9న బిషప్ పట్టాభిషేక ఉత్సవం
కడప కల్చరల్ : ఆర్సీఎం నూతన బిషప్ పట్టాభిషేక ఉత్సవాన్ని ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కడప అపోస్తలిక పాలన అధికారి బిషప్ డాక్టర్ గాలి బాలి తెలిపారు. సోమవారం స్థానిక బిషప్ హౌస్లో వికర్ జనరల్ తలారి బాలరాజు అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బిషప్ గాలి బాలి మాట్లాడుతూ కడప మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ గ్రౌండ్లో నూతన బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ పట్టాభిషేక ఉత్సవం నిర్వహిస్తున్నామని, ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది బిషప్లు పాల్గొంటారన్నారు, అంతేకాకుండా ఢిల్లీ నుంచి కథోలిగా ముఖ్య ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఉత్సవం నాడు ఉదయం 8 గంటలకు మరియాపురంలోని పాత చర్చి నుంచి బిషప్ ఊరేగింపు ప్రారంభమై, బిల్డప్ మీదుగా సెయింట్ జోసఫ్ హైస్కూల్ వేదిక వద్దకు చేరుతుందని వివరించారు. జిల్లాలోని ప్రతి విచారణల నుండి కథోలిక విశ్వాసులు మహోత్సవానికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహోత్సవాన్ని క్రమశిక్షణ, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తామని, అందరూ భక్తి విశ్వాసాలతో పాల్గొని నూతన బిషప్ను సంపూర్ణ విశ్వాసంతో ఆహ్వానించి కార్యక్రమాన్నిజయప్రదం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment