
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పంచముఖ హనుమాన్ కాలనీలో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనా బారినపడి మృతి చెందారు. కరోనా లక్షణాలతో హోం క్వారంటెన్లో ఉన్న రాజేష్(35) అనే యువకుడు బాత్ రూమ్లో జారిపడి ఈ నెల 7న మృతి చెందాడు. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య గురువారం మృతి చెందింది. మరో వైపు మృతుడి కుమార్తె, తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది.
అంతేకాకుండా మృతుడి అంత్యక్రియలకు హాజరైన 6 మందికి కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో వెల్లడైంది. దీంతో రాజేష్ అంత్యక్రియలకు హాజరైన బంధువులు, స్నేహితుల్లో ఆందోళన మొదలైంది. కాగా. అంత్యక్రియలకు హాజరైన వారికి వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. అయితే కామారెడ్డిలో గతంలో కూడా ఓ వ్యాపారి ఇచ్చిన విందు ద్వారా ఐదుగురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. (కరోనా: తెలంగాణ హెల్త్ బులెటిన్)
Comments
Please login to add a commentAdd a comment