
లింకురోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి
చేవెళ్ల: పెండింగ్లో ఉన్న రేగడిఘనాపూర్–చనువెళ్లి లింక్రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి సూచించారు. మండలంలోని రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు రఘువీర్రెడ్డి కాలికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న చీఫ్ విప్ మహేందర్రెడ్డి ఆదివారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనను గ్రామ నాయకులు కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామం నుంచి చనువెళ్లి లింక్రోడ్డుకు మంత్రిగా ఉన్న సమయంలో రూ.80లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఆ పనులు ఆలస్యమవుతున్నాయని గ్రామస్తులు ఆయనకు తెలిపారు. వెంటనే ఆయన పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ రోడ్డుపై ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిధులు రిజెక్ట్ అయ్యాయని, మరోసారి ప్రతిపాధనలు పంపాలని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో మాట్లాడి మంత్రి శ్రీధర్బాబుతో చర్చించి ఈ ప్రాంతంలో ఇలా మిగిలిపోయిన బ్రిడ్జిలకు సంబంధించి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు శ్రీరామ్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి, చంద్రయ్య తదితరులు ఉన్నారు.
చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment