సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం కార్మిక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికమంత్రిత్వ శాఖతో కలిసి కార్మికులకు బ్యాంకు ఖాతాల కోసం స్పెషల్ డ్రైవ్ ఈ (శనివారం) నుంచే మొదలు కానుంది. నవంబర్ 26, 2016 నుంచి ప్రత్యేక శిబిరాలద్వారా బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి జిల్లాలో నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ డ్రైవ్ ను నిర్వహించనుంచనుంది. డిజిటల్ లావాదేవీలను మరింత తీవ్రం చేసే యోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు.