన గాలిని గుండెలనిండా పీల్చుకున్నాడు దారూ. ఎంత అలవాటైనా, ఎడారిలో నడవడం ప్రతిసారీ ఒక వింత అనుభవమే. దక్షిణంగా మరో గంట నడిచారు.దూరంగా రాళ్లు గుట్టలు కనిపించాయి. వెంట తెచ్చిన ఖర్జూరాలు, బ్రెడ్డు, చక్కెర ప్యాకెట్టు ఇచ్చి ‘‘ఇంద, ఈ వెయ్యి ఫ్రాకులు కూడా తీసుకో, ఇలా నేరుగా రెండు గంటలు నడిస్తే టింగిట్ వస్తుంది. అక్కడ పోలీసులు నీ కోసం నిరీక్షిస్తున్నారు. వెళ్లు’’ అంటూ తన అతిథికి వీడ్కోలు చెప్పాడు దారూ. తిరిగి స్కూలు వైపు నడిచాడు దారూ. అరబ్బు కదలకుండా అక్కడే నిల్చున్నాడు. దిగులుగా తనవైపు చూస్తున్నాడు. గొంతులో ఏదో అడ్డు పడినట్లున్నది. మరోసారి వెనుతిరిగి చూశాడు. అరబ్బు కనిపించలేదు.నెమ్మదిగా కొండ ఎక్కి మరోసారి ఎడారినంతా గాలించి చూశాడు. దూరంగా కనిపించాడు అరబ్బు.దారూకు గుండె బరువెక్కింది. క్లాసురూంలో బోర్డు ముందర తలొంచుకుని నిల్చున్నాడు.ఫ్రెంచి నదులు మెలికలు తిరిగుతూ పరిగెత్తుతున్నాయి.అయితే అతను తిరిగి వచ్చేలోగా... ‘‘మా సోదరుణ్ని శత్రువులకు అప్పచెప్పావు. నిన్ను వదిలిపెట్టం’’ అంటూ బోర్డు మీద రాశారెవరో.ఇది తన మాతృభూమి. ఇక్కడే పుట్టిపెరిగిన తను ఇప్పుడు ఏకాకి. ఫ్రెంచి మూలం : ఆల్బర్ట్ కామూ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
ఆశలు గల్లంతు!
సాక్షి, పెద్దపల్లి : కొనుగోళ్లలో జాప్యం...అకాల వర్షం... వరదకు కొట్టుకుపోతున్న ధాన్యం... బురదనీళ్లలో గింజలు ఏరుకుంటు న్న రైతు ధైన్యం. జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిత్యం కనిపిస్తున్న దృశ్యం. చమటోడ్చి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే అన్నదాత ఆశలు గల్లంతవుతున్నా యి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి, దళారులను ఆశ్రయించొద్దు అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఉండడం లేదనే విమర్శలున్నాయి. తేమ శాతం పేరిట కొనుగోళ్లలో విపరీతమైన జాప్యానికి తోడు, అకాల వర్షాలు రైతును నిండా ముంచుతున్నాయి. బాధ్యులెవరు? ప్రతీ సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 131 పీఏసీఎస్, 35 ఐకేపీ కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 7,24,320 క్వింటాళ్లు, ఐకేపీ ద్వారా 2,51,521 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే క్వింటాళ్ల కొద్దీ ధాన్యం రాశులు ఇప్పటికీ కొనుగోలు కాకుండా కేంద్రాల్లోనే పడిఉన్నాయి. తేమశాతం పేరిట కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని కేంద్రాల్లోనే ఆరబెడుతూ రైతులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతుల కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతోంది. ఆరబెట్టిన ధాన్యం, కుప్పలు పోసిన ధాన్యం కూడా వర్షానికి తడవడమే కాకుండా, వరద నీళ్లతో మోరీల పాలవుతోంది. టార్పాలిన్లు ఉన్నాయని చెబుతున్నా, అవి సమయానికి రైతులకు అందడం లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో రైతులకు ముందే టార్పాలిన్లు ఇవ్వాల్సి ఉండగా, సిబ్బంది తమ దగ్గరే ఉంచుకుని వర్షం పడుతున్న సమయంలో ఇస్తుండడంతో ధాన్యం తడిసిపోతుంది. కొన్ని చోట్ల చిరిగిన టార్పాలిన్లు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు టార్పాలిన్లు లేవు. స్థలాల ఎంపికలోనే సమస్య.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల స్థల ఎంపిక కూడా ఇబ్బందిగా మారింది. పెద్దపల్లి మండలం రంగాపూర్లో కుంట కింద, కాలువ పక్కన కేంద్రం ఏర్పాటు చేయడంతో ధాన్యం నష్టం ఎక్కువ జరిగింది. వర్షానికి తోడు వరద నీళ్లు ముంచెత్తడంతో రైతులు తమ ధాన్యాన్ని అధిక మొత్తంలో నష్టపోతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం, వరదనీళ్ల కారణంగా గంట శ్రీకాంత్ అనే కౌలురైతుకు చెందిన ధాన్యం కుప్ప మొత్తం కొట్టుకుపోయింది. సకాలంలో తన ధాన్యం కొనుగోలు చేస్తే నష్టం తప్పేదని ఆ రైతు వాపోతున్నాడు. ఇంచిమించు జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తేమ, హమాలీ, రవాణా పేరిట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుంది. మద్దతు ధర వస్తుందని ఆశపడి కొనుగోలు కేంద్రాలకు వస్తే, ఆలస్యంతో తాము తెచ్చిన ధాన్యమే నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తమ కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోయిందని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. పంట విక్రయించి అప్పులు తీర్చి, పెట్టుబడికి మిగుల్చుకుందామనుకున్న సమయంలో పంట కొట్టుకుపోతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉండడంతో, ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. జాప్యం లేకుండా కొనుగోళ్లు – చంద్రప్రకాశ్రెడ్డి, డీసీవో రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండానే తూకం వేయిస్తున్నాం. తేమశాతం ఎక్కువగా ఉన్న రైతులే రెండు, మూడు రోజులు నిరీక్షిస్తున్నారు. ధాన్యం నింపేందుకు అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. రవాణాపరమైన ఇబ్బందులు లేవు. టార్పాలిన్లను కూడా కేంద్రాల్లోనే ఉంచాం. అనుకోకుండా వర్షాలు కురవడం వల్లే అక్కడక్కడ కొంత మేరకు ధాన్యం తడిసింది. రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేయ్యాలి
సాక్షి, నల్గొండ : అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జిల్లాలోని కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఇస్తున్న రూ.1500 లకు అదనంగా మరో రూ.500 జమ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకంలో సగభాగం మంత్రులు, ఎమ్మెల్యేలకే సరిపోతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో రైతులను పట్టించుకునే నాధులు లేరని, వారికి పట్టాలు పాసు బుక్లు ఇచ్చే వారే కరువయ్యారని విమర్శించారు. తడిచిన ధాన్యాన్ని మిల్లింగ్ తరలించే దిక్కు లేదని, వీటిని వెంటనే పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కృషి చేయాలన్నారు. అదే విధంగా రైతులకు సబ్సీడీ కింద ఎరువులు, విత్తనాలు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
గింజ గుట్టు విప్పేస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఎంఆర్ఐ స్కానింగ్ చేయ డం ద్వారా శరీర అంతర్భాగంలోని లోపాలను గుర్తించినట్లుగానే, ఇప్పుడు ఆహార ధాన్యాల నాణ్యతను గుర్తించేలా కొత్త స్కానింగ్ పరిజ్ఞా నం వచ్చింది. ఎంఆర్ఐ రిపోర్టు ఇచ్చినట్లుగానే ఇది కూడా ధాన్యం గింజలోని లోపాలను గుర్తిం చి రిపోర్టు ఇస్తుంది. అటువంటి పరికరాన్ని ఇద్ద రు ఐఐటీయన్లు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా మహబూబ్నగర్, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో ఇతర మార్కెట్లలోనూ ప్రవేశ పెట్టాలని మార్కెటింగ్శాఖ నిర్ణయించింది. త్వరలో టెండ ర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సేంద్రీయ లక్షణాలను గుర్తించవచ్చు రైతులు పండించిన ఆహార పంటల్లో నాణ్యతను గుర్తించడానికి ప్రస్తుతం సాధారణ పద్ధతులనే ఉపయోగిస్తున్నారు. తేమ శాతం, వాటిలోని నాణ్యతను సక్రమంగా నిర్ధారించకపోవడంతో సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. పూర్తిస్థాయి శాస్త్రీయ పద్ధతులు లేకపోవడంతో దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టే పరిజ్ఞానాన్ని మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టింది. ‘మ్యాట్’ అనే ఈ పరికరం ద్వారా వరి, పప్పులు సహా ఇతర అన్ని ధాన్యాల నాణ్యతను గుర్తించవచ్చు. ధాన్యం రాశిలోని నమూనా గింజలను ఈ పరికరంలోని స్కానర్పై పెడితే కంప్యూటర్ మానిటర్పై గింజలోని లక్షణాలు, లోపాలు ప్రత్యక్షమవుతాయి. ఆ ధాన్యంలో పురుగు మందులు, తేమ శాతం, సేంద్రీయ లక్షణాలు, ప్రొటీన్లు, విటమిన్లూ ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది. నిముషాల్లో స్కానింగ్ చేసి రిపోర్టు ఇస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా దాని నాణ్యతను నిర్ధారించి, దానికి తగ్గట్లు గ్రేడింగ్ చేసి ధరను నిర్ణయిస్తారు. అంతేకాదు సేంద్రీయ లక్షణాలు, నాణ్యత సరిగా ఉంటే అటువంటి ధాన్యాన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొనుగోలు చేసే అవకాశముంది. వాటి ధర కూడా గణనీయంగా పెరిగి రైతుకు లబ్ధి చేకూరనుందని అధికారులు చెబుతున్నారు. ధర ఎక్కువే అయినా... ఈ పరికరం ద్వారా ధాన్యం నాణ్యతను గుర్తించేందుకు ఖర్చు అధికంగానే ఉందని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ‘సాక్షి’కి చెప్పారు. ‘ఒక నమూనాను స్కానింగ్ చేయాలంటే రూ.180 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ పద్ధతులకంటే ఇది ఖరీదైనది. అయినా ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకో వాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. టెండ ర్లు పిలిచి ఈ పరిజ్ఞానాన్ని ఇతర మార్కెట్లలో ప్రవేశపెడతామన్నారు. సమగ్రమైన నాణ్యత రిపోర్టు వస్తున్నందున ఖరీదైనప్పటికీ రైతుకు లాభం చేకూర్చుతుందన్నారు. పత్తి, మిరప, పసుపు, పండ్లను స్కానింగ్ చేసే పరిస్థితి లేకపోవడం ఇందులో ప్రధాన లోపం. -
వందల క్వింటాళ్లు వర్షార్పణం
బూర్గంపాడు/ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడ/సంగెం: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వందల క్వింటాళ్ల ధాన్యం వర్షార్పణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం రాశులు అకాల వర్షానికి తడిశాయి. 100 లారీ ల ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు తేగా.. వర్షం కురిసే సమయంలో రైతులు కొంతమేర పట్టాలు కప్పి కాపాడుకున్నారు. మిగతా 60 లారీల లోడ్లకు సరిపోయే ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడిన కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు. నిమిషాల వ్యవధిలో వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే.. రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 20 బస్తాల ధాన్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందని, వందల క్వింటాళ్ల ధాన్యం పనికిరాకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కొత్తగూడ, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, సంగెం మండలాల్లో వర్షం కురిసింది. రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన మక్కలు, పసుపు మార్కెట్లలో తడిసిపోయాయి. -
ఏం కష్టమొచ్చె దేవుడా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అన్నదాతకు కొత్త కష్టం వచ్చి పడింది. ఆకస్మాత్తుగా కురుస్తున్న వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలవుతున్నాయి. నోటిదాకా వచ్చిన ముద్ద మట్టి పాలవుతోందనే బాధ ఒకవైపు... తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్శాఖ ససేమిరా అనడం మరోవైపు.. ఇలా రెండు విధానాలుగా కష్టమే ఎదురుకావడంతో ఏం చేయాలో తోచన వరి సాగు చేసిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఇటీవల వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానతో జిల్లాలో మూడో వంతు పంట నేలపాలైంది. ఇంత భారీ స్థాయిలో పంట నష్టం జరగడంతో బాధిత రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు మాత్రం నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడమే తమ బాధ్యత అని.. పరిహారానికి సంబంధించి తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు నిరాకరిస్తుండడం అన్నదాతను ఆవేదనకుగురి చేస్తోంది. మొత్తంగా కాలం కాని కాలం.. వరుణుడి కన్నెర్రతో సమస్యల సుడిగుండలో చిక్కుకున్న పాలమూరు రైతన్నలు ఏం చేయాలో దిక్కుతోచక స్థితి ఎదుర్కొంటున్నాలు. నిబంధనల విషయంలో సడలింపు, నష్టపరిహారం పంపిణీలో ప్రభుత్వం నిర్ణయంతో కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడో వంతు నేలపాలు... క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇటీవల కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని 26 మండలాలకు గాను 20 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాగైన పంటలో దాదాపు మూడో వంతు పూర్తిగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలే పేర్కొంటున్నాయి. జిల్లాలో 46వేల ఎకరాల్లో వరి పంట సాగవగా.. ఇటీవలి వడగండ్ల వానకు 15,123 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జిల్లాలోని మొత్తం 206 గ్రామాల్లో 8,428 మంది రైతులు పంట నష్టపోయినట్లు తేలింది. తద్వారా జిల్లా రైతాంగానికి రూ.8.16 కోట్ల పంట నష్టం వాటినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా కోయిల్కొండ మండలంలో 2,699 ఎకరాలు, మద్దూరు మండలంలో 2,125 ఎకరాలు, గండేడ్ మండలంలో 2,054 ఎకరాల చొప్పున రైతులు పంట నష్టపోయారు. మార్కెట్కు వస్తున్న ధాన్యం యాసంగి సీజన్ సంబంధించి ధాన్యం ఇప్పుడిప్పుడే మార్కెట్ వస్తోంది. కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రైతులు మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కురుస్తున్న వర్షానికి చాలా వరకు కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతోంది. కొన్నిచోట్ల ఎండిన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చినా అకాల వర్షాలతో తడిసిపోతుంది. దేవరకద్ర మార్కెట్కు సోమవారం తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అప్పటికప్పుడు కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు మార్కెటింగ్శాఖ అధికారులు ససేమిరా అంటున్నారు. నిబంధనల మేరకు తేమ 14శాతం కంటే తక్కువగా ఉండాలని, అంతకంటే ఎక్కువగా ఉంటే తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 2,489 క్వింటాళ్ల హంస, 3,635 క్వింటాళ్ల సోనమసూరి రకం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రెండు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఇందుకు గాను రూ. 40 వేల పెట్టుబడి పెట్టాను. వారం రోజుల నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో 50 శాతం ధాన్యం నేలరాలింది. దీంతో నాకు రూ. 80 వేల వరకు నష్టం వట్టిలింది. ఈ విషయాన్ని గమనించి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి మాలాంటి వారిని ఆదుకోవాలి. – టంకర్ శ్రీనివాస్, మరికల్ -
రైతు కంట కన్నీరే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే 48 గంటల్లో బ్యాంకు అకౌంట్కు డబ్బు జమ అవుతుందని అధికారులు చెప్పారు. విక్రయించి 20 రోజులు గడిచినా ఇంకా నా అకౌంట్కు డబ్బు జమ కాలేదు. ఇలాగైతే కూలీలకు కూలి ఎప్పుడు ఇవ్వాలి? పెట్టుబడి కోసం అప్పు తెచ్చిన చోట అప్పు ఎలా కట్టాలి? ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలి –కేవీ సుబ్బారావు, మంతెన గ్రామం, కృష్ణా జిల్లా ఖరీఫ్లో నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఎకరాకు 22 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్లో అమ్ముకోవడానికి పోతే క్వింటాల్ రూ.3,500 అడుగుతున్నారు. ఆయిల్ఫెడ్ కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రేపో మాపో కొంటామని చెబుతూ వచ్చిన అధికారులు తీరా సెంటర్లను మూసివేయడం దారుణం. – నాగరాజు, గమ్మరాళ్ల, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా ఇది సుబ్బారావు, నాగరాజుల ఆవేదనే కాదు... రాష్ట్రంలోని రైతులందరిది అదే రోదన. ఆరుగాలం చెమటోడ్చి పండించడం ఒక ఎత్తయితే... పండించిన పంటను అమ్ముకునేందుకు అంతకుమించి శ్రమించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు పట్టించుకునే నాధుడే లేదు. తేమ శాతం పేరుతో ధాన్యం ధరలో ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారు. గోదాములు లేవంటూ వేరుశనగ కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. ఎలాగోలా పంట విక్రయించినా డబ్బుల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో వ్యవసాయ కార్మికులు, ట్రాక్టర్లు, ధాన్యం నూర్పిడి యంత్రాలకు నగదు చెల్లించేందుకు దళారులు ఇచ్చిన రేటుకు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. లేదంటే బంగారం తాకట్టు పెట్టి ఆ ఖర్చులకు నగదు చెల్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరల ప్రకటనలతోనే సరిపుచ్చుకోవడంతో రాష్ట్రంలో ధాన్యం, వేరుశనగ విక్రయాల తీరు, రైతుల కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్... పెండింగ్లో రూ.వందల కోట్ల బిల్లులు ధాన్యం, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్లలో ఘోరంగా విఫలమయ్యాయి. కొనుగోలు చేసిన పంటకు వెంటనే చెల్లింపులు జరపకపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ధాన్యం రైతులకు రూ.324.73 కోట్లు, వేరుశనగ రైతులకు దాదాపు రూ.100 కోట్లు చెల్లింపులు బకాయి ఉన్నాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసి, రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు కోసం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్లో ఏ– గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ. 1,590, సాధారణ రకానికి రూ. 1,550గా మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్తున్నా తేమ శాతం పేరుతో క్వింటాల్కు రూ. 1480 మించి ఇవ్వడం లేదు. ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిద్దామంటే అందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి మోసాలు లేకుండా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, రవాణా, డీఆర్డీఏ, ఏటీడీఏ, ఐఅండ్పీఆర్ శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ(పీఏసీఎస్)లు, జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా రైతుల బ్యాంకు అకౌంట్లకు డబ్బు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా నెలలు గడుస్తున్నా జమ కావడం లేదు. ప్రభుత్వం ఇప్పటివరకు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో దాదాపు 20 వేల మంది రైతులకు రూ.324.73 కోట్ల విలువ చేసే బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వేరుశనగ రైతులకు ప్రభుత్వం రూ.120 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.25 కోట్లనే చెల్లించింది. రైతులకు తక్షణం నగదు చెల్లింపులు చేయడానికి రూ.100 కోట్లను సర్దుబాటు చేయాలని ఆయిల్ఫెడ్ అధికారులు విజ్ఞప్తి చేయగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకోవడంతో రైతులకు నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త నిబంధనలతో రైతుకు నష్టం మరోవైపు ప్రభుత్వం రూపొందించిన ఈ–క్రాప్ వెబ్సైట్లో రైతులు తమకున్న పొలం వివరాలు నమోదు చేసుకోకపోతే కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. సాగు వివరాలు ఈ–క్రాప్ వెబ్సైట్లో నమోదుకాని రైతులు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా గ్రామ కార్యదర్శి జారీ చేసిన సర్టిఫికేట్ తీసుకొని వెళ్తేనే ధాన్యం విక్రయించాలనే నిబంధన ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాదారు పుస్తకాలు లేకపోయినా రైతులు ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. కౌలుదారుల సంగతి సరేసరి. సాగు ధ్రువీకరణపత్రాలు, కౌలు గుర్తింపు కార్డులు ఉంటేనే పంటను అమ్ముకోగలుగుతున్నారు. మరోవైపు ఏ ఊరిలో పండిన ధాన్యాన్ని ఆ ఊరి మిల్లులోనే అమ్మాలని ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆ ఊరి ఆయకట్టులో పండిన మొత్తం పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు అనుమతి లేనందున రైతులు ఎప్పటికైనా తమ వద్దకే ధాన్యాన్ని తీసుకొస్తారనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వ్యాపారుల మధ్య పోటీ ఉండటంతో రైతుకు మంచి ధరే లభించేది. కొందరు వ్యాపారులు రైతులకు అవసరమైన ఖర్చులకు డబ్బును ఇచ్చేవారు. ఇప్పుడు వారంతా రైతులకు పెట్టుబడి పెట్టడం మానేశారు. దీంతో అటు ప్రభుత్వమూ డబ్బు చెల్లించక, ఇటు వ్యాపారులు డబ్బు ఇవ్వక రైతుల పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా మారింది. వేరుశనగ కొనుగోళ్లు నిలిపివేత మొన్నటి ఖరీఫ్లో రాష్ట్రంలో రైతులు 6 లక్షల 47 వేల 187 హెక్టార్లలో వేరుశనగను సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో 6 లక్షల 56 వేల 873 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గత అక్టోబర్, నవంబరు నెలల్లో ధర పెద్దగా లేకపోయినా సాగుకు చేసిన అప్పులు తీర్చేందుకు క్వింటాకు రూ.3,800లకు అమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు క్వింటాకు రూ.4,450 మద్దతు ధర ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి 24 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఫిబ్రవరి 28 లోపు 11.70 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 24 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఆయిల్ఫెడ్ అధికారులు అనంతపురం జిల్లాలో 1.60 లక్షల క్వింటాళ్లు, కర్నూలు 1.17 లక్షల క్వింటాళ్లు, వైఎస్సార్ జిల్లాలో 30 వేల క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 3.07 లక్షల క్వింటాళ్లలో 1.25 క్వింటాళ్లను ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేయగా, మిగిలిన పంట అంతా అక్కడి మార్కెట్ యార్డుల్లోనే ఆరుబయట నిల్వచేశారు. దీనినంతటినీ ప్రభుత్వ గోదాములకు తరలించిన తరువాతనే కొత్తగా కొనుగోళ్లు ప్రారంభించాలని, అప్పటివరకు కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటినుంచి వేరుశనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేసి రైతులను దోపిడీ చేయడం ప్రారంభించారు. మూసివేసిన కొనుగోలు కేంద్రాలు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన పంటకు నగదు చెల్లింపులు జరగలేదని, మళ్లీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా అప్పుడు కొనుగోలు చేసిన పంటకు మరో రెండు నెలల వరకు నగదు చెల్లింపులు జరగవని రైతులకు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడంతో రైతులు మరో మార్గం లేక క్వింటా రూ.3,400లకు అమ్ముకుంటున్నారు. 15 రోజులుగా పడిగాపులు: రామిరెడ్డి, నాగిరెడ్డి. కాటికానికాలువ, అనంతపురం రూరల్ ఈసారి కొంత వాతావరణం కరుణించడంతో అంతో ఇంతో వేరుశనగ పంట చేతికొచ్చింది. ఎకరాకు రూ.16 నుంచి రూ.18 వేల వరకు ఖర్చు చేశాం. వచ్చిన పంట అమ్ముకుందామంటే బయట వ్యాపారులు క్వింటా రూ.3,400కు మించి అడగడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. మేము వచ్చి 15 రోజులైంది. కూడు, నీళ్లు, నిద్ర లేక పదిహేను రోజులుగా రేయిబవళ్లు కాపలా కాస్తున్నాం. రైతులను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. గోదాముల కొరత పరిష్కారానికి చర్యలు: కె.రమేష్కుమార్ రెడ్డి, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ వేరుశనగ సేకరణకు గోదాముల కొరత ప్రధాన సమస్యగా ఉంది. కేంద్ర ప్రభుత్వం స్టేట్, సెంట్రల్ వేర్హౌసింగ్ గోడౌన్లను లీజుకు తీసుకోవాలని ఆదేశించింది. అయితే అవి ఖాళీగా లేకపోవడంతో అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేసిన వేరుశనగను నెల్లూరు, గుంటూరు, తాడేపల్లిగూడెంల్లోని ప్రభుత్వ గోడౌన్లకు తరలిస్తున్నాం. రాయలసీమలో ప్రభుత్వ గోడౌన్లకు ధీటుగా ఉన్న వాటి వివరాలను కేంద్రానికి పంపాము. వాటిని లీజుకు తీసుకోడానికి అనుమతి వస్తే వచ్చే నెలలోపు లక్ష్యాన్ని సాధిస్తాం. రైతులకు వెంటనే నగదు చెల్లింపులు చేయడానికి రాష్ట్రంతో పాటు కేంద్రానికి లేఖ రాశాం. నిధులు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. ఎకరాకు రూ.తొమ్మిది వేల నష్టం ధాన్యానికి మద్దతు ధర లేకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా చేతికందడంలేదు. ప్రస్తుతం క్వింటాల్కు రూ. 1450లు కూడా ధర దక్కడంలేదు. కూలీల ఖర్చుతో సహా ఒక ఎకరా వరి సాగుకు రూ. 45 వేలు ఖర్చు అవుతోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ప్రస్తుతం లభిస్తున్న ధరను పోల్చితే ఎకరాకు రూ.తొమ్మిది వేల వరకు నష్టం వస్తోంది. –మాదు శ్రీనివాసరావు, మంతెన గ్రామం, కృష్ణా జిల్లా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నేను మూడు ఎకరాలు కౌలుకు తీసుకొన్నాను. ఎకరాకు 30 బస్తాలు కూడా దిగుబడి రాలేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడిపోగా ఇంకా రూ. 5 వేలు అప్పు మిగిలింది. జీఎస్టీ వల్ల పురుగు మందులు, ఎరువుల ధరలు పెరిగిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. –కవురు కోటేశ్వరరావు, ఎన్.ఆర్.పి.అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా. -
బంగారు రేణువులను ముద్దలు చేస్తుంది...
సూక్ష్మ ప్రపంచం.. అదేనండీ... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లతో కూడినది ఓ వింతల లోకం. అదెలా అనే ప్రశ్నకి క్వీన్స్ల్యాండ్ శాస్త్రవేత్తలు సమాధానం చెబుతున్నారు. బంగారు రేణువులను హరాయించుకుని ముద్దలుగా మార్చేసే సరికొత్త బ్యాక్టీరియాను వీరు గుర్తించారు మరి! అయితే ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మీ స్మార్ట్ఫోన్, కంప్యూటర్ల వైపు ఒక్కచూపు చూసేయండి. దాంట్లో ఉండే అతితక్కువ మోతాదు బంగారం, ఇతర విలువైన ఖనిజాల కోసం అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. అంతేకాదు.. బంగారు గనుల్లో టన్నులకొద్దీ మట్టి తవ్వి తీస్తే వచ్చే బంగారం గ్రాముల్లోనే! ఈ కొత్త బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందనుకోండి. ఈ రెండు అంశాల్లోనూ గణనీయమైన మార్పు వస్తుంది. పాత, పడేసిన సర్క్యూట్ బోర్డుల నుంచి ఇవే ఎంచక్కా సువర్ణాన్ని వెలికితీసి ఇస్తాయి. గనుల విషయంలోనూ అధిక లాభాలు పొందేందుకు అవకాశమేర్పడుతుంది. ఈ మధ్యే కనుక్కొన్న ఈ బ్యాక్టీరియా ప్రస్తుతానికి కొంచెం నెమ్మదిగానే పనిచేస్తోంది గానీ.. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా వేగం పెంచడం కష్టం కాకపోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2016 నాటి లెక్క ప్రకారం.. కంప్యూటర్లు, టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లలో దాగి ఉన్న మొత్తం బంగారం విలువ లక్ష కోట్ల రూపాయల పైమాటే కావడం కొసమెరుపు! -
వీటితో గుండె పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించేందుకు ఆహారంలో సోయా, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మాంసం, కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు వంటి పదార్ధాల స్ధానంలో ఆరోగ్యకర ఆహారంతో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయని ఓ అథ్యయనం వెల్లడించింది. రోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకుంటే హానికర ఎల్డీఎల్ కొవ్వులను 5 శాతం మేర తగ్గించవచ్చని తేలింది.ఈ ఆహారంపై తాము విస్తృతంగా జరిపిన పరిశోధనలో ఇవి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని స్పష్టంగా వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ సెన్పైపర్ చెప్పారు. కెనడాలోని ఒంటారియో నగరంలోని సెంట్ మైఖేల్ హాస్పిటల్లో జాన్ సేవలందిస్తున్నారు. ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటి ఆహారంతో వీటిని కలిపితీసుకుంటే ఆరోగ్యకరంగా మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని అథ్యయనంలో తేలింది. -
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన
- జగిత్యాల జిల్లాలో కదం తొక్కిన అన్నదాత - 3 గంటలపాటు రాస్తారోకో జగిత్యాల అగ్రికల్చర్/జగిత్యాల రూరల్: అన్నదాతకు కోపమొచ్చింది. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. అధికారులెవరూ స్పందించకపోవడంతో రోడ్డెక్కారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బాధితుల్లో గర్భిణి.. ఫిట్స్తో బాధపడుతున్న చిన్నారి.. మంటలార్పడానికి వెళ్తున్న ఫైరింజన్ కూడా ఉంది. ధాన్యం కొనాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల– నిజామాబాద్ రహదారిపై అన్నదాతలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ ధర్నా.. రాస్తారోకో ప్రారంభించారు. జిల్లా కేంద్రం, శివారు ప్రాంతాల్లోని ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాల్లో లారీల కొరత, సంచుల సమస్యతో ధాన్యం కొనుగోళ్లు చేయడంలేదని జగిత్యాల మండలం కన్నాపూర్, బాలపల్లి, తిప్పన్నపేట, కల్లెడ, అంబారిపేట, చల్గల్ గ్రామాలరైతులు ఆరోపించారు. 3 గంటలపాటు ఆందోళనను కొనసాగించారు. దీంతో మూడు కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. ఉన్నతాధికారులు వచ్చి సమస్య పరి ష్కరించాలని భీష్మించుకుకుర్చున్నారు. ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు మాత్రమే వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించారు. చివరకు ప్రయాణికులు, మీడి యా ప్రతినిధులు జనం ఇబ్బందులను వివరించడంతో రైతులు శాంతించారు. చిక్కుకున్న గర్భిణి.. డెలివరీ కోసం జగిత్యాలకు వస్తున్న గర్భిణి నిఖిత, ఫిట్స్తో బాధపడుతున్న చిన్నారి ట్రాఫిక్లో చిక్కుకొని నరకయాతన అనుభవించారు. ప్రయాణికులు చివరకు సహనం కోల్పోయి రైతులతో గొడవకు దిగారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
ధాన్యం దండెత్తింది
- ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులు - అంచనా 29.5 లక్షల మెట్రిక్ టన్నులు..చేతికొచ్చింది 41 లక్షల మెట్రిక్ టన్నులు - రంగంలోకి దిగిన మంత్రి హరీశ్రావు - మిల్లర్లు, లారీ యజమానులతో యుద్ధ ప్రాతిపదికన చర్చలు సాక్షి, సిద్దిపేట: అన్నదాత పంట పండింది. దండిగా ధాన్యం మార్కెట్ మీదకు దండెత్తి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువులు నిండి, బావులు, బోర్లు ఊట పట్టడం.. దానికి నిరంతరాయ విద్యుత్ తోడు కావటం యాసంగికి కలిసొచ్చింది. పుట్ల కొద్దీ ధాన్యం పోటెత్తడంతో మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. అదే సమయంలో ఖమ్మం మిర్చి యార్డుకు రైతులు నిప్పు పెట్టడం.. అక్కడక్కడా రైతాంగం నిరసనలకు దిగటంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు రంగంలో దిగారు. పోటెత్తుతున్న ధాన్యానికి ధీటుగా అధికారులను మానసికంగా సిద్ధం చేశారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ ఏడాది రబీ సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా 31.5 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. రబీలో ఇంత విస్తీర్ణంలో వరిసాగు చేయడం వ్యవసాయశాఖ చరిత్రలోనే ఇది తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 41.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 29.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి రావచ్చని అధి కారులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. మార్కెట్కు తరలివస్తున్న ధాన్యం తీరును చూస్తే 41.67 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రావచ్చని భావిస్తు న్నారు. అయితే, మార్కెట్లో ధాన్యం పోయడానికి జాగ లేదు. నింపటానికి బస్తాలు, తూకం వేయడానికి హమాలీలు, తరలించడానికి లారీలు లేవు. దీనికి తోడుగా మార్కెట్లోకి బతుకమ్మ వడ్ల రాశులు వస్తున్నాయి. ఈ రకం వడ్లకు మార్కెటింగ్ శాఖ గుర్తింపు లేక అదో గందరగోళం. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్రావు స్పందించి వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయిస్ అధికారులను ఏకతాటి మీదకు తెచ్చారు. లారీల కొరత ఒప్పందం చేసుకున్నంతగా ఏజెన్సీలు లారీలను పంపలేకపోయాయి. ఒక్కో జిల్లాకు రోజుకు సగటున 400 లారీలు అవసరం. 31 జిల్లాలకు కనీసం 12,400 లారీలు అవసరం. వీటికోసం అధికారులు రోడ్డెక్కారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల లారీలను మినహాయించి, మిగిలిన లారీలను మార్కెట్ వైపు మళ్లించారు. ధాన్యం లోడ్ చేసి మార్కెట్ ఖాళీ చేయించారు. లారీల్లోనైతే ధాన్యం ఎత్తారు, కానీ వాటిని నిల్వ చేయడానికి గోదాములు ఖాళీ లేవు. గోదాముల సమస్య రాష్ట్రంలో పాతవి 4.14 లక్షల మెట్రిక్ టన్నులు సామర్థ్యం, కొత్తవి 17.85 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయి. మొత్తం కలిపి 21.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయొచ్చు. కానీ పంట దిగుబడి వచ్చిందేమో 41.67 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ కొరత నుంచి గట్టెక్కేందుకు హరీశ్రావు రైస్ మిల్లర్ల సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఒక్కో మిల్లుకు 4000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. దానికి అదనంగా మరో 1000 మెట్రిక్ టన్నులను చేర్చారు. మొత్తం 16.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లులు నిర్విరామంగా పనిచేయాలని ఒప్పించారు. ఇక ధాన్యానికి వచ్చిన డబ్బును రైతు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. . ఇప్పటివరకు 4.02 లక్షల మందిS రైతుల వద్ద నుంచి 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రూ.3598 కోట్లు రైతులు ఆర్జించారు. ఇందులో రూ.2300 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మంత్రి ఇప్పుడు ఈ లావాదేవీలపై దృష్టి పెట్టారు. చివరి గింజ వరకు కొంటాం.. చెరువులు నిండినయ్, రైతన్నలు కష్టపడ్డారు. కష్టానికి తగిన ఫలితం వచ్చింది. గతంలో ఎప్పుడూ చూడనంతగా దిగుబడులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్, రవాణా శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. కొనుగోళ్లకు ఇబ్బంది లేదు. రైతన్న కష్టానికి నాది భరోసా. మార్కెట్కు వచ్చే చివరి గింజను కూడా కొనుగోలు చేస్తాం. బతుకమ్మ వడ్లకు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్టిఫికెట్ ఇచ్చింది. సమస్య లేదు. మీ ప్రతి రూపాయి లెక్కగట్టి మీ ఖాతాల్లో జమ చేస్తాం. – టి.హరీశ్రావు, మార్కెటింగ్ శాఖ మంత్రి -
ధాన్యం కుప్పలపైనే రైతు కన్నుమూత
ఐదు రోజులుగా ధాన్యానికి కాపలా... దోమకొండ(కామారెడ్డి): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి, ధాన్యం కుప్ప కు కాపలాగా ఉన్న ఓ రైతు అక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల పోచయ్య (62) ఈనెల 11న 30 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ రవాణా సమస్యతో ధాన్యం తూకాలు వేగంగా సాగడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి కాంటా కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకుల పోచయ్య ఐదు రోజులుగా తన ధాన్యానికి కాపలా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం వరకు పొలం వద్ద పనులు చేసిన పోచయ్య.. రాత్రి భోజనం చేసి వెళ్లి.. ధాన్యం వద్ద కాపలాగా పడుకున్నాడు. మంగళవారం వేకువజామున తోటి రైతులు లేపడానికి ప్రయత్నించగా, అప్పటికే చనిపోయి ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురై మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అకాల వర్షం.. ఆగమాగం..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, సంగెం, భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట, నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలాల్లో వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. అలాగే, కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలమట్టమైంది. ఇంకా ఈదురు గాలులతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ వర్ధన్నపేట మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లాలో తడిసిన ధాన్యం అర్వపల్లి/ తిరుమలగిరి: సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి, తిరుమలగిరి మండలాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ వర్షానికి జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి, రామన్నగూడెం, కొమ్మాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులపై పట్టాలు కప్పుకున్నా కొంత మేర తడిసింది. రామన్నగూడెం పీఏసీఎస్ కేంద్రం బండపై ఉండటంతో ధాన్యం కుప్పల మధ్య నీళ్లు నిలిచాయి. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం బస్తాలు తడిశాయి. -
నల్లరేగడి నవ్వింది!
సింగూరు కింద తొలిసారి ధాన్యం సిరులు - 30 వేల ఎకరాల్లో పసిడి పంటలు - యాసంగిలో ఊహించని స్థాయిలో దిగుబడి - ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు - పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి హరీశ్ - స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి సింగూరు కింద నీళ్లందినట్టు వెల్లడి - వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని స్పష్టీకరణ సింగూరు ప్రాంతం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆ భూములన్నీ ఇన్నాళ్లూ వట్టిపోయాయి.. నీళ్లు లేక నోళ్లెళ్లబెట్టాయి.. తుప్పలు, ముళ్ల పొదలతో నిండిపోయాయి.. మూడు దశాబ్దాలుగా చుక్కనీటికి నోచుకోలేక బీళ్లుగా పడి ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఆ భూముల్లో పసిడి పంట పండింది.. రైతుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది! ఇన్నాళ్లూ కోటి జనాభా ఉన్న జంట నగరాల దాహార్తిని తీర్చిన సింగూరు.. చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు కింది గ్రామాల పంటలకు ప్రాణం పోసింది. గతేడాది వర్షాలతో మంజీరా పరవళ్లు తొక్కడం, అప్పటికే సిద్ధం చేసిన సింగూరు కాల్వల ద్వారా నీటి విడుదల జరగడంతో తొలిసారి 30 వేల ఎకరాలకు నీటి పారుదల శాఖ నీళ్లందించింది. ఈ ప్రాజెక్టు పరిధిలో తొలిసారి సాగు చేసిన పంటలు కోతకు రావడంతో కాల్వల పరిధిలోని గ్రామాల్లో నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం పర్యటించారు. రైతులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు..? ఉమ్మడి మెదక్ జిల్లాలో 1976లో నిర్మించిన సింగూరు ప్రాజెక్టు తొలి నుంచి తాగునీటి ప్రాజెక్టుగానే ఉంది. 30 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని చేపట్టగా 11.59 టీఎంసీలను పూడిక, ఆవిరి నష్టాలకు కేటాయించి, మిగిలిన 18.41 టీఎంసీల్లో 8.35 టీఎంసీలు నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు, 4 టీఎంసీలు జంట నగరాల తాగునీటికి, మరో 4.06 టీఎంసీలను ఘణపూర్ ఆయకట్టు స్థిరీకరణకు కేటాయించారు. సింగూరు ప్రాజెక్టు కోసం 32,892 ఎకరాల భూమిచ్చి,. 68 గ్రామాలు ముంపులో పోయినా, ఏనాడూ పరీవాహక ప్రాంతాల పొలాలకు నీళ్లందలేదు. ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం దశాబ్దాలుగా ఆందోళనలు జరగడంతో 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 జూన్ 7న రూ.88.99 కోట్ల అంచనా వ్యయంతో కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆయన తదనంతరం ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. మళ్లీ తెలంగాణ ఏర్పాటుతో ఆ నిర్మాణాలు మొదలయ్యాయి. కాల్వల నిర్మాణానికి రూ.88.99 కోట్లు, ఎత్తిపోతలకు రూ.32.68 కోట్లు.. మొత్తంగా 121.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాల్వలకు రూ.34.02 కోట్లు, లిఫ్ట్కు రూ.15.80 కోట్లు విడుదల చేశారు. దీంతో కాలువలకు సంబంధించి 80.6 శాతం, లిఫ్ట్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. 2017–18 బడ్జెట్లో సింగూరు కాల్వల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.49.50 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో పనుల్లో వేగం పెరిగి కాల్వల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీళ్లు.. ప్రాజెక్టు కింద నాలుగు మండలాల్లోని 44 గ్రామాల పరిధిలో 40 వేల ఆయకట్టుకు నీరదించడం లక్ష్యం కాగా.. యాసంగిలో 30,116 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. అలాగే 72 చెరువులను నింపి, 9,076 ఎకరాలను స్థిరీకరించారు. ఇకపై పూర్తి ఆయకట్టుకు నీరందించనున్నారు. బుధవారం కాల్వల పరిధిలో మంత్రి హరీశ్రావు పర్యటించారు. ఆందోల్, ముదుమాణిక్యం, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పంటల దిగుబడులు, ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల పొలాల వద్దే వారి అనుభవాలను తెలుసుకున్నారు. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పల వద్ద ఆగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం దిగుబడులపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోటి ఎకరాల కలలో భాగమే..: మంత్రి హరీశ్ రైతులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి వివిధ గ్రామాల్లో ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల కింది ఆయకట్టుకు నీరందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాల కలలో భాగమే సింగూరు కింద కాల్వలకు నీళ్లని పేర్కొన్నారు. ‘‘పూర్వ మెదక్ జిల్లాలో నిజాం హయాం తర్వాత ఒక్క కొత్త ఎకరాకు నీళ్లు పారకపోగా.. ఉన్న ఘణపూర్ ఆయకట్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు తగ్గింది. కానీ తెలంగాణ ప్రభుత్వం సింగూరు కాల్వలకు రూ.60 కోట్ల మేర ఖర్చు చేసి ఈ ఏడాది 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చింది. మరో 10 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్లో నీళ్లివ్వనుంది. మరో 121 చెరువులను నింపి మరో 10 వేల ఎకరాలను స్థిరీకరించనుంది. గతంలో సింగూరు గ్రామాల్లో ఉన్న ముళ్ల పొదలన్నీ ఇప్పుడు పంట పొలాలయ్యాయి..’’ అని హరీశ్ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్లో 40 శాతానికి పైగా నిధులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి వెచ్చిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, కరెంట్ కోతలు లేవని, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పోయాయని అన్నారు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా 60 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చిందని చెప్పారు. పత్తి మద్దతు ధర రూ.4,160 ఉంటే ప్రస్తుతం మార్కెట్లో రూ.5 వేలకు పైగా ఉందని, పల్లికాయ ధర సైతం రూ.4,220 నుంచి రూ.5 వేలు దాటిందని, మొక్కజొన్న, కందులకు అదే మాదిరి మద్దతు ధర లభిస్తోందన్నారు. వచ్చే ఏడాది మే నుంచి రైతులకు పట్నం, పరిశ్రమలకు ఇస్తున్న మాదిరే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ రానే రాదని, ఇప్పుడు మాత్రం పొమ్మన్నా పోదని అన్నారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీS వచ్చే ఏడాది మే నుంచి రూ.6 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇంత పంట పుట్టినప్పట్నుంచీ చూడలేదు సింగూరు కింద ఇన్ని నీళ్లు ఎన్నడూ చూడలే. నేను పుట్టినప్పట్నుంచీ చూడనంత పంట పడింది. ఇంతకుముందు గొర్లు కాసేవాణ్ణి. ఇప్పుడు నాకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. మంత్రి చెప్పి నట్లు పెట్టుబడికి సాయపడితే ఇక పట్నం దిక్కు చూసే గోసుండదు.. – చెన్నయ్య, రైతు, ఆందోల్ మళ్లీ వస్తే గొర్రె కూర పెడతా నాకు రెండెకరాలుంది. నాలుగేళ్లు పట్నంల కూరగాయలమ్మిన. నీళ్లు వచ్చినయని వచ్చి పంటల సాగు చేసిన. మంచి పంట వచ్చింది. వానాకాలానికి తయారుగా ఉన్నా. మంత్రి ముందస్తడని తెలిస్తే గొర్రె కోసెటొళ్లం. మళ్లొస్తే కచ్చితంగా గొర్రె కూర పెడతం.. – కొత్తగొల్ల శ్రీనివాస్, రైతు, ఆందోల్ ఇంత పంట జిందగీల చూస్తమనుకోలే.. నాకు 63 ఏళ్లు. ఇంతవరకు యాసంగిల ఇంత పంట చూడలే. జిందగీల చూస్తమనుకోలే. సింగూరు కాల్వలతో బంగారం లాంటి పంట పడింది. పెట్టుబడికి సైతం సాయం చేస్తామంటే ఇంకా పంటలు పండిస్తం. – బాల్రెడ్డి, రైతు, ముదుమాణిక్యం -
ధాన్యం.. దళారుల పరం
పెనుమంట్ర/ఇరగవరం : అన్నదాతల శ్రమను దళారులు దోచుకుంటున్నారు. పంటలు బాగా పండినా ఆ ఫలితం ఆరుగాలం కష్టపడిన రైతుకు దక్కటం లేదు. జిల్లాలో ఈ సార్వాలో ఎకరాకు సగటున 45 నుంచి 54 బస్తాలు (బస్తా 75 కేజీలు) వరకు ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో రైతు కష్టం ఎంతో ఉన్నా అమ్ముకునే విషయంలో అడుగడుగునా మోసపోతున్నాడు. ఆదుకుంటా యనుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు వారిని గాలికొదిలేశాయి. దళారులు, మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తామే కొన్నట్టు రికార్డుల్లో రాసుకుని ప్రభుత్వం నుంచి కమీషన్లు తీసుకోవడానికే ఐకేపీ కేంద్రాలు పరిమితమయ్యాయి. దీనివల్ల ఒక్కొక్క రైతు వేలాది రూపాయలు నష్టపోతుండగా.. దళారులు రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఊరికో రేటు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో నిర్ధిష్టమైన ధర అంటూలేదు. ఊరికో రకంగా దళారులు రైతులను దోచుకుంటున్నారు. ఒక గ్రామంలో 1156 వరి రకం ధాన్యం 75 కేజీల ధర రూ.1,050 ఉంటే మరో గ్రామంలో రూ.వెయ్యికే కొంటున్నారు. ఇదేమిటని రైతులు అడిగితే.. దళారులు తేమ శాతం, తూకంలో తేడా, కామన్ రకం, తప్ప–తాలు ఉన్నాయంటూ రకరకాల సాకులు చెబుతున్నారు. వరి కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లో పలుచోట్ల సూపర్ ఫైన్ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,150 మాత్రమే చెల్లించారు. నిజానికి ఈ రకం ధాన్యానికి క్విం టాల్కు రూ.1,510 చెల్లించాలి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర. ఆ తరువాత ఎండలు ముదరటంతో ధాన్యంలో ఆరుదల శాతం బాగా పెరిగింది. దీంతో కొనుగోలు ధరను కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు రూ.1,220 వరకు చెల్లిస్తున్నారు. ధాన్యం రవాణా ఖర్చులు దళారులే భరిస్తుండటం వల్ల తక్కువ ధర చెల్లిస్తున్నారనుకున్నా క్వింటాల్కు రూ.150 నుంచి రూ.250 వరకు రైతులు నష్టపోతున్నారు. 75 కేజీల బస్తా ధాన్యానికి దళారులు రూ.1,100 నుంచి రూ.1,130 వరకు రేటు కడుతున్నా కాటా, కూలీ, ఎగుమతి, రవాణా చార్జీలు, ధాన్యంలో తేమ శాతం అంటూ రూ.100 నుంచి రూ.150 వరకు కోత విధిస్తున్నారు. గోళ్లు గిల్లుకుంటున్న ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా జిల్లా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు గోళ్లు గిల్లుకుంటున్నాయి. దాదాపు 100 కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క గింజ ధాన్యమైనా కొనుగోలు చేయలేదు. ఈ కేంద్రాల్లో గ్రేడ్ ఏ ధాన్యం క్వింటాల్కు రూ.1,510, సాధారణ రకానికి రూ.1,470 కనీస మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీరా అక్కడికి ధాన్యం తీసుకెళితే.. కేంద్రాల నిర్వాహకులు సవాలక్ష నిబంధనలతో తిప్పి పంపుతున్నారు. ఆనక మిల్లర్లు, దళారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్టు చూపించి కమీషన్లు పొందుతున్నారు. రూ.1,220కి అమ్మాను నేను నెలమూరులో 11 ఎకరాల్లో 1011, బొండాలు వరి రకాలను సాగు చేశాను. ఎకరాకు సగటున 42 బస్తాల దిగుబడి వచ్చింది. క్వింటాల్ ధాన్యాన్ని రూ.1220 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా అక్కడ అనేక ఆంక్షలు పెడుతున్నారు. పైగా సకాలంలో డబ్బు చేతికి రావడం లేదు. ఆర్థిక అవసరాల వల్ల నాలాంటి రైతులంతా దళారులకు అయినకాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది.– యరకరాజు సత్యనారాయణరాజు, రైతు, నెలమూరు కొనుగోలు కేంద్రాలేవి వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తోంది. మా మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దారుణం. దిక్కులేని స్థితిలో కమీషన్ వ్యాపారులకు అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి.–కర్రి శ్రీనివాసరెడ్డి, రైతు, కంతేరు, ఇరగవరం మండలం -
‘వెలుగు’లో చీకటికోణం
నెల్లూరు(పొగతోట/అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో పేదిరి కాన్ని తొలగించి, ప్రజల ఆర్థికశక్తిని పెంచి మెరుగైన జీవనాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెలుగు కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. నెల్లూరుకు చెందిన ఫ్రెండ్స్ క్యాటరింగ్ యజమాని సునీల్కుమార్ నుంచి వెలుగు ప్రాజెక్టు ఫైనాన్స్ మేనేజర్ శ్రీనివాసులు రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. డీఆర్డీఏ చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. నిరుపేద మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని స్వయం సహాయక గ్రూపుల(ఎస్హెచ్జీ)కు బ్యాంకు లింకేజి రుణాలు మంజూరు చేయిస్తూ వెలుగు సిబ్బంది కమీషన్లు పుచ్చుకుంటున్నారు. గతంలో ఎస్హెచ్జీ గ్రూపుల ఏర్పాటుకు రేషన్, ఆధార్ కార్డుల అనుసంధానం లేదు. ఆ సమయంలో బోగస్ ఎస్హెచ్జీలు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయల లింకేజి రుణాలు స్వాహా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో 45వేల వరకు ఎస్హెచ్జీలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది వరకు మహిళలుంటారు. ఆర్థిక స్వావలంబన కోసం మహిళలు నెలనెలా పొదుపు చేసుకుంటూ బ్యాంకు లింకేజి రుణాలు తీసుకుంటున్నారు. కావలి , గూడూరు, ఉదయగిరి, నాయుడుపేట, రాపూరు తదితర ప్రాంతాల్లో బోగస్ ఎస్హెచ్జీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 45వేల గ్రూపుల్లో సుమారు 8వేల గ్రూపులు నాన్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించి వాటిని సరిదిద్దాలని ప్రయత్నాలు చేసినా ఫలితం కన్పించలేదు. వీటి పేరు మీదట స్వాహా చేసిన బ్యాంకు లింకేజి నిధులతో అనేక మంది సిబ్బంది సొంత భవనాలు నిర్మించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరికొంతమంది సిబ్బంది నాలుగు చక్రాల వాహనాలు కొనుగోలు చేశారు. పొదుపు సభ్యులకు తక్కువ ధరకే నిత్యావసరాల సరకులు అందించే లక్ష్యంతో సిబ్బంది ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో దుకాణాలు ఏర్పాటు చేశారు. నగదు స్వాహా చేయడంతో దుకాణాలు మూత పడ్డాయి. సిబ్బంది అవినీతి వల్లనే దుకాణాలు మూతపడ్డాయనే ప్రచారం ఉంది. వెలుగు ప్రాజెక్టు అభివృద్ధి కోసం 2004లో జిల్లాకు సుమారు రూ.40 కోట్ల రూపాయల మూల నిధిని కేటాయించారు. మూలనిధిని గ్రూపులకు రుణాలుగా ఇచ్చి తక్కువ వడ్డీతో తిరిగి రికవరీ చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు గల్లంతయ్యాయి. డీఆర్డీఏలో గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగం ఉంది. ఈ విభాగం నిరుపేద గిరిజనులను గుర్తించి వారికి రుణాలు మంజూరు చేయించి ప్రతి నెలా ఆదాయం చేకూరేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి బోగస్ పేర్లను నమోదు చేసి రుణాలు స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ► దగదర్తి మండలంలో బ్యాంకుల ద్వారా పొదుపు సభ్యులు రుణాలు తీసుకున్నారు. సభ్యులు తిరిగి చెల్లించిన నగదును బ్యాంకుల్లో జమ చేయకుండా సిబ్బంది స్వాహా చేశారని జిల్లా అధికారులకు మహిళలు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు . ► ఇందుకూరు పేట మండలంలో బ్యాంకులు ద్వారా రుణాలు మంజూరు చేయించి సిబ్బంది కమీషన్లు వసూలు చేశారని పొదుపు సభ్యులు గతంలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ► డీఆర్డీఏలో విద్యార్థుల కోసం ఉపకారవేతనాల విభాగం ప్రత్యేకంగా ఉంది. బోగస్ పేర్లు నమోదు చేసి స్కాలర్షిప్లు స్వాహా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్త్రీ నిధిని పంచుకున్న సిబ్బంది మహిళలకు పిల్లల చదువులు, వివాహాలు, కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం స్త్రీనిధిని ప్రవేశ పెట్టారు. జిల్లాలో రూ.వందల కోట్లు రుణాలు మంజూరు చేశారు. మహిళలకు మంజూరు చేయాల్సిన రుణాల్లో సింహభాగం సిబ్బంది మహిళల పేర్లతో రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలను బయట అధిక వడ్డీలకు మార్చుకుని నగదు తిరిగి చెల్లించాలనే ఆలోచనతో చేతి వాటం ప్రదర్శించారు. వడ్డీలకు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో సిబ్బంది చిక్కుల్లో పడ్డారు. రికవరీ శాతం పెరిగి పోవడంతో అధికారుల వత్తిళ్లు అధికమై సిబ్బందిని సస్పెండ్ చేసిన సంఘటనలున్నాయి. శిక్షణలోనూ చేతి వాటం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పలు శిక్షణ కేంద్రాలను డీఆర్డీఏ ఏర్పాటు చేసింది. శిక్షణ కార్యాక్రమాల్లోనూ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపితే వెలుగులోకి.. వెలుగు కార్యాలయంలో గతంలో నుంచి అమలయిన పథకాలు, ఖర్చు , శిక్షణలు, స్త్రీనిధి తదితర అంశాలపై లోతుగా విచారణ చేస్తే అనేక చీకటికోణాలు వెలుగుచూస్తాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోల్ మాల్ రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ, బాధ్యత వెలుగు సిబ్బందికి అప్పగించారు. పలు మండలాల్లో సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి ధాన్యం కొనక పోయినా కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించారు. ఆత్మకూరు ప్రాంతంలో భూమి లేని రైతు పేరుతో రూ.లక్షలు ఆయన ఖాతాలో జమ చేశారు. నగదు పంపకాల్లో విషయం వెలుగు చూసింది. దీంతో విచారణ చేసిన అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేశారు. -
బియ్యం మిఠాయిలు
కొత్త ధాన్యం ఇంటికి వచ్చింది... కొత్త సంతోషాల పంట పండుగ చేసింది. ఉగాదికైతే ఆరు రుచులు కావాలి కానీ, సంక్రాంతి మాత్రం తియ్యగానే ఉండాలి. ఆరుబయటి నుంచి ఇంట్లో దాకా... అంతా తియ్యతియ్యగానే ఉండాలి. అందుకే... ఈ బియ్యం మిఠాయిలతో తియ్యటి పండుగ జరుపుకోండి. పరమాన్నం కావల్సినవి: కొత్త బియ్యం – ముప్పావు కప్పు, బెల్లం – 250 గ్రాములు, యాలకులు – 4 (పొడి చేయాలి), పాలు – 5 కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, జీడిపప్పు , కిస్మిస్ – తగినన్ని, నెయ్యి – 3 టేబుల్స్పూన్లు తయారీ: ∙బియ్యం కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో బెల్లం వేసి, నీళ్లు పోసి సన్నని మంట మీద కరిగించాలి. దీన్ని వడకట్టి, చెత్త తీసేయాలి. ఈ బెల్లం పానకాన్ని చల్లారనివ్వాలి. ∙ పాలు మరిగించి పక్కనుంచాలి. ∙బియ్యంలో నీళ్లు పోసి ఉడకించాలి. ∙చిన్న పాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. ∙బియ్యం మెత్తగా ఉడికాక చల్లారిన బెల్లం పాకాన్ని పోసి కలపాలి. దీంట్లో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్ వేసి కలిపి, మంట తీసేయాలి. బూరెలు కావల్సినవి: కొత్తబియ్యం – పావు కేజీ, బెల్లం – పావు కేజీ, పచ్చికొబ్బరి తురుము – కప్పు, నూనె – వేయించడానికి తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్లు తయారీ: ∙బియ్యం కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. బియ్యంలో నీళ్లు వంపేసి కాటన్ క్లాత్లో వేసి పది నిమిషాలు మూటకట్టాలి. ఈ బియ్యాన్ని రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి మెత్తటి పిండి చేసుకోవాలి. బెల్లాన్ని తురిమి ఒక గిన్నెలో వేసి దాంట్లో పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. దీంతో బెల్లం కరుగుతుంది. ఇలా కరిగిన బెల్లంలో కొబ్బరి తురుము వేసి కలపాలి. కొంచెం జిగురుగా అయ్యేంతవరకు ఉంచి, నెయ్యి వేసి కలపాలి. తర్వాత దీంట్లో బియ్యప్పిండి వేస్తూ అదేపనిగా కలుపుతూ ఉండాలి. దీంట్లో 2 టీ స్పూన్ల నూనె వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న బియ్యప్పిండి చల్లారిందా లేదా చూసుకొని నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్ కవర్ మీద పెట్టి, వెడల్పుగా వత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వడ్డించాలి. తీపి పునుగులు కావల్సినవి: కొత్తబియ్యప్పిండి – కప్పు, ఓట్స్ పొడి – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – కప్పు, యాలకుల పొడి – టీ స్పూన్, పంచదార – కప్పు, మైదా – కప్పు, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి సరిపడా తయారీ: ∙ఒక గిన్నెలో నూనె, పాలు మినహా మిగిలిన పదార్థాలన్నీ తీసుకొని బాగా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ పునుగుల పిండిలా కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. తరువాత పిండిని కాగుతున్న నూనెలో ఉండల్లా వేసుకొని ఎర్రగా వేగాక తీయాలి. తీపి పొంగలి కావల్సినవి: కొత్త బియ్యం – కప్పు, పెసరపప్పు – అర కప్పు, బెల్లం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – 4 1/2 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పులు – 12, కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙పొయ్యి మీద బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కనుంచాలి. ∙అదే పాన్లో పెసరపప్పు కూడా కొద్దిగా వేయించి పక్కనుంచాలి. ∙వేడి బాణలిలో బెల్లం తురుము వేసి, కరిగేంతవరకు ఉంచి, చల్లారనివ్వాలి. ∙మరొక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, మంట తగ్గించాలి. ∙బియ్యం, పెసరపప్పు కడిగి నీళ్లు వంపి మరుగుతున్న నీటిలో నెమ్మదిగా పోయాలి. బియ్యం–పప్పు మెత్తగా ఉడికించి మంట తగ్గించాలి. దీంట్లో కిగించిన బెల్లం వేసి కలపాలి. మిశ్రమం ఉడికేంతవరకు ఉంచి యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి మరో 2–3 నిమిషాలు ఉంచి మంట తీసేయాలి. ఈ తీపి పొంగలిని వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయవచ్చు. నోట్: జీడిపప్పు, కిస్మిస్లు మంచి టేస్ట్ రావాలంటే చిటికెడు ఉప్పు వేసి వేయించాలి. బెల్లం గారెలు కావల్సినవి: కొత్తబియ్యం – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత, బెల్లం – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు తయారీ: ∙బియ్యం రెండుగంటల సేపు నానబెట్టాలి. నీళ్లు వడగట్టాలి. పిండి మెత్తగా వడలకు తగిన విధంగా రుబ్బుకోవాలి. ∙వేడినీళ్లలో బెల్లం వేసి కరిగించి, పాకం పట్టాలి. ∙బాణలిలో నూనె పోసి, కాగనివ్వాలి. చేతులు తడిలేకుండా చూసుకొని చేతిమీద గానీ, అరటి ఆకు మీదగానీ నిమ్మకాయ పరిమాణంలో పిండి తీసుకొని అదిమి మధ్యకు పెద్ద రంధ్రం చేయాలి. ∙ఇలా చే సిన దాన్ని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వదలాలి. సన్నని మంట మీద రెండువైపులా వేయించాలి. ∙గారె బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాక తీసి బెల్లం పాకంలో వేయాలి. మరో గారె సిద్ధమైంతవరకు బెల్లం పాకంలో గారెను ఉంచి, తర్వాత తీసి ప్లేట్లో పెట్టాలి. వేడి వేడిగా సర్వ్ చేస్తే కరకరలాడుతూ బెల్లం గారెలు రుచిగా ఉంటాయి. వీటిని పెసరపప్పు, మినప్పప్పుతోనూ చేసుకోవచ్చు. -
కాకి లెక్కలు తేలేదెన్నడు...
► గతేడాది ధాన్యం కొనుగోళ్లలో చురుకై న ప్రాతపోషించిన మహిళలు ►డ్వాక్రా మహిళలకు నేటికీ అందని కమీషన్ విజయనగరం కంటోన్మెంట్ : డ్వాక్రా మహిళలకు మంచి అవకాశమిది.. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయం పొందొచ్చని ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం అందుకు తగ్గ కమీషన్లను ఇవ్వడంలో కాకిలెక్కలు వేస్తోంది. సీజన్లో ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించినందుకు ఇవ్వాల్సిన కమీషన్పై తాత్సారం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లు చేసి సంవత్సరం గడచిపోరుునా ఇంకా కమీషన్లు ఎందుకివ్వరని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ సీజన్లో 18,81,082 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన మహిళలకు రూ.5,87,83,000 కమీషన్ రావాల్సి ఉంది. అరుుతే ఒక సారి రూ.2.94 కోట్లు, మరో సారి రూ.2.21 కోట్ల కమీషన్ వచ్చింది. మొత్తంగా రూ.5.15 కోట్ల కమీషన్ రావడంతో డ్వాక్రా మహిళలు మాకిచ్చేందుకు డబ్బులు వచ్చేశాయోచ్ అని అనుకున్నారు. కానీ వీరికి మాత్రం ఇంకా కమీషన్లు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గోనెలు తిరిగి ఎందుకు ఇవ్వలేదని జిల్లా అధికారులు అడిగే సరికి డ్వాక్రా మహిళలకు ఏం చెప్పాలో తోచలేదు. కమీషన్ డబ్బుల్లో గోనెలకు సంబంధించిన సొమ్మును కట్ చేశారు. అదీ వేలల్లో కాదు. రూ. లక్షల్లో. జిల్లా వ్యాప్తగా పీపీసీల వద్ద ఉండిపోయాయని చెప్పి రూ.72,83,000ల కమీషన్ డబ్బులను కట్ చేశారు. అసలేమైందంటే.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన మహిళలకు అధికారులు గోనెలు అందించారు. ఈ గోనెలను పీపీసీల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇస్తే వారు హమాలీల సాయంతో ధాన్యం వేసి తూకం వేస్తారు. అలా తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించాలి. వాస్తవంగా ఇలా జరగాల్సి ఉంది. కానీ ఏం జరిగిందంటే నేరుగా మిల్లర్లు ఇచ్చిన తెల్లని గోనెల ద్వారానే కొనుగోళ్లు జరిగారుు. దీంతో కోల్కతా నుంచి పెద్ద ఎత్తున ధరలు వెచ్చించి కొనుగోలు చేసిన గన్నీ బ్యాగులు పీపీసీల వద్ద, వివిధ ప్రజాప్రతినిధుల వద్ద ఉండిపోయారుు. వీటిని వారు వేరే అవసరాలకు వాడుకున్నారు. కేంద్రాల వద్ద మిగిలిపోయన గోనెల్లో చాలామటుకు పాడయ్యారుు. దాదాపు కోటి రూపాయల పైగానే వెచ్చించి కొన్న ఈ గోనెలను ఇప్పుడు అడగడంతో ఆయా గ్రామైక్య సంఘాలు వాటిని పట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చారు. కానీ లెక్కలు మాత్రం తేలలేదు. ఈ లెక్కలు ఇలా ఉంటుండగానే మళ్లీ కొత్తగా ధాన్యం కొనేందుకు కోటి రూపాయల విలువలైన కొత్త గోనెలు కొనుగోలు చేశారు. అరుుతే వీటి కొనుగోళ్లు వెనుక లొసుగులున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే పాడైన గోనె సంచుల నష్టాన్ని భరించే పరిస్థితి తలెత్తిందని పలువురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గతేడాది కమీషన్ను వెంటనే అందజేయాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రానికి చిరిగిన గోనెలు ఉత్తరావల్లి (మెరకముడిదాం): మండలంలోని ఉత్తరావల్లిలో వెలుగు కార్యాలయం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆదివారం మధ్యాహ్నం 20 వేల గోనెలు వచ్చారుు. అరుుతే ఈ గోనెలను దించుతున్నప్పుడు వాటిని పరిశీలించిన డ్వాక్రా సంఘం సభ్యులు వాటిలో చిరిగిపోరుున వాటిని గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి లారీలోనుంచి దించుతుండగానే ప్రతి కట్టను విడదీసి క్షుణ్ణంగా పరిశీలించగా వచ్చిన 20 వేల గోనెలలో సుమారు 3 వేల వరకూ పూర్తిగా చిరిగిపోరుునవే ఉండడంతో డ్వాక్రా సంఘం సభ్యులు అవాక్కయ్యారు. అంతేకాదు మరో విషయమేమిటంటే ఈగోనెలను 50 ఒక కట్టగా చేసి పంపించారు. అరుుతే కట్టలో ఉండాల్సిన 50 గోనెలకు కొన్ని కట్టల్లో 10 నుంచి 20 గోనెల వరకూ తక్కువగా ఉన్నారుు. ఈ 20 వేల గోనెలలలో సుమారు 10వేల నుంచి 12వేల వరకు గోనెలు మాత్రమే ఉంటాయని డ్వాక్రా గ్రూపు సభ్యులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర ధర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘం సభ్యులతో పాటు స్థానిక రైతులు కోరుతున్నారు. -
రైతు చేతికి రద్దునోట్లు
► ధాన్యం కొనకముందే చెల్లింపులు ► పెద్దపల్లి జిల్లాలో రూ.100 కోట్ల పంపిణీ పెద్దపల్లి : వ్యాపారులు, మిల్లర్లు తమ వద్ద ఉన్న రద్దు నోట్లతో వరిధాన్యం కొనుగోలు చేసి సర్కారు నిఘా నుంచి తప్పించుకున్నారు. రైతులు మార్కెట్కు వెళ్లి ధాన్యం విక్రరుుంచడం కంటే, తమ వద్దకు వచ్చిన వ్యాపారి వద్ద రద్దు నోట్లు తీసుకుని విక్రయాలను పూర్తి చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో 15 రోజుల్లో వ్యాపారుల నుంచి రైతులకు సుమారు రూ.100 కోట్ల రద్దు నోట్లు ముట్టినట్లు సమాచారం. కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, సిద్దిపేట, మానకొండూర్ తదితర ప్రాంతాలకు చెందిన రైస్మిల్లుల యజమానులు రైతుల నుంచి ఈ ప్రాం తంలో పెద్ద మొత్తంలో వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. అరుుతే రైతులకు గతంలోకంటే ఈసారి వేగవంతంగా డబ్బులు చేతికందారుు. ధాన్యం మిల్లుకు చేరిన 15 రోజుల నుంచి 20 రోజుల్లోపు ధాన్యం డబ్బులు రైతుకు అందేవి. అలాగే ప్రభుత్వం సేకరిస్తున్న ఐకేపీ కేంద్రాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. చెక్కులు తీసుకుని బ్యాంకులో జమ చేసుకోవడం, ఆ తర్వాత బ్యాంకు ద్వారా విత్డ్రా చేసుకోవడం ప్రహాసనంగా మారింది. దీనికంటే వ్యాపారి నుంచి వస్తున్న రద్దు నోట్లు తీసుకోవడం, కొంత అవసరాల కోసం చలామణి చేసుకోవడం, మిగిలిన సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేసుకుంటున్నారు. నమ్మకస్తులకు ముందే డబ్బు.. గ్రామాల్లో ఉన్న నమ్మకమైన రైతులకు వ్యాపారులు ముందే డబ్బును ముట్టజెబుతున్నారు. తూకం వేయడం కంటే ముందే డబ్బు ఇచ్చి, ఆ తర్వాత మిల్లర్ ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. ఇదే పద్ధతిలో ప్రతి గ్రామంలో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేరకు చలామణీ అయ్యా రుు. ఇటు రద్దు నోట్లు మార్పిడి చేసుకోవడం వ్యాపారికి ఇబ్బంది కాగా.. అనుకున్న సమయంకంటే ముందే తమచేతికి ఏదో ఒక నోటు రావడం రైతుకు కూడా సంతోషంగానే మారిం ది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా రద్దు నోట్ల న్నీ రైతుల జేబుల్లోకి చేరుకున్నారుు. అలాగే వ్యాపారి సైతం తాను ఎలాంటి కష్టం లేకుం డానే నోట్లన్నీ రైతులకు పంపిణీ చేసి పని పూర్తి చేసుకున్నారు. దీంతో వడ్ల సేకరణ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండానే నోట్ల పంపిణీ కూడా పూర్తరుుంది. మిల్లులకు చేరిన వరిధాన్యం పెద్దపల్లి జిల్లాతోపాటు పొరుగు జిల్లాలకు కూ డా ఈ ప్రాంతం నుంచి ధాన్యం తరలిపోరుుం ది. ఉద్దెర, ఇబ్బంది లేకుండానే ధాన్యం కొనుగోళ్లన్నీ పూర్తయ్యారుు. కొన్ని చోట్ల రైతులకు అడ్వాన్స ముట్టినట్లు సమాచారం. ఆరోపణలు, అనుమానాలు లేకుండా పూర్తరుున కొనుగోళ్ల పై ఇటు అధికారుల దృష్టి కూడా పడలేదు. రైతులు నోట్ల గొడవలో అంతా తమకు మంచే జరిగిందని సంతోషం వ్యక్తం చేసినా మళ్లీ డబ్బులు పొందేందుకు మాత్రం బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పడం లేదు. -
గంటలు కాదు.. రోజులు దాటాయ్..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే ఎదురుచూపులే... ఆన్లైన్ నమోదులో జాప్యం.. చెల్లింపుల్లో ఆలస్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ‘పెద్ది’ ప్రకటనతో అన్నదాతల్లో ఆశలు నర్సంపేట : రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రరుుంచడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేం దుకు దివంగత నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్రమేణా పర్యవేక్షణ లోపంతో రైతులకు మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నారుు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం ధాన్యం విక్రరుుంచిన తర్వాత ఆన్లైన్లో నమోదైన సమయం నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ కావాలి. కానీ ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఊరటగా చైర్మన్ ప్రకటన సివిల్ సప్లయి రాష్ట్ర చైర్మన్గా రూరల్ జిల్లాకు చెందిన పెద్ది సుదర్శన్రెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వరుస సమీక్షలతో పౌర సరఫరాల శాఖలోని లోపాలను సరిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రైతులకు ధాన్యం డబ్బు ఎప్పటికప్పుడు చెల్లించే విషయం కూడా గాడిన పడేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇలా పెద్ది ఆదేశాలు ఫలించి తమకు మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. శుక్రవారం కూడా నర్సంపేటలో జరిగిన శాఖ సమీక్షలో రైతులు విక్రరుుంచిన ధాన్యానికి 48 గంటల్లో అకౌంట్ల జమ చేయాల్సిందేనని.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి రైతులకు ఇబ్బందులు కలిగజేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చెల్లింపులో జాప్యం.... వరంగల్ రూరల్ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 30,913 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగైంది. దిగుబడిని రైతులు విక్రరుుంచిన 48 గంటల్లోపు చెల్లింపులు చేస్తామని గత పంట కాలం నుంచి చెబుతున్నా అమలు కావడంలేదు. ఈ నెల మొదటి వారంలో ధాన్యం సేకరణ ప్రారంభం కాగా రెండు రోజుల కిందట చెల్లింపులు మొదలయ్యారుు. ఆన్లైన్లో నగదు జమ చేయడానికి వారం పదిహేను రోజులకుపైగా సమయం తీసుకుంటోంది. సివిల్ సప్లై కేంద్రాలకు గన్నీ సంచులను పంపిన వెంటనే వివరాలను నమోదు చేయాలి. తద్వారా కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాల అప్లోడ్కు వీలవుతుంది. కానీ పౌరసరఫరాల సంస్థ గన్నీలను పంపినా వీటి వివరాలను సకాలంలో ఆన్లైన్ చేయటం లేదు. దీంతో కేంద్రాల్లో ధాన్యం విక్రరుుంచిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం సిబ్బందికి సాధ్యపడటం లేదు. ఈ మేరకు రైతులు విక్రరుుంచిన బస్తాలు తరలించిన వారం వరకు ఆన్లైన్లోనే అప్లోడ్ కాకపోవడం చెల్లింపుల్లో ఆలస్యానికి కారణమవుతోంది. ప్రస్తుతం ధాన్యం సేకరణ తొలిదశలోనే ఇలా ఉంటే మరో వారం రోజుల్లో సేకరణ మరింత పెరిగే అవకాశం ఉండగా రైతులకు డబ్బు చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతుంది. దీనిని అధికారులు ఇప్పటికై నా మేల్కొంటే రైతులకు మేలు చేసిన వారవుతారు. అమలు జరుగుతుంది ఇలా...... దుగ్గొండి మండలంలోని బల్వంతాపురంలో గత నెల 28న ధనలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 26 రోజులుగా ఈ కేంద్రం పనిచేస్తుండగా ఇప్పటికి 750 బస్తాల(40 కిలోల చొప్పున) ధాన్యం కొనుగోలు చేశారు. 200 క్వింటాళ్ల ధాన్యం గిర్నిబావి సమీపంలోని వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్కు ఎగుమతి చేయగా మరో 100 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. 14 మంది రైతులకు అమ్మకం చీటీలు ఇచ్చారు. సరుకు తూకం పూర్తి కాగానే వివరాలన్నీ నిర్వాహకులు ట్యాబ్ల ద్వారా ఆన్లైన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బు జమకావాలి. కానీ అలా కాకుండా వారం రోజులకు జమ అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ ఇప్పటికీ 14 మంది రైతులు ఏ గ్రేడ్ ధాన్యాన్ని విక్రరుుంచగా నలుగురు రైతులు ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యారుు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పెంతల ఇంద్రారెడ్డి. నల్లబెల్లి శివారు కొండారుులుపల్లికి చెందిన ఈయన కూతురు మహేశ్వరి వివాహం శుక్రవారం జరిగింది. పెళ్లి ఖర్చుల కోసం తాను పండించిన 68 బస్తాల ధాన్యాన్ని ఇరవై రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో విక్రరుుంచారు. అరుుతే, పెళ్లి రోజు వచ్చినా ధాన్యం డబ్బులు రాకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. అక్కడా, ఇక్కడా అప్పులు తెచ్చి ఎలాగోలా పెళ్లి కానిచ్చేశాడు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ధాన్యం అమ్మిన వారికి ఆన్లైన్ అరుున 48 గంటల్లో డబ్బును ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన అమలుకావడం లేదనడానికి ఇంద్రారెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ... -
ధాన్యానికి రాజకీయ రంగు
► కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలతో సమావేశం ► వారి నిర్ణయంతోనే కేంద్రాల ఏర్పాటు? ► అప్పటివరకూ ధాన్యం కొనుగోళ్లకు బ్రేక్ ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు కొత్త కష్టాలు ఎదురుకానున్నాయి. ఇది వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రైతులకు అనుకూలమైన చోట ఏర్పాటు చేసేది. ఇప్పుడు దానిని రాజకీయ నేత చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమవుయింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో రాజకీయ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. రాజకీయ నేతలకు అనుకూలమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మిల్లర్లకు పరోక్షంగా సహకారం అందినట్టే. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభమేమీ ఉండదనే వాదనలూ వినిపిస్తున్నాయి. విజయనగరం కంటోన్మెంట్: ధాన్యం పండిన చోట దళారులు రాక ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మద్దతు ధర కల్పించాల్సిన యంత్రాంగం ఇందులో రాజకీయ జోక్యానికి తెర లేపనుంది. రైతులకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఈ సారి రాజకీయ జోక్యం మితిమీరనుంది. రాజకీయ నాయకులు ‘‘మాకో మూడివ్వండి లేదా నాలుగివ్వండి’’ అన్న సిఫార్సులకు ఇబ్బందులొస్తాయని ఆలోచిస్తున్నది. దీని వల్ల ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కష్టమని అనుకుంటోంది. అందుకే జిల్లా యంత్రాంగం ముందుగా వారిచేతనే ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేంద్రాలే ఏర్పాటు చేయాలోనన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొత్త అడుగులేస్తుంది. దీనికోసం త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. అప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేనట్టేనని తెలుస్తోంది. ఈ లోగా దళారులు ఎప్పటిలానే ధాన్యం కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించేందుకు మంచి అవకాశమిచ్చినట్టు కనిపిస్తుంది. జిల్లాలో గతేడాది 3.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు చేశారు. ఈ ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు దాదాపు తమ చేతుల మీదుగానే నడిపించారన్న విమర్శలు ఉన్నారుు. పార్వతీపురం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతుం టా రుు. ఈ ఏడాది ఇప్పటికే ధాన్యం నూర్పిళ్లు ప్రారంభమయ్యారుు. వాటిని దళారులు కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యారు. రాజకీయ ప్రమేయం.. రాజకీయ పార్టీల అనుమతితో ఈ సారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివిధ వర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇది జిల్లాలో ఎప్పు డూ లేని కొత్త అడుగు. ఎందుకంటే గతంలో కొనుగోలు కేంద్రాలను అధికారులే ఏర్పాటు చేసేవారు. ఎక్కడరుునా ధాన్యం విక్రరుుంచేందుకు రైతులు ఇబ్బందు లు పడుతున్నారన్న విషయం కానీ తెలిస్తే ఆ ప్రాంతంలో ఓ పీపీసీని ఏర్పాటు చేయాలని కోరితే అధికారులు ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయ నాయకులతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. దీని వల్ల జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు తమ ప్రాంతంలో కూడా ఓ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే కోరికలు కోరవచ్చు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ధాన్యం పండిన చోట్లనే ఏర్పాటు చేయాలనే నిబందనలున్నారుు. మిల్లర్లకు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు రాజకీయ ఉచ్చులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పడితే మిల్లర్ల ఆగడాలకు అడ్డుండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ జోక్యం వల్ల ధాన్యం కొనుగోలు నిబంధనలు వర్తిస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. -
రెండ్రోజుల్లోగా ధాన్యం డబ్బులివ్వాలి
► నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి ► ఖరీఫ్లో 30 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం ► {Vేడ్-1 రకానికి రూ.1,510.. గ్రేడ్-2 రకానికి రూ.1,470 ► ధాన్యం సేకరణ విధివిధానాలు ఖరారు ► సీఎంఆర్కు మిల్లర్లు 25 శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సిందే ► కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తే మిల్లర్లపై క్రిమినల్ కేసులు సాక్షి, హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. 2016-17 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో కనీసం 30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి సేకరించనున్నారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు 48 గంటల్లోగా డబ్బులు చెల్లించాలని, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు (జీవో 40) జారీ చేసింది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా... ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం సేకరణ వరకే నిబంధనలు ఖరారు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు పరిమితి ఏమీ లేదని, ఎంత ధాన్యం వస్తే అంతా కొనుగోలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రేడ్-1 రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.1,510, సాధారణ రకానికి రూ.1,470 కనీస మద్దతు ధర చెల్లించాలని ఆదేశించింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కొనుగోలు కేంద్రాల కోసం ప్రాంతాల గుర్తింపు, ఏర్పాటు బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పజెప్పారు. ప్రతీ కేంద్రంలో ధాన్యం కొనుగోలును ధ్రువీకరించడానికి డిప్యూటీ తహశీల్దారు ర్యాంకుకు తక్కువ కానీ అధికారిని నియమించాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలతో డీఆర్డీఏ పీడీ, డీసీవో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ధాన్యం నాణ్యతా పరీక్షలను సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ అధికారులు చేపట్టాలని, ప్రమాణాలకు అనుగుణంగా లేని ధాన్యం సేకరించిన కొనుగోలు కేంద్రం ఇన్ చార్జిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి.. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని పూర్తిగా కస్టమ్ మిల్లింగ్కే కేటాయించనున్నారు. మిల్లు సామర్థ్యాన్ని బట్టే ధాన్యం కేటాయించనున్నారు. ఇప్పటికే సీఎంఆర్ (క స్టమ్ మిల్లింగ్ రైస్) చెల్లింపుల్లో ఎగవేతదారులుగా గుర్తించిన మిల్లులకు ధాన్యం కేటాయించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. సీఎంఆర్ కోసం మిల్లుకు కేటాయిస్తున్న ధాన్యం విలువలో కనీసం 25% మొత్తానికి మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడం తప్పనిసరి చేసింది. సీఎంఆర్ విషయంలో కార్పొరేషన్.. మిల్లర్లతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించింది. సీఎంఆర్కు ఇచ్చిన ధాన్యాన్ని ఇతర అవసరాలకు తరలిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఒప్పం దంలో రాసుకోవాలని సూచించింది. ము ఖ్యంగా సీఎంఆర్ కోసం తీసుకున్న ధాన్యా న్ని బ్యాంకుల్లో తనఖా పెట్టడానికి వీల్లేదని, అలా చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉత్వర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. మిల్లర్లకు ఇచ్చే ధాన్యంలో క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల పచ్చి బియ్యం, 68 కిలోల బాయిల్డ్ రైస్ (ఔట్టర్న్) ఇవ్వాల్సిందేనని నిబంధనల్లో పేర్కొంది. నిర్ణీత గడువులోగా సీఎంఆర్ చెల్లింపులు జరపకుంటే తెలంగాణ రైస్ (కస్టమ్ మిల్లింగ్)-2015 ఉత్తర్వుల కింద చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. -
రైతన్నకు ‘రుణ’ గండం
ధాన్యం నగదు బ్యాంకుఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం సగానికిపైగా రైతులకు బ్యాంకుల్లో అప్పులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయించిన అన్నదాతలను బ్యాంకుల్లో రుణ గండం భయపెడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సగానికిపైగా రైతులు బ్యాంకుల్లో అప్పులున్నారు. ఈవిధంగా అప్పులున్న వారి ఖాతాలోకి నగదు పడితే బ్యాంకర్లు పాత అప్పుల కింద జమవేసుకుంటారనే భయం పట్టుకుంది. ఇప్పుటికే డ్వాక్రా లోన్ల నగదును, గ్యాస్ సబ్సిడీ నగదుని పాత బకాయిల కింద కలిపేసిన సందర్భాలు ఉండడంతో రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. పలమనేరు రూరల్:రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించిన రైతులు నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులేమో రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తున్నారు. తీరా బ్యాంకులు తమ డబ్బును ఎక్కడ పాత అప్పులకు జమ చేసుకుంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ ధాన్య విక్రయ కేంద్రాల్లో పరిస్థితి. ఉదాహరణకు పలమనేరు నియోజకవర్గంలో ఐదుచోట్ల ప్రభుత్వం ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పల మనేరు, పెద్దపంజాణి, వి.కోటలో వెలుగు ద్వారా, గంగవరం, పెద్దపంజాణిలలో పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా నగదు పొందాల నే ప్రభుత్వ నిబంధనలతో ధాన్యం విక్రయాలు మందకొడిగానే సాగుతున్నాయి. ఇప్పటిదాకా పలమనేరు నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో మొత్తం 3,500 క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్రమే రైతులు విక్రయించారు. బ్యాంకులతోనే భయం చంద్రబాబు రుణమాఫీ హామీతో చాలామంది రైతు లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగనేలేదు. దీంతో బకాయిపడ్డ రైతులు కొందరు రీషెడ్యూల్ చేసుకోగా మరికొందరు డీఫాల్టర్లుగా మారారు. దీంతో బ్యాంకర్లు ఎలాగైనా ఈ రైతుల నుంచి ఈ బకాయిలను వసూలు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే గ్యాస్కు సబ్సిడీ నగదుని పాత బకాయిల కింద జమచేసుకుంటున్నారు. అంతేగాక డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రుణాలు మంజూరైనా వారి భ ర్తలెవరికైనా బ్యాంకు రుణాలుంటే దానిని జమవేసుకునేందుకు బ్యాంకర్లు ప్రయత్నిస్తున్నారు. ఆధార్తో దొరికిపోతారు బ్యాంకుల్లో బకాయిలున్న కొందరు రైతులు మాత్రం ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మి తమ కుటుంబీకుల బ్యాంకు ఖాతాలను ఇచ్చారు. మరికొందరు రైతులు అప్పున్న బ్యాంకులో కాకుండా ఇతర బ్యాంకు ఖాతాలను అందజేశారు. కానీ అన్ని బ్యాంకుల్లోనూ ఆధార్కార్డు అనుసంధానం జరిగింది కాబట్టి ఎవరికి ఏ బ్యాంకులో ఖాతా ఉంది.. అందులోని బ్యాలెన్స్ వివరాలు సులభంగా తెలిసిపోతుంది. దీంతో బ్యాంకర్లకు రైతుల నుంచి అప్పులు రికవరీలు చేయడం కష్టమైన పనేమీ కాదు. కొందరు ప్రైవేటు వ్యాపారులకే.. ధాన్యాన్ని అమ్మి, బ్యాంకు ద్వారా నగదు తీసుకోవడం ఇబ్బందులతో కూడిన విషయం అని తెలుసుకున్న కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,400 ధర ఇస్తున్నా బ్యాంకర్ల నుంచి నగదు తీసుకోవాలి కాబట్టి నష్టపోయినా ప్రైవేటు మిల్లర్లు, వ్యాపారులకు కేవలం రూ.1.100లకే అమ్ముకుంటున్నారు. స్థానికంగా కర్ణాటక వ్యాపారులు టెంపోలతో సహా గ్రామాలకు వచ్చి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. -
విత్తనోత్పత్తిలో జర్మనీ సహకారం
ఆ దేశ ప్రతినిధులతో మంత్రి పోచారం సమావేశం సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తిలో జర్మనీ సాంకేతిక సహకారం తీసుకుంటామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్మనీ వ్యవసాయ, ఆహార మంత్రి త్వ ప్రతినిధి డాక్టర్ ఉల్రైక్ ముల్లర్, ఇండిపెండెంట్ ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ బ్రిటర్నిట్జ్ హార్ట్విగ్లతో మంత్రి శుక్రవారం సచివాల యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, విత ్తన ధ్రువీకరణ సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని మంత్రి జర్మనీ ప్రతినిధులకు వివరించారు. అనంతరం పోచారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తికి గల అవకాశాలను జర్మనీ ప్రతి నిధులు అధ్యయనం చేస్తున్నారన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో జర్మనీ ప్రభుత్వ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 400 ప్రైవేటు విత్తన కంపెనీలు రెండు లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నాయన్నారు. విత్తనోత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో వారు మ రో మూడు రోజులు పర్యటిస్తారని... అనంతరం మరోసారి సమావేశమై పర స్పర సహకారానికి తీసుకోవాల్సిన అంశాలను చర్చిస్తామన్నారు. జర్మనీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రం విత్తనోత్పత్తిలో అగ్రగామిగా ఉండటం తమకు స్ఫూర్తినిస్తుందన్నారు. రాష్ట్రానికి అవసరమైన సహకారం ఇస్తామన్నారు. విత్తనోత్పత్తిలో పరస్పర సహకారం ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. -
మాట తప్పింది
ధాన్యం కొనుగోలును మొక్కుబడిగా చేస్తున్న ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న వరి పంట 3లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిన దిగుబడి ఇప్పటివరకు ప్రభుత్వం కొన్న ధాన్యం 32,626 టన్నులు ఒక్క టన్ను కూడా బుడ్డలు కొనని వైనం తాజాగా బుడ్డలు కొనుగోలు చేయాలంటూ ఆదేశం 30వేల టన్నులు మాత్రమే కొంటామంటూ ప్రకటన ఆందోళనలో అన్నదాతలు రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. జిల్లావ్యాప్తంగా 3లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో 75 వేల మెట్రిక్ టన్నులు సన్నాలు రకం (1010), మిగిలిన 2.25లక్షల మెట్రిక్ టన్నుల (ఏడీటీ-37) రకం ధాన్యం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 32,626 టన్నుల సన్నాలు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఒక క్వింటాలు కూడా బుడ్డలు కొనుగోలు చేయలేదు. బుధవారం నుంచి బుడ్డలను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నా, కేవలం 30వేల టన్నులు మాత్రమే కొంటామని ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం మాట తప్పడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు: జిల్లావ్యాప్తంగా రైతులు ఈ ఏడాది వరి పంటను అధికంగా సాగుచేశారు. నవంబర్లో భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలు నిండాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది వరి పంట పెద్దమొత్తంలో సాగైంది. జిల్లా సాధారణ విస్తీర్ణం 35వేల హెక్టార్లు కాగా 82వేల హెక్టార్లు వరి సాగైంది. 30 శాతం సన్నాలు రకం, 70 శాతం బుడ్డల రకం వరిని రైతులు సాగుచేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో వరి కోతలు మొదలయ్యాయి. 40 నుంచి 50 శాతం పంట కోతకు వచ్చింది. ధాన్యం బాగా పండితే ఒక ఎకరాకు 30 బస్తాలు దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది సుడిదోమ, మెడవిరుపు, తెల్లచీడ తదితర తెగుళ్లు సోకడంతో పంట చాలామేరకు దెబ్బతింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు నాలుగు వేల హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంటలో సైతం దిగుబడి సగానికి సగం తగ్గినట్లు తెలుస్తోంది. సాగు విస్తీర్ణం ప్రకారం పూర్తిస్థాయిలో పంట దిగుబడి వచ్చి ఉంటే 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ పంట దెబ్బతినడంతో 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 3లక్షల టన్నుల్లో 75వేల మెట్రిక్ టన్నులు సన్నాలు రకం ధాన్యం ఉండగా, 2.25లక్షల మెట్రిక్ టన్నుల బుడ్డల రకం ధాన్యం ఉంది. సన్నాలు మాత్రమే కొన్న ప్రభుత్వం ప్రభుత్వం రైతులు అధికంగా సాగుచేసిన ఏడీటీ-37 రకం (బుడ్డలు) ధాన్యం కొనలేదు. కేవలం సన్నాలు రకం మాత్రం అరకొరగా కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 17కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాల్కు రూ.1,450 చొప్పున 36,626 టన్నుల ధాన్యం కొన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది నామమాత్రపు కొనుగోలు కిందే లెక్క. రైతులు అత్యధికంగా పండించిన బుడ్డలు రకం ధాన్యాన్ని ఒక్క కింట్వాల్ కూడా కొనుగోలు చేయలేదు. పైగా తెగుళ్లు సోకడంతో బుడ్డల రకం ధాన్యం పనికి రాకుండా పోయిందని, ధాన్యం కొనుగోలు చేసినా నూక తప్ప బియ్యం వచ్చే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 12 టన్నుల బుడ్డలు కొని మిషన్ ఆడించి పరిశీలించగా మొత్తం నూక వస్తోందని, దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి బుడ్డల కొనుగోలుకు ప్రత్యేక అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. బయ ట మార్కెట్లో బుడ్డలు కొనేవారు కరువడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు అధికంగా పెట్టి ఆరుగాలం శ్రమించినా వరి తెగుళ్ల బారిన పడి సగానికి సగం కూడా దిగుబడి రాలేదని ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన ధాన్యం అయినా ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్సీఐకి బుడ్డలు.. కొనుగోళ్లకు గ్రీన్సిగ్నల్ జిల్లాలో పండిన బుడ్డలు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని విజయవాడ ధాన్యం మిల్లులకు తరలించాలని సూచించింది. అక్కడ ధాన్యాన్ని బాయిల్ చేసి ఎఫ్సీఐకు తరలించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం విజయవాడ రైస్ మిల్లర్స్తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం నుంచి బుడ్డల రకం ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,410 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి జయరాములు ‘సాక్షి’కి తెలిపారు. అయితే జిల్లావ్యాప్తంగా దాదాపు 2లక్షల టన్నులు బుడ్డల ధాన్యం ఉండగా కేవలం 30వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో మిగిలిన ధాన్యాన్ని రైతులు ఎక్కడ ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకుంది. మరోవైపు బయట మార్కెట్ లో బుడ్డల రకం ధాన్యం ధర తక్కువ ఉంది. క్వింటాల్ రూ.800 మించి కొనే పరిస్థితి లేదు. ధాన్యాన్ని కొంటామన్న ప్రభుత్వం మాట తప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘నవ’ ధాన్యాలు
1. గోధుమలు: పలు పాశ్చాత్య దేశాలతో పాటు ఉత్తర భారతీయుల ఆహారంలో ప్రధానమైనవి గోధుమలే. వీటిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. బీ కాంప్లెక్స్లో బి-12 మినహా మిగిలిన విటమిన్లు, విటమిన్-ఈ, విటమిన్-కేతో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. 2. వరి: పలు తూర్పు దేశాలతో పాటు దక్షిణ భారతీయులు వరి ధాన్యం నుంచి వేరు చేసిన బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. వరిలో రకరకాల వంగడాలు ఉన్నా, వాటిలోని పోషక విలువలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. బియ్యంలో దాదాపు 80 శాతం పిండి పదార్థాలే ఉంటాయి. స్వల్పంగా ప్రొటీన్లు, కొవ్వులు, బి1, బి2, బి3, బి5, బి6 విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. 3. కందులు: కందులను దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వినియోగిస్తారు. ఎక్కువగా పొట్టు తీసేసి పప్పుగా మార్చి వినియోగిస్తారు. కందులలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బి1, బి2, బి3, బి5, బి6, బి9 సీ, ఈ, కే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 4. పెసలు: పెసలను కూడా అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా వినియోగిస్తారు. పొట్టుతీయని గింజలను నానబెట్టి మొలకెత్తిన తర్వాత తినడంతో పాటు పొట్టుతీసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. పెసలలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 5. శనగలు: పెసల మాదిరిగానే శనగలను కూడా నానబెట్టి మొలకెత్తిన తర్వాత నేరుగా తినడంతో పాటు పొట్టుతీసేసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. శనగల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగాను, కొవ్వులు నామమాత్రంగాను ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 6. బొబ్బర్లు: కందులు, పెసలు, శనగల మాదిరిగా బొబ్బర్లను అంత విరివిగా వాడకపోయినా, మన దేశంలో వీటిని తరచుగానే ఉపయోగిస్తారు. బొబ్బర్లను నానబెట్టి ఉడికించి వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. బొబ్బర్లలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. 7. నువ్వులు: నువ్వులు ప్రధానంగా నూనెగింజల జాతికి చెందుతాయి. నువ్వులను, నువ్వుల నూనెను కూడా మన దేశంలో విరివిగా వినియోగిస్తారు. నువ్వుల నూనెను ఊరగాయల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వులలో ప్రధానంగా కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 8. మినుములు: మినుముల వాడుక మన దేశంలో పురాతన కాలం నుంచి ఉంది. మినుములను లేదా పొట్టుతీసిన మినప్పప్పును నానబెట్టి వివిధ రకాల అల్పాహార వంటకాలకు ఉపయోగిస్తారు. మినప్పుప్పును పిండిగా చేసి అప్పడాలు, సున్నుండలు వంటివి తయారు చేస్తారు. మినుముల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 9. ఉలవలు: ఉలవల వాడకం మన దేశంలో పురాతన కాలం నుంచే ఉన్నా, మిగిలిన పప్పుధాన్యాలతో పోలిస్తే వీటి వాడుక చాలా తక్కువ. ఉలవల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో బి1, బి2, బి3, బి5, బి6, బి9 విటమిన్లతో పాటు విటమిన్-సీ, విటమిన్-ఈ, విటమిన్-కే వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఉలవలను నానబెట్టి నేరుగా తింటే, మధుమేహం అదుపులోకి వస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో తేలింది. ఉషశ్రీ సీనియర్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పిల్లల కోసం ‘నవ’ సూచనలు 1 ఐదేళ్ల వయసొచ్చే వరకు తలిదండ్రులు తమ పిల్లలను అపురూపంగా చూడాలి 2 ఐదేళ్లు వచ్చాక వారికి మంచి, చెడు చెప్పే ప్రయత్నం చేయాలి. నయానా భయానా దారికి తెచ్చుకోవాలి. వారి మంచిలోనూ, చెడులోనూ అన్ని సందర్భాలలోనూ వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించాలి 3 వారిని విమర్శించడం, వ్యాఖ్యానించడం, ఇతరులతో పోల్చి చిన్నబుచ్చడం చేయకూడదు 4 పిల్లల శారీరక, మానసిక స్థితిగతులను బట్టి పెద్దయ్యాక వారు ఏమి కావాలన్న దానిపై ఒక ఆలోచన చేయాలి కానీ ముందు నుంచే వారిపై ఆశలు పెట్టుకుని, మోయలేనంత భారం మోపకూడదు 5 శారీరకంగా బలంగా అంటే బొద్దుగా, ముద్దుగా ఉన్నారు కదా అని మురిసిపోకూడదు. మానసికంగా కూడా దృఢంగా ఉండేలా చూడాలి. 6 భార్యాభర్తల కీచులాటలు, అత్తాకోడళ్ల తగవులు, ఇరుగుపొరుగుతో కయ్యాలు వంటివి లేకుండా ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. 7 ఎప్పుడూ చదువు.. చదువు.. అని వారిని సాధించకుండా, వారికి నైతికవిలువలను, నీతినిజాయితీలను ప్రబోధించే కథలు చెబుతుండాలి. నిజాయితీగా ఉన్నందుకు చిన్న చిన్న బహుమతులిచ్చి ప్రోత్సహించాలి 8 క్రమశిక్షణ పేరుతో వారిని తీవ్రంగా మందలించడం, మీతో మాట్లాడాలంటేనే భయపడేలా చేయకూడదు. అలాగని అతి చనువు ఇచ్చి నెత్తిన ఎక్కించుకోకూడదు. క్రమశిక్షణకు క్రమశిక్షణే, చనువు చనువే అన్నట్లు వ్యవహరించాలి 9 చివరగా ఒక్క మాట.. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వండి. అవసరమైతే వారి ఆలోచనలను, అభిప్రాయాలను సరిదిద్దుతూ, సూచనలు, సలహాలు ఇస్తుండండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నొస్టిక్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఫార్మర్స్ లంగ్...
మెడిక్షనరీ ‘వ్యవసాయదారుల ఊపిరితిత్తి’ అని రైతుల పేరిట ఉన్న ఈ ఆరోగ్య సమస్య కేవలం రైతులకే కాదు... ఎవరికైనా రావచ్చు. గాదెల్లోనూ, గరిసెల్లోనూ ధాన్యం నిల్వ చేసినప్పుడు, ఆ గింజల మీద ఉండే తేమపై పెరిగే థెర్మోయాక్టినోమైసిటిస్ అనే ఫంగస్ కారణంగా ఇది వస్తుంది. ఈ వ్యాధి న్యుమోనియాను కలిగించే ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అయితే వృత్తిరీత్యా ఇది వ్యవసాయదారులకూ, ఆ వృత్తితో సంబంధం ఉన్నవారికి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి దీనికి ఫార్మర్స్ లంగ్ అని పేరు. చెరుకుపంటపై నుంచి వచ్చే ధూళిని పీల్చేవారిలోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. -
ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!
-
ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!
- ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా కసరత్తు - కొనుగోళ్లకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పరిమితం కానుంది. లెవీ సేకరణ ఇకమీదట ఉండదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ధాన్యం సేకరణలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ధాన్యం సేకరణ మొదలు నిల్వ, మిల్లింగ్, రవాణా వరకు అన్నిరకాల వ్యవహారాలను ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ధాన్యం నాణ్యత పరీక్షల బాధ్యత సైతం ప్రైవేటు సంస్థల వ్యక్తుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలో పీపీపీ భాగస్వామ్య విధానాన్ని అనుసరించాలని సూచించింది. ప్రతిపాదనలో పేర్కొన్న అంశాలను అమల్లోకి తెచ్చేందుకు తగిన విధానాన్ని రూపొందించడానికి పౌరసరఫరాల శాఖ కసరత్తు ఆరంభించింది. వ్యవహారమంతా ప్రైవేటు చేతుల్లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం వరకు కొనసాగుతూ వచ్చిన ధాన్యం సేకరణ విధానాన్ని వచ్చే అక్టోబర్ నుంచి పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది. ప్రస్తుతం ధాన్యం సేకరణ చేస్తున్న పీఏసీ, ఐకేపీ, డీసీఎంఎస్లు ఈ మొత్తం భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే ఐకేపీ పౌర సరఫరాలశాఖకు తేల్చిచెప్పింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన సమయంలో కేంద్రం పీపీపీ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. టెండర్ విధానం ద్వారా ప్రైవేటు సంస్థ లేక వ్యక్తులను ఎంపిక చేసి ధాన్యం సేకరణ, మిల్లింగ్తోపాటు గోదాములు, మండల్ లెవల్ పాయింట్ (ఎంఎల్ఎస్) పాయింట్లోకి రవాణా బాధ్యతలను వారికి కట్టబెట్టాలని సూచించింది. ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు నైపుణ్యంగల సంస్థల పర్యవేక్షణలో అంటే.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఈ ప్రైవేటు సంస్థలు లేక వ్యక్తులకు ప్రభుత్వాల తరఫున బడ్జెట్ సాయం చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం బాధ్యతను ప్రైవేటు సంస్థలే చూసుకుంటుండటంతో వారి చేతుల్లోకి వెళ్లినట్లే అవుతుంది. -
ధాన్యంపై వేటు... మద్యానికి చోటు !
నరసరావుపేటవెస్ట్: రైతులు పండించిన ధాన్యం, అపరాలతోపాటు ఎరువులు నిల్వ ఉంచే సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లు ఇప్పుడు మద్యం నిల్వలకు చిరునామాగా మారాయి. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధరలేక, ఇళ్ల వద్ద దాచిఉంచే సౌకర్యంలేక మార్కెట్యార్డులో నిల్వచేద్దామనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం మాత్రం మద్యం నిల్వలను దాచి ఉంచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వివరాలను పరిశీలిస్తే... ఆర్టీసీ బస్టాండ్, క్వార్టర్లకు ఎదురుగా గుంటూరు-కర్నూలు రహదారిలో వేర్హౌసింగ్ గోడౌన్లు వాటి పక్కనే మార్కెట్ యార్డు ఉంది. వేర్హౌసింగ్ గోడౌన్లలో ధాన్యం, లెవీ బియ్యం, ఎరువులు, అపరాలు నిల్వ చేస్తుంటారు. పక్కనే ఉన్న మార్కెట్యార్డు గోడౌన్లలో ఆత్మబంధు పథకం కింద ధాన్యం నిల్వ ఉంచుతున్నారు. ఒక గోడౌన్ పౌరసరఫరాల శాఖ ఆధీనంలో ఉంది. ఇటీవల మద్యం నిల్వలు ఉంచే ఏపీ బేవరేజెస్ గోడౌన్లను పన్ను చెల్లించలేదని ఆదాయ పన్నుశాఖ సీజ్ చేసింది. దీంతో వారం రోజుల పాటు బార్లు, మద్యం షాపులకు సరఫరా నిలిచిపోయింది. మద్యం వ్యాపారులతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం గిలగిలలాడింది. ఆదాయ పన్ను చెల్లించకుండానే యుద్ధప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్శాఖతో మరో గోడౌన్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేయటంతో వెంటనే వారు వేర్హౌసింగ్ గోడౌన్ను ఎంపికచేసి అందులో మద్యం నిల్వ ఉంచి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే గోడౌన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం నిల్వ ఉంచితే టీడీపీ నాయకులు ఎదో అపరాధం జరిగినట్లుగా ఊరూ, వాడా కోడై కూశారు. యార్డులో ధాన్యం దాచుకునేందుకు స్థలమేదీ? ధాన్యానికి ప్రస్తుతం మద్దతు ధరలేకపోవటంతో రైతులు దాచుకునేందుకు యార్డుకు తీసుకొస్తున్నారు. గోదాములు నిండిపోయినందున దాచుకునే అవకాశం లేదని యార్డు అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు దిగాలుగా వెళ్లిపోతున్నారు. ఎటూ అవకాశంలేని రైతులు యార్డులోని రేకుల షెడ్డుకిందనే ధాన్యం నిల్వచేసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల ప్రయోజనాలను గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం నిల్వలకు మాత్రం గోడౌన్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయటం గమనార్హం. రైతులన్నా, రైతు పండించిన పంటలన్నా తెలుగుదేశం ప్రభ -
ఇక వరిసాగు.. కొరివితో చెలగాటమే!
ఎఫ్సీఐ ద్వారా లెవీ సేకరణ నిలిపివేయనున్న కేంద్రం ధాన్యం ‘తలరాత’ బహిరంగ మార్కెట్కే వదిలివేత కనీస మద్దతుధర దక్కదని అన్నదాతల ఆందోళన అమలాపురం : రైతుల నెత్తున కేంద్రం మరో పిడుగు వేయనుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా ధాన్యం లెవీ సేకరణ నిలిపివేయాలని, ధాన్యాన్ని కేవలం బహిరంగ మార్కెట్కే విడిచిపెట్టాలని దాదాపు నిర్ణయం తీసుకుంది. దీనితో పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర పొందలేక రైతులు నష్టపోయే దుస్థితి తలెత్తనుంది. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా లెవీగా సేకరించేది. గత ఖరీఫ్కు ముందు ఇది 75 శాతం వరకు ఉండేది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు దీనిని కస్టమ్ మిల్లింగ్ చేసిన తరువాత బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించేది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని 75 శాతం లెవీగా సేకరించడం ఏమిటని భావించిన కేంద్ర ప్రభుత్వం.. గత ఖరీఫ్ ముందు దీనిని మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నట్టు 25 శాతానికి కుదించింది. ఈ నిర్ణయం రైతులకు చేదు ఫలితాలు చవి చూపించింది. ధాన్యం కొనేవారు లేక కనీస మద్దతుధర బస్తా (75 కేజీలు)కి రూ.1,035 పొందలేకపోయూరు. రైతుల వద్ద కొన్న ధాన్యాన్ని బియ్యం గా మార్చిన తరువాత ఎఫ్సీఐ సేకరిస్తుందనే భరోసా లేకపోవడంతో మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాలేదు. అలాగే ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కనీస మద్దతు ధర చెల్లించకుండా బస్తా రూ.800కు కొనడం ద్వారా మిల్లర్లు లాభాలు ఆర్జిస్తే, రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా పెద్దగా కొనుగోలు జరగలేదు. కళ్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడం వల్ల ఈ ఏడాది సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జిల్లాలో గత ఖరీఫ్లో 10.50 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం గమనార్హం. అంటే మిల్లర్లు పెద్దగాా కొనుగోలు చేయకున్నా పండిన ధాన్యంలో మూడో వంతుమాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టు. దీని వల్లే రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదు. తాజాగా ఎఫ్సీఐ ద్వారా సేకరిస్తున్న 25 శాతం లెవీని కూడా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు ఎఫ్సీఐ గొడౌన్లలో బఫర్స్టాక్ కోసం ప్రభుత్వం లెవీ సేకరించేది. అవసరాలకు మించి ధాన్యం నిల్వలు ఉండడంతో కేంద్రం సేకరణ నిలిపివేసిందని సమాచారం. పండినా తప్పని దండగ.. కేంద్రం నిర్ణయం రైతులకు అశనిపాతంగా మారనుంది. ఎఫ్సీఐ నుంచి కొనుగోలు ఉంటుందనే భరోసా లేకుండా పోతే మిల్లర్లు ధాన్యాన్ని ఆచితూచి కొంటారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినా దీనిని మళ్లీ మిల్లర్లకు ఇచ్చి పౌరసరఫరా శాఖ ద్వారా సేకరించాల్సి వస్తోంది. మిల్లరు కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి మొత్తం ఓపెన్ మార్కెట్కు తరలిస్తే డిమాండ్ తగ్గి బియ్యం ధరలు పడిపోతాయి. అదే జరిగితే మిల్లర్లకు నష్టం వస్తుంది. అలా కాక అవసరం మేరకే బియ్యాన్ని పంపినా, కృత్రిమ కొరత సృష్టించినా ధర మరింత పెరిగి మిల్లర్లు మంచి లాభాలు పొందుతారు. ఇవన్నీ చూస్తే మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించేందుకు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ. అంటే ధాన్యాన్ని వాస్తవికమైన అవసరమైన మేరకైనా కొంటారనేది ప్రశ్నార్థకం. పోనీ ప్రభుత్వ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తుందా అంటే గత ఖరీఫ్లో కొన్నది మూడో వంతే. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వచ్చే రబీలో జిల్లాలో ధాన్యం దిగుబడి13 లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా. పరిస్థితి చూస్తే దిగుబడి పెరిగి.. కొనుగోలు తగ్గేలా ఉంది. అదే జరిగితే రైతులు లాభసాటి, గిట్టుబాటు ధర అటుంచి కనీస మద్దతు ధర కూడా పొందే అవకాశం లేకుండా పోతుంది. అంటే బాగా పండినా రైతులు నష్టాలు చూడాల్సి వస్తోందన్నమాట. ‘ప్రభుత్వం లెవీ సేకరణ ఎత్తివేస్తే ఎత్తివేసింది. కనీసం ఇతర దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించినా ధాన్యానికి డిమాండ్ వస్తుంది’ అని రైతులు కోరుతున్నా ప్రభుత్వం తలకెక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మునుముందు వరి సాగు కొరివితో తలగోక్కోవడమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ధాన్యం సొమ్మును పట్టేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుందామనే ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు సరికొత్త కష్టం వచ్చిపడింది. రుణమాఫీని పక్కనపెట్టడమే కాకుండా రైతులు తీసుకున్న రుణాలను తిరిగి రాబట్టేందుకు టీడీపీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. గతంలో వ్యక్తిగత ఖాతాల్లో వేసిన డిపాజిట్లను రుణాలకు జమచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. తాజాగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యానికి చెల్లించాల్సిన నగదును బ్యాంకు బకాయిలకు జమ చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారం కోసం చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయినా ఏ ఒక్క రైతుకూ పూర్తిగా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. రుణమాఫీ చేయకపోగా రైతుల నుంచి బకాయిలు వసూలుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆధార్తో లింకు జిల్లావ్యాప్తంగా 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఇప్పటివరకు 150 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొదటి రకం టన్ను రూ.14వేలు, సాధారణ రకం రూ.13,600 చొప్పన కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును నేరుగా రైతుకు ఇవ్వకుండా ఆధార్, బ్యాంక్ అకౌంట్తో లింకుపెట్టి డబ్బులను రైతు ఖాతాలోకి మళ్లించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఆ మేరకు రైతుల నుంచి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో అధికారులు తొమ్మిదివేలమంది రైతుల నుంచి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర పేరుతో ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యానికి చెల్లించాల్సిన నగదును అప్పులకు జమచేసుకుంటున్నారని తెలుసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. దళారుల దందా... బ్యాంకర్లు అప్పుల కింద జమచేసుకుంటున్నారని తెలుసుకున్న రైతులు ప్రైవేటుగా ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మిల్లర్లు, దళారీలు ఇదే అదనుగా సిండికేట్గా ఏర్పడి ధాన్యపు ధరలు ఒక్కసారిగా తగ్గించారు. పుట్టి ప్రభుత్వ ధర రూ.13,600 నుంచి రూ.14వేలు ఉంటే.. దళారులు ఒక్కసారిగా పుట్టి రూ.10వేలు నిర్ణయించారు. ఎంటీయూ 1010 రకం పుట్టి రెండ్రోజుల క్రితం రూ.11,800 వేలుకి కొనుగోలు చేశారు. అదే ధాన్యం ఇప్పుడు రూ.10వేలకి తగ్గించారు. బీపీటీ 5204 (జిలకర మసూరి) రకం రూ.14వేలు ఉంటే.. రూ.12 వేలకు చేశారు. అంతటితో వదలకుండా తూకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ఎలక్రానిక్ కాటాల ద్వారా తూకం వేయాల్సి ఉంది. అయితే ఇటు అధికారులు కానీ, అటు దళారులు కానీ ఆ కాటాలను వినియోగించటం లేదు. మూడు కర్రలు ఏర్పాటు చేసి అందులో తూనికల, కొలత శాఖ ముద్రలు లేని గుండ్లు, రాళ్లు పెట్టి కాటాలు వేస్తుండటం గమనార్హం. పాత బకాయిల కింద జమచేసుకుంటాం రైతుల ధాన్యానికి సంబంధించిన సొమ్ము మా బ్యాంక్ ఖాతాలకు వస్తే.. సంబంధిత రైతు చెల్లించాల్సిన బకాయిల కింద జమచేసుకుని మిగిలిన సొమ్మును రైతులకు ఇస్తాం. రైతులకు రుణాలు కావాలంటే మార్చిపైన కొత్తవి ఇస్తాం. - డేనియల్ ప్రసాద్, ఆంధ్రాబ్యాంక్, వాకాడు ధాన్యం సొమ్మును రైతుకివ్వండి కనీస మద్దతు ధరలేకపోయినా కష్టపడి పండించి అమ్ముకున్న ధాన్యం డబ్బులను అప్పుకు జమ చేసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇలాగైతే తాము ఎలా బతకాలి. చేసిన అప్పులు ఎలా తీర్చేది. సొమ్మును నేరుగా రైతుకి ఇవ్వకుండా మిల్లర్లు, దళారీలు వారి బ్యాంక్ ఖాతాల్లో వేస్తే ఊరుకునేది లేదు. -వంజివాక నారయ్య, వాకాడు. డబ్బులు ఇవ్వరంటున్నారు నాకు మూడున్నర ఎకరం పొలం ఉంది. వానలు లేక దిగుబడి తగ్గిపోయిం ది. వడ్లను కొనుగోలు కేంద్రానికి వేశాం. అయితే డబ్బులు ఇంకా ఇవ్వలేదు. గతంలో బ్యాంకు లో తీసుకున్న అప్పుకు జమ చేస్తారని చెబుతున్నారు. అలా చేస్తే మేమెట్లా బతకాలి. అందుకే మొన్న ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం అడిగారు. ముందే తెలిసి ఉంటే వడ్లు అమ్మేవాళ్లమే కాదు. - కె.శ్రీనివాసులు, కాశీపురం. -
ధాన్యం కొనుగోలు నిలిపివేత!
విజయనగరం కంటోన్మెంట్: రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడాన్ని నిలిపివేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా అవసరాల కన్నా ఎక్కువగా ధాన్యాన్ని సేకరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్వతీపురం డివిజన్ లో ధాన్యం కొనుగోలును ఇప్పటికే దాదాపు నిలిపివేశారు. అయితే అ ధికారికంగా ఆదేశాలు లేక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది గోళ్లు గిల్లుకుంటున్నారు. విజయనగరం డివిజన్లో మాత్రం ధాన్యం వస్తున్నప్పటికీ జిల్లా అవసరాలు తీరేంత నిల్వలుండడం, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలను భద్రపరిచేందుకు గోడౌన్లు చాలకపోవడం వంటి కారణాలతో ధాన్యం కొనుగోళ్లను ముందుగా నిలిపివేస్తే తరువాత కస్టమ్ మిల్లింగ్తో జిల్లా అవసరాలకు బియ్యం అందించవచ్చనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల శాఖ జిల్లా ఇన్చార్జి మేనేజర్ ఎం గణపతిరావు, పౌరసరఫరాల శాఖ కలెక్టర్, జేసీ బి.రామారావుకు చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన సెలవులో ఉన్నారు. దీంతో కొనుగోళ్లను నిలిపివేసేందుకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఎంఎం నాయక్ను కోరగా, వీలును బట్టి చర్యలు తీసుకోవాలని, జాయింట్ కలెక్టర్ చెప్పిన ప్రకారం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు డీఎం తెలిపారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు నిలిపివేయాలనే ఆదేశాలు మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశముంది. -
ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
లక్ష్యానికి 3 లక్షల టన్నులు తక్కువ గతేడాది కంటే అధిక సేకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ర్టవ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. పౌరసరఫరాల శాఖ మొత్తం 11.03 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది నిర్దేశించుకున్న 14 లక్షల టన్నుల లక్ష్యం చేరుకోకపోయినప్పటికీ గతేడాదితో పోలిస్తే 3.14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా సేకరించింది. బియ్యం లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తూ గతేడాది జూన్లో తీసుకున్న కేంద్ర నిర్ణయాన్ని చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు ధర రాదనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేకించింది. లెవీ తగ్గింపు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయినా కేంద్రం వెనక్కు తగ్గకపోవడంతో ఆగస్టు నుంచే కొనుగోలుకు అవసరమైన చర్యలు చేపట్టి, ఎలాంటి అడ్డంకులు లేకుండా ముగించింది. విజయవంతంగా పూర్తి: పార్థసారథి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలంగాణలో తొలి ఖరీఫ్ను విజయవంతంగా ముగించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. ఎక్కడా రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయకుండా ధాన్య సేకరణ పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఇందుకోసం కృషి చేసిన అన్ని జిల్లాల అధికారులను ఆయన అభినందించారు. నల్లగొండ, వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసినట్లు తెలిపారు. -
తెలంగాణ దారిపట్టిన ధాన్యం
రోజుకు 40 వేల నుంచి 50 వేల బస్తాల వరకు తరలింపు ఏపీలో అనుకూలంగా లేని లెవీ సేకరణ విధానాలు ధాన్యం విక్రేతలకు చెక్కులు ఇవ్వాలని ఆదేశాలు స్థానిక మిల్లర్లకు అమ్మేందుకు రైతుల విముఖత నరసరావుపేట వెస్ట్ : లెవీ సేకరణ విధానం అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడి ధాన్యం తెలంగాణకు తరలిపోతోంది. నిత్యం 40 వేల నుంచి 50 వేల బస్తాల వరకు ధాన్యం తెలంగాణ లోని నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు మిర్యాలగూడకు చేరుతోంది. అంతేకాక అక్కడి నుంచి బియ్యం భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో బియ్యం ధరలకు రెక్కలు వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవు తోంది. లెవీ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి నేరుగా డబ్బు చెల్లించకుండా చెక్ల రూపంలో ఇవ్వాలని జిల్లాలోని మిల్లర్లకు ఆదేశాలు జారీచేసింది. దీంతో మిల్లర్లకు ధాన్యం విక్రయించేందుకు రైతులు వెనుకాడుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న బయ్యర్లవైపు మొగ్గు చూపుతున్నారు.లెవీ సేకరణకు సంబంధించి మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యంలో 25 శాతం ప్రభుత్వానికి ఇచ్చి మిగిలిన సరుకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే 75 శాతం ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం మిల్లర్లకు లేకపోవటం, విక్రయిస్తే రెండు మూడు నెలలకు సొమ్ము చేతికొచ్చే పరిస్థితులు ఉండటం వంటి కారణాలతో మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు వెనుకంజవేస్తున్నారు. అంతేగాక కొనుగోలు చేసిన ధాన్యానికి చెక్కులు ఇస్తామంటే రైతులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వం రుణమాఫీని సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల చెక్కులను బ్యాంకుల్లో జమచేస్తే బాకీ కింద మినహాయించుకునే పరిస్థితులు ఉన్నాయని రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్మేందుకు విముఖత చూపుతున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం లెవీసేకరణ విధానాలను సరళతరం చేసిందని ఇక్కడికి వస్తున్న బయ్యర్లు చెపుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ము చేతిలోపెడుతున్నారు. దీంతో జిల్లా నుంచి భారీ స్థాయిలో ధాన్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో జిల్లాలో ధాన్యం నిల్వలు తగ్గి బియ్యంపై ఇతర రాష్ట్రాలపై ఆధార పడాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల రానున్న రోజుల్లో బియ్యం ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బీపీటీ బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.40లు ఉండగా రానున్న రోజుల్లో రూ.50లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. -
పల్లెకు పండగొచ్చింది..!
కోవెలకుంట్ల: ధాన్యం చేతికొచ్చిన సమయంలో ఘనంగా జరుపుకునే పండగ సంక్రాంతి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పండగకు వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా స్వగ్రామానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ముగ్గులు, పిండి వంటకాలు.. ఆటల పోటీలు.. ఇలా ఎన్నో సంక్రాంతి పండగకు సరికొత్త సందడిని తీసుకొస్తున్నాయి. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్డివిజన్లోని భాగ్యనగరం గ్రామంలో ఈ పండగను ప్రతీ ఏటా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అందుకుతగినట్లు ఏర్పాట్లు చేశారు. గుంటూరు, ఒంగోలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి సుమారు 52 సంవత్సరాల క్రితం వచ్చివారు దొర్నిపాడు మండలంలోని కేసీ కెనాల్ పరివాహ ప్రాంతాలైన భాగ్యనగరం, రామచంద్రాపురుం, అర్జునాపురం, వెంకటేశ్వరనగర్(డాక్టర్ కొట్టాల), రాజనగరం ప్రాంతాల్లో స్ధిరపడ్డారు. వీరి పిల్లలు, మనవళ్లు, మనుమరాళ్లు ఉన్నత చదువులు చదివి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరు ఎక్కడ ఉన్నా.. సంక్రాంతి పండగకు ముందురోజు మాత్రం అందరూ సొంత గ్రామాలను చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. బంధువులంతా ఒకేచోట చేరి వారం రోజుల పాటు శ్రమించి పిండి వంటకాలను తయారు చేస్తారు.భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అరిసెలు, పసుపు, కుంకుమ, కర్పూరంతో బోగిమంటలు వేసి పండుగకు స్వాగతం పలుకుతారు. భోగి సందర్భంగా ప్రతీ ఇంటా దోసె, నాటుకోడి చికెన్ ప్రత్యేక వంటకం. మకర సంక్రాంతికి ఇళ్లుముందు రంగురంగుల ముగ్గులు వేసి అలంకరణ చేస్తారు. బియ్యంతో పొంగలి తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడంతోపాటు ఆయా గ్రామాల్లో వెలసిన రామాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హరిదాసులకు బియ్యం, అరిసెలు, చెక్కలు, తదితర పిండి వంటకాలను దానం చేస్తారు. కనుమ రోజున చికెన్, వడలు, మటన్, తదితర ఆహార పదార్ధాలను ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. రామచంద్రాపురం గ్రామంలో మకర సంక్రాంతి రోజున బియ్యం పిండి, పాలు, బెల్లంతో కూడిన పాలతాళికలు ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. వారింట పండగ సందడి భాగ్యనగరంలో తాళ్లూరు, కరిమాల కుటుంబాల్లో పండగ సందడి బాగా కనిపిస్తుంది. నలుగురు అన్నదమ్ములు, వారి కుమారులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమన్లు, మనుమరాళ్లతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంటుంది. సుమారు వంద మందితో ఆ కుటుంబాలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటామని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల ముందేగానే.. సంక్రాంతి పండుగను ప్రతీ ఏటా వైభవంగా జరుపుకుంటాం. నా భర్త అం కాల్నాయుడు, నేను డాక్టర్లుగా ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాం. ఈ ఏడాది పండుగకు వారం రోజుల ముందుగానే భాగ్యనగరం చేరుకున్నాను. పిండి వంట తయారీలో నా వంతు సాయం చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. - నాగసుధారాణి, డాక్టర్, భాగ్యనగరం కబుర్లే.. కబుర్లు... సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబసభ్యులమంతా గ్రామాన్ని చేరుకుంటాం. పండుగ నిర్వహించే మూడు రోజులు పిండి వంటకాలు, ముచ్చట్లు, కబుర్లతో సరదాగా గడుపుతాం. నా భర్త హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడ్డాం. మాకు నికిల్ చౌదరి, జోషిక సంతానం. భాగ్యనగరంలో మూడు రోజులు సంక్రాంతి వేడుకలను నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చాం. - శశికళ, ఎంసీఏ -
కొనుగోళ్లను వేగవంతం చేయండి
ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై ఆదివారం ఆయన తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, సీఎం కార్యాలయ అధికారులు సతీష్చంద్ర, జి.సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధ, నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గంటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గతేడాది కన్నా ఈ సంవత్సరం ఇప్పటివరకు రైతుల నుంచి ఎక్కువ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది జనవరి 11 నాటికి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగగా.. ఈ ఏడాది ఇదే సమయానికి 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. పౌరసరఫరాల శాఖ ద్వారా దాదాపు పది లక్షల మెట్రిక్ టన్నులు, మిల్లర్ల ద్వారా 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. సీఎం స్పందిస్తూ ధాన్యం కొనుగోలు సొమ్మును రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని సూచించారు. పారదర్శకంగా సంక్రాంతి సరుకుల కొనుగోలు.. ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కార్యక్రమ సరుకుల కొనుగోలు, పంపిణీ ఎంతో పారదర్శకంగా జరిగిందని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థించుకున్నారు. అయినప్పటికీ కొందరు పనిగట్టుకుని దుష్ర్పచారం చేయడం సబబు కాదన్నారు. 12వ తేదీ సాయంత్రానికల్లా సరుకుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆయనీ సందర్భంగా ఆదేశించారు. వివిధ జిల్లాల పార్టీ నాయకులతో తాను నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లోనూ సంక్రాంతి కానుక పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన ఉన్నట్టు దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 50 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ విద్యా సంస్థ ఏర్పాటుకవసరమయ్యే భూమి విషయంలో.. అటవీ భూమిని డీనోటిఫై చేయడం, ఏలూరులో భూసేకరణ చేయడం.. ఈ రెంటిలో ఏది త్వరితగతిన చేపట్టవచ్చో పరిశీలించి దానిని అమలు చేయాలని సూచించారు. -
కొత్తగా 21 గిడ్డంగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ప్రత్యేకంగా గిడ్డంగులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలె యాదయ్యలతో కలిసి మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పది మార్కెట్ కమిటీల పరిధిలో గిడ్డంగుల నిర్మాణాలకు స్థలం అనుకూలంగా ఉందన్నారు. వాటి నిర్మాణాలకు రూ.13.20కోట్లతో మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు తయారు చేసిందని, వీటిని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందని చెప్పారు. ఈమేరకు శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను నిల్వ చేసేందుకు వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మరో 11 గిడ్డంగులు అవసరమని, వాటికి రూ.6.6కోట్లు కావాల్సిఉందని అన్నారు. ఈమేరకు ఆ శాఖ తయారు చేసిన ప్రణాళికలను ఆయన పరిశీలించారు. స్థల సేకరణకు సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడ గిట్టుబాటు కాకే..ఈ పాట్లు!
ఎచ్చెర్ల:ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు విఫలం కావడం, మిల్లర్లు సరైన ధర ఇవ్వకపోవడం వల్లే ఇతర జిల్లాల వర్తకులకు ధాన్యం అమ్మడానికే ఇష్టపడుతున్నారు. దాని పర్యవసానంగానే తూర్పు గోదావరి జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం లోడ్లు తరలిపోతున్నాయి. అలా వెళుతున్న 30 లారీలను ఆదివారం అర్ధరాత్రి చిలకపాలెం వద్ద పౌరసరఫరా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు పట్టుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఆ మేరకు ఈ ఖరీఫ్లో లెవీ సేకరణ లక్ష్యాన్ని రెండు లక్షల క్వింటాళ్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. కొండంత లక్ష్యం ముందున్నా వేరే జిల్లాకు పెద్ద ఎత్తున ధాన్యం తరలిపోవడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రైతుల వాదన వాస్తవ పరిస్థితులను కళ్లకు కడుతోంది. వారి వాదన ప్రకారం.. ధాన్యం కొనుగోలుకు వంద కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినా .. ఆ స్థాయిలో కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమన కేంద్రాల్లోనూ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. దళారులే నేరుగా కళ్లాల్లోకి వచ్చి ధాన్యం కొని ఇతర జిల్లాల మిల్లర్లకు అమ్ముతున్నారు. రైతులు కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే కంటే దళారులకు అమ్మడానికే ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువపరిమాణంలో ధాన్యం పండించే రైతులు దాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించలేకపోవడమే దీనికి కారణం. కొనుగోలు కేంద్రాల్లోగానీ, జిల్లాలోని మిల్లర్లు గానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోవడం మరో కారణం. మద్దతు ధర కావాలా.. ముదరా ఇవ్వండి ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలు రూ.1400, సాధారణ రకం రూ.1360 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ రేటు ఇవ్వాలంటే క్వింటాలుకు ఆరు కిలోలు ఎక్కువ ధాన్యం ఇవ్వాలని జిల్లాలోని పలువురు మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారన్నది రైతుల ఆరోపణ. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో స్థానిక మిల్లర్ల కంటే ఇతర జిల్లాల మిల్లర్లే మంచి ధర ఇస్తున్నారని, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తున్నారని నరసన్నపేట మండలం బద్రి గ్రామానికి చెందిన రైతులు చెప్పారు. అందువల్లే వరి ఎక్కువగా సాగు చేసే పోలాకి, గార, నరసన్నపేట, జలుమూరు, శ్రీకాకుళం రూరల్ మండలాల నుంచి ధాన్యం నిల్వలు తూర్పుగోదావరి జిల్లాకు తరలిపోతున్నాయంటున్నారు. మద్దతు ధర విషయంలో విఫలమైన అధికారులు ఇతర జిల్లాలకు తరలివెళుతున్న ధాన్యాన్ని పట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే అధికారుల దాడుల్లో రైస్ మిల్లర్లు పాల్గొనడమేమిటని నిలదీస్తున్నారు. దళారీ వ్యవస్థను, ఇతర జిల్లాలకు ధాన్యం రవాణాను అరికట్టాలనుకుంటే ముందు మద్దతు ధర ఖచ్చితంగా అమలు చేయడంతోపాటు గ్రామం యూనిట్గా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. ఇప్పటికే తుపాను కారణంగా దిగుబడి తగ్గిందని, ఈ పరిస్థితుల్లో ధాన్యం ఇతర జిల్లాలకు తరలిపోతే, ముందు ముందు జిల్లా బియ్యం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన ధాన్యంపై విచారణ ఇదిలా ఉండగా జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్ప్లాజా సమీపంలోఆదివారం ఆర్ధరాత్రి వరకు పట్టుకున్న 30 ధాన్యం లారీలను ఎచ్చెర్ల పోలీస్ సే ్టషన్కు తరలించి, విచారణ జరుపుతున్నారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి, జిల్లా పౌరసర ఫరాల అధికారి ఆనందరావు, పౌరసరఫరాల సంస్థ ఏఎస్వో తిలగ, ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావు తదితరలు పోలీస్ స్టేషన్కు చేరుకొని విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మిన రైతులు కొందరు కూడా స్టేషన్కు వచ్చి తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ధాన్యం కొనుగోలు ర సీదులు, ఆధార్ కార్డులు చూపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అన్ని ఆధారాలు ఉన్న ధాన్యం లారీలను విడిచిపెడతామని, ఆధారాలు చూపని లారీలపై 6(ఎ) కేసులు నమోదు చేసి జేసీ కోర్టుకు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు పూర్తి రికార్డులు ఉన్న రెండు లారీలను విడిచి పెట్టాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. మరోపక్క పోలీస్స్టేషన్కు వచ్చిన నరసన్నపేట మండలానికి చెందిన కొందరు రైతులు తూర్పుగోదావరి జిల్లా మిల్లర్లకు ధాన్యం అమ్మితే తప్పేమిటని అధికారులను ప్రశ్నించారు. కాగా గతంలో ఎప్పుడూ ఇటువంటి అభ్యంతరాలు రాలేదని కొందరు లారీ డ్రైవర్లు చెప్పారు. -
దళారులదే హవా
ఏళ్లు గడుస్తున్నా.. పాలకులు మారుతున్నా.. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరుతున్నా.. కర్షకుల కష్టాలు మాత్రం తీరడం లేదు. నిత్యం వ్యయప్రయాసాల కోర్చి.. దిగుబడి వస్తున్నా.. రాకున్నా.. సాగు పోరాటంలో దిగుతున్న అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. సాగు సమయంలో ప్రకృతి పగబడితే.. ధాన్యం చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆసరానివ్వలేకపోతున్నాయి. కొద్దోగొప్పో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేకపాయె. అరకొరగా ప్రారంభిస్తుండడంతో చివరికి ధాన్యం దళారులకే అమ్ముకోవాల్సి వస్తోం ది. దళారులేమో మద్దతు ధర చెల్లించక పోగా.. కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. క్వింటాల్కు 10 నుంచి 20 కిలోల వరకు చిలక్కొట్టుడు కొడుతున్నారు. ఫలితంగా రైతన్న నిలువునా దగాకు గురవుతున్నాడు. - ఆదిలాబాద్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో వరి సాగు తగ్గింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 60 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. కానీ.. అది 27 హెక్టార్లకే పరిమితమైంది. ఆలస్యంగానైనా కురిసిన కొద్దిపాటి వర్షాలతో ఈ కొద్ది మేర వరినాట్లు వేశారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 92,500 మెట్రిక్ టన్నుల ధాన్య దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం కూడా గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1,400, మధ్యరకం ధాన్యానికి రూ.1,360 ధర నిర్ణయించింది. ప్రస్తుత దిగుబడి ధాన్యం చేతికి వస్తోంది. ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. దీంతో దిగుబడి వస్తున్నా.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవాల్సి వస్తోంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 194 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. చివరికి 71 కేంద్రాలకే పరిమితమయ్యారు. ఐకేపీ 50, పీఏసీఎస్ 18, డీసీఎమ్మెస్ కొన్ని మండలాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. ఇప్పటివరకు వీటన్నింటి పరిధిలో 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది సుమారుగా ఇంకా 34 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది 52 వేల క్వింటాళ్ల వరిధాన్యాన్ని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేశారు. తూకాల్లో మోసాలు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో.. కొనుగోలు కేంద్రాలు లేని ఏరియాలను దళారులు ఎంచుకున్నారు. దీంతో వ్యాపారులు రైతుల పంట పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని జైపూర్, నెన్నెల, వేమనపల్లి, లక్ష్మణచాంద, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బెల్లంపల్లి, కౌటాల తదితర మండలాల్లో రైతులు దళారులకే విక్రయిస్తున్నారు. కాగా.. దళారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు చెల్లిస్తున్నా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు మధ్య రకం ధాన్యానికి రూ. 1,300, సన్నరకం ధాన్యానికి రూ.1,700 వరకు చెల్లిస్తున్నారు. తూకాల్లో మాత్రం క్వింటాల్కు 10 నుంచి 20 కిలోల వరకు మోసం చేస్తున్నారు. దీన్ని కనిపెట్టిన వారు నిలదీస్తే తేమ శాతం చూడకుండానే కొనుగోలు చేస్తున్నందునా బరువు ఎక్కువగా వ స్తుందని, అందుకే ధర ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అసలే కరువు నేపథ్యంలో జిల్లాలో అంతంత మాత్రంగానే వరిధాన్యం సాగైంది. దీంతో రానున్న రోజుల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో దళారులు జోరుగా తమ దందాను కొనసాగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.. - చరణ్దాస్, డీఆర్డీఏ ఏపీడీ జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేసి 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. కొన్ని మండలాల్లో ఆలస్యంగా వరినాట్లు వేయడంతో దిగుబడి రాక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వారం రోజుల్లో కడెం, ఖానాపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, మామడ, జన్నారం, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి తదితర మండలాల్లో ఏర్పాటు చేస్తాం. మరో 35 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తున్నాం. -
ధాన్యం సేకరణలో పశ్చిమ బెస్ట్
ఏలూరు : ధాన్యం సేకరణ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ కోసం పటిష్టమైన విధానాన్ని అవలంభిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతతో ఫోన్లో మాట్లాడి ఇదే విధానాన్ని అన్ని జిల్లాలు అనుసరించేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్, జేసీ బాబురావునాయుడు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో గ్రామాలవారీ ప్రణాళికను సిద్ధం చేశారని, ఇతర జిల్లాలు కూడా అనుసరిస్తే ప్రజావసరాలు కోసం కావాల్సిన బియ్యాన్ని మనమే సమకూర్చుకోగలుగుతామని రాజశేఖర్ మంత్రికి వివరించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లో ఆన్లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్న తీరు సంతృప్తికరంగా ఉందన్నారు. రైస్మిల్లర్స్ కూడా ప్రభుత్వంతో సహకరించి మంచి నాణ్యత గల ధాన్యాన్ని సేకరించేందుకు దోహదం చేయాలని కమిషనర్ కోరారు. రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యంలో ఏ-గ్రేడ్ బియ్యాన్ని ప్రత్యేక గోదాముల్లో భద్రపరచాలని, జిల్లాలో చౌకడిపోల ద్వారా రూ.1 కే కిలో బియ్యాన్ని అందిస్తామన్నారు. అదే విధంగా హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలకు కూడా నాణ్యమైన బియ్యాన్ని అందించాలని నిర్ణయించామన్నారు. 22 వేల దీపం కనెక్షన్లు మంజూరు రాష్ట్రంలోని గిరిజనులందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు సరఫరా చేస్తామని రాజశేఖర్ చెప్పారు. జిల్లాలో దీపం పథకం కింద కొత్తగా 22 వేల వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. సమావే శంలో జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు. జిల్లా పౌరసరఫరాల అధికారి డి.శివశంకర్రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం వసంతరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చింతలపూడి : రాష్ట్రంలో ఇప్పటివరకు 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ తెలిపారు. చింతలపూడి ఏఎంసీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తీసుకుంటున్న జాగ్రత్తలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెయ్యి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వరి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆయన వెంట జేసీ టి.బాబూరావునాయుడు, డీఎస్వో శివశంకర్రెడ్డి, డీఎం వసంతరావు, ఏజీ డీఎం సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ మైఖేల్రాజ్ పాల్గొన్నారు. -
ఇకపై అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఏ జిల్లాలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని అదే జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఇప్పటివరకు కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైన ధాన్యం సేకరణను అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బియ్యాన్ని వికేంద్రీకరణ కింద పౌర సరఫరాల శాఖ సేకరించనుంది. ఆయా జిల్లాల్లో సేకరించిన ధాన్యాన్ని అక్కడే బియ్యంగా మార్చి ఆ జిల్లా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లో మిల్లు లెవీ లేనందున దానికి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. ఇకపై అన్ని జిల్లాల్లో పచ్చిబియ్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరిస్తుందని, పీడీఎస్కు అవసరమయ్యే బియ్యాన్ని ఇక్కడి నుంచే వాడుకుంటుందని వెల్లడించారు. భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) కేవలం ఉప్పుడు బియ్యాన్ని సేకరించి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. కార్పొరేషన్కు డెరైక్టర్ల నియామకం: తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్కు డెరైక్టర్లను నియమిస్తూ శుక్రవారం ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. కార్పొరేషన్లో డెరైక్టర్లుగా కమిషనర్ సి.పార్థసారథి, ఎండీ అనిల్కుమార్,ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఎంవీ సాయిప్రసాద్లు ఉంటారు. -
అడుగడుగునా వేదనే
విత్తు వేసినప్పటి నుంచీ కష్టాలే కన్నీరు పెట్టించిన కరెంటు కోతలు సమయానికి రాని వానలు అదును దాటాక వచ్చి తిప్పలు చేతికందిన పంట చేజారిపాయే అందిన దిగుబడికీ ‘మద్దతు’ లేదాయే జడ్పీ చైర్మన్కు రైతుల వినతి ఖరీఫ్ కొనుగోళ్ల సీజన్. ఇందూరు వ్యవసాయ మార్కెట్ ఆవరణ. ఓ వైపు ధాన్యం రాశులు. మరోవైపు తూకాలలో నిమగ్నమైన దడ్వాయిలు. వడ్ల అమ్మకం కోసం బారులు తీరిన రైతులు. కనీస మద్దతు ధర లేదు. కాంటాలు జరిగిన 48 గంటలలో చెల్లింపులు జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా తప్పని పడిగాపులు. కరెంట్ కోతలు. సమయానికి పడని వానలు. అదును దాటాక కురిసి పంటను చెడగొట్టిన వర్షాలు. ఇన్ని కష్టాల నడుమ చేతి కందిన కొద్దో, గొప్పో పంటకు లభించని గిట్టుబాటు ధర. దళారుల ప్రమేయం. అధికారుల మౌనవ్రతం. అన్నదాత వేదన అంతులేనిది. ఈ నేపథ్యంలో కర్షకుల కష్టసుఖాలు తెలుసుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు ‘సాక్షి’ ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించి వారితో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. రాజుగారు ఏమన్నారంటే రైతులు పండించిన పంటలకు సర్కారు మద్దతు ధర ఇస్తుంది. అందుకోసం నేను కూడా ప్రయత్నిస్తా. దళారులను నమ్మి మోసపోవద్దు. రైతుల కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. వానలు, నీటి సదుపాయాలు చూసుకుని పంటలను వేసుకోవాలి. అన్నదాతలను ప్రోత్సహించేందుకు మేం ఎంతగానో కృషి చేస్తున్నం. ఇక నుంచి కరెంటు సమస్య లేకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నం. ప్రతి రైతుకు మద్దతు ధర అందుతుంది. ఈ విషయాన్ని పరిశీలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినం. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచే విషయాన్ని పరిశీలిస్తం. మార్కెటు యార్డులలో తగిన సౌకర్యాలు కల్పిస్తం. అన్నదాతలు ఆరుతడి పంటల మీద దృష్టి సారించాలి. చైర్మన్: బాగున్నవా.. నీ పేరేంది... ఎక్కడి నుంచి వచ్చినవు? రైతు : నా పేరు పొట్టయ్య... బాన్సువాడ నుంచి వచ్చిన. చైర్మన్: ఎంత ధాన్యం తీసుకచ్చినవు? పొట్టయ్య : 40 సంచులు తీసుకొచ్చిన. చైర్మన్: పంట బాగ పండిందా? పొట్టయ్య : ఈ సారి పంటలు బాగా పండలేదు సారూ. వానలు లేవు. సరిగ్గా కరెంటూ లేకపాయే. దీంతో పంట చాల తక్కువగా వచ్చింది. లింగయ్య (వెల్మల్) : కరెంటు సక్కగ లేకనే సాన ఇబ్బందులు పడ్డం. ఎప్పుడస్తదో, ఎప్పుడు పోతదో తెల్వకపాయె. దీంతో పంటలను కాపాడుకోలేకపోయినం. చైర్మన్: ఎంత పంట వేసినవు...ఎంత పండింది? లింగయ్య (కేశ్పల్లి) : మూడెకరాలు వరి వేసిన. కరెంటు, వానలు లేక ఎకరంన్నరే పం డింది. అంతా లాస్ లాసే. చైర్మన్: మరి ఏదన్న ఆరుతడి పంట వేయకపోయినవా? పోశెట్టి: ఖరీఫ్లో వానలను నమ్ముకొని ఏటా వరి మాత్రమే ఏస్తం. ఈసారి ఠమొదటిపేజీ తరువాయి కూడా పంటలు వేసినంక కూడా వానలు పడుతయనుకున్నం. కానీ, పడకపాయే! చైర్మన్: ఏం సర్దార్...మద్దతు ధర వస్తందా? సర్దార్ : ధర బాగా తక్కువగా చేస్తున్నరు. సార్లేమో రూ. 1,400 అంటే, మార్కెట్లో రూ. 1,200కే అడుగుతున్నారు. ఏమన్నంటే వడ్లు బాగా లేవంటున్నరు. చైర్మన్: ఇక్కడ అధికారి ఎవరున్నరు ? (అంతలోనే ఓ అధికారి చైర్మన్ వద్దకు వచ్చారు) మీ పేరేంది? అధికారి : నాపేరు రమేశ్ సార్. గ్రేడ్-1 అధికారిని. చైర్మన్: అచ్ఛా.. రమేశ్ గారూ రైతుకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు? రమేశ్ : వడ్లను పూర్తిగా పరిశీలించి తరువాతనే ధరను నిర్ణయిస్తున్నాం సార్. కొద్దిపాటి తేడా ఉంటే రైతులకు వివరిస్తున్నాం. అందుకే ధర తక్కువగా ఉన్నట్లుంది. చైర్మన్: ప్రతి రైతుకు మద్దతు ధర తప్పని సరి వచ్చే లా చూడాలి. ఇలా కారణాలు చూపెడితే ఎట్ల మరీ? గంగారాం : మీరైనా వాళ్లని అడుగండి సారూ. మ ద్దతు ధర ఇవ్వడం లేదు. ఏవో కారణాలు చూపెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇట్లయితే మే మెట్ల బతుకుతం. నారాయణ : ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. సమయానికి వడ్లను కొనేవారు లేరు. కొంటే మద్దతు ధర లేదు. సర్కారేమో మద్దతు ధర ఇస్తామంటాంది. చైర్మన్: మీరు పండించిన పంటకు మద్దతు ధర తప్పనిసరి వస్తుంది. అధికారులు మద్దతు ధరను మీకు అందిస్తారు. మీరు బాధ పడవద్దు. ఎల్లయ్య : పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. చైర్మన్: ఎంత పంట వేసినవు. ఖర్చు ఎంత అయింది. మీకు ఎంత మిగులుతుంది? ఎల్లయ్య : నాలుగు ఎకరాలలో వరి వేసిన. లక్ష రూపాయల వరకు ఖర్చయింది. నీళ్లందక సగం పంట ఎండిపోయింది. వచ్చిన పంటను అమ్మితే లక్ష రూపాయలు కూడా రావడం లేదు. పి.పి. గంగారెడ్డి (గోవింద్పేట్) : చాలా కష్టాలు పడుతున్నాం సార్. పొద్దనక, రాత్రనక పంటలు పం డిస్తే, పండించిన దానికి మద్దతు ధర లేదు. కొనేటప్పుడు ఏమో అన్ని ధరలు ఎక్కువగా ఉన్నాయి. మేము అమ్మితే మాత్రం తక్కువగా కొంటున్నారు. మేమెట్ల బతకాలే! చైర్మన్: మీరు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తుంది. కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడే మీరు ధా న్యం విక్రయించాలి. అప్పుడు సరైన మద్దతు ధర లభిస్తుంది. దళారులను నమ్మవద్దు. రమేశ్ (నిర్మల్) : ఊళ్లళ్లకచ్చే దళారులే ధరలు తక్కువగా ఉన్నయంటూ రైతులను మోసం చేస్తున్నరు. వారి అడిగిన ధరకే వడ్లు ఇవ్వాల్సి వస్తాంది. అందు కే నేను ఇక్కడికి వచ్చిన. చైర్మన్: మంచి పని చేసినవు. ఇక్కడ అధికారులు మద్దతు ధర తప్పనిసరిగా ఇస్తరు. రాజన్న : సారూ.. సోయాలు వేసి చాలా నష్టపోయినం. పంట అసలు చేతికి రాలేదు. నీళ్లు లేక సగం ఎండిపోతే, రోగం వచ్చి మరి కొంత ఎండిపోయింది. వడ్లు అమ్మడానికి తీసుకొచ్చిన. దీనికన్న మద్దతు ధర వస్తుందో లేదోనని చూస్తున్న. చైర్మన్: నువ్వు తీసుకొచ్చిన వడ్లకు మంచి ధర వస్తది. ఏదైనా సమస్య ఉంటే మార్కెట్ కమిటీ అధికారులను కలువు. రాజవ్వ : కరెంటు సమస్య ఇంకా ఎన్ని రోజులుం టది? చైర్మన్: త్వరలోనే కరెంటు సమస్య తీరిపోతది. మన తెలంగాణలో ఉన్న నీళ్లను బాగా వాడుకుందాం. కరెం టు కూడా ఉంటుంది. పంటలు బాగా పండించుకోవచ్చు. సాయిలు : సారూ... ప్రతి ఊళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. అప్పుడే మాకు మద్దతు ధర దొరుకుతది. చైర్మన్: అలా ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తాం. మీ ఊరిలోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధర వచ్చేలా చూస్తాం. వెంకటేశ్ : మక్కలకు ‘మద్దతు’ దొరకడం లేదు. ఆరుతడి పం ట అని వేస్తే దానికి కూడా ధర లేకుంటే ఎట్లా! నాగరాజు : ఆరుతడి పంటలకు మద్దతు ధర కల్పించి కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేదంటే పండించిన పంట ను భద్రపరుచుకునేందుకు గోదాములు ఉచితంగా ఇవ్వాలి. చైర్మన్: ఇలాంటి ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజయ్య (నందిపేట) : అధికారులు మద్దతు ధర ఇప్పించడానికి కృషి చేయాలి. మాజీద్ ఖాన్, గ్రేడ్-3 అధికారి : మార్కెట్ యార్డుకు వచ్చే ధాన్యానికి తప్పకుండా మద్దతు ధర ఇప్పిస్తున్నాం, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. చైర్మన్: మార్కెట్కు వచ్చే రైతులకు అధికారులు సహాయ సహకారాలు అందించాలి. వారికి ఇబ్బందులు లేకుండా చూడాలి. రమేశ్, గ్రేడ్-2 అధికారి : రైతుల కోసం అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. -
వర్షార్పణం
కరీంనగర్ అగ్రికల్చర్/జగిత్యాల అగ్రికల్చర్ : పంటల దశలో ముఖం చాటేసిన వానలు.. పంట దిగుబడులు చేతికొచ్చిన దశలో అన్నదాతలను దెబ్బతీస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి బోరున వర్షం కురవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోయింది. కరీంనగర్, హుస్నాబాద్, జమ్మికుంట, జగిత్యాల, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, శంకరపట్నం, బెజ్జంకి, సుల్తానాబాద్, కథలాపూర్, వీణవంక, కాల్వశ్రీరాంపూర్, మంథని, మహదేవపూర్, కాటారం, ముత్తారం, మల్హర్ తదితర మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లోకి నీరు చేరి వరిధాన్యం, మక్కలు, పత్తి తడిసిపోయాయి. తూకం వేసి రవాణా చేయని బస్తాలతోపాటు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. ధాన్యం తడిసిపోవడంతో మార్క్ఫెడ్తోపాటు ఐకేపీ నిర్వాహకులు కొనుగోళ్లను నిలిపివేశారు. మరోవైపు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు పేర్కొంటుండడం అన్నదాతలను కలవరపెడుతోంది. మరో నాలుగు రోజులు వర్షాలు మరోనాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఈనెల 16 వరకు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, 13న మూడు మిల్లీమీటర్లు, 14న 10 మిల్లీమీటర్లు, 15న 15మిల్లీమీటర్లు, 16న 12 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందన్నారు. ఈదురుగాలులు గంటకు 5 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, గాలిలో తేమ ఉదయం 90నుంచి 95 శాతం, మధ్యాహ్నం 46 నుంచి 64 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించారు. -
అంతా ఆన్లైన్
తూకాల్లో మోసాలు... చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతోపాటు మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు యంత్రాంగం సరికొత్త విధానం ప్రవేశపెట్టబోతోంది. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసే రైతన్న పంటను అమ్ముకునే క్రమంలో మోసపోకుండా అడ్డుకట్ట వేయనుంది. అందుకోసం ఇకనుంచి మార్కెట్యార్డుల్లో రైతు ధాన్యం అమ్మిన వెంటనే తక్పట్టీల జారీ...చెల్లింపుల వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరిచేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా మూడు రోజుల్లోనే రైతులకు డబ్బు చెల్లించేలా చర్యలు తీసుకుంటోంది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు సొంత జిల్లా కావడంతో మన జిల్లా నుంచే ఈ సరికొత్త విధానం అమలు కాబోతోంది. గజ్వేల్: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ విధానం అమల్లోకి రాబోతోంది. ఇకనుంచి కంప్యూటర్ విధానంలో తక్పట్టీలను జారీ చేయనున్నారు. మోసాల నివారణతోపాటు రైతుకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడానికి ఈసారి నుంచి ఈ విధానాన్ని అమలుచేయడానికి రంగం సిద్ధమైంది. అదేవిధంగా గతంలో మాదిరి కాకుండా బ్యాంకుల ద్వారా మూడు రోజుల్లోపు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని అన్ని యార్డుల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్రమాలకు అడ్డుకట్ట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి, దౌల్తాబాద్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, రామాయంపేట, చేగుంట, మెదక్, నారాయణఖేడ్, వట్టిపల్లి, రాయికోడ్, జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, నర్సాపూర్, జోగిపేటల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులున్నాయి. ఈ యార్డుల్లో ప్రతి సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్థవ్యస్తంగా మారుతోంది. కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గత ఏడాది గజ్వేల్లో మక్కల కొనుగోలు కేంద్రం నిర్వహణలో ఐకేపీ సిబ్బంది కుంభకోణానికి పాల్పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఐకేపీ సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయం విధితమే. గజ్వేల్లోనే కాదు దాదాపు అన్ని యార్డుల్లోనూ అక్రమాల చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ ఉపక్రమించింది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు నేతృత్వంలో తెలంగాణలోని అన్ని యార్డుల్లో ఇక నుంచి కొనుగోలు కార్యకలాపాలన్నీ ఆన్లైన్ విధానంలో జరపాలని నిర్ణయించింది. ఈమేరకు యార్డుల్లో కంప్యూటర్ విధానానికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేశారు. ఇక నుంచి యార్డుల్లోని కొనుగోలు కేంద్రాల్లో కంప్యూటర్ విధానంలోనే తక్పట్టీ(రశీదు)లను ఇవ్వనున్నారు. అంతేకాకుండా గతంలో చెల్లింపులు నెలల తరబడి కేంద్రాల నిర్వాహకులు చుట్టూ తిరిగినా, ఫలితం లేక రైతులు విసిగి వేసారిపోయేవారు. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసే దిశలో మూడు రోజుల్లోనే రైతుకు బిల్లులు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రైతుకు ఎప్పటికప్పుడు సెల్ఫోన్ మెసేజ్ ఇవ్వనున్నారు. మంత్రి హరీష్రావు సొంత జిల్లాలో ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి సత్ఫలితాలు తీసుకురావడానికి సంబంధిత యంత్రాంగం ప్రయత్నిస్తోంది. -
మద్దతు ధరతో ధాన్యం కొనాలి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్దతు ధరతోనే రైతుల వద్ద నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014-15 సీజన్ ప్రారంభమైందని, తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపడుతుందని తెలిపారు. బియ్యం ఏ గ్రేడ్ ధర క్వింటాల్కు రూ.1,400, బీ గ్రేడ్ ధర క్వింటాల్కు రూ.1,360, మొక్కజొన్న క్వింటాల్కు రూ.1310 చొప్పున ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైస్మిల్లర్లకు సీఎమ్మార్ చార్జీలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మార్కెట్యార్డుల్లో కావాల్సిన పరికరాల కొనుగోలుకు రూ.6 కోట్ల 40 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని, జిల్లాకు రూ.80 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. యార్డుల్లో సౌకర్యాలు, కాంటాలు, ఎలక్ట్రానిక్ మిషన్ల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించాలని సూచించారు.ఉపయోగించాలని న్నారు. రాష్ట్రంలో పండించిన సూపర్ క్వాలిటీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయరాదన్నారు. పత్తి, మొక్కజొన్న మద్దతు ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయాలన్నారు. 31 వేల మెట్రిక్ టన్నుల అంచనా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ, ఈ ఏడాది 31 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలుకు అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో 179 కేంద్రాల్లో కొనుగోళ్ల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా ఈ నెల 20 నుంచి పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని, జిన్నింగ్ మిల్లులకు రెండు రోజుల పాటు పవర్ హాలీడే లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 284 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. డీఎస్వో వసంత్రావు దేశ్పాండే, డీఎం ఆనంద్రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ధాన్యం మీది.. భద్రత మాది
ఒంగోలు టూటౌన్ : రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి భద్రత కల్పిస్తామని కేంద్ర గిడ్డంగుల సంస్థ(సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్) రీజినల్ మేనేజర్ పీఈ ప్రసాద్ భరోసా ఇచ్చారు. స్థానిక వ్యవసాయమార్కెట్ కమిటీ మేనేజర్ రామమోహన్ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం నిల్వలపై రైతులకు అవగహన కల్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే సెంట్రల్ వేర్హౌసింగ్ లక్ష్యమని అన్నారు. రైతులు గోడౌన్లలో నిల్వ చేసిన ధాన్యం విలువను బట్టి రుణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయశాఖ సంచాలకుడు జే మురళీకృష్ణ మాట్లాడుతూ.. గోడౌన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేసుకుంటే భద్రత ఉంటుందని తెలిపారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునే వీలుందని చెప్పారు. ఏరువాక కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ వరప్రసాదరావు మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ చేసే ఆహార ధాన్యాలను ఆశించే క్రిమికీటకాలు, వాటి జీవన విధానాం, నివారించే పద్ధతులను వివరించారు. పురుగు మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సీనియర్ మేనేజర్ పివిఆర్ ఫణికుమార్ మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ చేసుకున్న ధాన్యంపై కల్పించే రుణ సదుపాయం గురించి వివరించారు. శాస్త్రవేత్త అనిల్కుమార్ మాట్లాడుతూ.. పంట కోత అనంతరం నిల్వలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. గోడౌన్లలో సౌకర్యాలపై ప్రశ్నించిన రైతులు కేంద్ర గిడ్డంగుల సంస్థలో అధునాతన సౌకర్యాలు లేకుండా ధాన్యం నిల్వలు ఎలా చేస్తారని రమణారెడ్డి అనే రైతు అధికారులను ప్రశ్నించారు. పాత గిడ్డంగుల్లో ధాన్యం నిల్వలు ఎలా సాధ్యమని అధికారులను అడిగారు. ధాన్యం నిల్వలకు సరిపడా ఉష్ణోగ్రతను కల్పించే సౌకర్యం కేంద్ర గిడ్డంగుల సంస్థలో ఉందా అని నిలదీశారు. అధునాతన వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమం అనంతరం శిక్షణకు వచ్చిన రైతులకు సర్టిఫికెట్లు, ధాన్యం నిల్వ చేసుకునే మెటల్ డ్రమ్ములను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డిప్యూటీ డెరైక్టర్ ఆర్ జగన్నాథం, కొత్తపట్నం, సంతనూతలపాడు వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
కొంపముంచనున్న..కొత్త లెవీ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బియ్యం సేకరణ (లెవీ) విధానం ఒకే విధంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అటు రైతులకు.. ఇటు చిన్నమిల్లర్లకు ఆశనిపాతంగా మారనుంది. పాత పద్ధతి ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి రైస్మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75శాతం ప్రభుత్వానికి లెవీగా పెట్టేవారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విధానంలో కేవలం 25శాతం మాత్రమే లెవీగా సేకరించనున్నారు. దీంతో మిల్లర్లు ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కంటే, మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసే ధాన్యమే ఎక్కువ. గ్రామాల్లో వరి కల్లాల వద్ద నేరుగా వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం మొత్తం చేరేది కూడా మిల్లులకే. లెవీ తగ్గింపుల వల్ల అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం మిల్లర్లకు ఉండదు. ప్రతికూల పరిస్థితులనుంచి బయటపడేందుకే.. దేశ వ్యాప్తంగా లెవీ సేకరణ అధికంగా జరుగుతోందని, దీనివల్ల అధిక నిల్వలు పేరుకు పోవడం, వృథా పెరగడం, కేంద్రం నిధులు ఎక్కువగా వినియోగించాల్సి రావడం, ఎక్కువ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వాల్సి రావడం వ ంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడేందుకు లెవీ సేకరణ తగ్గిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి దాకా కస్టమ్ మిల్లింగ్, 30శాతం నుంచి 75శాతం వరకు మిల్లరునుంచి లెవీ సేకరణ జరుగుతోంది. మన రాష్ట్రంలో మాత్రం 75శాతం లేవీ సేకరణ అమలులో ఉంది. నూతన లేవీ విధానంలో రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని పాత పద్ధతిలోనే 75శాతం, లేదంటే కనీసం 50శాతం లేవీ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయినా, ఇది సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిందని, దీంతో ఇటు మిల్లర్లకు, అటు రైతులకు ఇబ్బంది తప్పదని రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 350రైస్మిల్లులు ఉన్నాయి. వీటిలో ఆధునిక టెక్నాలజీవి 150 వరకు ఉండగా, చిన్నాచితకవి 200 వరకు ఉన్నాయి. అదే విధంగా 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో రికార్డు స్థాయిలో 24.52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇక, ముందు ఇంతస్థాయిలో సేకరణ జరిగే వీలులేదు. లేవీ 25 శాతం లెవీ పెట్టి, బహిరంగ మార్కెట్లో 75శాతం విక్రయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆధునిక టెక్నాలజీ లేని మిల్లులు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నుంచి బయట పడేందుకు, ప్రభుత్వం నుంచి అమితుమీ తేల్చుకునేందుకు సోమవారం కోదాడలో రాష్ట్రస్థాయి మిల్లర్ల సమావేశం జరగనుంది. కొత్త విధానంతో ఇవీ..నష్టాలు పాత లెవీ విధానంలో మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం ప్రభుత్వం లెవీగా తీసుకునేది. నూతన లెవీ విధానం వల్ల మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో లెవీగా 25శాతం తీసుకోనున్నారు. కొత్త విధానం వల్ల రైతులకు, మిల్లర్లకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతుల నుంచి మిల్లర్లు ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలుచేయరు. దీంతో మద్దతు ధర లభించే అవకాశం లేదు. ప్రభుత్వ గోదాములు తక్కువగా ఉండటం వల్ల సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు. అటు మిల్లర్లు కొనుగోలు చేయక, ఇటు ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువ. లో టెక్నాలజీ ఉన్న మిల్లులు బియ్యం విక్రయించుకోవాలంటే నానా ఇబ్బందులు పడతారు. ఉత్తమ టెక్నాలజీ ఉన్న మిల్లుల్లో కూడా బియ్యం ఉత్పత్తి పెరగడం కూడా బహిరంగ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. రైతులకు, మిల్లులకు తీరని నష్టం కేంద్ర తెచ్చిన లెవీ విధానం వల్ల రైస్మిల్లర్లకు, రైతులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం 75 శాతం బియ్యాన్ని ప్రభుత్వం లెవీ రూపంలో మిల్లర్ల నుంచి కొనుగోలు చేసేది. ప్రస్తుతం 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీంతో మిల్లర్లు ఎక్కువగా నష్టపోతారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటే మిల్లర్ల వద్ద ప్రభుత్వం లెవీ రూపంలో తీసుకుంటేనే కుదురుతుంది. బియ్యానికి డిమాండ్ లేనప్పుడు, సరైన ధర మార్కెట్లో లభించదనుకున్న సమయంలో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం ఆశించిన మేరకు ఉండదు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించదు. డిమాండ్ ఉంటేనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడానికి మిల్లర్లు సిద్ధపడతారు. మిల్లులు కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. - గంపా నాగేందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
వరికి మించిన ‘మద్దతు'
దేవరకద్ర : ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను మించి ధాన్యం ధరలు పలుకుతున్నాయి. రబీ తరువాత వేసవి లో కత్తెర పంటకింద సాగుచేసిన రైతులు ప్రస్తుతం కోతలు చేసి పంట మార్పిడి త రువాత మార్కెట్కు వరి ధాన్యాన్ని పెద్దఎత్తున అమ్మకానికి తెస్తున్నారు. 10101 రకం వడ్లతో పాటు హంస వడ్లు మార్కెట్కు వస్తున్నాయి. గ్రేడ్ వన్గా ఉన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 1400 ఉండగా దేవరకద్ర మార్కెట్లో రూ. 1600కు పైగా ధర పలుకుతుంది. ఇక రెండో రకం వడ్లకు రూ. 1400కు పైగా ధరలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ప్రస్తుతం మందకొడిగా వ్యాపారం సాగుతున్నది. ప్రతి రోజు మూడు వందల నుంచి అయిదు వందల బస్తాల ధాన్యం అమ్మకానికి వస్తున్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీనికితోడు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తుండడంతో రైతులు వారికే ధాన్యం అమ్ముకుంటున్నారు. నేరుగా కొనుగోళ్లు.. మార్కెట్లో వ్యాపారులు నేరుగా రైతుల నుంచే కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. గతంలో కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని టెండర్ వేసి కొనుగోళ్లు చేసేవారు. ప్రస్తుతం బాయిల్డ్ రైస్మిల్లు యజమానులు మార్కెట్ వ్యాపారులు కావడంతో నేరుగా పోటిపడి ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. గోప్లాపూర, ఎలిగండ్ల సమీపంలో గత ఏడాది నుంచి బాయిల్డ్ రైస్ మిల్లులు ప్రారంభం అయిన తరువాత వ్యాపారులు నేరుగా మిల్లుల ద్వార ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. మద్దతు ధర కన్నా ఎక్కువ ఇవ్వడంతో పాటు హమాలీ కమీషన్ లేకుండా రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉండడంతో చాలామంది రైతులు మార్కెట్కు రాకుండా మిల్లులకు నేరుగా వెళ్తున్నారు. నాణ్యమైన దిగుబడి..... కత్తెర పంట కింద సాగుచేసిన వరి ధాన్యం నాణ్యమైన దిగుబడిగా ఉంటుందని అందుకే ధరలు అధికంగా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. క్వింటాల్ వడ్లకు బియ్యం శాతం అధికంగా వస్తుందని అలాగే నూకల శాతం తక్కువగా ఉంటుందని అందుకే కత్తెర పంట కింద వచ్చే వడ్లను ఎంత ధరయినా చెల్లించడానికి వ్యాపారులు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్ పంటల కన్నా కత్తెర పంట కింద వచ్చే హంస వడ్లు నాణ్యంగా ఉంటాయని తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు.. రూ.125 కోట్లు
68 పీఏసీఎస్ల ద్వారా 100 కేంద్రాలు సొసైటీలకు రూ.3.12 కోట్ల ఆదాయం మక్కల కొనుగోలుతో మరో రూ.35 లక్షలు హన్మకొండ సిటీ : రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు వారి కొనుగోళ్లు సులువుగా పూర్తయేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, జీసీసీల ద్వారా ధాన్యం, మక్కల కొనుగోలుకు ఏర్పాటుచేస్తున్న కేంద్రాలతో రైతులకు లాభం చేకూరుతోంది. అంతేకాకుండా సంఘాలకు కూడా కమీషన్ రూపంలో ఆదాయం సమకూరుతోంది. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో.. జిల్లాలో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు ఉండగా ఈ రబీలో 68 సంఘాల ద్వారా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ఐకేపీల ద్వారా మరో 127 కేంద్రాలు, జీసీసీల ద్వారా 10 కేంద్రాలు కూ డా ఏర్పాటయ్యాయి. ఇందులో పీఏసీఎస్ కేంద్రాల్లో రూ.125 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా, కమీషన్ రూ పంలో సంఘాలకు రూ.3.12 కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా రూ.36.37 కోట్ల విలువైన మక్కలు కొనుగోలు చేయ గా, రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. 2011-2012 ఖరీ ఫ్ సీజన్లో 16 సహకార సంఘాల ద్వారా 22 కేంద్రాల్లో ధా న్యం కొనుగోలు చేపట్టా, ప్రతి సీజన్కు కేంద్రాల సంఖ్య పెంచుతున్న అధికారులు ప్రస్తుత రబీలో 100కు చేర్చారు. ఇదే తీరులో కొనుగోలు చేసిన ధాన్యం విలువు, సంఘాల ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇటు సంఘాలు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుండగా, మార్కెట్లు, వ్యాపారుల వద్దకు వెళ్లే ఇబ్బంది రైతులకు తప్పింది. అంతేకాకుండా నేరుగా అమ్ముకునే సౌకర్యం రావడంతో దళారుల దోపిడీ నుంచి బయటపడినట్లయింది. కాగా, ధాన్యం అమ్మిన రైతులకు సొమ్ము చెల్లించేందుకు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో డీసీఓ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల వివరాలు తెలుసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధా న్యం మిల్లులకు తరలింపు, ఆ తర్వాత రైతులకు డబ్బు చెల్లింపు వివరాలను పర్యవేక్షించారు. ఇబ్బందులను అధిగమిస్తే.. పీఏసీఎస్ల ద్వారా ధాన్యం, మక్కల కేంద్రాల ఏర్పాటుతో ఇరువర్గాలకు లాభం చేకూరుతున్నా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఖరీఫ్ నాటిని ఆ ఇబ్బందులను సమీక్షించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మరింత పెద్దమొత్తంలో కొనుగోళ్లు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. వర్షాకాలంలో పంట దిగుబడులు వస్తున్నందున ధాన్యం ఆరబెట్టడానికి కల్లాల నిర్మాణం, సరుకు నిల్వ చేసేందుకు గోదాం లు నిర్మించాల్సిన అవసరముంది. నాబార్డు సాయంతో ఇప్పటికే కొన్ని సహకార సంఘాల పరిధిలో గోదాంలు నిర్మిస్తున్నా, అన్ని సంఘాలకు దీన్ని విస్తరిస్తే ధాన్యం నిల్వ చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లాలు, గోదాంల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఇప్పటి నుంచే పనులు ప్రారంభిస్తే సీజన్ ముగిసే నాటికి అం దుబాటులోకి వస్తాయని ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. సొసైటీలను రైతులకు చేరువ చేశాం... ధాన్యం, మక్కల కొనుగోలు ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను రైతులకు మరింత చేరువ చేశాం. రైతులకు మద్దతు ధర లభించడమే కాకుండా మోసాల నుంచి బయటపడ్డారు. అరువుకు ధాన్యం ఇచ్చి వ్యాపారుల చుట్టూ తిరగాల్సి రావడం, దళారుల దోపిడీ వంటివి తప్పాయి. అయి తే, ప్రస్తుతం ఎదురైన కొన్ని ఇబ్బందులను వచ్చే ఖరీఫ్కు అధిగమిస్తాం. - సంజీవరెడ్డి, జిల్లా సహకార అధికారి -
ధాన్యం..దైన్యం
- ధాన్యం కొనేనాథుడు కరువు - మళ్లీ పెట్టుబడులు లేక అవస్థలు - రుణ మాఫీపై స్పష్టతేదీ పంట చేతికందే దాకా రైతుకు ఒక రకమైన శ్రమ.. తీరా ధాన్యపు రాశులు ఇంటికి చేరాక వాటిని అమ్ముకోవడం అన్నదాతకు పెద్ద పనవుతోంది. కష్టించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ధాన్యాన్ని పురుల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలో సరైన ధర లేక ధాన్యపు నిల్వలు పేరుకుపోయాయి. కారంచేడు: అన్నదాతలు వరిసాగంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన వరిధాన్యంను పురులు కట్టుకొని గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో కొంత కాలం ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే వారు లేక నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని కారంచేడు, స్వర్ణ, కుంకలమర్రు, ఆదిపూడి, రంగప్పనాయుడువారిపాలెం, స్వర్ణపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. మండలంలో మొత్తం 40 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 15 వేల ఎకరాలు ఖరీఫ్లో, 10 వేల ఎకరాలు రబీలో వరి సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో కారంచేడు మండలంలోనే వరి ఎక్కువగా సాగవుతుంది. గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన వరదలతో వేసిన పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో నాట్లు ఆలస్యంగా వేశారు. అష్ట కష్టాలు పడి పండించిన పంటలను ఇళ్ల ముంగిట పెట్టుకొని కొనే వారి కోసం దైన్యంగా ఎదురు చూస్తున్నారు. కొనేనాథుడే కరువయ్యాడు.. - మండలంలో ఏటా సుమారు 8 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండిస్తుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 98 శాతం ధాన్యం రైతుల ముంగిట పురుల్లో మూలుగుతోంది. - ఈ ప్రాంతంలో 92 రకం, 2270 రకం, జీలకర రకం ధాన్యం సాగు చేస్తుంటారు. - 92, 2270 రకం ధాన్యం క్వింటా రూ.1200-రూ.1300 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. జిలకర రకం ధాన్యం క్వింటా 1050-రూ.1100 మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం అవి కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. - మళ్లీ సాగు సీజన్ ప్రారంభం కావడంతో వాటికి అవసరమైన పెట్టుబడులకు సన్న, చిన్నకారు రైతులతో పాటు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. - కౌలు ఎకరానికి 18-20 వేలు వరకు ఉంది. వీటిలో ఎక్కువ మంది డబ్బు కౌలుకే మొగ్గు చూపడంతో కౌలు రైతులు అప్పులు చేసి కౌలు కట్టుకున్నారు. ఇవి కాకుండా దుక్కులు, విత్తనాలు, ఎరువులకు అవసరమైన పెట్టుబడులకు అవసరమైన డబ్బు కోసం నానా అవస్థలు పడుతున్నారు. రుణమాఫీపై స్పష్టత లేదు.. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకా దానిపై ఏ విధమైన ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న అన్నదాతలు రుణమాఫీలు చేస్తారా.. లేదా, ఒకవేళ చేసినా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు అనే సందిగ్ధంలో ఉన్నారు. మళ్లీ అప్పుల కోసం బ్యాంకులకు ఎలా వెళ్లాలి, వెళ్తే ముందు తీసుకున్న రుణాలు చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తే పరిస్థితి ఏంటని అన్నదాతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మళ్లీ సాగు ప్రశ్నార్థకమేనని రైతులంటున్నారు. -
మిల్లర్లతో మిలాఖత్?
తనిఖీలు చాలు.. వచ్చేయండి! అధికారులకు బాస్ల ఫోన్? రైస్మిల్లుల్లో ఆగిన తనిఖీలు మధ్యలోనే వెళ్లిపోయిన వైనం ఇక నోటీసులిచ్చి ఏం ప్రయోజనం? జమ్మికుంట :ధాన్యం రైతులకు మద్దతు ధర చెల్లించని మిల్లర్లకు నోటీసులిచ్చి.. తనిఖీలు మొదలుపెట్టిన విజిలెన్స్ అధికారులకు ఏమైందో ఏమో గానీ... కాసేపటికే ఆపేశారు. అధికారుల నోటీసులతో తమకు మద్దతు ధర దక్కుతుందని ఆశించిన రైతన్నలకు దీంతో నిరాశే మిగిలింది. ఉన్నతాధికారుల ఫోన్తో అధికారులు ఆగమేఘాలమీద వెనుదిరగగా నోటీసులు ఇక చెత్తబుట్టలకే పరిమితం కానున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మిల్లర్లు కూడా కొనుగోలు చేశారు. మద్దతు ధర గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాల్కు రూ.1,345 ఉండగా వ్యాపారులు రూ.1,150 నుంచి రూ.1,200 దాకా, మగ ధాన్యానికి క్వింటాల్కు రూ.1,310 ఉండగా మిల్లర్లు రూ.850 నుంచి రూ.950 మాత్రమే చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లయ్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టగా... తమకు మద్దతు ధర దక్కడం లేదని చాలా మంది రైతులు వెల్లడించారు. రైతులు చెప్పిన వివరాల మేరకు రూపొందించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు జమ్మికుంటలోని ఏడు మిల్లులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా విజిలెన్స్ అధికారులు మూడు మిల్లుల్లో సోదాలు మొదలుపెట్టారు. ఒక్కో మిల్లులో వేలాది క్వింటాళ్ల నిల్వలుండగా తనిఖీ చేసేందుకు ఒక రోజు సమయం పట్టే అవకాశముంది. కానీ, అధికారులు కేవలం రెండు గంటల్లోనే మూడు మిల్లులు తనిఖీ చేసి అర్ధంతరంగా వెనుదిరిగారు. తనిఖీలు మొదలుపెట్టగానే మిల్లుల్లో ఉన్న అక్రమ నిల్వలు, నేరుగా కొనుగోళ్లు చేపట్టిన వివరాలు, రికార్డుల్లోకి ఎక్కని ధాన్యం, రైతుల వద్ద తక్కువ ధరతో సేకరించిన ధాన్యం గుట్టు బయటపడుతుందనే భయంతో కొందరు వ్యాపారులు ఓ ముఖ్యనాయకుడితో తనిఖీలు ఆపేలా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సదరు నాయకుడినుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లగా.. మిల్లుల్లో అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు తయారు చేయాలని వారు తనిఖీ అధికారులకు ఫోన్లోనే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం మూడు మిల్లుల్లోనే రెండు గంటల్లో తనిఖీలు చేపట్టి వెనుదిరిగారనే ప్రచారం జరుగుతోంది. అధికారుల తనిఖీలతో తమకు మద్దతు ధర చెల్లిస్తారని ఆశించిన రైతులు తీవ్ర నిరాశ చెందారు. అసలు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లకు నోటీసులు ఎందుకు జారీ చేశారు? వీటి వెనుక మర్మమేమిటి? తనిఖీలు లేకుండా అక్రమ నిల్వలను ఎలా గుర్తిస్తారు? తనిఖీలు అర్ధంతరంగా నిలిపేసి ఎందుకు వెనుదిరిగినట్లు? అనేది అంతుచిక్కడం లేదు. -
అద్భుత వరి వంగడాల రూపశిల్పి
జ్ఞానభాండాగారాలను తల దిండుగా పెట్టుకొని పెరిగిన వారు విసిరేసిన వెలివాడలో పుట్టిన మట్టి మనిషి దాదాజీ రాంజీ ఖోబ్రగడే. బతుకు మట్టికొట్టుకుపోయినా మట్టిని నమ్ముకొనే బతికిన వెలివాడ దళిత రైతు. మట్టి మీద ఆయనకున్న మమకారం అద్భుత ఆవిష్కరణలకు కారణమైంది. ఆ కృషి ఫలితమే ఇప్పుడు యావత్తు ఉత్తరాది కంచాల్లో వెదజల్లిన విరజాజి మొగ్గల్లా పరుచుకున్న అన్నం మెతుకులు. అవి ఖోబ్రగడే సృష్టించిన హెచ్ఎంటీ రకం బియ్యపు మెతుకులే. విదర్భలోని నాందేడ్ జిల్లా చండీపూర్ తాలుకాలోని నాగ్బీడ్ ఓ మారుమూల కుగ్రామం. దాదాజీ ఆవిష్కరించిన హెచ్ఎంటి ధాన్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. మూడో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన దాదాజీ ఖోబ్రగడేకు శాస్త్ర పరిజ్ఞానం లేనప్పటికీ.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని పరిశీలించి చూడడం అలవాటు. నారుపోశామా, నాటేశామా, కోసి నూర్చి, మండీకి తోలామా.. అనే విధానం కాదు ఆయనది. మనస్ఫూర్తిగా నిమగ్నమై పని చేయడం ఆయనకు అలవాటు. దాదాపు 30 ఏళ్ల కిందటి మాట. ఉన్న ఎకరంన్నర పొలంలో ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పటేల్-3 రకం వరి సాగు చేశాడు. జబల్పూర్లోని జేఎన్కేవి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ జేపి పటేల్ ఈ రకాన్ని అభివృద్ధి చేశాడు. పొలంలో వేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకునే దాదాజీ పంటపొలంలో ప్రతి అడుగును పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఓ మడి మూలన మూడు వరి వెన్నులు మిగతా చేనుకు భిన్నంగా కనిపించాయి. వెంటనే వెన్నులకు గుర్తులు పెట్టి ప్రత్యేకంగా కోసి నూర్చాడు. ఆ గింజలను భద్రంగా దాచి మరుసటి సంవత్సరం పంట సమయంలో ప్రత్యేకంగా నాటేసి అడవి జంతువుల పాలు కాకుండా చుట్టూ కంచెవేశాడు. ఈసారి వచ్చిన దిగుబడిని మరోమారు జాగ్రత్తగా తిరిగి సాగు చేశాడు. కొత్తవిత్తనం సంరక్షణ ప్రస్థానం సాగుతూ 1988 నాటికి నాలుగున్నర క్వింటాళ్ల విత్తనం చేతికి వచ్చింది. బియ్యం మరపట్టించి చూడగా 80 శాతం బియ్యం దిగుబడి వచ్చింది. పటేల్ రకంతో పోలిస్తే అన్నం నాణ్యంగా, రుచికరంగా ఉంది. తన పంట గొప్పతనం గుర్తించిన దాదాజీ ఖోబ్రగడే ఈసారి 150 కిలోల ధాన్యాన్ని విత్తాడు. దాదాజీ ఆశలు ఫలించి 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. 1990లో దాదాజీ వద్ద విత్తనం తీసుకున్న బీమ్రావ్ షిండే అనే భూస్వామి నాలుగెకరాల్లో సాగు చేశాడు. ఆచేత, ఈచేత చుట్టుపక్కల రైతులకు చేరిన ఈ విత్తనం ఆ ప్రాంతంలో చాలా విస్తీర్ణంలో సాగైంది. మార్కెట్లో కొత్త రకం మేలిమి ధాన్యం రాశులుగా పోగుపడగా వ్యాపారులు ఆనందం వ్యకం చేశారు. తలోడి మార్కెట్ వ్యాపారి ఒకడు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి దానికి ఆనాటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న హెచ్ఎంటి గడియారం స్ఫూర్తితో హెచ్ఎంటీ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్లలో ఇది సాగవుతోంది. అసలు కథ అప్పుడు మొదలయింది. కోబ్రాగడే ఘనతను చూసి కొందరు పెద్దమనుషులకు కన్నుకుట్టింది. ఓ దళిత రైతు విత్తనాన్ని రూపొందించడం వారికి నచ్చలేదు. అతనికి అందుతున్న ఖ్యాతిని కాజేయాలని ‘ఈనగాచిన చేను నక్కలు నమిలేసినట్లు’ నిరుపేద దళిత రైతు కష్టఫలితాన్ని కొల్లగొట్టడానికి కుట్రచేశారు. హెచ్ఎంటీ ధాన్యానికి ముందు ఒక తోక తగిలించి పీకేవి హెచ్ఎంటీగా పేరు పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రిక ప్రతినిధి ఈ కుట్రను బట్టబయలు చేయడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఖోబ్రగడేకు మద్దతుగా ముందుకొచ్చాయి. న్యాయపోరాటంతో పాటు, శాస్త్రీయ పరీక్షలు జరిపించి నిజాన్ని నిగ్గుతేల్చగా హెచ్ఎంటీ, పెద్ద మనుషులు చెలామణిలోకి తెచ్చిన హెచ్ఎంటీకి ఎలాంటి తేడాలేదని తేలిపోయింది. హైద్రాబాద్ నగరంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు రెండు వంగడాల జన్యుపటాలను చిత్రించగా ఎలాంటి తేడాలు లేవని వెల్లడయింది. ఈ విషయం నాగ్పూర్లోని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్కు తెలియపర్చింది. ఎన్ఐఎఫ్ దాదాజీ రాంజీ ఖోబ్రగడే కృషిని గుర్తించి 2005లో జాతీయ పురస్కారం ఇచ్చి గౌరవించింది. దాదాజీ విత్తనాభివృద్ధి ప్రస్థానం హెచ్ఎంటీతో ఆగిపోలేదు. 1987లో మరో రకం ధాన్యానికి ఊపిరి పోసి.. దానికి తన మనవడు నాందేడ్ చిన్నూర్ పేరు పెట్టారు. 1994లో నాందేడ్ హీరా, 1996లో విజయ్ నాందేడ్, 1997లో దీపక్ రత్న రకాలను సృష్టించి మనుమల పేర్లు పెట్టాడు. 1998లో తన పేరుతోనే డీఆర్కె (దాదాజీ రాంజీ ఖోబ్రగడే) రకాన్ని సృష్టించాడు. 2002లో కాటే హెచ్ఎంటీ, 2003లో డీఆర్కె సుగంధి రకానికి ఊపిరి పోశాడు. దాదాజీ మొత్తం 9 రకాల వరి వంగడాలను సృష్టించాడు. ఇందులో హెచ్ఎంటీ రకం ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో 2.5 లక్షల హెక్టార్లలో సాగవుతున్నదంటే.. దాని గొప్పదనం అర్థమౌతుంది. మన్నులోంచి అన్నం తీసే రైతన్నల ఆశలకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని అందించిన ఖోబ్రగడేని కుల వివక్ష అణగదొక్కిందని మహారాష్ట్రలో అనేక మంది మేథావులు విమర్శించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కుట్రను తూర్పారబట్టాయి. రైతు క్షేత్ర స్థాయి పరిజ్ఞానానికి శాస్త్ర,సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే కొత్త ఆలోచనలకు ఊపిరిపోసి వెనవేల సృజనలు చేయగలరని దాదాజీ రాంజీ ఖోబ్రగడే నిరూపించాడు. విత్తనాలకు: ఖోబ్రగడే వరి వంగడాలను సికింద్రాబాద్లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనేక విత్తనోత్పత్తి సహకార సంఘాల ద్వారా రబీ నాటికి రైతులకు అందుబాటులోకి తెస్తోంది. రైతులు డా. రాజశేఖర్(7386145368)కు ఫోన్ చేసి రిజర్వు చేసుకోవచ్చు. ఖోబ్రగడేను 09767290201 నంబరులో సంప్రదించవచ్చు. - జిట్టా బాల్రెడ్డి, సాగుబడి డెస్క్ -
కొందామంటే..
సాక్షి, ఏలూరు : ఏటా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోంది. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ధాన్యానికి సంబంధించిన సొమ్ము చెల్లించటంలో అధికారులు జాప్యం చేయడం దీనికి బలం చేకూ రుస్తోంది. సకాలంలో సొమ్ము చెల్లించకపోవడం వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్న ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలుకు ముందుకు రావటం లేదు. దీంతో ఈ కేంద్రాల ఏర్పాటు లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలోని 35 మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 58 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 5 మండలాల్లోని 6 కేంద్రాల్లో మాత్ర మే కొనుగోళ్లు జరిగాయి. బకాయిలు చెల్లిస్తే తప్ప ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు చేయలేమని ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. రైతులకు బకాయిపడ్డ సొమ్ము వెంటనే చెల్లించాలని కేంద్రాల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న గ్రామ సంఘాల సభ్యులు అధికారులను కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి నెలన్నర దాటినా సొమ్ము చెల్లించకపోవడంతో తమపై రైతులు తీవ్రంగా వత్తిడి తెస్తున్నారని వారు చెబుతున్నారు. సొమ్ము రావటానికి మరో 15 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారని సభ్యులు వాపోతున్నారు. ఐకేపీ కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు రాకపోవడంతోరైతులు కమిషన్దారులను ఆశ్రయిస్తున్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటమే కానీ సేక రణలో విఫలమవుతూనే ఉన్నాయి. 2012 ఖరీఫ్లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారు. దిగుబడి అంచనా 11.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా లక్షా 35 వేల హెక్టార్లలో వరి పంట ‘నీలం’ తుపాను ధాటికి నీటిపాలైంది. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కోల్పోయారు. మిగిలిన ధాన్యాన్ని కొనేందుకు జిల్లాలో 72 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 28 కేంద్రాలు మాత్రం కేవలం 7వేల 301 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాయి. 2013 రబీలో లక్షా 68 వేల హెక్టార్లలో వరి పండించారు. ధాన్యం కొనుగోలుకు 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్పత్తి అంచనా 11.99 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నది కేవలం 108 మెట్రిక్ టన్నులే. 2013 ఖరీఫ్లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. 13 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అకాల వర్షాలకు దిగుబడి సగానికి పడిపోయింది. 80కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కేవలం 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది రబీలో జిల్లాలో ఇప్పటివరకూ రూ.3.36 కోట్ల విలువైన 22వేల 583 క్వింటాళ్ల ధాన్యం, రూ.1.36కోట్ల విలువైన 11వేల 958 క్వింటాళ్ల మొక్కజొన్న మాత్రమే కొనుగోలు చేశారు. ధాన్యం రైతులకు రూ.1.36 కోట్లు, మొక్కజొన్న రైతులకు రూ.80 లక్షలు మాత్రమే చెల్లించారు. రూ. 2.76 కోట్ల బకాయిలు ఉన్నాయి. సొమ్ము పౌరసరఫరాల శాఖ నుంచి రావాలి : డీఆర్డీఏ పీడీరైతులకు చెల్లించాల్సిన సొమ్ము పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సి ఉందని డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసరావు చెప్పారు. ఆ శాఖ నుంచి వచ్చిన వెంటనే బకాయిలు చెల్లిస్తామన్నారు. బకాయి సొమ్ము కోసం 40 రోజులుగా తిరుగుతున్నాం ఏప్రిల్ 24న కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశాం. ఇప్పటి వరకూ రూ.58 లక్షల 73వేల 561 విలువైన ధాన్యం సేకరించాం. ఇందులో మే నెల 27న కొంతసొమ్ముకు సరిపడా చెక్కులు ఇవ్వగా, ఇంకా రూ.34 లక్షల 73వేల 561 బకాయి ఉంది. బకాయి సొమ్ము కోసం ఏలూరులోని డీఆర్డీఏ కార్యాలయం చూట్టూ 40 రోజులుగా తిరుగుతున్నాం. అధికారులు మా కమిషన్ చెల్లింపులోను అలక్ష్యం వహిస్తున్నారు. గత రబీ సీజన్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ధాన్యం సేకరించాం. -లింగాల కాంతమ్మ, గ్రామసంఘం-1 అధ్యక్షురాలు, రాజవరం, కొయ్యలగూడెం మండలం -
గోదాములు ఫుల్
నల్లగొండ, న్యూస్లైన్ :జిల్లాలో వెల్లువెత్తిన ధాన్యం దిగుబడులు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ), పౌరసరఫరాల సంస్థ గుండెల్లో గుబులు రెకేత్తిస్తున్నాయి. అధికార యంత్రాంగం ముందుచూపు లేకపోవడం.. నేడు అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. జిల్లాలో 25.84 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులో ఉన్నా, వాటిల్లో సామర్థ్యానికి మించి బియ్యం, గోధుమల నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యం, ఈ సీజన్లో సేకరించాల్సిన లేవీ బియ్యం దాచేందుకు గోదాముల్లో అంగుళం స్థలం కూడా ఖాళీ లేదు. 2013-14కు గాను మిల్లర్ల నుంచి 8 లక్షల టన్నుల లేవీ బియ్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల టన్నులు పూర్తయ్యాయి. ఇవిగాక రబీ సీజన్లో పౌర సరఫరాల సంస్థ 3.58 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇంత పెద్దమొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడంతో వాటిని నిల్వ ఉంచేం దుకు మిల్లర్ల వద్ద కూడా స్థలం లేకుండా పోయింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి 2.50లక్షల టన్నుల బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించాల్సి ఉంది. లేవీ, కస్టమ్ మిల్లింగ్ కలిపి మొత్తం 6.50లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి సేకరించి గోదాముల్లో నిల్వ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే గోదాముల్లో బియ్యం, గోధుమల నిల్వలుపేరుకుపోవడంతో సివిల్ సప్లయీస్, ఎఫ్సీఐ సంస్థలు బిక్కమొహం వేస్తున్నాయి. గోదాముల్లో పరిస్థితి ఇదీ.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 16 గోదాములు ఉన్నాయి. వీటిలో 25.84 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికిగానూ ఏకంగా 29.47 లక్షల టన్నుల ధాన్యాన్ని, గోధుమలను నిల్వ చేశారు. ఇంకా స్థలం చాలకపోవడంతో గోదాముల వెలుపల 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు ఖాళీ ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా గోధుములు 34,469 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ఇదిలా ఉంటే ప్రతిరోజూ ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి (కస్టమ్ మిల్లింగ్) గోదాములకే తరలిస్తున్నారు. దీంతో రోజుకు 8 నుంచి 9 లక్షల టన్నుల వరకు బియ్యం గోదాములకు వచ్చి చేరుతోంది. రేక్ల కోసం ఎదురుచూపులు... జిల్లాలో నిల్వలను తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలకు తరలించేందుకు దక్షిణమధ్య రైల్వే రేక్లను అనుకున్న విధంగా కేటాయించడం లేదు. వాస్తవానికి జిల్లాలోని లక్ష టన్నుల బియ్యాన్ని జూన్ మొదటి వారంలోనే పక్క రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా 12 రేక్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు నాలుగు రేక్ల ద్వారా కేవలం 13వేల టన్నులు మాత్రమే తరలించారు. అయితే గోదాముల్లో బియ్యం నిల్వలు తరలించేందుకు అదనంగా 20 రేక్లు కేటాయించాలని, దాంతోపాటు అదనంగా గోదాములు అద్దెకు తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఆమోదంతో పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. పై నుంచి రేక్లు కేటాయిస్తూ..అప్పటివరకు ప్రైవేటు గోదాములు అద్దెకు తీసుకునేందుకు వీలుగా అనుమతులు వస్తే తప్ప రబీ బియ్యం దాచే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా స్పందిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. -
3.20లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 3 లక్షల 20 వేల 176 మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. సోమవారం తన చాంబర్లో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 3 లక్షల 5 వేల 69 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామని ఇంకా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో నిల్వ ఉందన్నారు. ఈ ధాన్యాన్ని తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పాక్షికంగా తడిసిందని, ఈ తడిసిన ధాన్యాన్ని మానవతా దృక్పథంతో మిల్లుల యజమానులు అన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకు మిల్లర్ల సంఘం ప్రతినిధులు అంగీకరించారు. ఈ సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, పౌర సరఫరాల శాఖ డీఎం, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
సాగుబడి
ఈ వారం వ్యవసాయ సూచనలు ధాన్యం నిల్వలో మెలకువలు మన రాష్ట్రంలో పండించే ఆహార ధాన్యాల లో 12-16 మిలియన్ టన్నుల ధాన్యాన్ని పంట కోసిన తర్వాత నష్టపోతున్నాం.వరి ధాన్యాన్ని నిల్వ చేసే ముందు గింజలో తేమ శాతం 14% ఉండే విధంగా చూసుకోవాలి. వేరుశనగ గింజల్లో తేమ 7% కన్నా తక్కువ ఉండేలా ఆరబెట్టాలి. నిల్వ ఉన్న పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపరాదు.గోదాముల్లో గతేడాది పంట తాలూకు మిగిలిన ధాన్యాన్ని తీసివేసి శుభ్రపరచుకోవాలి. ఒక లీటరు మలాథియాన్ మందును 100 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని గోదామంతా తడిచేలా పిచికారీ చేయాలి.పాత సంచులను వాడేటప్పుడు పాత ధాన్యం, క్రిమికీటకాలు లేకుండా వాటిని శుభ్రపరచి ఎండబెట్టాలి. వీలైనంత వరకు కొత్త సంచుల్లో ధాన్యం నిల్వ చేయాలి.ధాన్యం నింపిన బస్తాలను నేలకు, గోడలకు తగలకుండా, తేమలేని పొడి ప్రదేశంలో చెక్క బల్లల మీద నిల్వ చేయాలి. 100 కిలోల ధాన్యానికి, 2 కిలోల వేపగింజల పొడిని కలిపితే బియ్యపు చిలక తదితర పురుగులు ఆశించవు.గోదాములలోనికి తేమ చొరబడకుండా జాగ్రత్త వహించాలి.గోదాము నేలలు, గోడలు, పైకప్పులపై బీటలు లేకుండా చూడాలి.అపరాలను జనపనార సంచుల్లో గాని లేక పాలిథిన్ అమర్చిన గోనె సంచుల్లో గాని, నైలాన్ సంచుల్లో గాని నిలువ చేయాలి.గోదాముల్లో ఎలుక బోనులను ఉంచాలి. సంచుల్లోని గింజ వేడెక్కుతున్నదా, రంగు మారుతున్నదా, ముక్కవాసన వస్తున్నదా, బూజు పడుతున్నదా, అనే వివరాలను ప్రతి 15 రోజులకోసారి పరిశీలించి తగు చర్యలు చేపట్టాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
తూకం మాయ
మిల్లర్ల ఎత్తులకు ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ధాన్యం కొనుగోలు నిర్వాహకులు, రైతులు చిత్తవుతున్నారు. తూకాల్లో మిల్లర్లు పెద్దఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్కో లోడ్ లారీలో పెద్దఎత్తున తూకంలో కోత పెట్టి అక్రమంగా జేబులు నింపుకుంటున్నారు. ఫలితంగా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ మాట దేవుడెరుగు మరింత నష్టం వాటిల్లుతోంది. సాక్షి, నల్లగొండ: ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, గ్రామ సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులు రబీలో వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అందుకు తగ్గట్లుగా ధాన్యం దిగుబడి పెద్ద ఎత్తున వస్తోంది. ధాన్యాన్ని రైతులు తమకు అందుబాటులో ఉన్న ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ఇలా పోగైన ధాన్యాన్ని ఐకేపీ నిర్వాహకులు ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలిస్తుంటారు. అయితే ఇలా తీసుకెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు తూకం వేసుకుని ధాన్యాన్ని దింపుకుంటారు. ఇక్కడే కిటుకు.... ఐకేపీ కేంద్రం నుంచి లారీలో వెళ్లిన ధాన్యం బరువుకు.. మిల్లుల వద్ద చేసే తూకానికి పొంతన కుదర డం లేదు. తీసుకెళ్లిన ధాన్యం కంటే.. మిల్లులకు చేరుకున్న ధాన్యంలో తరుగుదల కనిపిస్తోంది. ఒక్కో లారీ లోడ్కు దాదాపు 3 క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువగా తూకం వేస్తూ మిల్లర్లు ఐకేపీ కేంద్రాలను నిలువునా మోసం చేస్తున్నారు. ఇప్పటికే తాలు, తరుగు పేరిట మాత్రమే కోత విధిస్తున్నారని అనుకున్నాం. కానీ తూకాల్లోనూ అవకతవకలు పాల్పడుతూ అక్రమంగా జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో లారీ లోడ్కు దాదాపు 3 క్వింటాళ్ల వరకు తక్కువగా తూకం వేస్తున్నారు. ఒక్కో క్వింటా ధాన్యం ధర రూ. 1345. ఈ లెక్కన మూడు క్వింటాళ్లకు కలుపుకుంటే రూ.4035లు నిర్వాహకులు నష్టపోతున్నారు. గోనె సంచులపైనా కోత... ఒక్కో గోనెసంచి బరువు ఇంచుమించు 650 గ్రాములు ఉంటుంది. ఇదే పరిమాణాన్ని మిల్లర్లు పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఒక్కో గోనెసంచి బరువు 800 గ్రాములుగా లెక్కించి తరుగు తీస్తున్నారు. ఒక్కో లారీలో 500 వరకు ధాన్యం బస్తాలు లోడ్ చేస్తారు. ఇలా ప్రతి సంచికి 150 గ్రాములు అదనంగా కోత విధించడం వల్ల కూడా ఐకేపీ నిర్వాహకులు నష్టపోతున్నారు. రోజుకు వేల బస్తా లు మిల్లుల వ ద్దకు వెళ్తుంటాయి. వీటన్నిం టినీ లెక్కిస్తే నష్టం కూడా పెద్దఎత్తునే ఉం టుంది. ఇలా అన్ని రకాలుగా ఐకేపీ నిర్వాహకులను మిల్లర్లు మోసం చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే అధికారులు దాడులు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే కొనుగోళ్లు న్యాయబద్ధంగా జరుగుతాయని ఐకేపీ నిర్వాహకులు కోరుతున్నారు. -
ధాన్యం కొనుగోలుకు 617 కేంద్రాలు
కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కరీంనగర్, న్యూస్లైన్ : రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు జిల్లాలో 617 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో జిల్లాలో 13.41మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశామని అన్నారు. అందులో సుమారు 5లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ సంస్థలతో కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 311 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 303 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 3 గిరిజన కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీబ్యాగ్లు, అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. జిల్లాలోని ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైస్మిల్లర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని రవాణా చేసేందుకు 262 రైస్ మిల్లులను ఎంపిక చేసి అనుసంధానం చేసినట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకుండా ధాన్యం కొనుగోలు చే సే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా సరఫరా అధికారి చంద్రప్రకాశ్, డెప్యూటీ రవాణా అధికారి మీరాప్రసాద్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
అకాల వర్షం..రైతన్నకు శాపం
జిల్లావ్యాప్తంగా శనివారం కురిసిన అకాల వర్షం రైతుల ఆశల్ని చిదిమేసింది. పలుచోట్ల పంటలు నీటి మునిగాయి. ఈన గాచిన పాలు నక్కల పాలు చందంగా రైతుల శ్రమ వర్షార్పణమైంది. ఆరుగాలం శ్రమించి, కంటికి రెప్పలా సాగిన పంట కళ్లముందే తడిచిపోవడంతో కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ధాన్యం రాశులు, పనలపై ఉన్న వరిని, మొక్కజొన్నకు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. మచిలీపట్నం, న్యూస్లైన్ : అకాల వర్షం రైతులను నిట్టనిలువునా ముంచింది. ఈ రబీ సీజన్లో జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. ప్రస్తుతం వరి కోత, కుప్పనూర్పిడిలు, పనల దశలో ఉంది. మరో పది రోజుల వ్యవధిలో కోతలు పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో శనివారం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో భారీ వర్షమే కురిసింది. ధాన్యం రాశులు, పనలపై ఉన్న వరిని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తీరప్రాంతంలోని మండలాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురవటంతో చేతికొచ్చే దశలో ఉన్న పంట వర్షానికి తడిచిపోయిందని వాపోతున్నారు. కల్లాల్లో తడిచిన పంట వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రైతులు యంత్రాల ద్వారా కోత కోసినా ప్రయోజనం లేకపోయింది. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అధికశాతం రైతులు పొలాల్లోనే రాశులుగా పోసి ఉంచారు. ఊహించని విధంగా వర్షం కురవటంతో తడిసి ముద్దయ్యాయి. జిల్లావ్యాప్తంగా 70వేల ఎకరాల్లో వరి కోత కోసి పనలపై ఉంది. మరో 50వేల ఎకరాల్లో ధాన్యం కోత పూర్తయిన అనంతరం రాశులపై ఉంది. అకాల వర్షం ధాటికి పనలపై ఉన్న వరి, రాశులుగా ఉన్న ధాన్యం తడిచిపోవటంతో రబీ సీజన్లో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రబీ సీజన్లో ఎంటీయు-1010 రకం అధికంగా సాగుచేశారని ఒకమోస్తరు వర్షానికి ఈ రకం ధాన్యం మొలకెత్తే గుణం అంతగా ఉండదని, నష్టం తక్కువగానే ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వర్షం వల్ల జరిగిన నష్టాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నాట్లు ఆలస్యంతోనే నష్టం నాట్లు ఆలస్యం కావడంతోనే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్కు జనవరిలో సాగునీటిని విడుదల చేశారని, దీంతో ఫిబ్రవరిలో నాట్లు పూర్తి చేయటంతో మే నెలలో కోతలు కోయాల్సి వస్తోందని చెబుతున్నారు. నెల రోజులు పంట ఆలస్యం కావటంతో వర్షాలకు పంట కోల్పోయే ప్రమాదంలో పడ్డామని అంటున్నారు. మొలకెత్తనున్న మొక్కజొన్న జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో దాదాపు 65 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. పలుచోట్ల కోత, రాశులపైనా ఉంది. అకాల వర్షం కురవటంతో అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి తదితర మండలాల్లో రాశులపై ఉన్న మొక్కజొన్న తడిచి మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. మిల్లర్ల ఇష్టారాజ్యం అకాల వర్షంతో ధాన్యం తడిచిపోయింది కాబట్టి ధర తగ్గిపోతుందని మిల్లర్లు కొత్త పల్లవి అందుకున్నారు. వర్షం కురిసి 10 గంటలైనా కాకముందే మిల్లర్లు ఈ తరహా ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అకాల వర్షాలకు తడిచి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
దారుణంగా పడిపోయిన ధాన్యం ధర
ఎన్నికల మిషతో సొమ్ము చెల్లింపు వాయిదా ఖర్చులు గిట్టుబాటు కాక రైతుల ఆందోళన ప్రేక్షక పాత్ర వహిస్తున్న మార్కెటింగ్ శాఖ తిరువూరు, న్యూస్లైన్ : ఎన్నికల హడావుడిలో పడి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల గోడు పట్టించుకోవట్లేదు. దాళ్వా వరికోతలు చివరిదశకు చేరుతున్నా పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ఇష్టానుసారం ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలోని రెండు వ్యవసాయ సబ్డివిజన్లలో 20 వేల ఎకరాల్లో దాళ్వా సాగైంది. ఎకరాకు గరిష్టంగా 45 బస్తాల ధాన్యం దిగుబడి రావడంతో గత ఖరీఫ్ సీజన్లో ప్రకృతి అననుకూలతతో పంటనష్టం చవిచూసిన రైతాంగం ఈ దాళ్వా సీజన్లో తమ అప్పులు కొంతమేర తీరతాయని ఆశ పడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర లభించక పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, ధాన్యం వ్యాపారులు కొన్న ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లించలేమని, ఎన్నికల కారణంగా చెక్పోస్టులలో నగదు సీజ్ చేస్తున్నందున మే రెండోవారంలో సొమ్ము ఇస్తామని చెబుతుండటంతో గిట్టుబాటు ధర రాకపోగా అసలు సొమ్ములకే ఎసరు వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దారుణంగా పడిపోయిన ధరలు... దాళ్వా ధాన్యానికి ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రోజుకొక ధర నిర్ణయిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాలు ధర రూ.950 చొప్పున నిర్ణయించిన మిల్లర్లు ఇప్పుడు రూ.780కి మించి ఇవ్వలేమంటున్నారని రైతులు వాపోతున్నారు. యంత్రాలతో కోసిన వరి క్వింటాలుకు 17 కిలోల తరుగు వస్తున్నందున మద్దతు ధర వర్తించదని వ్యాపారులు చెబుతున్నారు. ఆరుదల ధాన్యానికి మాత్రమే 75 కిలోలకు రూ.1010 చొప్పున చెల్లిస్తున్నామని, దాళ్వా ధాన్యానికి ధర పలకట్లేదని వ్యాపార వర్గాలు కరాఖండిగా చెబుతుండటంతో గత్యంతరం లేక రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. కలెక్టరు దృష్టికి తీసుకెళ్లినా... దాళ్వా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఇటీవల తిరువూరు వచ్చిన జిల్లా కలెక్టర్ రఘునందన్రావు దృష్టికి పలువురు రైతులు తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తామని కలెక్టరు తెలిపినప్పటికీ ఇంతవరకు తదనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో దాళ్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అప్పు ఇచ్చిన వ్యాపారులు కల్లాల్లోనే ధాన్యాన్ని తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో తెగనమ్మవలసి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కనీసం గిట్టుబాటు ధర లభించేవరకు మార్కెట్ కమిటీ గోదాముల్లో రైతుబంధు పథకంపై రైతుల ధాన్యాన్ని నిల్వ చేసుకునే సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. -
పెరిగిన ధాన్యం, బియ్యం ధరలు
నిజామాబాద్ బిజినెస్/ మోర్తాడ్, న్యూస్లైన్ : జిల్లాలో 15 రోజుల క్రితం బీపీటీ ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1,400 నుం చి రూ. 1,500 పలికింది. దాదాపుగా ధాన్యం రైతుల వద్దనుంచి దళారులు, మిల్లర్ల వద్దకు చేరిపోయింది. దీంతో ధాన్యం ధర పెరుగుతోంది. ప్రస్తుతం బీపీటీ ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1,700 నుంచి రూ. 1,800 పలుకుతోంది. హెచ్ఎంటీ ధాన్యం ధర రూ.1,700ల నుంచి రూ. 2 వేలకు చేరింది. జైశ్రీరాం రకం ధాన్యం ధర రూ. 2 వేలనుంచి రూ. 2,300లకు పెరిగింది. కాగా దొడ్డురకం ధాన్యం ధర రూ. 1,300 ఉండగా ఇప్పుడు రూ. 1,400 లభిస్తోంది. దీంతో బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి. పదిహేను రోజుల క్రితం బీపీటీ పాత బియ్యం ధర క్వింటాలుకు రూ. 3,400 ఉండేది. కొత్త బియ్యం రూ. 2,400 నుంచి 2,700 మధ్య విక్రయించేవారు. ప్రస్తుతం ధరలు పెరిగాయి. పాత బియ్యం రూ. 3,800లుదాటింది. కొత్త బియ్యం రూ. 2,800 నుంచి రూ. 3వేల వరకు విక్రయిస్తున్నారు. హెచ్ఎంటీ ధర రూ. 2,800 నుంచి 3,200లకు చేరింది. జై శ్రీరాం రకం బియ్యం మార్కెట్లో క్వింటాలుకు 4 వేల రూపాయలు పలుకుతోంది. ధర తగ్గుతుందనుకుంటే.. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. పంటలు సైతం బాగానే పండాయి. దీంతో ఈసారి బియ్యం ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నెల క్రితం వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పండిన పంటను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తరలించారు. బీహార్, మధ్యప్రదేశ్ల నుంచి వరి ధాన్యం దిగుమతి కొనసాగుతున్నా.. ఆ ధాన్యాన్ని పట్టిస్తే నూక ఎక్కువగా వస్తుండడంతో ధర పెరుగుతోంది. ధాన్యాన్ని ముందుగానే విక్రయించిన రైతులు ఇప్పుడు పెరిగిన ధరను చూసి నిరాశ చెందుతున్నారు. ధర పెరగడం వల్ల రైతుల కంటే వ్యాపారులు, రైస్మిల్లర్లు ఎక్కువగా లాభపడుతున్నారని స్పష్టం అవుతోంది. కాగా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు నిల్వ చేసుకొని ధర పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో పంట చేతికి వస్తోందని, త్వరలో అక్కడినుంచి ధాన్యం దిగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధాన్యం దిగుమతి అయిన తర్వాత బియ్యం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో ఇష్టారాజ్యం
కడెం, న్యూస్లైన్ : రైతులను దళారుల బారి నుంచి కాపాడి.. ధాన్యానికి మద్దతు ధర దక్కేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నాడు. క్వింటాల్ ధాన్యంపై రెండున్నర కిలోల ధాన్యం కోతపడుతోంది. తేమ పేరిట సా గుతున్న ఈ అదనపు దందాను పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలో పాత మద్దిపడగ, కొత్త మద్దిపడగ, లింగాపూర్, దస్తురాబాద్, మున్యాల, బు ట్టాపూర్, పాండ్వాపూర్ గ్రామాల్లో 20 రోజుల క్రితం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తూ ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యంలో 17శాతం తేమ ఉంటే సరిపోతుంది. ఆ ధాన్యాన్ని అధికారికంగా కొనుగోలు చేయవచ్చు. కానీ తేమ పేరిట నిర్వాహకులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని, రైస్మిల్లులో తూకం వేస్తే బరువు తగ్గి నష్టపోతామని చెబుతూ.. 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తూకం వేస్తున్నారు. కాంటాలో 41 కిలోల బాట్లు వేసి 40 కిలోలుగానే పరిగణిస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్కు రెండున్నర కిలోల ధాన్యం అదనంగా నిర్వాహకులకు చేరుతోంది. రైతులు ఈ రెండున్నర కిలోలు నష్టపోవాల్సి వస్తోంది. మంగళవారం పెద్దూరు గ్రామానికి చెందిన రైతు జీల నాగరాజు 52 సంచుల ధాన్యాన్ని పాండ్వాపూర్లోని కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి తీసుకెళ్లాడు. తేమ శాతం సరిగ్గానే ఉన్నా 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తూకం వేశారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఇలా చేయాల్సి ఉన్నా అందరికీ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. దస్తురాబాద్లోని కేంద్రంలో ఖాళీ గన్నీ బ్యాగుపై తూకం రాళ్లు వేసి ఉంచుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూ కం విషయమై ఐకేపీ ఏపీఎం బుచ్చన్నను సంప్రదిం చగా.. కేంద్రాలను తనిఖీ చేస్తామని చెప్పారు. అదనంగా తూకం వేయడం సరికాదని, ఖాళీ సంచులు పెట్టి తూకం వేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లకు 167 కేంద్రాలు
కలెక్టరేట్, న్యూస్లైన్: ఖరీఫ్కు సంబంధించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆధార్ అనుసంధానం, నిత్యావసర సరుకుల పంపిణీ ఇతర అంశాలపై పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ రకం వరి ధాన్యం క్వింటాల్కు రూ.1,310, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ. 1,345లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలుకు ఐకేపీ ద్వారా 119 కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 48 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం మార్కెట్లోకి వస్తుందని ఆ ప్రకారం కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై స్వయం సహాయక సభ్యులకు పూర్తి స్థాయి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలకు అవసరమైన ప్యాడి, పవర్ క్లీనర్స్, మాయిశ్చరైజ్ మీటర్లు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె మార్కెటింగ్ శాఖ ఏడీకి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 72 గంటల్లోగా రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. రైతులు ఎదుర్కొనే సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.శరత్, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్రెడ్డి, డీఎస్ఓ ఏసు రత్నం, మార్కెటింగ్ ఏడీ నవీన్రెడ్డి, ఆర్డీఓలు ముత్యంరెడ్డి, వనజాదేవి తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్ల అక్రమాలకు చెక్!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: రైస్ మిల్లర్ల ఆధిపత్యానికి, అక్రమాలకు చెక్ పడనుంది. అందు కు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ అధికారులు లెవీ సేకరణలో నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొంత మంది మిల్లర్లు తమకున్న పలుకుబడిని అడ్డంగా పెట్టుకొని లెవీలో అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొందరు దొడ్డిదారిన బియ్యా న్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నూతన విధానంతో వాటికి చెక్ పడనుంది. ప్రతి మిల్లరు తాను కొనుగోలు చేసే ధాన్యంలో 75 శాతం లెవీకి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటా ప్రజా అవసరాల కోసం పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకూ జిల్లా యూ నిట్గా లెవీ సేకరణ చేస్తోంది. కొత్త విధానం ఈ అక్టోబర్ నుంచి అమలు కానుంది. ఈ మేర కు జీఓ నంబర్ 18ని జారీచేశారు. ఈ విధానం ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు కానుంది. 75 శాతం బియ్యం లెవీకి... ప్రతి రైస్మిల్లులో తయారైన బియ్యంలో 75 శాతం ప్రభుత్వానికి లెవీ రూపంలో అందించవలసి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నా...రైస్మిల్లుల యజ మానులు నిబంధనలను సక్రమంగా పాటించ డం లేదు. 60 నుంచి 70 శాతం మాత్రమే లెవీ ఇస్తున్నారు. నూతన విధానంతో తప్పని సరిగా 75 శాతం లెవీకి అందజేయాలి. జిల్లాలో 102 మిల్లులున్నాయి. వాటిలో మిల్లుల వారీగా ధాన్యం కొనుగోలు రికార్డులను సివిల్ సప్లయ్ అధికారులకు అందించవలసి ఉంది. రికార్డులను పరిశీలించి ధాన్యం కొనుగోళ్ల ఆధారంగా లెవీ లక్ష్యాన్ని నిర్ధారించి బియ్యం సేకరిస్తారు. ఈ నూతన విధానంతో ప్రతి మిల్లర్ తప్పనిసరిగా లక్ష్యం మేరకు లెవీకి బియ్యం ఇవ్వాలి. లెవీకి ఇస్తేనే పర్మిట్లు... ప్రతి రైస్మిల్లులో తయారైన బియ్యంలో 75శాతం లెవీకి ఇస్తే నే మిగతా 25 శాతం బియ్యం ఎగుమతులు చేసుకోవటానికి పౌరసరఫరాల శాఖ అనుమతులు ఇస్తుంది. గతంలో కూడా ఒకసారి ఇలాగే లెవీ సేకరణలో జిల్లా యూనిట్ విధానాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో సేకరణ వేగంగా జరిగింది. నూతన విధానంతో బియ్యం ఇవ్వని వారికి మాత్రమే పర్మిట్లు నిలిపి వేస్తారు. దీంతో అటు మిల్లర్లకు, ఇటు అధికారులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ లెవీ సేకరణ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి రావడం అక్టోబర్లోనే ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్ష్యాన్ని నిర్ణయిస్తున్నారు. 2012-13లో లక్షా 58 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించవలసి ఉండగా ఇప్పటి వరకూ లక్షా 40 వేల మెట్రిక్ టన్నులను సేకరించారు. ఏడు వేల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించవలసి ఉండగా నాలుగు వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి లెవీ నూరుశాతం పూర్తి కావలసి ఉంది. ఈ నూతన విధానం వల్ల మిల్లర్లందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంది.