పింఛన్ల కోత.. పండుటాకులకు వాత! | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల కోత.. పండుటాకులకు వాత!

Published Sat, Mar 1 2025 7:40 AM | Last Updated on Sat, Mar 1 2025 7:38 AM

పింఛన్ల కోత.. పండుటాకులకు వాత!

పింఛన్ల కోత.. పండుటాకులకు వాత!

9 నెలల్లో 8,722 పింఛన్ల తగ్గింపు

తిరుపతి అర్బన్‌: కూటమి ప్రభుత్వం అభాగ్యులు, దివ్యాంగులు, పండుటాకులతో చెడుగుడు ఆడుతోంది. బతుకు జీవనానికి చుక్కానిగా ఉన్న పింఛన్లకు కోత విధిస్తూ రోడ్డున పడేస్తోంది. కొత్తపింఛన్లు ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు తొలగించడం విమర్శలకు తావిస్తోంది. గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లా వ్యాప్తంగా 8,722 పింఛన్లను పక్కన పెట్టేసింది. గత ఫిబ్రవరిలో 2,63,191 మందికి పింఛన్లు ఇవ్వగా.. మార్చి నెల వచ్చేసరికి 2,62,461 మందికి పరిమితం చేసింది.

పింఛన్ల కోత ఇలా

నెల పింఛన్ల సంఖ్య

జూన్‌ 2,71,183

జూలై 2,69,162

ఆగస్ట్‌ 2,67,772

సెప్టెంబర్‌ 2,67,089

అక్టోబర్‌ 2,66,342

నవంబర్‌ 2,65,488

డిసెంబర్‌ 2,64,636

జనవరి 2,63,995

పిభ్రవరి 2,63,191

మార్చి 2,62,461

ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వండి

లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. శనివారం ఉదయం 7 నుంచే పింఛన్ల ప్రక్రియ మొదలు పెట్టాలి. మార్చి లో 2,62,461 మందికిగాను రూ.112.06 కోట్లు నగదు ఇవ్వాల్సి ఉంది. ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీఓలు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలి. –ఎస్‌.వెంకటేశ్వర్‌, కలెక్టర్‌, తిరుపతి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement