సంక్రాంతి కోసం ఖండాలు దాటొచ్చారు.. | Sankranti festival In Peddapalli | Sakshi
Sakshi News home page

సంక్రాంతి కోసం ఖండాలు దాటొచ్చారు..

Published Tue, Jan 16 2024 11:31 AM | Last Updated on Tue, Jan 16 2024 11:31 AM

Sankranti festival In Peddapalli - Sakshi

పెద్దపల్లిరూరల్‌: సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని బ్రిటన్‌ నుంచి పెద్దపల్లికి వచ్చారు దరియా–అరుణ్‌ దంపతులు. ఉద్యోగ నిమిత్తం బ్రిటన్‌ వెళ్లిన అరుణ్‌ అక్కడ పోలెండ్‌ దేశస్తురాలు దరియాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి పెద్దపల్లిలో ఉండే తల్లిదండ్రులు రాంరెడ్డి–రోహిణిల వద్దకు వచ్చాడు.

భోగి పండుగ రోజు ఆదివారం అత్త రోహిణి ముగ్గులు వేయగా, కోడలు దరియా వాటిపై గొబ్బెమ్మలను ఉంచింది. అనంతరం స్థానిక కోదండ రామాలయంలో గోదాదేవిరంగనాథులస్వామి కల్యాణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని తెలిపింది. కల్యాణోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఫొటోలు దిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement