Launch
-
సిల్వర్ జ్యువెలరీ ఆవిష్కరించిన సినీ నటి నిధి అగర్వాల్ (ఫోటోలు)
-
2025లో ది బెస్ట్ కారు?.. ఫీచర్లు తెలిస్తే షాకే!
-
ఖాజాగూడలో గ్రాండ్గా మంగళ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం (ఫోటోలు)
-
సుమ కనకాల తనయుడి కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
కడపలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
మలైకా అరోరా కొత్త రెస్టారెంట్.. లోపల ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో మరియు బ్రోచర్ ప్రారంభం
-
కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్లు
న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న ఆస్ట్రియన్ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్లో తన మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్లోని బజాజ్ ప్లాంటులో తయారైన బైక్స్ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్మోటార్సైకిల్ జీఎంబీహెచ్ ఆసియా, పసిఫిక్, మిడిల్–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ పెర్బెర్స్లాగర్ తెలిపారు.ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్లు లాంచ్కు రెడీఅమ్మకాలలో భారత్ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్లు ఎగుమతి అయ్యాయి.కొత్త బైక్లు ఇవే..అడ్వెంచర్ టూరర్ మోటార్సైకిల్ సెగ్మెంట్లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు). -
కో కో రెస్టారెంట్ : డింపుల్ హయతీ, హెబ్బా పటేల్ సందడి
ఫుడ్ హబ్గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్స్పాట్ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్ రెస్టారెంట్ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. #KoKo Restaurant Launch in #Hyderabad #dimplehayati pic.twitter.com/XUyCPnmWMt— Dimple Hayathi (Parody) (@hayathidimple) November 11, 2024ప్రారంభోత్సవంలో డింపుల్ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. -
'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గురుడి చందమామ యూరోపా..
“ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?”… అని ప్రశ్నిస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్రదేశాలను కనిపెట్టేదెలా?వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్రదేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేషించాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ భారత కాలమానం ప్రకారం ఈ నెల 14న రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది.నీరు-రసాయనాలు-శక్తి… ఈ మూడు వనరుల నెలవు!జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’ అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి.మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది.భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేషించాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’ యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15-25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60-150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట.గతంలో పయనీర్-10, పయనీర్-11, వోయేజర్-1, వోయేజర్-2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’ యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు).అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కల్పించే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’ సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’ పరిశోధిస్తుంది.క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న!గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు-భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి-గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు-గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’ తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది.అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’ గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’ తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది.రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది.యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు-ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్’ (జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది.- జమ్ముల శ్రీకాంత్ -
నిస్సాన్ మాగ్నైట్ మళ్లీ వచ్చేసింది.. సరికొత్తగా..
సరికొత్త రూపం సంతరించుకున్న నిస్సాన్ మాగ్నైట్ ఎట్టకేలకు భారత్లో విడుదలైంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది విసియా, విసియా ప్లస్, ఏసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే ఆరు వేరియంట్లలో, రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్ తొలిసారిగా 2020లో పరిచయమైంది. అప్పటి నుంచి కంపెనీలో ప్రధాన మోడల్ కారుగా ఉంటూ వచ్చింది. 2023 ఏప్రిల్లో ఈ మోడల్ను కంపెనీ నిలిపేసింది. ఎగుమతులతో కలుపుకొని మొత్తం 1.5 లక్షల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన లుక్తో ఉండే ఈ కారును మరింత ఆకర్షణీయంగా ఫేస్లిఫ్ట్ చేసి 2024 మోడల్గా కంపెనీ విడుదల చేసింది.తాజా నిస్సాన్ మాగ్నైట్ పాత ఫీచర్లతోనే వచ్చినప్పటికీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందుభాగంలో సరికొత్త ఫ్రంట్ బంపర్తోపాటు ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అలాగే ఆటోమెటిక్ ఎల్ఈడీ హెడ్లైట్లు బై ఫంక్షనల్ ప్రొజెక్టర్తో ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్లో ఉన్నాయి. వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన డీటైలింగ్, స్మోక్డ్ ఎఫెక్ట్తో ఇచ్చారు. రియర్ బంపర్ డిజైన్ కూడా మార్చారు.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ మొత్తానికి మార్చకుండా చిన్నపాటి మార్పులు చేశారు. లోపలవైపు లెదర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్లెస్ చార్జర్ సరికొత్త ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరోవైపు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
12 కి.మీ. అండర్గ్రౌండ్ జర్నీ!
వచ్చేనెలలో ముంబైలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనిలో ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో త్రీ ప్రాజెక్ట్ ఒకటి. ఇది ఆక్వా లైన్లోని మొదటి దశ. ఆరే కాలనీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య నడుస్తున్న 12 కిలోమీటర్ల మార్గానికి ఇది విస్తరణకానుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం థానే క్రీక్ వంతెనలోని ఒక భాగం, ముంబై నుండి నాగ్పూర్కు అనుసంధానించే సమృద్ధి ఎక్స్ప్రెస్వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. థానే రింగ్ మెట్రోకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముంబై మెట్రో కొత్త విస్తరణలో మొత్తం 10 స్టేషన్లు ఉండనున్నాయి. ఈ కారిడార్ పొడవు 33.5 కి.మీ. ఈ లైన్ పూర్తి కావడానికి 2025 మార్చి వరకూ సమయం పట్టనుంది.ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక దాదాపు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకునేందుకు ఈ మెట్రో ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ ఆక్వా లైన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. ఈ మార్గంలో నారిమన్ పాయింట్, ముంబై సెంట్రల్, వర్లీ, దాదర్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే -
AI: ప్రపంచంలో మొదటి హెల్త్ మానిటరింగ్ ఏఐ యాప్ ఇది..
సాక్షి, సిటీబ్యూరో: ఆరోగ్య సంరక్షణలో భాగంగా యాప్ ఆధారిత హెల్త్ టూల్స్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అడుగులేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని హోటల్ ఆవాసా వేదికగా బుధవారం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డీప్ లెరి్నంగ్ పవర్డ్ హెల్త్ మానిటరింగ్ యాప్ క్విక్ వైటల్స్ను ఆవిష్కరించారు.తెలుగు వ్యక్తి, బిసామ్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకులు ఎండీ హరీష్ బిసామ్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ యాప్ స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా కీలకమైన హెల్త్ డేటాను అందిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కో డాక్టర్ వంద మందికిపైగా రోగులను పరీక్షిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఈ యాప్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్త పరిమాణంలోని వైవిధ్యాలను కాంతి శోషణ మార్పులను విశ్లేíÙంచడానికి ఈ యాప్లో ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ) అనే సాంకేతికతను వినియోగించడం విశేషం.డేటా భద్రత, గోప్యతకు మా హామీ..ఈ నేపథ్యంలో హరీష్ బిసామ్ మాట్లాడుతూ.. ఈ వినూత్న సాంకేతికత ఆధారంగా మొబైల్ యాప్లో కేవలం సెకన్లలో ఆరోగ్య సూచికలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. డాక్టర్ను కలవకుండానే ప్రాథమిక సమాచారాన్ని పొందడానికి ఈ యాప్ దోహదపడుతుందని అన్నారు. ఈ యాప్ కెమెరా ఆధారిత కాంటాక్ట్లెస్ స్పాట్ చెక్లు, పీపీజీ సెన్సార్లతో పర్యవేక్షణ చేస్తుంది. ఇది బలమైన క్లౌడ్ రిజి్రస్టేషన్తో పాటు కఠినమైన భారతీయ డేటా రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, కాబట్టి డేటా భద్రత, గోప్యతకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు.ఈ ఆవిష్కరణలో భాగంగా ఏఐ, డీప్ లెరి్నంగ్: ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్కేర్ అంశంపై ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించారు. చర్చలో ప్లానింగ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డా.సుధ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ మాజీ డైరెక్టర్ డా.పి.వెంకటేశ్వర్లు, డా.పూరి్ణమ, ఇన్నోవేటర్–ప్రొడక్ట్ స్పెషలిస్ట్ డేనియల్ గోల్డ్మన్, కాటలిస్ట్ వ్యవస్థాపకులు ఆండ్రూ షోస్టాక్, డాక్టర్ ఉషతో పాటు టెక్ ఔత్సాహికులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఇవి చదవండి: పీక్స్లో.. పికిల్ బాల్! సిటిజనుల్ని ఉర్రూతలూగిస్తోన్న ఆట! -
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
షమ్ము హీరోగా క్రేజీ మూవీ.. టైటిల్ రివీల్ చేసిన అశ్విన్ బాబు
షమ్ము హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'క్రేజీ రాంబో'. ఈ సినిమాకు హరీష్ మధురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభం అయింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. 'క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా తప్పకుండా క్రేజీగా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. హీరో షమ్ము మాట్లాడుతూ.. 'ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రేజీ రాంబో కథ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ మధు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నా. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది' అన్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
స్కూల్ లైఫ్ ఆరంభం
పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లోప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్కి అభినందనలు తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ నా ఒక్కడిదే కాదు.సినిమా మీద ఉన్న ఇష్టంతో పాటు కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. మా బడ్జెట్ సరిపోకపోవడంతో కథ నచ్చి, నన్ను నమ్మి సహకారం అందిస్తున్న నిర్మాత రాహుల్ త్రిశూల్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ రెగ్యులర్ షూటింగ్ని ఆగస్టు 2నప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్. -
పుట్టపర్తిలో సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్
ప్రశాంతి నిలయం: సత్యసాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత మానవతా విలువలను,సేవా స్ఫూర్తిని చాటుతూ ఆదర్శవంతమైన జీవితం సాగించాలని భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత ‘సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్’ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. మురళీ కార్తీక్తోపాటు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు తదితరులు ట్రోఫీని, క్రికెట్ లీగ్ పోటీల బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. -
టిబిసి లగ్జరీ సెలూన్స్ లాంచ్ లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/సాక్షి, బెంగళూరు: గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. రీ యూజబుల్ లాంఛ్ వెహికల్(ఆర్ఎల్వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సముపార్జించిందని ఈ ప్రయోగం మరోసారి నిరూపించింది. ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్ అవడం వంటి పరామితులను పుష్పక్గా పిలుచుకునే ఈ ఆర్ఎల్వీ ఖచి్చతత్వంతో సాధించిందని ఇస్రో ఆదివారం పేర్కొంది. ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్(ఎల్ఈఎక్స్–03) సిరీస్లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్ను భారత వాయుసేకు చెందిన చినూక్ హెలికాప్టర్లో రన్వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్వే వైపు ఖచి్చతత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డర్, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. -
ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రధాని పిలుపు
ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. దేశంలో తాలిబాన్ సహకారంతో పెరిగిపోతున్న ఉగ్రవాదంపై పోరుసాగించడం సమిష్టి బాధ్యత అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఎసీ) అపెక్స్ కమిటీ సమావేశానికి ప్రధాని షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు సాగించడం అందరి కర్తవ్యమని, దేశంలోని అన్ని సంస్థల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అన్ని ప్రావిన్సులు తమ పాత్ర పోషించాలని కోరారు. గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, నేరాలు, డ్రగ్స్, స్మగ్లింగ్ మొదలైనవాటితో ఉగ్రవాదం ముడిపడి ఉన్నదని, అందుకే దీనిని అంతం చేయడం సంక్లిష్టంగా మారిందన్నారు.2014, డిసెంబర్ 16న పాక్లోని పెషావర్ స్కూల్పై దాడి తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి 20 పాయింట్ల ఎన్ఏపీ ఎజెండాను ప్రభుత్వం ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సమ్మతి తెలిపాయి. కాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విడుదల చేసిన వార్షిక భద్రతా నివేదికలోని వివరాల ప్రకారం 2023లో పాకిస్తాన్లో జరిగిన 789 ఉగ్రవాద దాడులు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 1,524 మంది మృతి చెందారు. 1,463 మంది గాయపడ్డారు. -
షావోమీ కొత్త 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసిన సినీనటి వర్షిణి (ఫోటోలు)
-
'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్..
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా గురువారం ప్రముఖ యాంకర్, సినీతార వర్షిణి సౌందరాజన్ నూతన షావోమీ 14 సీవీ మోడల్ను ఆవిష్కరించనున్నారు.మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీతార వర్షిణి సౌందరాజన్తో పాటు పలువురు ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొంటారని స్టోర్ నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!! -
ఆలియా డ్రీమ్ : సరికొత్తగా మరో ఘనత తన ఖాతాలో
నటిగా, భార్యగా, తల్లిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ లుక్, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆలియా తాజాగా రచయిత్రిగా తొలి పుస్తకాన్ని ఆవిష్కరించింది. దివంగత తాతయ్య నరేంద్రనాథ్ రజ్దాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్(‘Ed Finds a Home)'ను ఆదివారం తీసుకొచ్చింది. పిల్లల కోసం స్పెషల్గా పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు చెందిన పఫిన్ భాగస్వామ్యంతో పిల్లల కథల పుస్తకాన్ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆలియా పిల్లలతో ముచ్చటించింది. అలాగే ఆలియా కుమార్తె రాహాకపూర్ కోసం చిన్నారులు తీసుకొచ్చిన బహుమతులను స్వీకరించింది. ఈ లాంచింగ్కు ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోదరి షాహీన్ భట్ హాజరయ్యారు. ముంబైలోని స్టోరీవర్స్ చిల్డ్రన్స్ లిటరరి ఫెస్ట్లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తన బాల్యం నుంచీ తన జీవితం కథలు, స్టోరీ టెల్లింగ్ చుట్టూ అల్లుకొని ఉందని, తన బాల్యాన్ని, పిల్లలకోసం వెలికి తీయాలని కలలు కన్నాననీ, ఇది ప్రారంభం మాత్రమే..ఈ బుక్ సిరీస్గా ఉండబోతోందని ఆలియా ఇన్స్టాలో వెల్లడించింది. ఈ సందర్బంగా ఆలియా బటర్ ఎల్లో ఫ్లోరల్ ప్రింటెడ్ గౌనులో ఆకట్టుకుంది. సీబీ బ్రాండ్కు చెందిన లోలిత పేరుతో ఉన్న ఈ ఎల్లో కలర్ పూల గౌను ధర రూ. 17,901 లట. ఇప్పటికే ‘ఎడ్-ఎ-మమ్మా’ పేరుతో కిడ్స్ వేర్ బ్రాండ్ను నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్తో కలిసి రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ మూవీలో నటించిన ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే బ్రహ్మాస్త్ర-2లో కూడా కనిపించనుంది. ది ఆర్చీస్ ఫేమ్ వేదాంగ్ రైనాతో కలిసి నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'జిగ్రా' ఈ అక్టోబర్లో విడుదల కానుంది -
పురుషుల వంధ్యత్వ సమస్యను పరిష్కరించే ఆండ్రోమాక్స్ ప్రారంభం
-
Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో సందడి చేసిన నటి వర్ష (ఫోటోలు)
-
బ్లాక్ బస్టర్ గ్యారెంటీ: హీరో శర్వానంద్
‘‘మనమే’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రాన్ని తల్లితండ్రులకు అంకితం ఇస్తున్నాం. ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ’’ అన్నారు హీరో శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది.ఈ చిత్రం ట్రైలర్ని హీరో రామ్చరణ్ లాంచ్ చేశారు. అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఈ సినిమా ఓ మ్యాజిక్.. ఆ మ్యాజిక్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మనమే’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూఛిబొట్ల. ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ కృతీ ప్రసాద్, అసోసియేట్ప్రోడ్యూసర్ ఏడిద రాజా మాట్లాడారు. -
మరో మడత ఫోన్ వచ్చేస్తోంది.. రేటు రూ.లక్షకు పైనే!
దేశ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో మడత ఫోన్ వచ్చేస్తోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివొ గ్రేటర్ నోయిడాలోని కర్మాగారంలో తయారైన తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను భారత్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.వివో తన నాలుగో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్ను భారత్కు తీసుకురానుంది. భారత మార్కెట్లో వివో నుంచి దేశంలోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని జూన్ 6గా వివో ధ్రువీకరించింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ తో ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ సరసన చేరాలని వివో భావిస్తోంది.వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)తేలికపాటి డిజైన్ను మన్నికతో సమతుల్యం చేసేలా కార్బన్ హింజ్ ఫైబర్.6.53 అంగుళాల కవర్ డిస్ ప్లే, 8.03 అంగుళాల ఇన్నర్ అమోల్డ్ ఎల్టీపీఓ ఫోల్డింగ్ డిస్ ప్లే2480-2200 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో జీపీయూ16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం50 మెగాపిక్సెల్ అల్ట్రా-సెన్సింగ్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, వీ3 ఇమేజింగ్ చిప్సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాఅంచనా ధరవివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైలర్ల ద్వారా విక్రయించనున్నారు. చైనాలో దీని ధర 9,999 యువాన్లుగా(సుమారు రూ.1.17 లక్షలు) ఉండగా, భారత్లో దీని ధర రూ.1.2 లక్షలుగా ఉండొచ్చని అంచనా. -
సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా
-
తుక్కుగూడ నుంచే సమర శంఖం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పారీ్టలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్గౌడ్, మాణిక్రావు, డి.సు«దీర్రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు: చిరంజీవి
‘‘మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా జన్మ సార్థకం అయిందని భావిస్తున్నాను’’ అన్నారు హీరో చిరంజీవి. దివంగత నటి సావిత్రిపై సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు. మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్ క్యాన్సిల్ అయింది. నేను సరదాగా డ్యాన్స్ చేస్తూ జారిపడ్డాను. అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. ఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. -
మాదాపూర్లో గ్రాండ్గా ఎఫ్ కేఫ్ లాంచ్ ప్రారంభం.. సందడి చేసిన స్టార్స్ (ఫోటోలు)
-
రోటీ కపడా రొమాన్స్ మూవీ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
Kajal Aggarwal: హైదరాబాద్లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
రతన్ టాటా బయోగ్రఫీ బుక్ లాంచ్ ఎప్పుడంటే..
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన 'రతన్ టాటా' జీవిత చరిత్ర పుస్తకం రూపంలో రానున్నట్లు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. పుస్తక రచయిత 'మాథ్యూ' (Mathew) నవంబర్ 2022లో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2022లో రతన్ టాటా బయోగ్రఫీ బుక్ విడుదలవుతుందని ఎదురుచూసే అభిమానులకు అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ తరువాత బుక్ లాంచ్ తేదీని 2023 మార్చి నెలకు మార్చారు, మళ్ళీ ఓసారి 2024 ఫిబ్రవరి అన్నారు. ఈ నెలలో కూడా బుక్ లాంచ్ సాధ్యంకాదని తేలిపోయింది. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ మార్చి 30 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి.. దాతృత్వానికి మారుపేరుగా నిలిచినా రతన్ టాటాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంది. ఇటీవలే రతన్ టాటా ఏకంగా 165 కోట్ల రూపాయలతో పెంపుడు జంతువుల కోసం హాస్పిటల్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. -
జీఎస్ఎల్వీ ఎఫ్14 గ్రాండ్ సక్సెస్.. సీఎం జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: జీఎస్ఎల్వీ ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన ఇస్రో బృందాన్ని సీఎం అభినందించారు. భవిష్యత్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్ని పంపించారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ఇదీ చదవండి: చంద్రబాబులోని చీకటి కోణమే ఇది! -
మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు
-
300 సెల్టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘‘ఇవాళ 300 టవర్లు, జూన్లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగింది. 5,549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయి. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుంది. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయి’’ అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ (ఐటీశాఖ) డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయెన్స్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్చువల్ సమావేశంలో గిరిజనులు మాట్లాడారు. ఏమన్నారంటే...వారి మాటల్లోనే.. మళ్లీ మీరే రావాలి.. సార్.. మేం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు పాడేరు హెడ్ క్వార్టర్కు వెళ్ళాల్సి వచ్చేది ప్రతి విషయానికి గతంలో ఫోన్ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా మా గ్రామానికే సెల్టవర్స్ వేశారు. మాకు సిగ్నల్ కూడా వచ్చింది. మా గ్రామస్తులు అంతా సంతోషంగా ఉన్నారు, మాకు గతంలో సచివాలయం అంటే, కలెక్టర్ అంటే, వలంటీర్ అంటే ఏం తెలీదు, కానీ ఇప్పుడు అందరి గురించి తెలిసింది. జగనన్న మీరు మా బాధలు గమనించి మాకు సాయం చేస్తున్నారు. గతంలో రోడ్లు లేవు, కానీ ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి, మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, జగనన్నా మీరు మాకు అన్నీ ఇస్తున్నారు, మేం మీ పథకాల ద్వారా లబ్ధిపొంది మా కాళ్ళపై మేం నిలబడ్డాం, మేమంతా కూడా మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాడేరు వచ్చినప్పుడు చూడాలనుకుని చూడలేకపోయాను, ఇప్పుడు నేరుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ అన్నా -చిట్టెమ్మ, గిరిజన మహిళ, పాడేరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా చాలా సంతోషంగా ఉంది.. అన్నా, మా గిరిజన గ్రామాలకు ఫోన్ సిగ్నల్ లేదు. 5 కిలోమీటర్లు వెళ్లి ఫోన్ చేయాల్సి వచ్చేది. ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్కి చెప్పడానికి కూడా ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు, మా బంధువుల కష్టసుఖాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడుతున్నాం. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. నేరుగా టీచర్స్తో మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు నేరుగా జగనన్నకు చెబుదాం నెంబర్ 1902 కి కాల్ చేసి మాట్లాడగానే మా సమస్య పరిష్కారం అయింది. గతంలో ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. ఇప్పుడు మాత్రం అన్నీ వెంటనే తెలిసిపోతున్నాయి. మా సచివాలయంలో సిగ్నల్ లేక ఇబ్బందులు పడేవారు, ఇప్పుడు మీ చొరవ వల్ల ఇంటినుంచే అన్నీ తెలుసుకుంటున్నాం, ఏదైనా మా సచివాలయంలో ఇస్తున్నారు. బ్యాంకులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే డబ్బు కూడా తీసుకుంటున్నాం, మాకు సెల్ టవర్ వచ్చిన తర్వాతే నిజంగా సంతోషంగా ఉంది. నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు బావుండాలి, మీరు మళ్లీ వస్తేనే మాకు చాలా బావుంటుంది. మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నాం -చలపతిరావు, గిరిజనుడు, పార్వతీపురం మన్యం జిల్లా -
టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ప్రారంభం
సాక్షి,తిరుమల: టీటీడీ ఆలయాల సమాచారంతో ఆధునీకరించిన వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానిక, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్సైట్ను ఆధునీకరించింది. మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేసే అధికారిక వెబ్ సైట్ పేరు మారినట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ పేరుతో ఇతర వెబ్సైట్ వస్తుండటంతో టీటీడి తాజా వెబ్సైట్ పేరు మార్పు చేసింది. శ్రీవారి భక్తులు ఇకపై టీటీడీ సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ తెలుసుకోవచ్చు. గతంలో tirupatibalaji.ap.gov.in అని ఉన్న టీటీడీ వెబ్సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.in గా మార్పు చేశారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతి, ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలుతో పాటు హిందూ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో కొత్త వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.inను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ పేరు మార్పుని 'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్' లో భాగంగా మార్చినట్లు వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ఆన్లైన్ బుకింగ్ను ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా చేసుకోవాల్సిందిగా సూచించారు. స్వామి వారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా వెబ్ సైట్ పేరుని మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంస్థ, ఒకే వెబ్ సైట్, ఒకే మొబైల్ యాప్ ఉండాలన్న నిర్ణయంతో పేరుని మార్చినట్లు ప్రకటించింది. ఇక పై భక్తులు శ్రీవారి దర్శనం కోసం లేదా ఆలయ వివరాల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇక నుంచి కొత్త వెబ్సైట్ని ఉపయోగించాలని వెల్లడించింది. గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీ సేవా ఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అనంతరం టీటీడీ వెబ్సైట్ను tirupatibalaji.ap.gov.inగా మార్చారు. ఇప్పుడు ఆ పేరుని కూడా మార్చి.. ttdevasthanams.ap.gov.inగా కొత్త పేరుని పెట్టారు. ఈ కొత్త వెబ్ సైట్ లో తిరుపతిలో టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు.. అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, చరిత్రతో సహా శ్రీవారి దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస సహా ఇతర వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఈ వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను భక్తులకు అందుబాటులో ఉంచారు. -
HyperOS: ఈ సాఫ్ట్వేర్తో భారత్లో వస్తున్న తొలి స్మార్ట్ఫోన్ ఇదే..
హైపర్ ఓఎస్ (HyperOS) అనే సరికొత్త సాఫ్ట్వేర్తో భారత్లోకి తొలి స్మార్ట్ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన షావోమీ నుంచి వేరుపడిన పోకో (poco) బ్రాండ్ దీన్ని లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 ప్రో (Poco X6 Pro) షావోమీ ఆండ్రాయిడ్ 14తో కూడిన హైపర్ ఓఎస్ సాఫ్ట్వేర్తో వస్తోంది. పోకో తన ఎక్స్ సిరీస్ను రెండు కొత్త స్మార్ట్ఫోన్లతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో మోడల్లు వచ్చే వారంలో భారత్లో అధికారికంగా లాంచ్ అవుతున్నాయి. రాబోయే స్మార్ట్ఫోన్లకు సంబంధించిన కొన్ని స్పెక్స్లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీతో కూడిన ఎక్స్6 సిరీస్కు సంబంధించిన ఇతర కీలక ఫీచర్లను కంపెనీ ఇంకా ఆవిష్కరించలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోకో షేర్ చేసిన తాజా పోస్ట్ ప్రకారం.. పోకో ఎక్స్6 ప్రో ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న సాయంత్రం 5.30 గంటలకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతోంది. అత్యధిక ఫర్మార్మెన్స్ను జోడించిన సరికొత్త షావోమీ హైపర్ఓఎస్తో ఇది వస్తోంది. అయితే వెనిలా పోకో ఎక్స్6 మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUIతో వస్తుందని భావిస్తున్నారు. More power to performance on the #POCOX6Pro,Powered by #XiaomiHyperOS. Global launch on 11th Jan, 5:30 PM on @flipkart. Know More👉https://t.co/JdcBOET57Z#POCOIndia #POCO #MadeOfMad #Flipkart #TheUtimatePredator pic.twitter.com/wujI4fvZ1Y — POCO India (@IndiaPOCO) January 5, 2024 పోకో ఎక్స్6 సిరీస్ స్పెసిఫికేషన్లు ఇవే.. పోకో ఎక్స్6 ప్రో సరికొత్త MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు వనిల్లా పోకో ఎక్స్6 మోడల్ స్నాప్డ్రాగన్ 7s Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్కు సంబంధించి కొన్ని ఫీచర్లను ఫ్లిప్కార్ట్ లిస్ట్ చేసింది. వాటిలో WildBoost 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్, హీట్ మేనేజ్మెంట్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ 5000mm2 ఆవిరి చాంబర్ ఉన్నాయి. ఇక ప్రో వేరియంట్ 12GB ర్యామ్ 512GB ఇన్బిల్ట్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇవి కాకుండా పోకో ఎక్స్6 సిరీస్ మోడల్లు 120Hz డిస్ప్లేతో వస్తున్నాయని రూమర్స్ వచ్చాయి. రెండు స్మార్ట్ఫోన్లు 64MP మెయిన్ కెమెరా, 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. -
స్వేచ్ఛ చందమామ కథలు: తొలి తెలుగు AI టూల్ లాంచ్ (ఫొటోలు)
-
చందమామ కథలు: స్వేచ్ఛ తొలి తెలుగు AI టూల్ లాంచ్
హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని, తెలుగులో ప్రత్యేకించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డేటాతో స్వేచ్చా "AI చందమామ కథలు" ను శనివారం ఆవిష్కరించింది. తెలుగు ఎల్ఎల్ఎమ్ అనేది తెలుగు మాట్లాడే మారుమూల రైతుకు కూడా అందుబాటులో ఉండాలనే ఛాలెంజ్ను స్వీకరించి, ఈ క్రమంలో దీనికి చందమామ కథలను ఎంచుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరైనారు. ఇది తెలుగులో కథ చెప్పడం కోసం దేశంలో తీసుకొచ్చిన తొలి ఏఐని ఆయన కొనియాడారు. నీతి, మర్మం నైతిక విలువలతో కూడిన చందమామ కథలను తెలుగు ఏఐవైపు మళ్లించడం సంతోషమన్నారు. భారతీయ కథలు, భారతీయ భాషలలో, భారతీయులందరికీ కథల రూపంలో అందించడం ముఖ్యం, ఈ క్రమంలో తెలుగు భాషలో, విలువలతో కూడిన చందమామ కథలతో ప్రారంభించడం చాలా బాగుందన్నారు ప్రొఫెసర్ (ఐఐటీ, మద్రాస్)గౌరవ్ రైనా. ఈ సందర్భంగా స్వేచ్ఛ తెలంగాణ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర సాక్షి.కామ్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక చిన్న సమావేశంలో కథలకోసం భారతీయ భాషలలో ఏఐని సృష్టించే ఈ సమస్యపై ఆలోచిస్తున్న క్రమంలో చైతన్య (CPO & కో-ఫౌండర్, ఓజోనెటెల్), ప్రొఫెసర్ గౌరవ్ రైనా (ప్రొఫెసర్ IIT మద్రాస్) ఈ ఆలోచనకు రూపం వచ్చిందని తెలిపారు. తమ ప్రయత్నానికి 30 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు సహకరించారని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో స్వేచ్ఛ గొంతుకలా కూడా విస్తరించాలని భావిస్తున్నామని కిరణ్ చంద్ర తెలిపారు. ప్రధానంగా భారతదేశంలో 10 మిలియన్ డాలర్లతో ChatGPT లాంటి ఎల్ఎల్ఎంని నిర్మించడం అసాధ్యమన్న ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వ్యాఖ్యల్ని సవాల్గా తీసుకున్నట్టు చెప్పారు. ఓపెన్ AI వంటి వాటితో పోటీ పడేందుకు భారతీయ స్టార్ట్-అప్ రూపొందించిన తొలి ఇండిక్ లాంగ్వేజ్ మోడల్లలో తమ స్వేచ్ఛ చాట్బాట్ ఒకటని కిరణ్ వెల్లడించారు. 42 వేలకు పైగా పేజీల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేశామనీ, అమృతమైన సరికొత్త కథలు వచ్చేలా కూడా ఈ టూల్ ను సిద్ధం చేశామని చెప్పారు. 40వేల కథల డేటాసెట్ ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది చాట్జీపీటీలా ఖరీదైనదిగా గాకుండా ప్రతి రైతుకు, ప్రతి గ్రామీణ ఉపాధ్యాయునికి, ప్రతి దుకాణదారునికి అందుబాటులో ఉండాలన్నారు. ఆవైపుగా కూడా తమ కృషి సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రమా దేవి లంక(డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్) ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల కూడా పొల్గొనడం విశేషం. -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. 260 టన్నుల బరువు.. పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్ఫోశాట్ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్పోశాట్ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. -
Meenakshi Choudhary: బంజారాహిల్స్లో సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
Allari Naresh: అల్లరి నరేశ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
లవ్ డ్యూయెట్
ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటగా నటించనున్న సినిమాకు ‘డ్యూయెట్’ టైటిల్ను ఖరారు చేశారు. ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్గా చేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్టూడియో గ్రీన్ పతాకంపై కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాప్రారంభోత్సవం గురువారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఆనంద్ తల్లిదండ్రులు గోవర్ధన్ దేవరకొండ, మాధవి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో హీరోయిన్లపై దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ ఇచ్చారు. తొలి సీన్కి దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత జ్ఞానవేల్ రాజా, ఈ చిత్ర సహ–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ స్క్రిప్ట్ను దర్శకుడు మిథున్కు అందజేశారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘డ్యూయెట్’ నాకు స్పెషల్ ఫిల్మ్. మిథున్ మంచి కథ రాశాడు’’ అన్నారు. ‘‘ఇదొక మంచి లవ్స్టోరీ’’ అన్నారు మిథున్. ‘‘ఈ కథ విన్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. జీవీ ప్రకాశ్కుమార్ ఆల్రెడీ రెండు పాటలు ఇచ్చేశారు. వారం రోజుల్లో తొలి షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు. ఈ వేడుకకు హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. -
హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం (ఫొటోలు)
-
చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. చంద్రయాన్-3 మహా క్విజ్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు -
Krishna Rama Movie Actors Photos: ‘కృష్ణారామా’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఏఎన్యూలో కొత్త కోర్సులు ప్రారంభం
ఏఎన్యూ: విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులను వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎంఏ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్సులు ఉన్నాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు నూతన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన కోర్సులలో ఫ్యాకల్టీ నియామకం, మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. డిగ్రీ ఫలితాలు విడుదల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో 61శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఏసీఈ ఆర్.ప్రకాష్రావు తెలిపారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. ఫీజు ఒక్కో పేపర్కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
తాటిబెల్లం కాఫీ 100వ బ్రాంచ్.. ఓపెన్ చేసిన బిందుమాధవి (ఫోటోలు)
-
ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
గ్రామాల్లో సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు: సీఎం జగన్
-
థ్రిల్ చేసే విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన, దర్శకత్వంలో ఎస్. రంజిత్ నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో హీరో రోహిత్ నందా మాట్లాడుతూ– ‘‘విధి’ మాకెంతో స్పెషల్ మూవీ. ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను చేశాం. దీంతో కంటి చూపు లేనివాళ్లు కూడా మా సినిమాను అనుభూతి చెందగలరు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాలగారు అద్భుతమైన ఆర్ఆర్, సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన మూవీ ‘విధి’’ అన్నారు నిర్మాత రంజిత్. ‘‘మాకు ఇది తొలి సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీకాంత్, శ్రీనాథ్. ‘‘వినోదం మాత్రమే కాదు.. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు హీరోయిన్ ఆనంది. ‘‘ఈ సినిమాలో ట్విస్ట్లు బాగుంటాయి’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. నటుడు ‘రంగస్థలం’ మహేశ్ మాట్లాడారు. -
సూర్య రోష్ని లాంచ్ అఫ్ ఫెస్టివ్ లైటింగ్ కలెక్షన్స్..
-
ఇస్రో శాస్త్రవేత్తల విశేష కృషి: సోమనాథ్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అనుకున్న విధంగానే చేయగలిగామని చెప్పారు. జూలై 14న నిర్వహించి చంద్రయాన్–3 మిషన్ను ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ను దించి సక్సెస్ను ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్యయాన్–1కి రెడీ అయిపోయామని చెప్పారు. రేపటి నుంచి 16 రోజుల పాటు ఆర్టిట్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 125 రోజుల తర్వాత ఉపగ్రహాన్ని సూర్యుని దిశగా పయనింపజేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్–1 బిందువు వద్ద ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 ప్రయోగం, ఆ తర్వాత శుక్రుడి మీదకు కూడా ప్రయోగానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్లో గగన్యాన్ ప్రయోగాత్మక ప్రయోగం, జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా త్రీడీఎస్ అనే సరికొత్త ఉపగ్రహాన్ని పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రోకు ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: దేశం యొక్క మొదటి సోలార్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వాంతరాళాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన శాస్త్రీయ పరిశోధనలు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు అభినందనలు అని తెలిపారు. ఇస్రో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. పరిశోధనల క్రమంలో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్ను సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్–1’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
Aditya-L1: మిషన్ సూర్య సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యడిపై పరిశోధనలు చేయాలనే కల నెరవేరింది. సూర్యయాన్–1 పేరుతో చేసిన ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ఇస్రో మంచి జోష్ మీదుంది. నిన్న చంద్రయాన్–3, నేడు సూర్యయాన్ ప్రయోగంతో వరుసగా రెండు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతం చేసి చరిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది. ఈ ప్రయోగంతోనే చంద్రయాన్–4, శుక్రుడిపై ప్రయోగానికి బీజం పడింది. ప్రపంచంలో నాసా ఇప్పటికే సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ప్రయోగాలను చేసింది. ఆ తరువాత మొదటిసారి సూర్యుడిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. సూర్యుడు అగి్నగోళం కదా! అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోదా! అనే సందేహం చాలామందిలో ఉంది. అందుకే భూమికి 15 లక్షల కిలోమీటర్లు దూరంలోని సూర్యునికి దగ్గరగా ఉన్న లాంగ్రేజియన్ బిందువు 1 వద్ద ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి అ«ధ్యయనం చేయనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కాంతిమండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయనుంది. చంద్రుడు, అంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు కూడా మొదటి ప్రయత్నంలోనే చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమై ప్రయోగంలో మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్కు తిరుగులేదని మరోమారు నిరూపించారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి సూర్యయాన్–1 పేరుతో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా 1,480 కిలోలు ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో చరిత్రలోచరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. మొన్న చంద్రయాన్–3 సక్సెస్ జోష్లో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేని దేశంగా మరోమారు నిలిపారు. సూర్యుడి మీద అధ్యయనం చేసే ప్రయోగం కావడం, కక్ష్య దూరం కొత్తగా ఉండడంతో మిషన్ కంట్రోల్రూంలో నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 23.40 గంటలపాటు కొనసాగింది. కౌంట్డౌన్ ముగిసే సమయం దగ్గర పడింది. కౌంట్డౌన్ సమయంలో జీరో పడడమే తరువాయి.. తూర్పువైపున నిప్పులు చెరుగుతున్న భగభగ మండే ఎండను, మబ్బులను చీల్చుకుంటూ ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్గా కంప్యూటర్లును ఆపరేట్ చేస్తూ కంటి మీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. నాలుగు దశలతో కూడిన ప్రయోగాన్ని 01.03.31 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. 1,480 కిలోల ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని గంటా మూడు నిమిషాల వ్యవధిలో భూమికి దగ్గరగా (పెరిజీ)235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్లు ఎత్తులో ఎసిన్ట్రిక్ ఎర్త్ బౌండ్ అర్బిట్(అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం 125 రోజులకు లాంగ్రేజియన్ బిందువు వద్ద ప్రవేశపెట్టి, 12 రోజుల తర్వాత సూర్యుడు సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద అధ్యయనం చేసి సూర్యునిపై రహస్యాలను భూమికి చేర్చుతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 90వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి మరో గ‘ఘన’విజయాన్ని నమోదు చేసుకున్నారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఆదిత్య ఎల్1 మిషన్ ఐదో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి, మూడో దశలు ఘన ఇంధనంతో.. రెండు, నాలుగు దశలు ద్రవ ఇంధనంతో నిర్వహించారు. ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైన 1.03.31 గంటల్లో (3,799.52 సెకన్లు) ప్రయోగాన్ని పూర్తి చేశారు. -
ఆదిత్య L1 లాంచ్ : ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ వైరల్
Aditya L1 launch మిషన్ ఆదిత్య ఎల్ 1 పేరుతో ఇస్రో మరో ఘనతను సాధించింది. సూర్యుడి పరిశోధనలు నిర్వహించేందుకు ఆదిత్య ఎల్1 మిషన్ను శనివారం ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ మిషన్ సక్సెస్తో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. అటు పారిశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర కూడా దీనిపై స్పందించారు. ఈ సందర్బంగా ట్విటర్(ఎక్స్)లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇండియా తొలి సోలార్ మిషన్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూగ్రీకు పురాణ గాథలొ మైనపు రెక్కలతో సూర్యునికి దగ్గరగా ఎగురుతూ మరణించిన డేడాలస్ కుమారుడు ఇకారస్ కథను గుర్తుచేసుకున్నారు. “‘సూర్యుడికి చాలా దగ్గరగా ఎగరవద్దు’ అనే సామెత గ్రీకు పురాణం నుంచి వచ్చింది. గ్రీకు లెజెండ్ ఐకారస్ సూర్యుని దగ్గరగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అత్యాశకు ప్రతీకగా నిలిచిన ఈ మాటల్ని ఇక ఇస్రో చెరిపేయనుంది. మనం మన ఆశయాలను మరింత ఉన్నతంగా నిర్దేశించుకునేలా 'సూర్యుడికి దగ్గరగా ఎగురుదాం' అనే సందేశాన్నిస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు అంటూ ఆయన రాశారు.ఈ సందర్బంగా ఆదిత్య ఎల్1 మిషన్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. (దివంగత రాకేష్ ఝన్ఝన్వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?) మరోవైపు చంద్రయాన్-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) “Don’t fly too close to the Sun” comes from the Greek legend of Icarus who flew fatally near the sun, & is used to describe TOO MUCH ambition. Thanks to @Isro :“Let’s fly close to the Sun” will mean that we should lift our ambitions even HIGHER. 🙏🏽🇮🇳 pic.twitter.com/4DQQrGKQWs — anand mahindra (@anandmahindra) September 2, 2023 కాగా చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఆదిత్య ఎల్ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తాయి. అంతేకాదు చంద్రుని దక్షిణ ధృవంపై కాలినడి తొలిదేశంగా నిలిచిన భారత్ఇపుడు అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది. -
అద్భుతమైన ఫీచర్లతో బోట్ ‘స్మార్ట్ రింగ్’ లాంచ్.. ధర ఎంతంటే..
ఇప్పటివరకూ స్మార్ట్ వాచీలను ఎక్కువగా చూస్తున్నాం.. ఇప్పుడిప్పుడే చేతి వేళ్లకు ధరించగలిగే 'స్మార్ట్ రింగ్'లు సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి స్మార్ట్ రింగ్ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ తాజాగా లాంచ్ చేసింది. ఆరోగ్య పర్యవేక్షణ నుంచి సింగిల్ హ్యాండ్ కదలికల ద్వారా చేసే స్మార్ట్ ట్రాకింగ్ యాక్టివిటీ వరకూ పలు రకాల ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ధరను రూ. 8,999లుగా కంపెనీ ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, బోట్ వెబ్సైట్లలో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల తర్వత నుంచి ఈ స్మార్ట్ రింగ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అందరి వేళ్లకూ సరిపోయేలా ఈ రింగ్ మూడు సైజ్లలో వస్తుంది. బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్లు స్టైలిష్, ప్రీమియం, మెటాలిక్ లుక్ స్వైప్ నావిగేషన్తో ఇతర డివైజ్ల కంట్రోల్ ప్లే/పాజ్ మ్యూజిక్, ట్రాక్ చేంజ్, పిక్చర్ క్లిక్, అప్లికేషన్ల నావిగేట్ హార్ట్ రేటు, బాడీ రికవరీ, శరీర ఉష్ణోగ్రత, స్లీప్ మానిటరింగ్, ఋతుక్రమ ట్రాకర్ సొంత బోట్ రింగ్ యాప్కు కనెక్ట్ స్టెప్ కౌంట్, కరిగిన కేలరీలు, ప్రయాణించిన దూరం వంటి స్మార్ట్ యాక్టివిటీ ట్రాకింగ్ అత్యవసర పరిస్థితుల్లో ఇతరులను అప్రమత్తం చేసే ఎస్వోఎస్ ఫీచర్ 5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్ -
జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. సెప్టెంబర్ 1 నుంచే..
GST reward scheme: జీఎస్టీ బిల్లు అప్లోడ్ చేస్తే నగదు బహుమతులిచ్చే 'మేరా బిల్ మేరా అధికార్' (Mera Bill Mera Adhikaar Scheme) జీఎస్టీ రివార్డ్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు ప్రతి ఒక్కరూ బిల్లును అడిగి తీసుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఈ పథకం తొలుత ఆరు రాష్ట్రాల్లో అమలు కానుంది. అమలయ్యే రాష్ట్రాలు ఇవే.. 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ రివార్డ్ స్కీమ్ను మొదటి దశలో అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) తెలిపింది. ఈ మేరకు స్కీమ్ వివరాలతో ట్వీట్ చేసింది. అందుబాటులోకి మొబైల్ యాప్ 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్ను సీబీఐసీ ఇప్పటికే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైన వస్తువు కొలుగోలు చేసినప్పుడు విక్రేత ఇచ్చిన బిల్లును ఈ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా నగదు బహుమతులు పొందవచ్చు. అప్లోడ్ చేసే బిల్లులో విక్రేత జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తానికి సంబంధించిన వివరాలు ఉండాలి. రూ. కోటి వరకూ ప్రైజ్ మనీ జీఎస్టీ నమోదు చేసుకున్న దుకాణాలు, సంస్థలు ఇచ్చే బిల్లులను 'మేరా బిల్ మేరా అధికార్' యాప్లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా అప్లోడ్ బిల్లులన్నీ నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీస్తారు. విజేతలకు రూ. 10 వేల నుంచి రూ. 1 కోటి వరకు నగదు బహుమతులు అందజేస్తారు. లక్కీ డ్రాకు అర్హత పొందేందుకు కనీస కొనుగోలు విలువ రూ. 200 ఉండాలి. ఒక నెలలో గరిష్టంగా 25 బిల్లులను అప్లోడ్ చేయవచ్చు. ఇదీ చదవండి: ‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట? Mera Bill Mera Adhikaar Scheme! 👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23. 👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY — CBIC (@cbic_india) August 22, 2023 -
రేపు నితిన్ గడ్కరీ ప్రారంభించనున్న కొత్త ప్రోగ్రామ్ ఇదే..
Bharat NCAP: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (భారత్ ఎన్సీఏపీ) రేపు (మంగళవారం) ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్ ఎన్సీఏపీ భారతీయ ఆటోమొబైల్స్ భద్రతా ప్రమాణాలను పెంచడంతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ కార్ల ప్రతిష్టతను పెంచడానికి తోడ్పడుతుంది. తద్వారా రానున్న కొత్త ఉత్పత్తులు (కార్లు) మరింత పటిష్టమైన భద్రతను కలిగి ఉంటాయి. దీనికింద కార్లను క్రాష్ టెస్ట్ చేసి వాటికి సేఫ్టీ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది. సేఫ్టీ రేటింగ్ ఆధారంగా కారు భద్రతను నిర్థారిస్తారు. ఇది కార్ల కొనుగోలుదారులకు, భారత ఆర్థిక వ్యవస్థ పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మన దేశంలో తయారయ్యే కార్లు అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యత లేని కార్లుగా పరిగణించబడుతున్నాయి. దీనికి చెప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమవుతోంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతయ్యే కార్ల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: గూగుల్ ప్లేస్టోర్ నుంచి 22 యాప్స్ అవుట్.. ఇవి మీ మొబైల్లో ఉన్నాయా? క్రాష్ టెస్టులో కారు పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ పరీక్షించి రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే కారు యువకులకు, పిల్లలకు ఏ విధమైన రక్షణ అందిస్తాయనేది ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. రేపు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం భారత్లో సేఫ్టీ సెన్సిటివ్ కార్ మార్కెట్ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు. భారత్ ఎన్సీఏపీ కార్యక్రమానికి మారుతీ సుజుకి, మహీంద్రా & మహీంద్రా, టయోటా వంటి వాహన తయారీ దారులు ఇప్పటికే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా తప్పకుండా కార్లు మరింత భద్రతా ఫీచర్స్ పొందనున్నట్లు భావిస్తున్నారు. దీంతో భారతదేశంలో ప్రమాదంలో మరణించే వారి సంఖ్య తప్పకుండా తగ్గుతుందని చెబుతున్నారు. -
23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?
Hyundai Venue Knight Edition హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ దరను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ఎడిషన్ ధర రూ. 13.48 లక్షలుగా ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ SUV S(O) , SX వేరియంట్లకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 1.2 l కప్పా పెట్రోల్ ఇంజన్ అమర్చింది. SX(O) వేరియంట్ కోసం 6MT, 7DCTతో 1.0 l T-GDi పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. వెన్యూ నైట్ ఎడిషన్ 4 మోనోటోన్ , 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఫియరీ రెడ్ అండ్ ఫియరీ రెడ్ విత్ అబిస్ బ్లాక్ కలర్స్లో కొత్త వెన్యూ నైట్ ఎడిషన్ లభ్యం. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ 23 ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్, హ్యుందాయ్ లోగో, బ్రాస్ కలర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్సర్ట్లు, ఫ్రంట్ వీల్స్పై బ్రాంచ్ కలర్ ఇన్సర్ట్లు, బ్రాంచ్ రూఫ్ రైల్ ఇన్సర్ట్లు, డార్క్ క్రోమ్ రియర్ హ్యుందాయ్ లోగో,వెన్యూ ఎంబ్లం, నైట్ ఎంబ్లం, బ్లాక్ ఉన్నాయి. పెయింట్ చేయబడిన రూఫ్ రెయిల్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, ORVMలు, రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్/వీల్ కవర్, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రధానంగా ఉన్నాయి. వెన్యూ నైట్ ఎడిషన్ 82 bhp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజీన్, 118 bhp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండింటితో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెన్యూ , వెన్యూ ఎన్-లైన్ లా కాకుండా, టర్బో-పెట్రోల్ యూనిట్ మాన్యువల్ గేర్బాక్స్తో కొత్త ఎడిషన్ తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్లు iMTని పొందుతాయి. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ బ్రాస్ కలర్ ఇన్సర్ట్లతో బ్లాక్ ఇంటీరియర్, బ్రాస్ కలర్ హైలైట్లతో ప్రత్యేకమైన బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కెమెరాతో డాష్క్యామ్, స్పోర్టీ మెటల్ పెడల్స్, ECM IRVM , 3D డిజైనర్ మ్యాట్లను పొందుపర్చింది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
ఇన్ఫినిటమ్ అంటేనే ఒక వైబ్రేషన్...యూత్ కలల డెస్టినేషన్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫినిటమ్ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. యువత కలల సాధనకు వారధిగా నిలుస్తోంది. అరుదైన యుత్ ఐకాన్స్ కు ఇన్ఫినిటమ్ అడ్డగా నిలుస్తోంది. ఇన్ఫినిటమ్ ఈవెంట్ అదరహో అనే స్థాయిలో సాగింది. స్పూర్తిని నింపేలా ఈవెంట్ సంథింగ్ స్పెషల్గా నిలిచింది. యువతలో స్పూర్తిని నింపే ఎంతో మంది ఒకే వేదిక మీదకు ఇన్ఫినిటమ్ తీసుకొచ్చింది. డిజిటల్ ప్లాట్ఫారమ్లలో సాధించిన విజయం అద్భుతం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన భాగస్వామ్య సంస్థలను పరిచయం చేసింది. తమ లక్ష్యం ఏంటో ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. సెలబ్రెటీస్ సందడి.. ప్రముఖుల బ్లెస్సింగ్ నడుమ పండుగ వాతావరణంలో ఈవెంట్ సినీ ఎంట్రీ గ్రాండ్ లాంచ్ చేసింది. ఇన్ఫినిటమ్ ఈవెంట్కు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తరలి వచ్చారు. ఏషియన్ గ్రూప్ జాహ్నవి నారంగ్, ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇన్ఫినిటమ్కి విషెస్ చెప్పారు. ఏషియన్ మూవీతో టై అప్ అయిన ఇన్ఫినిటమ్ జయ క్రిష్ణ ముకుంద మురారీ తొలి మూవీ టైటిల్ ను ఆవిష్కరించారు. ఇక ఈవెంట్ కలర్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ గా గ్రాండ్ ఫీస్ట్ గా నిలిచింది. ఎంతో మంది యువ కళాకరులను ఈ వేదిక ద్వారా పరిచయం చేసింది. ఇన్ఫినిటమ్ కోర్సులను ఈవెంట్ లో ఆవిష్కరించారు. యూఎస్ లో ఇన్ఫినిటమ్ ఆపరేషన్స్ ను ఇదే ముహూర్తంగా అధికారికంగా లాంఛ్ చేసారు. ట్రిపుల్ ఆర్ మూవీ ఫేం రాహుల్ సిప్లిగంజ్, బేబీ ఫేం వైష్ణవి చైతన్యను సత్కరించారు. ఇన్ఫినిటమ్ పిక్చర్స్ సభికుల హర్షధ్వానాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేసారు. 2023 ఇన్ఫినిటమ్ వైటీ క్యాలెండర్ ను ప్రకటించారు. స్టూడెంట్ వెబ్ సిరీస్ లిరికల్ సాంగ్ రిలిజ్ చేశారు. ఇదే సమయంలో ఇన్ఫినిటమ్ ఏషియన్ భాగస్వామ్యంతో కొనసాగనున్న ప్రణాళికలు..ప్రకటనలను ఈవెంట్ లో ప్రకటించి ఆసక్తిని పెంచారు. యువ కళాకారుల అభిరుచులకు ఇన్ఫినిటమ్ మార్గదర్శకత్వం వహిస్తోంది. వారి అభిరుచులకు అనుగుణంగా ఎదిగేందుకు వేదికగా నిలుస్తోంది. వారు సక్సెస్ అవ్వటంలో రోల్ మోడల్ గా ఖ్యాతి దక్కించు కుంది. ఇలాంటి ప్రతిభ.. సమర్ధతకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఇన్ఫినిటమ్ను గెస్టులు మనస్పూర్తిగా అభినందించారు. భవిష్యత్లో మరెన్నో సక్సెస్ లకు చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. -
బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!
బాలీవుడ్ భామ, ఆదిపురుష్ హీరోయిన్ బర్త్డే గాళ్ కృతి సనన్ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన సొంత స్కిన్కేర్ బ్రాండ్ను గురువారం లాంచ్ చేసింది. ప్రముఖ బ్రాండ్ mCaffeine మాతృ సంస్థ PEP టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్తో బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే న సొంత ప్రొడక్షన్ హౌస్, బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ను ప్రారంభించిన కృతి సనన్ ఇక బిజినెస్ ఉమన్గా రాణించాలనుకుంటోంది. ఈ వెంచర్ ద్వారా బ్యూటీ వ్యాపార ప్రపంచంలో ఇతర సెలబ్రిటీల సరసన చేసింది. (హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్తో రీఎంట్రీ!) జూలై 27 తన బర్త్ డే సందర్భంగా కృతి సనన్ పీఈపీ టెక్నాలజీస్తో భాగస్వామ్యంతో హైఫెన్ అనే ప్రీమియమ్ స్కిన్కేర్ లైన్ను పరిచయం చేసింది. హైఫెన్ బ్రాండ్ ద్వారా వినియోగదారులకు అధిక-నాణ్యత చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యం అని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్యూటీ బ్రాండ్ లాంచ్ వీడియోలో కృతి అద్భుతంగా కనిపించింది. చర్మ సంరక్షణపై తనకున్న అభిరుచిని పాషన్గా మార్చుకోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నానో తెలిపింది. హైఫన్లో PEP టెక్నాలజీస్ 30 కోట్లతో మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. కృతి సనన్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్గా ఉండనుంది. (ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా? ) హైఫన్ మూడు ముఖ్యమైన రోజువారీ ఉత్పత్తులైన బారియర్ కేర్ క్రీమ్, గోల్డెన్ అవర్ గ్లో సీరమ్ , ఆల్ ఐ నీడ్ సన్స్క్రీన్ SPF 50 PA++++ని విడుదల చేసింది. అయితే ఈ బ్రాండ్ కొంతమంది బ్యూటీ లవర్స్ను ఆకట్టుకోగా, మరికొంతమంది నెటిజన్లు రియాక్షన్ భిన్నంగా ఉంది. దీపికా పడుకోన్ బ్రాండ్ను కాపీ చేసిందనికొందరు వ్యాఖ్యానించగా, టాక్స్ ఎగ్గొట్టడానికి ఇదో కొత్త ఎత్తుగడని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) కృతి సనన్ వర్క్ ఫ్రంట్ ఇక కరియర్ పరంగా నిర్మాతగా కృతి సనన్ తన తొలి చిత్రం "తీన్ పట్టి" తో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైగర్ ష్రాఫ్తో కలిసి మోస్ట్ ఎవైటెడ్ మూవీ "గణపత్"లో కూడా కనిపించనుంది. దీంతోపాటు షాహిద్ కపూర్ సరసన మరోప్రాజెక్ట్కు పనిచేస్తోంది. -
ఎమోషనల్ వృషభ
జీవన్, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో మంచి ఎమోషన్ ఉన్నట్లనిపిస్తోంది’’ అని ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ‘‘1966–1990 నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆధ్యాత్మికంగా వెళుతూనే మనుషులకు, పశువులకు మధ్య ఉండే బాండింగ్ని చూపించాం’’ అన్నారు అశ్విన్. ‘‘ఓ పల్లె లోని చిన్న గుడిలో ఈ కథ నా మదిలో మెదిలింది’’ అన్నారు ఉమాశంకర్. -
Nachinavadu trailer: ‘నచ్చినవాడు’.. సరికొత్త ప్రేమ కథా చిత్రం
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్ హీరోయిన్. స్ట్రీట్ డాగ్ సమర్పణలో లక్ష్మణ్ చిన్నా, వెంకట రత్నం నిర్మించారు. ఆగస్టు 18న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్ని సోమవారం విడుదల చేశారు. హీరో–దర్శక–నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ– ‘‘మహిళల ఆత్మగౌరవం కథాంశంగా చేసుకుని అల్లిన సరికొత్త ప్రేమ కథా చిత్రం ‘నచ్చినవాడు’’ అన్నారు. హీరోయిన్ కావ్య రమేష్ మాట్లాడుతూ "నచ్చినవాడు చిత్రం లో నేను అను అనే క్యారెక్టర్ చేశాను. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం, చాలా నీతిగా ఉంటుంది. తనకి ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు. మా సినిమా ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు. నటి లలిత నాయక్ మాట్లాడుతూ ‘నేను కన్నడ అమ్మాయిని, ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు" అని తెలిపారు. -
Niharika Konidela Photos: హై లైఫ్ ఎగ్జిబిషన్లో నిహారిక సందడి (ఫొటోలు)
-
Anchor Varsha Photos: హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్లో జబర్దస్త్ వర్ష సందడి (ఫొటోలు)
-
జాబిలిపై అన్వేషణకు ఇస్రో చంద్రయాన్-3
-
చంద్రయాన్-3 ప్రయోగం పై ఉత్కంఠ..!
-
చంద్రయాన్-3 కి సర్వం సిద్ధం చేసిన ఇస్రో
-
చంద్రయాన్-3 ప్రయోగం.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! చంద్రయాన్–3 మిషన్ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. ఈ మిషన్ను దిగ్విజయంగా పూర్తి చేసి నాలుగేళ్ల నాటి చంద్రయాన్–2 వైఫల్యం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని ఇస్రో పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నింటి కళ్లూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగంపైనే నిలిచాయి. చదవండి: కూకట్పల్లి: మామకు మనమూ చుట్టాలమే My best wishes to the entire team at @isro on the scheduled launch of Chandrayaan-3 from Sriharikota in our very own #AndhraPradesh today. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 -
నగల దుకాణంలో సినీ నటి మంచు లక్ష్మి సందడి (ఫోటోలు)
-
మీకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టమా.. అయితే మీ కోసమే ప్రత్యేక ఛానెల్!
యూట్యూబ్లో మనం రోజు మూవీస్, మ్యూజిక్, షార్ట్ ఫిల్మ్స్, ఎడ్యుకేషన్, కుక్కింగ్, ట్రావెల్ ఇలా ప్రతి రోజు ఎదో ఒక కంటెంట్ చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఫోక్ టచ్ ఉన్న ప్రైవేట్ తెలుగు సాంగ్స్ మాత్రం చాలా తక్కువే అని చెప్పచ్చు. ఇటీవల ఫోక్ సాంగ్స్కు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న వేళ 'షేడ్స్ స్టూడియోస్' పోస్ట్ ప్రొడక్షన్ సంస్థతో కలసి 'వోక్స్ బీట్జ్' మ్యూజిక్ ఛానల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన దర్శకులు నక్కిన త్రినాధ్ రావు, శేఖర్ మాష్టర్, హేమంత్ మధుకర్, బాల, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, హీరోయిన్ మాళవిక సతీషన్ హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రభాస్ 'సలార్' టీజర్ అఫీషియల్ ప్రకటన ఇదే) ఈ మ్యూజిక్ ఛానెల్ ద్వారా సంగీత ప్రియులను, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే పాటలను అందించనున్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ పర్సన్ లవ్ కాన్సెప్ట్పై తీసిన 'నా మది', కాలేజీ వాతావరణంలో జరిగే లవ్ మెలోడీ సాంగ్ 'జారే మనసు జారే', 'వయ్యారి', 'షరీభో షరీభో', 'బులుగు చొక్కా', 'జాబిలివే' వంటి పాటలను రిలీజ్ చేశారు. దర్శకులు నక్కిన త్రినాథ రావు మాట్లాడుతూ.. 'ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా 'స్టోరీ టెల్లింగ్' సాంగ్స్లా సినిమా చూస్తున్నట్లే ఉన్నాయి. సినిమాలో పాటలు కంటే చాలా బాగున్నాయి. మంచి కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఛానెల్ ప్రేక్షకాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. 'కొత్త వాళ్లయినా ఇంత అద్భుతంగా చేసిన పాటలు సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. మీ ద్వారా చాలామంది కొత్త టాలెంట్ బయటకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించిన నటీనటులు టెక్నికల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్తో వస్తున్న షేడ్స్ స్టూడియోస్, వోక్స్ బీట్జ్ మ్యూజిక్ ఛానల్ కు ఆల్ ద బెస్ట్.' అని అన్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..'టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు బయట చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ ఛానల్ ద్వారా ఒక గుర్తింపు తీసుకొస్తున్న ఉపేంద్ర, దేవి ప్రసాద్కు నా ధన్యవాదాలు. వీరందరూ కలసి చేసిన పాటలు చాలా బాగున్నాయి. వీరు ఇలాగే ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. -
విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్–3
చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు కొంతవరకు విజయం సాధించాయి. అంతరిక్ష నౌకలను క్షేమంగా పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై ఆయా అంతరిక్ష నౌకలు కాలుమోపాయి. ఈ జాబితాలో చేరాలని భారత్ సైతం ఉవి్వళ్లూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి రోవర్ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ మిషన్ లక్ష్యం. చంద్రయాన్–3 స్పేస్క్రాఫ్ట్ను జీఎస్ఎల్వీ–ఎంకే–3 రాకెట్ ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్–3 మిషన్ను కచి్చతంగా సఫలం చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. మీకు గుర్తుందా? చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిలి్చంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటార్తో వెళ్లిన చంద్రయాన్–2 స్పేస్క్రాఫ్ట్ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెపె్టంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రధాని మోదీ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్–2తో పోలిస్తే చంద్రయాన్–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం... ► ఆర్బిటార్, మిషన్ కంట్రోల్ సెంటర్తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా చంద్రయాన్–2లో కేవలం ఒక్కటే ఉంది. చంద్రయాన్–3లో ఇలాంటివి రెండు కెమెరాలు అమర్చుతున్నారు. చంద్రుడిపై ల్యాండర్ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి. ► చంద్రయాన్–2లో 9 కీలక పరికరాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి కక్ష్యలో ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉన్నాయి. చంద్రయాన్–3 ప్రొపల్షన్ మాడ్యూల్లో కేవలం స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(ఎస్హెచ్ఏపీఈ) అనే పేలోడ్ కూడా ఉంటుంది. ఇతర గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ పరికరం అందజేస్తుంది. ► చంద్రయాన్–3లో ల్యాండర్తోపాటు లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే(ఎల్ఆర్ఏ)ను సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం ఖాయమని సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలకమైన మైలురాయి కానుంది. ► చంద్రయాన్–2లో జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ఉపయోగించారు. చంద్రయాన్–3లోనూ ఇలాంటి రాకెట్ను వాడుతున్నారు. చంద్రయాన్–2 రాకెట్లో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ ఉన్నాయి. మూడో ప్రయోగంలో ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్ను ఈ తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో క్షేమంగా ఉంది. సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్ కోసం ఆర్బిటార్ను వాడుకుంటారు. ► చంద్రయాన్–2 వైఫల్యం నుంచి సైంటిస్టులు పాఠాలు నేర్చుకున్నారు. అందుకే చంద్రయాన్–3లో కొన్ని మార్పులు చేశారు. చదవండి: మెట్రోలో యువకుల పిడిగుద్దులు.. వీడియో వైరల్.. జూలై 13న చంద్రయాన్–3 ప్రయోగం! న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జూలై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభించనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త ఒకరు బుధవారం చెప్పా రు. అయితే, ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. జూలై12 నుంచి 19వ తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రయోగం చేపట్టే అవకాశముందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. చంద్రయాన్–1 ప్రయోగం 2008 అక్టోబర్22న, చంద్రయాన్–2 ప్రయోగం 2019 జూలై 22న ప్రయోగం నిర్వహించారు. చంద్రయాన్–1 విజయవంతమైంది. జాబిల్లి ఉపరితలంపై నీడ జాడ లను గుర్తించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ 312 రోజులపాటు సేవలందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జగనన్న సురక్షకు సర్వం సిద్ధం
సాలూరు: తన పాలనలో పార్టీల కతీతంగా, అర్హతే ప్రామాణింగా, అత్యంత పారదర్శకంగా, అవినీతి రహితంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రజలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో చారిత్రక నిర్ణయానికి తెరతీశారు. ఏవైనా కారణాల వల్ల ఎవరైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందనట్లయితే వారికి పథకాలు అందించేలా, సేవలకు సంబంధించి అవసరమైన పత్రాలు వెంటనే మంజూరుచేసే నూతన కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజల వద్దకు నేరుగా వలంటీర్లు, సచివాలయ గృహసారథులను పంపించి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి పథకాలు లేదా పత్రాల మంజురుకు సంబంధించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు. కార్యక్రమం విధివిధానాలు ఈ నెల 24నుంచి వలంటీర్లు, గృహసారథులులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. పథకాలు, సేవలకు సంబంధించి ప్రజలు సమస్యలు తెలిపిన పక్షంలో వివరాలను తెలుసుకుని, సేవలకు సంబంధించి అవసరమైన ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యుటేషన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్లో మొబైల్ నంబర్ అప్డేషన్, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్లు వంటివి మంజూరు గురించి వివరిస్తారు. ఎవరైనా పథకాలు, సేవలకు సంబంధించిన సమస్యలు చెప్తే వాటికి సంబంధించి అవసరమైన దరఖాస్తులను తీసుకుని సచివాలయంలో అందజేస్తారు. కార్యాచరణ ఇలా ప్రతి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. వారంలో మూడు సచివాలయాల చొప్పున నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్లు ఒక టీమ్గా, తహసీల్దార్, ఈఓపీఆర్డీ/మరో టీమ్గా ఏర్పాటవుతారు. మున్సిపాలిటీ, మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ క్యాంపు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జగనన్న సురక్ష ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధి చేకూరుస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అర్హులెవరైనా ఏవైనా సాంకేతిక, ఇతర కారణాల వల్ల పథకాలు పొందలేకపోతే వారిని గుర్తించి పథకాలు అందేలా చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన ప్రధాన సర్టిఫికెట్లు సత్వరమే ప్రజలకు అందించనున్నాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రి -
మాయ నాలో జరిగెనే!
‘అందరిలోనూ ఒక్కడు కాను... నేను వేరే తీరులే, కలిసే తాను.. వెలిగే మేను.. మాయ నాలో జరిగెనే...’ అంటూ మొదలవుతుంది ‘కల కంటూ ఉంటే..’ అనే పాట. నాగశౌర్య, యుక్తితరేజ జంటగా నటించిన ‘రంగ బలి’ చిత్రంలోని పాట ఇది. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. పవన్ సీహెచ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కల కంటూ ఉంటే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సార్థక్ కల్యాణి, వైష్ ఆలపించారు. సత్య, సప్తగిరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కెమెరా: దివాకర్ మణి. -
sreeleela : వనస్థలిపురంలో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు)
-
యూజర్లకు గుడ్ న్యూస్: అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ వచ్చేసింది!
యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను గురువారం దేశంలో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన ప్రైమ్ వీడియో ప్లాన్ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ధర రూ. 999గా ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, ప్రయోజనాలు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది చీపెస్ట్ ఆప్షన్. అమెజాన్ వెబ్సైట్లో లేదా యాప్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్లో యాడ్స్ ఉంటాయి. ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు. కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది. కాగా ఏడాది ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) -
షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
చైనా స్మార్ట్మేకర్ షావోమీ కొత్త ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. హైఎండ్ ఫీచర్స్తో షావోమీ ప్యాడ్ 6 మోడల్ను తీసుకొచ్చింది. షావోమీ ప్యాడ్ 5 అప్గ్రేడ్ వేరియంట్గా ఆల్ మెటల్ డిజైన్తో దీన్ని ఆవిష్కరించింది. ధర, ఆఫర్ షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించింది.అలాగే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. జూన్ 21న సేల్ ప్రారంభం. షావోమీ ఆన్లైన్ స్టోర్లతోపాటు,అమెజాన్లో లభిస్తుంది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్వర్త్ ఎంతంటే?) ఇక ఆఫర్ విషయానికి వస్తే..ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఫలితంగా షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.23,999కు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు కొనుగోలుచేయవచ్చు. షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్ 11 అంగుళాల 2.8K ఎల్సీడీ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కె కెమెరా 8,840mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
మామన్నన్ ఆడియో లాంఛ్లో కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
సరికొత్త కలెక్షన్తో మీ పెదాలకు మరింత అందం
-
మార్కెట్లో కి కొత్త సూపర్ ఆటో అబ్బురపరిచే ప్రత్యేకతలు..!
-
మహీంద్రా థార్ లాంచ్పై కీలక అప్డేట్
మహీంద్రా థార్ (5-డోర్) దేశంలో అత్యంత ఎదురుచూస్తున్న ఎస్యూవీ(SUV)లలో ఒకటి. ఇప్పటి వరకు ఈ ఏడాది ఆగస్టు 15న ఈ ఎస్యూవీ లాంచ్ అవుతుందని పుకారు ఉండేది. అయితే థార్ 5-డోర్ లాంచ్ ఎప్పుడనేది కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాహన ప్రియులను మరింత నిరీక్షణలోకి నెట్టేసింది. మహీంద్రా థార్ 5-డోర్ 2024లో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ సంవత్సరం కంపెనీకి సంబంధించిన కొత్త ఉత్పత్తులేవీ లేవని మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటో & ఫార్మ్ సెక్టార్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో రాజేష్ జెజురికర్ తెలిపారు. ఇప్పటికే 50,000లకుపైగా బుకింగ్లు 5-డోర్ థార్కు చాలా డిమాండ్ ఉందని, ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్లు వచ్చాయని జెజురికర్ పేర్కొన్నారు. కస్టమర్ల నిరీక్షణకు తెర దించుతూ 2024 సంవత్సరంలో 5-డోర్ థార్ను లాంచ్ చేయనున్నట్లు వివరించారు.పెంచాలి మరియు ఇప్పుడు మేము 2024లో వచ్చే థార్ 5-డోర్లను చూస్తున్నాము”, జోడించారు. మహీంద్రా థార్కు దేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఎస్యూవీ డెలివరీ పొందాలంటే కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాలి. కాగా మహీంద్రా ఈ సంవత్సరం ప్రారంభంలో థార్లో RWD 4X2 వెర్షన్ను కూడా ప్రారంభించింది. ఇక మహీంద్రా థార్ 5-డోర్ డిజైన్, ఇతర ప్రత్యేకతల విషయానికి వస్తే పొడవైన స్తంభాలతో బాక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ప్రస్తుత థార్ మాదిరిగానే ఉంటాయని తెలిసింది. అయితే కొత్త 5-డోర్ థార్లో పొడవైన డోర్లు, వీల్బేస్తో మరింత విశాలమైన క్యాబిన్ ఉంటుంది. సరికొత్త అల్లాయ్ వీల్స్, హుడ్ కింద 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉంటాయని వెల్లడైంది. ఇదీ చదవండి: మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్కు వచ్చేశాయ్! ధరలు ఇవే.. -
జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
బీజీఎంఐ గేమ్ మళ్ళీ వచ్చేసింది.. కొత్త రూల్స్ ఇలా ఉన్నాయి!
BGMI Relaunched: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజీఎంఐ (బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) గేమ్ ఎట్టకేలకు ఇండియాలో మళ్ళీ లాంచ్ అయింది. ఈ రోజు నుంచి గేమ్ మొదలైంది. బ్యాన్ అయిన సుమారు ఆరు సంవత్సరాల తరువాత ఈ గేమ్ మళ్ళీ భారతదేశంలో అడుగుపెట్టింది. దీనిని రీ-లాంచ్ చేయడానికి భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నుంచి అప్రూవల్ కూడా తీసుకుంది. కావున ఇప్పుడు లాంచ్ చేసింది. ప్రారంభ దశగా మూడు నెలలు అనుమతి పొందుతూ ప్రస్తుతం గేమ్ లాంచ్ చేసింది. ఆ తరువాత పరిస్థిని బట్టి కొనసాగించడమా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఆ స్కీమ్ గడువు మళ్ళీ పెంచిన హెచ్డీఎఫ్సీ - కస్టమర్లకు పండగే!) టైమ్ లిమిట్.. ఈ గేమ్ ఆడటానికి ఇప్పుడు డైలీ లిమిటెడ్ టైమ్ కేటాయించారు. కావున గేమ్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత 48 గంటల లోపు దశల వారీగా యూజర్లు లాగిన్ అవ్వవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న వారందరూ రెండు రోజుల్లోగా గేమ్ ఆడడం మొదలుపెట్టవచ్చని సమాచారం. యూజర్ల వయసుని బట్టి టైమ్ లిమిట్ ఉంటుంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు రోజుకి 6 గంటల పాటు ఆడుకోవచ్చు. ఆరు గంటల తరువాత లాగిన్ అకౌంట్ నుంచి గేమ్ ఆడలేరు. మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఆడాలంటే ఆ తరువాత రోజే ఆడాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్ కొన్న 'రూబిన్ సింగ్') 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న పిల్లలు రోజుకి 3 గంటలు మాత్రమే ఈ గేమ్ ఆడుకోవచ్చు. అంతే కాకుండా ఆ వయసున్న పిల్లలు ఆడాలంటే పేరెంటర్ వెరిఫికేషన్ కూడా చాలా అవసరం. ఈ గేమ్ వెర్షన్లో నుసా అనే కొత్త మ్యాప్ కూడా యాడ్ అయ్యింది. జిల్లైన్స్, సూపర్ రీకాల్ ఫీచర్, టాక్టికల్ క్రాస్బో, టూ సీటర్ ఆఫ్ రోడ్ ఆల్ టెరిటరైన్ హెహికల్స్ కూడా గేమ్కు యాడ్ అయ్యాయి. కావున ఇది మునుపటికంటే చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము. No more waiting, play like your heroes in the Battlegrounds! 🎙#BGMI #battlegroundsmobileindia #IndiaKiHeartbeat pic.twitter.com/VbPIRiS18Z — BattleGrounds Mobile India (@BattlegroundmIn) May 29, 2023 -
కీలక ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో
-
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా..
ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 28వ తేదీన (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ను ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణను సంతరింపజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావించింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 ప్రత్యేక నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ప్రతిబింబించేలానూ ఈ నాణేం ఉండనుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నాణేనికి ఒక వైపు నాలుగు సింహాల అశోక స్థూపం.. క్రింద సత్యమేవ జయతే అని ఉండనుంది. అలాగే.. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడి వైపున ఆంగ్లంలో భారత్ అనే పదం చేర్చారు. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ బొమ్మతో పాటు ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్ అని, దిగువన ఆంగ్లంలో పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు రాసి ఉంటాయి. 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉండబోయే నాణేం.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్ మరియు 5% జింక్తో తయారు చేశారు. Ministry of Finance to launch a special Rs 75 coin to commemorate the inauguration of the new Parliament building on 28th May. pic.twitter.com/NWnj3NFGai — ANI (@ANI) May 26, 2023 -
సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?
చెన్నై: ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సింపుల్ ఎనర్జీ తాజాగా సింపుల్ వన్ మోడల్ను ప్రవేశపెట్టింది. ధర బెంగళూరు ఎక్స్షోరూంలో రూ.1.45 లక్షలు. ఒకసారి చార్జింగ్తో 212 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్లు రూ. 13,000 అదనంగా చెల్లించి 750-వాట్ల పోర్టబుల్ ఛార్జర్ని తీసుకోవచ్చు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) 2021 ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో ఈ మోడల్ను కంపెనీ ఆవిష్కరించింది. కాగా, జూన్ 6 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని సింపుల్ ఎనర్జీ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరణ, సామర్థ్యం పెంపునకు వచ్చే 12-18 నెలల్లో సుమారు రూ.820 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఫౌండర్ సుహాస్ రాజ్కుమార్ తెలిపారు. ఏడాదిలో 40-50 నగరాల్లో 180 వరకు ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సింపుల్ వన్ కోసం ఇప్పటికే ఒక లక్ష యూనిట్లకు బుకింగ్స్ ఉన్నాయని వెల్లడించారు. ధర రూ.35 వేలు పెరిగినప్పటికీ బుకింగ్స్ రద్దు కాకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులోని శూలగిరి వద్ద ప్లాంటుకు ఇప్పటికే కంపెనీ రూ.110 కోట్లు ఖర్చు చేసింది. వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. (కొత్త వ్యాపారంలోకి నయన్, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ) -
Samyuktha Menon: నగల షోరూం ప్రారంభోత్సవంలో నటి సంయుక్త మీనన్ సందడి (ఫొటోలు)
-
మారుతి జిమ్నీ ఫస్ట్ కారు వచ్చేసింది - ఇక లాంచ్ అప్పుడే!
2023 ఆటో ఎక్స్పోలో 'మారుతి జిమ్నీ' 5 డోర్ వెర్షన్ కనిపించినప్పటినుంచి ఈ SUV కోసం ఎంతో మంది వాహన ప్రేమికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే తాజాగా మారుతి సుజుకి ఈ కారు గురించి ఒక అప్డేటెడ్ న్యూస్ అధికారికంగా వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం జిమ్నీ 5-డోర్స్ సిరీస్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక విక్రయాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ధర కాకుండా ఈ కారు గురించి దాదాపు అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. బుకింగ్స్ కూడా దాదాపు 30వేలకు చేరువలో ఉన్నట్లు సమాచారం. మారుతి సుజుకి జిమ్నీ ధరలు జూన్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరువాత వారంలో డెలివరీలు మొదలవుతాయని అంచనా. మార్కెట్లో ఈ కారు ఇంకా అధికారికంగా లాంచ్ కాకముందే వెయింటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మాన్యువల్ గేర్బాక్స్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం దాదాపు ఆరు నెలల వరకు ఉంది. అదే సమయంలో ఆటోమేటిక్ వెయిటింగ్ పీరియడ్ ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది. నాలుగు వేరియంట్లలో విడుదలకానున్న జిమ్నీ టాప్ స్పెక్ వేరియంట్ 'ఆల్ఫా'కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది. జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే కలర్ ఆప్షన్లలో విడుదలవుతుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ కలిగిన జిమ్నీ 105 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. మారుతి సుజుకి తన గురుగ్రామ్ ప్లాంట్లో ప్రతి సంవత్సరం 1 లక్ష యూనిట్ల జిమ్నీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 66 శాతం దేశీయ విక్రయాలకు, మిగిలిన 34 శాతం ఎగుమతులకు కేటాయించే అవకాశం ఉంది. అంతే కాకుండా కంపెనీ కేవలం భారతీయ మార్కెట్ కోసం ప్రతి నెల 7,000 యూనిట్లు కేటాయించాలని దానివైపు అడుగులు వేస్తోంది. (ఇదీ చదవండి: కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో) భారతీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి జిమ్నీ ఇప్పటికే విపరీతమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్'కి ప్రత్యేతిగా నిలబడుతుంది. కావున అమ్మకాల పరంగా కంపెనీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మారుతి జిమ్నీ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
విశ్వక్సేన్ కొత్త మూవీకి ముహుర్తం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు (ఫొటోలు)
-
వన్ప్లస్ ప్యాడ్ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ మేకర్ వన్ప్లస్ టాబ్లెట్ విభాగంలో తన అరంగేట్రం చేసింది. తన తొలి ఫ్లాగ్షిప్ టాబ్లెట్ను లాంచ్ చేసింది. MediaTek Dimensity 9000 చిప్సెట్, కార్టెక్స్-X2 కోర్ 3.05GHz తదితర ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. వన్ప్లస్ ప్యాడ్ 35శాతం పనితీరు ప్రయోజనాన్ని, 35 శాతం పవర్ ఎఫిషియెన్సీ అందజేస్తుందని కంపెనీ వెల్లడించింది. (ఇదీ చదవండి: బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) వన్ప్లస్ ప్యాడ్: ధర, ఆఫర్లు వన్ప్లస్ ప్యాడ్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 37,999, రూ. 39,999. వన్ప్లస్ యాప్, ఎక్స్పీరియన్స్ స్టోర్తోపాటు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈకామర్స్ సైట్లలోనూ, రిలయన్స్ క్రోమా స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్లు, డెబిట్ కార్డ్లు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన వారు రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. OnePlus Xchange కింద వన్ప్లస్ స్మార్ట్ఫోన్ల మార్పిడిపై అదనంగా రూ. 5000 లేదా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల మార్పిడిపై రూ. 3000 ఆఫర్ లభిస్తుంది. ఏప్రిల్ 28 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓపెన్ సేల్ మే 2, 2023 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో) It's almost D-Day. The all-new #OnePlusPad will be open for pre-orders starting April 28, at ₹37,999. Mark your calendars! Stay tuned: https://t.co/PSbe5gA0aF pic.twitter.com/aaO7ak9yNG — OnePlus India (@OnePlus_IN) April 25, 2023 వన్ప్లస్ ప్యాడ్ ఫీచర్లు భారీ 11.61-అంగుళాల 144 Hz రీడ్-ఫిట్ డిస్ప్లే 7:5 స్క్రీన్ నిష్పత్తి, మెటల్ బాడీ 2.5D రౌండ్ ఎడ్జ్ .కాంబెర్డ్ ఫ్రేమ్ డిజైన్ 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ సపోర్ట్ 9510mAh బ్యాటరీ 67w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా -
నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C55 రాకెట్
-
మీరు ఎంత ఊహించుకున్నా దానికి 10 రెట్లు ఉంటుంది ఉగ్రం
-
ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్కు ఊహించని గెస్ట్!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న మూవీ ఎన్టీఆర్ 3. ఈ చిత్రం ఓపెనింగ్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఈ మూవీ లాంచింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ సమయంలో కొరటాల టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అలాగే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎవరు ఊహించని గెస్ట్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కంటే ముందే ఎన్టీఆర్ ఇండియా తిరిగివచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్-కొరటాల మూవీ ఓపెనింగ్ ఈనెలలో వుంటుందనే వార్తలపై నమ్మకం కుదిరింది. అసలు ఫిబ్రవరిలోనే ఈ సినిమాను లాంఛ్ చేయాలనుకున్నారు. అయితే తారకరత్న చనిపోవటం.. ఆతర్వాత ఎన్టీఆర్ అమెరికా వెళ్లటంతో ఎన్టీఆర్ 30 మూవీ వాయిదా పడింది. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఆచార్యతో కొరటాల భారీ ఫ్లాప్ను ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ 30తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ వరల్డ్ హిట్ కావటంతో.. కొరటాల కూడా ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీ రెడీ చేశాడు. సముద్రం బ్యాక డ్రాప్లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం కొరటాల ఇప్పటికే తన టీమ్తో కలిసి హైదరాబాద్లో సముద్రం సెట్, ఓ దీవి సెట్ను ఇప్పటికే సిద్ధం చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్తో తలపడేందుకు విలన్గా బాలీవుడ్ నటుడిని ఫిక్స్ చేశారు. ప్రభాస్ మూవీలో ఆదిపురుష్ లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ను ఎన్టీఆర్ 30 లో విలన్గా నటించనున్నట్లు సమాచారం. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది. విలన్గా సైఫ్ అలీఖాన్! మార్చి 23న జరిగే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ ప్రోగ్రామ్ సైఫ్ అలీఖాన్ వస్తాడనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇక విలన్గా సైఫ్ అలీఖాన్ అధికారిక ప్రకటన కూడా ఆరోజే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మార్చి 23న జరగబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ గ్రాండ్గా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీ ఓపెనింగ్కి ఊహించని గెస్ట్ కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఆహ్వానం! ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ఆచార్య తర్వాత చిరు, కొరటాల మధ్య దూరం పెరిగిందనేది ఇండస్ట్రీ టాక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఇన్ డైరెక్ట్గా కొరటాలపై కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ 30 ఓపెనింగ్కి చిరంజీవిని ఆహ్వానిస్తే... కచ్చితంగా వస్తారనే మాట వినిపిస్తోంది. కొరటాల సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ కోసమే కాకుండా జాన్వీకపూర్ ఎంట్రీ ఇవ్వనుండడంతో చిరంజీవి వస్తాడనే టాక్ నడుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి,రామ్ చరణ్ రానున్నారట. ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ కాబట్టి .. తారక్ తో పాటే సందడి చేస్తాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మార్చి 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
పెరిగిన ఇన్నోవా హైక్రాస్ ధరలు.. విఎక్స్(ఓ) వేరియంట్ లాంచ్
టయోటా కంపెనీ తన ఇన్నోవా హైక్రాస్ VX(O) వేరియంట్ని అధికారికంగా విడుదల చేసింది. ఈ వేరియంట్ 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 26.73 లక్షలు, రూ. 26.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కొత్త ఇన్నోవా హైక్రాస్ విఎక్స్(ఓ) వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న విఎక్స్, జెడ్ఎక్స్ మధ్య ఉంటుంది. ఇది మూడ్ లైటింగ్తో కూడిన పనోరమిక్ సన్రూఫ్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్బ్యాగ్లు వంటి వాటిని పొందుతుంది. ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు మొదటిసారిగా తన హైక్రాస్ ధరలను పెంచింది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000, హైబ్రిడ్ వేరియంట్ ధరలు రూ. 75,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత హైక్రాస్ బేస్ వేరియంట్ ధర రూ. 18.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 29.72 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్). టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్, 197 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో 183 బిహెచ్పి పవర్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు CVT ఆటోమేటిక్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటాయి. కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి, అదే సమయంలో ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇన్నోవా హైక్రాస్ ADAS టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున ఇందులో పార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ పరంగా ఉత్తమంగా ఉండటమే కాకుండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. -
Taraka Ratna death: ఎన్టీఆర్ 30 వాయిదా
‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్– డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమాకి ఈ నెల 24న కొబ్బరికాయ కొట్టాల్సింది. అయితే హీరో తారకరత్న మృతితో నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ కారణంగా ఎన్టీఆర్– కొరటాల శివ తాజా చిత్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. నందమూరి కల్యాణ్రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో 30వ మూవీ. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 2024 ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. కాగా తాజాగా తారకరత్న మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్రబృందం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. ఇక ‘ఎన్టీఆర్ 30’తో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్. -
ఇండియాలోనే బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్.. ఒకేసారి 15-20 మంది తినేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: శాకాహారం మాత్రమే తినే తనపేరిట మాంసాహార బిర్యానీ రావడం సంతోషంగా ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. కొండాపూర్లోని జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్లో శనివారం సోనూసూద్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉండే బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని ఒకేసారి 15 నుంచి 20 మంది తినవచ్చన్నారు. ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు గౌతమి, ధర్మ, గౌతమ్లను ఆయన అభినందించారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, బెంగళూరులో బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్ను సోనూసూద్తో అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తా.. రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానని సినీ/చారిటీ స్టార్ సోనూసూద్ వెల్లడించారు. హైదరాబాద్తో తనకు దగ్గర అనుబంధం ఉందనీ, తన భార్య తెలుగు మహిళని తెలిపారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ క్లబ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘కరోనా తీవ్రత తగ్గిపోయినా సమస్యలతో మమ్మల్ని సంప్రదించేవారు తగ్గలేదు. ప్రస్తుతం షిరిడీలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తెలంగాణలో మరొకటి రానుంది. పంజాబ్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి సమీప భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఓ ఉచిత పాఠశాల ఉండేలా చూడాలనేది మా కోరిక. చాలా రాజకీయ పార్టీలు నన్ను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాట వాస్తవమే. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి నాకు లేదు. చిత్ర పరిశ్రమలో ఇంకా చాలా చేయాల్సి ఉంది. చెక్లు అందించి సాయం చేయడం మాత్రమే కాదు.. చెక్లు అందించి, చారిటీలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే పర్సనల్ టచ్ చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలికను నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు విమానంలో తరలించాం. ఆమె సోదరుడు తోడుగా వచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమెను రక్షించలేకపోయాం. ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా మృతి చెందాడు. ఆమె తల్లిదండ్రులు తమ ఇద్దర్నీ కోల్పోయారు. దీంతో వీలైనప్పుడల్లా నాగ్పూర్లోని వారి తల్లిదండ్రులను కలవడం అలవాటు చేసుకున్నా. ఇదే నేను ఇష్టపడే పర్సనల్ టచ్.. అని సోనూసూద్ చెప్పారు. చదవండి: పబ్లు, ఫామ్హౌజ్లపై పోలీస్ రైడ్స్ -
సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని లాంచ్ చేసిన నాని, అంబటి రాయుడు, హరీష్ రావు (ఫొటోలు)
-
షావోమి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఫోటోలు లీక్, లుక్ మాములుగా లేవుగా!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావోమీ తొలి ఎలక్ట్రిక్ కారుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్లోబల్గా అరంగేంట్రం చేయనున్న ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చైనాలో ఈవీ మార్కెట్ చాలా పోటీ ఉంది. దీంతో షావోమీ కారుకు మరింత ప్రాధాన్యతను సంతరించు కుంది. షావోమీ ఎంఎస్11 సెడాన్ పేరుతో తీసుకొస్తున్న సెడాన్ డిజైన్, లుక్ ఆకర్షణీయంగా మారింది. ఇది పోర్షే టైకాన్తో పోలి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రముఖ చైనీస్ ఆటో మొబైల్ సంస్థ బీవైడీకి చెందిన సియెల్ ఎలక్ట్రిక్ సెడాన్ తరహాలో షావోమి ఈవీ డిజైన్ ఉండనుందని అంచనా. అంతేకాదు కారు ముందు భాగంలో LiDAR సెన్సార్ ఆధారంగా ఇది అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యాలతో వస్తోందని కూడా భావిస్తున్నారు. షావోమీ 4 డోర్ ఎంఎస్11 చాలా ఆకర్షణీయమైన సెడాన్ అని సోషల్ మీడియా ప్రశంసిస్తోంది. స్పోర్టీగా కనిపించే 4-డోర్ల ఎలక్ట్రిక్ వాహనంలో విండ్షీల్డ్ పెద్దగా ఉండి, పైకప్పు మొత్తం ఒక సింగిల్ పేన్ గ్లాస్తో టెస్లా మోడల్లలో కని పిస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లాయ్ వీల్స్ అమర్చింది. ఈ వీల్స్ మధ్యలో "షావోమీ’’ బ్రాండ్ లోగో కనిపిస్తోంది. తుదిమెరుగులు దిద్దుకున్న షావోమీ ఈవీ టెస్టింగ్ను కూడా చైనా రోడ్లపై ఇప్పటికే నిర్వహించిందట. రూ. 1.2కోట్ల ఫైన్..! అయితే తొలి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ లీక్ కావడంపై షావోమీ సీరియస్గా స్పందించింది. బీజింగ్కు చెందిన మోల్డింగ్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ అనే వెండర్ ద్వారా ఈ ఫొటోలు లీక్ అయినట్టు గుర్తించారు. ఈ లీక్ను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని సీఈఓ లీ జున్ మండిపడ్డారు. అలాగే సెక్యూరిటీ బ్రీచ్కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించారు. సంస్థపై 1 మిలియన్ యువాన్ల ( దాదాపు. రూ.1.22కోట్లు) జరిమానా విధించనుందట షావోమీ. -
ఈనామ్ నుంచి ఇండియా విజన్ పోర్ట్ఫోలియో
ముంబై: అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఈనామ్ ఏఎంసీ కొత్తగా ఈనామ్ ఇండియా విజన్ పోర్ట్ఫోలియో (ఈఐవీపీ)ని ఆవిష్కరించింది. మార్కెట్ క్యాప్, రంగాలతో సంబంధం లేకుండా పటిష్టమైన 15–30 కంపెనీల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 50 లక్షలు మదుపు చేసే ఇన్వెస్టర్ల కోసం దీన్ని ఉద్దేశించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జితేన్ దోషి తెలిపారు. దీని ద్వారా 1 బిలియన్ డాలర్ల వరకూ సేకరించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఈనామ్ ఏఎంసీ సుమారు 3.48 బిలియన్ డాలర్ల ఆస్తులను (ఏయూఎం) నిర్వహిస్తోంది. -
బీ న్యూలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ ఆవిష్కరణ
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఇక్కడ బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటి ఈషా రెబ్బ ఈ ఫోన్ను ఆవిష్కరించారు. సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, రెడ్మీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ కొనుగోళ్లకు సంబంధించి ఈఎంఐ, జీరో ఫైనాన్స్ సౌలభ్యం అందుబాటులో ఉన్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
హౌరా రైల్వే స్టేషన్ లో హైడ్రామా
-
పులివెందుల బస్టాండ్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
వావ్ అనిపించే ఫీచర్లతో హీరో కొత్త బైక్.. స్టైలిష్ లుక్తో అదరగొడుతోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా అదిరిపోయే లుక్తో ఓ బైక్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన ఎక్స్పల్స్ 200టీ మోడల్లో కొత్త అప్డేటెడ్ వెర్షన్ను లాంచ్ చేసింది. దీని ధర ముంబై ఎక్స్షోరూంలో రూ.1.25 లక్షలు. కొత్తగా మార్కెటలోకి తీసుకువచ్చిన ఈ అప్డేటెడ్ వెర్షన్లో బీఎస్ 6 200 సీసీ 4 వాల్వ్ ఇంజిన్ను అమర్చారు. ఈ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పవర్ 19 హెచ్పీ, 17.3 ఎన్ఎం టార్క్తో రాబోతోంది. గోల్డ్, రెడ్, ఎల్లో మేట్ ఫంక్ వంటి కలర్స్ యాడ్ చేశారు. ఈ బైక్లో 37 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్స్, వెనక భాగంలో 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ అమర్చారు. ఈ బైక్ను కొనుగోలు చేయాలనుకున్న వారు కంపెనీ వెబ్సైట్లోకి రూ. 2,500తో ఈ బైక్ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్తో ఫుల్ డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్, యూఎస్బీ చార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లను జోడించారు. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి నిధుల లభ్యతను పెంచే క్రమంలో దేశీయంగా తొలిసారి ష్యూరిటీ బాండ్ల బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డిసెంబర్ 19న దీన్ని ఆవిష్కరించనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ పథకంతో కాంట్రాక్టర్లకు భారీగా ఊరట లభించగలదన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు .. కాంట్రాక్టరు తరఫున బీమా కంపెనీ ఈ ష్యూరిటీ బాండును జారీ చేస్తుంది. ఇదీ చదవండి: సరికొత్త అవతార్లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..? ప్రాజెక్టు పనితీరుకు లేదా సకాలంలో పూర్తి చేయడానికి సంబంధించి ఇది హామీగా పని చేస్తుంది. ఒకవేళ కాంట్రాక్టరు గానీ హామీ నిలబెట్టుకోలేకపోతే ప్రాజెక్టు ఇచ్చిన సంస్థ ఈ బాండు ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవడానికి వీలవుతుంది. ఫైనాన్షియల్ గ్యారంటీలో ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉండగా.. ష్యూరిటీ బాండ్లలో పనితీరు సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్లు భారీ మొత్తాలను ఫైనాన్షియల్ గ్యారంటీ చూపించేందుకు కేటాయించాల్సి వస్తోందని, ష్యూరిటీ బాండ్లను ప్రవేశపెడితే వారికి ఆయా నిధులు అందుబాటులోకి రాగలవని గడ్కరీ చెప్పారు. ఈ నిధులను వారు వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తద్వారా మౌలిక రంగంలో నిధుల లభ్యతను పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడగలవని మంత్రి చెప్పారు. (రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్) ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్విట్స్)లో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాలుపంచుకో వచ్చని గడ్కరీ తెలిపారు. ఇన్విట్స్ ద్వారా దాదాపు ఎనిమిది శాతం రాబడులు కూడా అందుకోవచ్చన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పూర్తి స్వదేశీ, చౌక నిర్మాణ విధానాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. (రూపాయిల్లో వాణిజ్యంపై బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు) -
అదిరే లుక్తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ప్రవేగ్ డైనమిక్స్ తాజాగా డిఫై పేరుతో ఎస్యూవీని ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.39.5 లక్షలు. డెలివరీలు వచ్చే ఏడాది మూడవ త్రైమాసికం నుంచి ఉంటాయి. 800 యూనిట్లకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని వివరించింది. బెంగళూరు ప్లాంటులో ఏటా 6,000 బ్యాటరీ ప్యాక్స్ తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. వీర్ పేరుతో ఆఫ్–రోడ్ మిలిటరీ వర్షన్ ఎస్యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది. చదవండి: భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు -
వచ్చే ఏడాది జీప్ కొత్త మోడళ్లు
ముంబై: దేశీయ మార్కెట్ కోసం వచ్చే ఏడాది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు జీప్ ఇండియా హెడ్ నిపుణ్ మహాజన్ తెలిపారు. ‘వచ్చే ఏడాది కూడా వృద్ధిని చూస్తున్నాం. ఉత్పత్తిని జోడించినప్పుడు వృద్ధి జరుగుతుంది. కస్టమర్ సంఖ్యను, పరిమాణాన్ని పెంచుతాం. మరింత వ్యాపారాన్ని జోడిస్తామని ఆయన ప్రకటించారు. ఇదీ చదవండి: Zomato డెలివరీ ఫెయిల్: భారీ మూల్యం చెల్లించిన జొమాటో పరిమాణం పరంగా 2023 మెరుగ్గా ఉంటుంది. 2022లో మూడు ఉత్పాదనలను పరిచయం చేశాం.నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి పూర్తిగా ఖరీదైన విభాగంలో పోటీపడుతున్నాయి. మార్కెట్ పనితీరు బాగుంది’ అని అన్నారు. భారత్లో కంపెనీ జీప్ కంపాస్, రాంగ్లర్, మెరీడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విక్రయిస్తోంది. గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్ను ప్రవేశపెట్టిన సందర్భంగా నిపుణ్ ఈ విషయాలను వెల్లడించారు. కాగా, ఈ ఎస్యూవీ ధర రూ.77.5 లక్షలు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో తయారైంది. 110కిపైగా అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించారు. యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎనమిది ఎయిర్బ్యాగ్స్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్, త్రీ పాయింట్ సీట్బెల్ట్, ఆక్యుపెంట్ డిటెక్షన్ వీటిలో ఉన్నాయి. -
లాజిటెక్ నుండి డాకింగ్ స్టేషన్
న్యూఢిల్లీ: లాజిటెక్ కొత్తగా లాజి డాక్ పేరిట ఆల్ ఇన్ వన్ డాకింగ్ స్టేషన్ను ఆవిష్కరించింది. వివిధ డెస్క్టాప్ డివైజ్లకు ఒకే కనెక్షన్ పాయింట్గా ఇది ఉపయోగపడుతుంది. అయిదు వరకు యూఎస్బీ పెరిఫరల్స్, రెండు వరకూ మానిటర్లతో పాటు ఒక ల్యాప్టాప్ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రాఫైట్, తెలుపు రంగుల్లో ఇది లభిస్తుంది. దీని ధర రూ. 55,000 (పన్నులు కాకుండా). ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నుండి భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి వస్తుంది. -
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కొత్త ఫండ్ చూశారా?
హైదరాబాద్: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 డెట్ ఇండెక్స్ ఫండ్ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. నవంబర్ 16తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 ఇండెక్స్లోని సెక్యూరిటీల ఆధారంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. దీర్ఘకాలిక కోణంలో 3-5 ఏళ్ల వ్యవధికి నాణ్యమైన డెట్ పోర్ట్ఫోలియోను రూపొందించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు అనువైనది. (పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్) -
వ్యాపార రంగంలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా
బాలీవుడ్లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ తన ఉనికి చాటుకుంది. బి-టౌన్లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీనటుల్లో దీపికా ఒకరు. ఇకా ఆమె వెండితెర ఎంట్రీకి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా చాటింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా మెప్పించిన ఆమె.. తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో దీపికా పదుకొణె తన సొంత బ్రాండ్ను లాంచ్ చేసింది. చదవండి: హీరోతో అభ్యంతరకర సీన్.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్ 82 ఈస్ట్ అనే పేరుతో సెల్ఫ్ కేర్ బ్రాండ్ను ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ దీన్ని ప్రమోట్ చేస్తూ ఆమె వీడియో విడుదల చేసింది. ‘రెండేళ్ల క్రితమే సెల్ప్ కేర్ బ్రాండ్ను ప్రారంభించాలని అనుకున్నాం. ప్రస్తుతం దీన్ని మన దేశంలోనే లాంచ్ చేశాం. ఇక త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని పరిచయం చేస్తాం. ఇదే మా 82 ఈస్ట్’ అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దీపికా నిర్మాతగా మారి పలు చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపికా షారుక్ ఖాన్తో పఠాన్ చిత్రంతో పాటు పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్-కెలో హీరోయిన్గా చేస్తోంది. చదవండి: నా గ్లామర్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
జర్నలిస్ట్ రెహాన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
జీఆర్టీ జ్యువెలర్స్: పోల్కి దేవాన్షి ఆభరణాలు అదరహ!
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ పోల్కి వజ్రాలతో తీర్చిదిద్దిన దేవాన్షి ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. చరిత్రలో రాజ కుటుంబీకులు, సంస్థానాధీశులు ధరించిన ఈ వజ్రాభరణాలు నిపుణులైన హస్తకళాకారుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి. ఈ అద్భుత శ్రేణిపై 15% వరకు ప్రత్యేక ఆఫర్ లభిస్తుంది. ప్రత్యేక రూపకల్పన కోరుకునే కస్టమర్ల కోసం సంప్రదాయ, సమకాలిక అంశాలను మేళవించి పోల్కి దేవాన్షి ఆభరణాలను తీసుకొచ్చామని సంస్థ ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ తెలిపారు. GRT Jewellers brings you the Devanshi Polki Collection, where every design is a masterpiece! Exclusively Available at: UsmanRoad (Chn) Coats Road (Chn) Vijayawada (AP) Vizag (AP) Somajiguda (Hyd) Tirupati (AP) Jayanagar (BLR) Malleswaram (BLR)#grtjewellers #polki #diamond — GRT JEWELLERS (@GRTJewellers) November 3, 2022 -
రాయల్ఎన్ఫీల్డ్ సూపర్ బైక్ వచ్చేసింది..సూపర్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: స్టయిలిష్ అండ్ లగ్జరీ బైక్ మేకర్ రాయిల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బైక్ ప్రియులను ఆకట్టుకునేలా అద్భుత ఫీచర్లతో 650 సీసీ క్రూయిజర్ ‘సూపర్ మెటోర్ 650’ బైక్ను తీసుకొచ్చింది. అతి త్వరలో భారతీయ మార్కెట్లలో కూడా సందడి చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిరీస్లో భాగంగా ఇటలీలోని మిలన్లో జరుగుతున్న 2022 EICMA షోలో ఈకొత్త బైక్ను అధికారికంగా ఆవిష్కరించింది. క్లాసికల్ క్రూయిజర్ డిజైన్తో రెండు వేరియంట్లలో (స్టాండర్డ్ ,టూరర్) మొదటిది ఐదు రంగులలో, రెండోది రెండు రంగుల్లో ఆకర్షణీయ లుక్లో అదరగొడుతోంది. ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఆధారంగా, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 648 సీసీ ట్విన్ ఇంజీన్ను ఇందులో అమర్చింది. 7,250 ఆర్ఎంపీ వద్ద 47 హెచ్పీ పవర్ను, 5650 ఆర్ఎంపీ వద్ద 52 గరిష్క టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. టియర్ డ్రాప్ ఆకారంలో 15.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అమర్చింది. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్, ఫ్రంట్ 320 మిమీ డిస్క్ బ్రేక్, రియర్లో 300 డిస్క్ తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. రౌండ్ LED హెడ్ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.భారతదేశంలో దాదాపు రూ. 3.4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుందని అంచనా. -
గ్రాండ్ లాంచ్కు రెడీగా రియల్మీ 10 సిరీస్.. ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మి (Realme) నుంచి రియల్మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్లో గ్రాండ్ లాంచ్క్ రెడీగా ఉంది. కంపెనీ రియల్మీ 10 సిరీస్ను చైనాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ నవంబర్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్కు ముందు, ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్ డిజైన్పై పుకార్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా త్వరలో Realme 10 సిరీస్ మార్కెట్లోకి రానున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. రాబోయే లైనప్లో వనిల్లా Realme 10, Realme 10 Pro+ అనే రెండు మోడల్లు ఉన్నాయి. కంపెనీ రియల్మీ సిరీస్ డిజైన్, పెర్ఫార్మెన్స్, పనితీరును ట్విటర్ ద్వారా రివీల్ చేసింది. రెగ్యులర్ మోడల్ MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది. Realme 10 Pro+ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 1080 SoCని కలిగి ఉంటుంది. ఫీచర్ల అంచనా.. Realme 10 4G.. 90Hz రిఫ్రెష్ రేట్తో 6.4 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►స్మార్ట్ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ►4GB RAM, 128GB స్టోరేజ్ ►స్మార్ట్ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్తో 5000mAh బ్యాటరీ Realme 10 Pro+ 5G.. 6.7 ఇంచెస్ AMOLED FHD+ డిస్ప్లే ► అండర్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ►స్మార్ట్ఫోన్ 8GB వరకు RAM, 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ జత చేయబడిన డైమెన్సిటీ 1080 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ►67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000mAh బ్యాటరీ సపోర్ట్ చదవండి: మస్క్కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్? -
15 వేలకే యాపిల్ 4కే టీవీ, అదిరిపోయే ఐప్యాడ్, ఐప్యాడ్ ప్రో
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ న్యూ జనరేషన్ యాపిల్ 4కే టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ 14,900గా ఉంచింది. దీంతోపాటు 5జీ సరికొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ప్రో (ఎం2చిప్సెట్) విడుదల చేసింది. ముఖ్యంగా ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో అదిరిపోయే లుక్లో ఈ ప్యాడ్ను తీసుకొచ్చింది. యాపిల్ 4కే టీవీ డాల్బీ విజన్తో పాటు HDR 10+కి మద్దతుతో సిరి రిమోట్, USB Type-C పోర్ట్ను ఇందులో జోడించింది. రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేసింది. వేగవంతమైన నెట్వర్కింగ్ , స్ట్రీమింగ్ కోసం వైఫై ఈథర్నెట్ సపోర్ట్తో 64 జీబీ స్టోరేజ్. రెండోది యాప్లు, గేమింగ్ కోసం 128 జీబీ స్టోరేజ్తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర 16,900. ఇంట్లోనే అతిపెద్ద స్క్రీన్పై తమకు ఇష్టమైన వినోదాన్ని ఆస్వాదించే లక్క్ష్యంతో గతంలో కంటే మరింత శక్తివంతంగా దీన్ని లాంచ్ చేసినట్టు వైస్ ప్రెసిడెంట్ బాబ్ బోర్చర్స్ అన్నారు. ఈటీవీలు ఆపిల్ ఇండియా వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్కు అందుబాటులో ఉండగా, షిప్పింగ్ నవంబర్ 4 నుండి ప్రారంభం. ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో ఐప్యాడ్ ఫుల్ ఆల్ స్క్రీన్ తో సిల్వర్, బ్లూ, ఎల్లో, పింక్ నాలుగు కొత్త రంగుల్లో కొత్త 10వ తరం ఐప్యాడ్ అందుబాటులో ఉండనుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ 2022 వైఫై 64 జీబీ మోడల్ ధర రూ. 44,900 గాను, వైఫై 256 జీబీ వేరియంట్ ధర రూ. 59,900గా ఉంది. అలాగే వైఫై + సెల్యులార్ 64 జీబీ మోడల్ ధర రూ. 59,900 గాను, వైఫై + సెల్యులార్ 256 జీబీ ధర రూ. 74,900 గా ఉంది. ఐప్యాడ్ స్పెసిఫికేషన్స్ 10.9 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ ప్లే ఏ14 బయోనిక్ చిప్ సెట్ ఐప్యాడ్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ రియర్ కెమెరా 4కే వీడియో సపోర్ట్ ఈ ఐప్యాడ్ కి సంబందించిన ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. యాపిల్ వెబ్సైట్ ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 26నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. -
డిజిటల్ కరెన్సీ: ఆర్బీఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ రూపాయికి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిజిటల్ రూపాయిని లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసింది. పరిమిత వినియోగం నిమిత్తం పైలట్ ప్రాతిపదికన ఈ-రూపాయిని త్వరలో ప్రారంభించనున్నామని శుక్రవారం విడుదల చేసిన కాన్సెప్ట్ పేపర్లో ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు కనిష్టంగా లేదా అంతరాయం కలగని విధంగా ఈ-రూపాయి వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను ఇ-రూపాయి తుది డిజైన్లో పొందుపరుస్తామని ఆర్బీఐ కాన్సెప్ట్ పేపర్ జారీ సందర్భంగా ప్రకటించింది. ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలతో ఎలాంటి రిస్క్ లేకుండా, రిస్క్ ఫ్రీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ మనీని పౌరులకు అందించడం తన బాధ్యత అని వ్యాఖ్యానించింది. అలాగే ఇ-రూపాయి నిర్దిష్ట లక్షణాలు,ప్రయోజనాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటామని ఆర్బీఐ పేర్కొంది కాగా ఆర్బీఐ కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సాధకబాధకాలను పరిశీలిస్తోంది. దశల వారీగా డిజిటల్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తెలిపిన సంగతి విదితమే. Issuance of Concept Note on Central Bank Digital Currencyhttps://t.co/JmEkN7rPyA — ReserveBankOfIndia (@RBI) October 7, 2022 -
హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకొచ్చింది. విడా వీ1, వీ1 ప్రొ అనే రెండు వేరియంట్లలో దీన్ని శుక్రవారం లాంచ్ చేసింది. కొత్త ఈవీ అనుబంధ సంస్థ- విడా బ్రాండ్ క్రింద ఇ-స్కూటర్లను ప్రారంభించడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి హీరో మోటో ప్రవేశించింది. విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు ఢిల్లీ , జైపూర్ మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్లు ప్రారంభమవుతాయి. బుకింగ్లు అక్టోబర్ 10న ప్రారంభం. డిసెంబర్ రెండో వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక్కో ఛార్జింగ్కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్ను అందించవచ్చని హీరో వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇది OTA అప్డేట్లను అందించడానికి కనెక్ట్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. కాగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఇ-స్కూటర్లతో పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
5జీ సేవలు లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ
-
PM launch 5G services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలు (5G Services) ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా (అక్టోబర్ 1న) లాంఛనంగా ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో అక్టోబర్ 1 నుంచి 4 తేదీల మధ్య జరిగే 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్–2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.. ప్రధానికి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోదీ స్వయంగా పరిశీలించారు. రిలయన్స్ జియో అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామంలో, భారతీ ఎయిర్టెల్ వారణాసిలో 5జీ సేవలను ప్రారంభిస్తాయి. ప్రధాని ఈ సందర్భంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తోపాటు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో 5జీ టెక్నాలజీ ఆధారంగా కనెక్ట్ కాబోతున్నారు. వొడాఫోన్ ఐడియా సైతం 5జీ సేవలను ప్రారంభించనుంది. కాగా, దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో 5జీ సేవలను పరిచయం చేస్తామని జియో ఇప్పటికే ప్రకటించింది. నెల రోజుల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ కూడా వెల్లడించారు. ముందుగా 5జీ సేవలను 13 నగరాలకు అందించనున్నారు. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్నగర్. చదవండి: Natural Gas Prices Hike: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు -
టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా!
యువతను తన వైపుకు తిప్పుకొని రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టిన టీవీఎస్ అపాచీ (Tvs Apache) మోడల్ బైకులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ కొత్తగా రెండు అపాచీ మోడళ్లను లాంచ్ చేసింది. ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160( 2022 TVS Apache RTR 160), రెండోది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోడల్. RTR 160 ధర రూ 1.18 లక్షలు కాగా RTR 180 ధర 1.31 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తగా రాబోతున్న ఈ రెండు మోటార్సైకిళ్లలో రిఫ్రెష్డ్ డిజైన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect) చేయబడిన టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక రెయిన్, అర్బన్, స్పోర్ట్ పేరుతో మూడు విభిన్న డైవింగ్ మోడ్లు ప్రత్యేక ఫీచర్గా చెప్పాలి. ఫీచర్లు ఇవే: 2022 TVS Apache RTR 160.. 5-స్పీడ్ గేర్బాక్స్తో 159.7 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, 16.04 PS పవర్, 13.85 Nm టార్క్ డెలివర్ చేస్తుంది. 2022 TVS Apache RTR 180.. 5-స్పీడ్ గేర్బాక్స్, 17PS పవర్, 15 Nm టార్క్తో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజన్తో వస్తుంది. వీటిలో..ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్లతో పాటు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ (LED) హెడ్ల్యాంప్ కూడా ఉంది. అధునాతన బ్లూటూత్తో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తున్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 సిరీస్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుండగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్లో గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, టీ-గ్రే వంటి ఐదు వేరియంట్ కలర్స్లో లభ్యమవుతుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్ క్రేజ్ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్ లుక్తో వచ్చేస్తోంది!
ఒకప్పుడు ఆటో మొబైల్ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్ కంపెనీ మరోసారి భారత్లో తన మార్క్ని చూపెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం 1970లో కస్టమర్లను తనవైపు తిప్పుకుని భారత రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరిగిన లాంబ్రెట్టా స్కూటర్లును .. 2023లో లేటెస్ట్ మోడల్తో తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రానున్న మోడల్స్లో 200, 350సీసీ ఇంజిన్స్తో ఈ స్కూటర్లు రానున్నాయి. వీటితో పాటు 2024 చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. బర్డ్ గ్రూప్తో జాయింట్ వెంచర్లో భాగంగా ఈ కంపెనీ మార్కెట్లోకి ఈ స్కూటర్లను తీసుకురాబోతున్నాయి. కంపెనీ ముఖ్య అధికారి మాట్లాడుతూ.. బర్డ్ గ్రూప్తో కలిసి వచ్చే 5 సంవత్సరాలలో $200 మిలియన్లకు పైగా ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. 1970లో భారత్ మార్కెట్లో ఈ స్కూటర్ బ్రాండ్కి ప్రత్యేక గుర్తింపుతో పాటు కస్టమర్లలో వీటికి విపరీతమైన క్రేజ్ ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త రకం స్కూటర్ల మోడళ్లను డిజైన్, లుక్, ఫీచర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల కానున్న స్కూటర్లతో కంపెనీకి భారత్లో ఉన్న గత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్లు హై-ఎండ్ మోడల్స్గా, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అత్యంత ఖరీదైన మోడల్ల కంటే దాదాపు 20% ఖరీదు ఉంటుందని అంచనా. ఈ జాయింట్ వెంచర్లో లాంబ్రెట్టా 51% వాటా ఉండగా, మిగిలిన 49% బర్డ్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్ లాంబ్రెట్టా స్కూటర్ 2023లో మిలన్ మోటార్సైకిల్ షోలో ప్రజలకు ప్రదర్శించబోతోంది. అదే మోడల్ను భారత్లో స్థానికంగా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. లాంబ్రెట్టా ప్రస్తుతం దాదాపు 70 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. -
బ్యాట్ పట్టిన చిరంజీవి..పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
ఆల్ న్యూ ఆల్టో కే10- 2022 వచ్చేసింది.. మోర్ ఎనర్జీ ఫీచర్స్తో
సాక్షి, ముంబై: మోస్ట్ ఎవైటెడ్ మారుతి సుజుకి ఆల్టో K10 2022 మోడల్ వచ్చేసింది. నేడు (గురువారం, ఆగస్టు 18) మారుతి సుజికి ఇండియా లాంచ్ చేసింది. మారుతి చల్ పడీ అంటూ ఆల్టో K10 2022 ను తీసుకొచ్చింది. రెడ్ అండ్ బ్లూ రంగుల్లో ఆవిష్కరించింది. ఆల్టో K10 2022 కేవలం ప్రారంభ రూ. 3, 99,000 గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ న్యూ వెర్షన్ ఆల్టో K10 2022 లభించనుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మారుతి సుజుకి ఇప్పటికే కొత్త 2022 ఆల్టో కోసం బుకింగ్లను ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలు దారులు ఆల్టోను రూ. 11,000తో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మారుతి సుజుకి ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్తో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (ఇది చదవండి: నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు) కాగా మారుతి సుజుకి ఆల్టో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పటి వరకు ఈ కారును 40 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో ఫస్ట్ జనరేషన్ 2000లో ఆల్టో 800గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10కి రెనాల్ట్ నుండి మాత్రమే పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (రియల్మీ 5జీ ఫోన్, ఇయర్ బడ్స్ లాంచ్: ఇంత తక్కువ ధరలోనా సూపర్!) -
మహిళలకు గొప్ప సందేశాత్మకంగా 'లవ్'
Love Movie Logo Launched By Director Nag Ashwin: రామరాజు, సోనాక్షీ వర్మ, అభి, ప్రీతీ సింగ్, శ్రీకృష్ణ, డాక్టర్ మారుతి సకారం ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘లవ్’. శ్రీనారాయణ దర్శకత్వంలో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – ‘‘గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథతో రానున్న సినిమా ఇది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుతున్నా. అలాగే ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశా’’ అని తెలిపారు. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. మహిళలకు సంబంధించిన ఓ గొప్ప సందేశం అంతర్లీనంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. చదవండి: రొమాంటిక్ వెబ్సిరీస్గా 'ఎమోజీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన లవ్బర్డ్స్! -
హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!
సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్పోర్టీ బైక్ను మార్కెట్లో విడుదల చేసింది. హోండా డియో స్పోర్ట్స్ పేరుతో రెగ్యులర్ డియో మోటో-స్కూటర్ స్పోర్టీ వెర్షన్గా లాంచ్ చేసింది. అయితే లిమిటెడ్ ఎడిషన్గా తీసుకొచ్చిన హోండా స్పోరర్ట్స్ పరిమిత కాలంలోనే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర 68,317/- (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ డీలక్స్ వేరియంట్ ధర రూ. 73,317 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ ప్రకటించింది. రెగ్యులర్ డియో స్టాండర్డ్ , డీలక్స్ ధర రూ. 73,599, రూ. 77,099 (ఎక్స్-షోరూమ్)ధరలతో పోలిస్తే కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధరలు చౌకగా ఉండటం విశేషం. ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ స్పోర్టీ రెడ్ రియర్ సస్పెన్షన్తో తీసుకొచ్చిన హోడా డియో స్పోర్ట్స్ స్కూటర్ బ్లాక్తో స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ ,స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ 2 కలర్ స్కీమ్లలో వస్తుంది. డీలక్స్ వేరియంట్ అదనంగా అల్లాయ్ వీల్స్ను అందిస్తుంది. 110 cc PGM-FI ఇంజిన్తో మెరుగైన స్మార్ట్ పవర్ (eSP) సాంకేతికతను అందిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్, పాస్ స్విచ్ , ఇంజన్ కట్-ఆఫ్తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా డియో స్పోర్ట్స్లో హోండా కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS) ఈక్వలైజర్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం 3-స్టెప్ ఎకో ఇండికేటర్ని జోడించింది. -
షావోమి 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్ త్వరలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమి త్వరలోనే 200 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్ఫోన్ లాంచ్ చేయనుంది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, 200MP సెన్సార్, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, 120Hz డిస్ప్లే , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే మోటరోలా తన తదుపరి ప్రీమియం స్మార్ట్ఫోన్ను 200 ఎంపీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అలాగే శాంసంగ్ కూడా 50 మెగాపిక్సెల్ ISOCELL జీఎన్ఎస్ సెన్సార్, 200-మెగాపిక్సెల్ సెన్సార్తో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ రేసులో షావోమి కూడా చేరింది. కాగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విక్రేతలు దేశంలో 38 మిలియన్ స్మార్ట్ఫోన్లను రవాణా చేయడంతో 2022 క్యూ1లో భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ సంవత్సరానికి కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. ఈ సమయంలో 8 మిలియన్ యూనిట్లన విక్రయాలతో షావోమి ఇండియాలో టాప్ బ్రాండ్గా నిలిచింది. శాంసంగ్ 6.9 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది. -
ఎలక్ట్రిక్ కియా.. ఆగయా: నటి క్యాథెరిన్, జానీ మాస్టర్ సందడి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కార్ల కంపెనీ కియా సరికొత్త పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం తొలిసారిగా మార్కెట్ లోకి వస్తోంది. త్వరలో వినియోగదారుల కు అందుబాటులో కి రానున్న ఈ కార్ ని హైదరాబాద్ లో ప్రదర్శించారు. · హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగిన కియా ఈవీ6 ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ నటి క్యాథెరిన్, సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్ ; షోరూమ్ ప్రతినిధి చెన్న కేశవ– సీఓఓ, జీఎం వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్లో ఉన్న ఆటోమోటివ్ కియా, హైటెక్ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 3లక్షల రూపాయల టోకెన్ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్ చేసుకో వచ్చు. దేశవ్యాప్తంగా 100 మంది వినియోదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్ 2022లో విడుదల చేయనున్నట్టు కియా ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేకతలివీ... ఈ కియా ఈవీ6ను ఈ–జీఎంపీ పై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్, అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్లో 77.4 కిలోవాట్ హవర్ లిథయం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్ విద్యుత్ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్లో 325పీఎస్ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్ సన్రూఫ్, డ్రైవర్, ప్యాసెంజర్ రిలాక్సేషన్ సీట్లు, రిమోట్ ఫోల్డింగ్ సీట్లు, ఏఆర్ హెడ్ అప్ డిస్ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్బ్యాగ్లు దీనిలో ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం మూన్స్కేప్, స్నో వైట్ పెరల్, రన్వే రెడ్, అరోరా బ్లాక్ పెరల్, యాచ్ బ్లూ –రంగుల లో లభిస్తుంది. -
పని చేస్తూ.. కునుకు తీసినా ఓకే!
‘నిద్ర తన్నుకొస్తోంది.. కాసేపు కునుకు తీస్తా’ అని పనిచేసే చోట అంటే ఒప్పుకుంటారా..? ‘మీ సేవలు ఇక చాలు’ అనే సమాధానం వినిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండేదేమో! ఉద్యోగులు కొద్దిసేపు కునుకు తీసేందుకు అభ్యంతరం లేదంటున్నాయి స్టార్టప్ సంస్థలు. పరుపులు, మంచాలు తదితర హోమ్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ‘వేక్ ఫిట్’ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగేగౌడ ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. ‘రైట్ టు న్యాప్’ విధానాన్ని ప్రకటించారు. లంచ్ తర్వాత కొద్దిసేపు నిద్రపోవడం ఉద్యోగుల హక్కుగా మార్చేశారు. తద్వారా ఉద్యోగుల అవసరాలను గుర్తించే సంస్థగా వేక్ఫిట్ను మార్చేశారు. నైపుణ్య మానవ వనరులు కంపెనీల పురోగతికి ఎంతో అవసరం. స్టార్టప్ సంస్థలు ఈ సూక్ష్మాన్ని గుర్తించే పనిచేస్తుంటాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో వేక్ఫిట్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. పనిచేసే చోట సౌకర్యంగా ఉంటేనే.. కరోనా మహమ్మారి అనంతరం ఉద్యోగులు పనికి, ఇంటికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిచేసే చోట సౌకర్యాన్ని, సదుపాయాలకు వారు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎన్నో సర్వేలు ప్రకటించాయి. ఇదంతా డిజిటల్ ప్రపంచం. నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలకు కొరత లేదు. ఆకర్షించే ఆఫర్లతో వారు వేగంగా సంస్థలు మారిపోతున్నారు. అనుభవం కలిగి, నైపుణ్యాలున్నవారు అలా వెళ్లిపోతే.. కంపెనీల్లో కీలక పనులు పడకేస్తాయి. అందుకనే ఉద్యోగుల వలసలు (అట్రిషన్) తగ్గించేందుకు వారిని సంతోషపరిచే పలు నిర్ణయాలను వేక్ఫిట్, డ్రీమ్11, ద గుడ్ గ్లామ్ గ్రూపు, బీట్వో, జెప్టో తదితర స్టార్టప్లు తీసుకుంటున్నాయి. వేక్ఫిట్ తీసుకున్న రైట్ టు న్యాప్ పట్ల ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం నిద్ర వరకే పరిమితం అనుకోవడానికి లేదు. పుట్టిన రోజు వేడుక కోసం సెలవు కోరినా ఈ కంపెనీలు అభ్యంతరం పెట్టవు. విహార యాత్రకు వెళ్లొస్తామన్నా.. పంపించి అయిన ఖర్చులను తిరిగి రీయింబర్స్ చేస్తున్నాయి. అంతేకాదు చాట్బాట్స్ సాయంతో సంస్థ అందిస్తున్న సేవలపై ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న కార్పొరేట్ సంస్కృతిని మార్చేలా కొత్త సంస్థల విధానాలు ఉంటున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగుల్లో మారిన ధోరణి.. ఈ తరహా చర్యలు అదనపు ప్రభావాన్ని చూపిస్తాయని వేక్ఫిట్ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగేగౌడ తెలిపారు. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుండడం.. తమకున్న నైపుణ్యాలకు కొత్త కొత్త అవకాశాలు పలుకరిస్తుండడం, అననుకూల పనివేళలు ఇవన్నీ కూడా ఉద్యోగులు సంస్థలు వీడేందుకు కారణమవుతున్నాయి. దీంతో ఈ పరిస్థితులను అధిగమిచేందుకు ఉద్యోగులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగుల సౌకర్యాన్ని చూస్తున్నాయి. ఉత్పాదకత పెరుగుతుంది..! మధ్యాహ్నం భోజనం తర్వాత 30 నిమిషాలు నిద్రించడం వల్ల రోజంతా తాజాగా ఉంటారని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అప్పటి వరకు పడిన అలసట 20–30 నిమిషాల నిద్రతో పూర్తిగా తొలగిపోతుందట. ఉద్యోగులు లంచ్ తర్వాత కొద్ది సేపు అలా నడుము వాల్చేందుకు అనుమతిస్తే.. అది కంపెనీల ఉత్పాదకతను కూడా పెంచుతుందేమో చూడాలి. -
‘ఫెమ్ టెక్’ గమ్యస్థానం.. హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఉన్న ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి వంద బిలియన్ డాలర్లకు చేర్చడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో జీనోమ్ వ్యాలీ.. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల్లో పవర్హౌస్గా మారుతోందన్నారు. దీంతో ప్రపంచంలోని ప్రముఖ పరిశోధన, అభివృద్ధి సంస్థలు హైదరాబాద్కు పెట్టు బడులతో వస్తున్నాయని చెప్పారు. స్విట్జ ర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్ టీఎస్ఐఐసీ బయోటెక్ పార్క్ లో ఏర్పాటుచేసిన కొత్త సమీకృత పరిశోధన, అభివృద్ధి, తయారీ యూనిట్ను కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఇటీవలి తన అమెరికా పర్యటనలో వివిధ రంగాల్లో రూ.7,500 కోట్ల పెట్టుబడులు సాధించగా, అందులో సగం లైఫ్సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందినవే ఉన్నాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ రంగంలో పరిశోధన, తయారీ పరిశ్రమలకు (ఫెమ్ టెక్) హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందన్నారు. పుణేకు చెందిన భారత్ సీరమ్ వాక్సిన్ కంపెనీ త్వర లో రూ.200 కోట్ల పెట్టుబడితో ఇంజెక్టబుల్, వాక్సిన్ మాన్యుఫ్యాక్చరింగ్ను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ సంస్థ మహిళల ఆరోగ్య రక్షణ ఉత్పత్తులతో పాటు రేబిస్ వ్యాక్సిన్ తదితరాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. 30 మిలియన్ యూరో(సుమారు రూ. 245కోట్లు)ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ గర్భధారణ మొదలు ప్రసవం వరకు అవసరమైన ఔష ధాలు, చికిత్స విధానాలను అభివృద్ధి చేస్తుం దని చెప్పారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఫార్మా, హెల్త్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఫెర్రింగ్ ఫార్మా ఉపాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోసెట్టె, ఎండీ అనింద్య ఘోష్ పాల్గొన్నారు. ఆవిష్కరణలో ముందంజ.. ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ దూసుకుపోతోందని.. డిజైన్ థింకింగ్, ఆవిష్కరణలు, పరిజ్ఞానంలో కొత్త తీరాలను తాకుతోందని కేటీఆర్ అన్నారు. అడ్మినిస్ట్రేటవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో తెలంగాణ ‘వాష్ ఇన్నోవేషన్ హబ్’(డబ్ల్యూఐహెచ్)ను ఏర్పాటు చేసిందన్నారు. వాష్ ఇన్నోవేషన్ హబ్ లోగోను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. వాష్ ఇన్నోవేషన్ హబ్ నిర్వహించే ఐNఓఃగిఅ ఏ 3.0 వార్షిక ఉత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో జరిగే ఈ ఉత్సవంలో ఔత్సాహిక ఆవి ష్కకర్తలు పాల్గొనాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. స్టార్టప్లు, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వా మ్యంతో వాష్ ఇన్నోవేషన్ హబ్ పని చేస్తుం దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్దేశిం చుకున్న ప్రమాణాలను చేరుకునేందుకు ప్రభుత్వం వాటర్, శానిటేషన్, హైజీన్ (వాష్)కు ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించారు. -
హల్చల్ చేస్తోన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్..!
భారత మార్కెట్లలోకి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ సరికొత్త కారును లాంచ్ చేసింది. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ గోస్ట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ గోస్ట్ ధర రూ. 12.25 కోట్ల నుంచి ప్రారంభంకానుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ రోల్స్ రాయిస్ ప్రసిద్ధ లగ్జరీ సెడాన్, ఘోస్ట్కి అప్గ్రేడ్గా రానుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్లో శక్తివంతమైన 6.75-లీటర్ వీ12 ఇంజన్ను అమర్చారు. ఇది స్టాండర్డ్ ఘోస్ట్తో పోల్చితే అదనంగా 29 పీఎస్ శక్తిను, 50 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారులో కొత్త జెడ్ఎఫ్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను అమర్చారు. ఈ కారులో లగ్జరీ సెడాన్ 'స్పోర్ట్' మోడ్ను ఎనేబుల్ చేసేందుకుగాను కొత్త బటను చేర్చారు. 'స్పోర్ట్' మోడ్ థ్రోటెల్తో కారు కేవలం 4.7 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గేర్ షిఫ్టింగ్ మరింత వేగంగా మారుతుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ వీల్స్ 21-అంగుళాల బెస్పోక్ కాంపోజిట్ అల్లాయ్ వీల్స్ను కలిగి ఉండనుంది. పాంథియోన్ గ్రిల్తో పాటు 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ' క్రోమ్ బ్లాక్తో రానుంది. సిగ్నేచర్ హై-గ్లోసీ బ్లాక్ పియానో 44,000 ఫినిషింగ్లలో కస్టమర్లు ఎంచుకోవచ్చు. చదవండి: 10 వేలకుపైగా ఉద్యోగాలు...ఈవెన్ కార్గోతో హీరో ఎలక్ట్రిక్ జోడీ -
సైకలాజికల్, రొమాంటిక్ డ్రామాగా 'గేమ్ ఆన్'..
Game On Movie Launch By Director Praveen Sattaru: సైకలాజికల్, రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఆన్'. గీతానంద్, నేహా సోలంకి, వసంతి, కిరిటీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరోహీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మూవీ డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ '2020 నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఫీల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు.' అని తెలిపారు. 'ఈ 'గేమ్ ఆన్' చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి. ఇందులో ట్విస్ట్లు చాలా ఉంటాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డారు. మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా 2022లో బెస్ట్ సినిమా అవుతుంది. అని హీరో గీతానంద్ పేర్కొన్నారు. లూజర్గా ఉన్న యువకుడు విన్నర్ ఎలా అయ్యాడనే కథాంశంతో రూపొందించామని నిర్మాతలు వెల్లడించారు. చదవండి: ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్ఫ్రెండ్పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు.. చదవండి: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పథకాలు ఆపేయాలట!
గత 35 నెలల్లో రూ.1,36,694 కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. ఇందులో రూ.94,318 కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల చేతుల్లోకి వెళ్లింది. కరోనా వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎదురు తిరిగినా, చెక్కుచెదరని సంకల్పం చూపించాం. నా ఇబ్బందులు నాకు ఉన్నా, వాటి ముందు మీ ఇబ్బందులే ఇంకా ఎక్కువ అని భావించి మీ సోదరుడిగా మీకు తోడుగా నిలిచాను. ఇంతలా మనసున్న పాలనను గతంలో మీరు ఎప్పుడైనా చూశారా? ఇంతటి సంక్షేమాభివృద్ధికి కారణమైన పథకాలను వాళ్లు ఆపేయాలంటున్నారు.. ఆపేయాలా? మీరే చెప్పండి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుండటం చూసి దుష్ట చతుష్టయం.. చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్, టీవీ5.. వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముద్ర పడటంతో వారికి కడుపు మంట పెరిగిపోయిందని చెప్పారు. అక్కచెల్లెమ్మలందరూ సొంత కాళ్లపై నిలబడేలా పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతుండటం తట్టుకోలేక విష ప్రచారానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాలన్నీ ఆపేయాలని, లేదంటే రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. ‘మీరే చెప్పండి.. ఈ పథకాలన్నీ ఆపేయాలా?’ అని అక్కచెల్లెమ్మలను ప్రశ్నించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆయన ఒంగోలులో ప్రారంభించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి కోటి 2 లక్షల 16 వేల 410 మంది మహిళల ఖాతాల్లో రూ.1,261 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పీవీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ పథకం కింద ఈ మూడు సంవత్సరాల్లో రూ.3,615 కోట్లు అందజేశామని చెప్పారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ జగనన్న కాలనీలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. తదితర పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల చరిత్రను మార్చేస్తున్నామని తెలిపారు. కేవలం ఈ 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు నేరుగా ప్రజల చేతుల్లో పెట్టామని సగర్వంగా చెబుతున్నానన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పేదల కడుపు నింపడం తమాషాలా? – ఏ పథకంలోనూ ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు. బటన్ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. 1వ తేదీన పొద్దున్నే తలుపు తట్టి పింఛన్ అందిస్తున్నాం. ఏ పథకంలో అయినా ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే జూన్లో, డిసెంబర్లో అందిస్తున్నాం. – అయితే ఇలాంటి పాలన వద్దని, మా బాబు పాలనే కావాలని దుష్ట చతుష్టయం, వారి దత్తపుత్రుడు అంటున్నారు. ఈనాడులో వాళ్లు రాస్తున్న రాతలు ఏంటో తెలుసా? ప్రభుత్వం డబ్బులు పంచే తమాషాలు ఇక ఆపాలట.. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం.. ఉచితంతో ఆర్థిక విధ్వంసం.. ఇవి రోజూ మన చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5లు మాట్లాడుతూ కలిసి రాస్తున్నారు. – ఇబ్బందులు పడుతున్న నా అక్కచెల్లెమ్మలు, రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అవ్వ, తాతలు, పేదరికంతో అలమటిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని నా వాళ్లందరికీ పథకాలు అమలు చేయడానికి వీలు లేదనేది ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడి ఉద్దేశం. – తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదల్చుకుందో అది వారి అధికార గెజిట్ పేపర్లో చెబుతుంటారు. దాదాపు రోజూ ఇటువంటి మాటలే. ఇటువంటి రాతలే. ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. చంద్రబాబులా.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే, ప్రజలకు వెళ్లాల్సిన సొమ్మంతా పాలకుల జేబుల్లోకి వెళితే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది ఈనాడు నిర్వచనం. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మీరు ఒప్పుకుంటారా? – లంచాలకు తావులేకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా? ఈ పథకాలన్నింటినీ ఆపేయాలని, చంద్రబాబుకు ఓటు వేస్తే వీటన్నింటినీ ఆపేస్తారని చెప్పకనే చెబుతున్నారు ఈ ఎల్లో మీడియా ప్రబుద్ధులు. దీనికి మీరు ఒప్పుకుంటారా? (ఒప్పుకోమంటూ అందరూ చేతులు పైకెత్తి ఊపారు) మీరు ఇలా గట్టిగా చెప్పడం వల్ల ఇప్పటికైనా ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు బుద్ధి వస్తుందని ఆశిద్దాం. – మనందరి ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ రూ.13,022 కోట్లు జగనన్న అమ్మ ఒడి ద్వారా లబ్ధి కలిగించాం. ఈ పథకాన్ని ఆపేయాలా? – 52.40 లక్షల మంది రైతులు, కౌలు రైతు కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కగానే వారి అకౌంట్లోకి డబ్బు వెళ్లిపోతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు, అసైన్డ్ రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ రైతన్నల కుటుంబాలు.. 52.40 లక్షల మందికి ఏకంగా రూ.20,162 కోట్లు నేరుగా ఇచ్చి మేలు చేశాం. ఈ పథకాన్నీ నిలిపివేయాలా? – ఏకంగా 25 లక్షల మంది 45 నుంచి 65 సంవత్సరాల వయస్సులోని అక్కచెల్లెమ్మలందరికీ మంచి చేస్తూ వైఎస్సార్ చేయూత పథకం తీసుకొచ్చాం. ఏటా వారికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తూ.. రిలయన్స్, అమూల్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థతో ఒప్పందాలు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేసి జీవనోపాధి చూపించాం. రూ.9,180 కోట్లతో అమలు చేస్తున్న ఈ పథకాన్నీ ఆపేయాలా? – గతంలో చంద్రబాబు మోసం వల్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రూ.25,517 కోట్ల మేర అప్పులపాలయ్యారు. సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేశారు. అప్పులు తడిసి మోపెడై 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా మారి ఎదురీదారు. మనందరి ప్రభుత్వంలో 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇస్తే..ఆ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా? – ఈ రోజు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరుతోనే ఇంటి స్థలాలు ఇచ్చాం. ఆ స్థలాల్లో ఇల్లు కట్టించే ఒక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఇది పూర్తయితే అక్కచెల్లెమ్మల చేతిలో ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్లు అవుతుంది. మొత్తంగా రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు వారి చేతుల్లో పెట్టినట్లు అవుతుంది. ఇటువంటి గొప్ప పథకాన్నీ ఆపేయాలా? (ఈ ప్రశ్నలన్నింటికీ ఒద్దు.. ఒద్దు.. అని ప్రజలు సమాధానమిచ్చారు) ఇలా ఎన్నో పథకాల ద్వారా మీకు తోడుగా నిలుస్తున్నాం. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తే కొద్దో గొప్పో మంచి జర్నలిజం అనేది కనిపిస్తుంది. మీరు కూడా ప్రశ్నించండి – 18.50 లక్షల పంపు సెట్లకు ఏటా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద ద్వారా జరుగుతున్న మంచి ఏమిటో మీ అందరికీ తెలుసు. నాడు–నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్న స్కూళ్లు, ఆస్పత్రుల రూపు రేఖలు మారుతున్నాయి. – వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 62 లక్షల మంది జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా దాదాపు లక్ష మంది చేనేత కుటుంబాలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.3 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతోంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మంది అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరుగుతోంది. – జగనన్న చేదోడు ద్వారా మన రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు.. మొత్తం 3 లక్షల మంది కుటుంబాలకు మంచి జరుగుతోంది. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారం చేస్తున్న 14.16 లక్షల మందికి మేలు కలిగింది. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2.75 లక్షల మంది సొంత ఆటోలు, సొంత క్యాబ్లు ఉన్న డ్రైవర్ల కుటుంబాలకు మంచి జరుగుతోంది. – వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 95 శాతం ప్రజలకు గొప్ప మేలు జరుగుతోంది. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకుని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నెలకు రూ.5 వేలు చొప్పున వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందిస్తున్నాం. ఇంకా గోరుముద్దు, సంపూర్ణ పోషణ.. ఇలాంటి పథకాలు కార్యక్రమాలన్నీ తీసి వేయాలన్నదే వాళ్ల ఉద్దేశం. – ఈ రోజు జగన్ చేస్తున్నది మంచా.. చెడా అన్నది మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఈ పథకాలన్నింటినీ నిలిపేయాలంటున్న ఎల్లో పార్టీలు, ఎల్లో మీడియా, వారి దత్తపుత్రుడిని నేను మీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా ప్రశ్నించండి. నిజంగా మీరు మనుషులేనా? అని అడగండి. ఇంత మంచి ఎలా చేయగలుగుతున్నానో ఆలోచించండి – జగన్ బటన్ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోంది. – రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ రోజు 70 శాతం మంత్రి పదవులు వచ్చాయి. సామాజిక న్యాయం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాల వారికి ఇవ్వడం మహా సామాజిక విప్లవం. మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఈ వర్గాల వారే ఉన్నారు. – ఎక్కడో ఎందుకు.. ఈ ఎల్లో సభ్యులు నివాసం ఉంటున్న విజయవాడను ఒక్కసారి ఉదాహరణగా తీసుకుందాం. విజయవాడ మేయర్ జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్గా జనరల్ స్థానంలో బీసీ మహిళ కనిపిస్తోంది. కనకదుర్గమ్మ తల్లి ఆలయ చైర్మన్గా బీసీ వ్యక్తికే అవకాశం కల్పించాం. 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లలో తొమ్మిది మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చాం. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా.. ఈ రోజు మీ అందరితో ఇన్ని విషయాలు పంచుకున్నాను. మీకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. చంద్రబాబు హయాంలో అయినా, మన హయాంలో అయినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అప్పులు దాదాపు ఒకటే. ఇంకా చెప్పాలంటే కాస్తో కూస్తో ఆయన కంటే మనమే తక్కువ అప్పులు చేస్తున్నాం. మరి అలాంటప్పుడు జగన్ ఎలా ఇంత మంచి చేస్తున్నాడు? ఆ పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు? అని అందరూ ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. జగన్ బటన్ నొక్కితే నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతోంది. చంద్రబాబు బటన్ నొక్కలేదు. ప్రభుత్వ సొమ్మును ఆయన కోసం, ఆయన చుట్టూ ఉన్న రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతల కోసం ఖర్చు చేస్తూ ఆయన పాలన సాగింది. అందుకే అదే బడ్జెట్, అదే రాష్ట్ర వనరులు, అవే అప్పులు అయినప్పటికీ జగన్ పాలన చంద్రబాబు పాలన కంటే చాలా చాలా గొప్పగా సాగుతోందని సగర్వంగా తెలియజేస్తున్నా. -
విజయ్తో సినిమా.. లాంచింగ్ ఈవెంట్లో కనిపించని సామ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్కి జోడీగా సమంత నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ శివ నిర్వాణతోపాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: తల్లి బర్త్డే సెలబ్రేషన్స్.. మిస్ అయిన మహేశ్ కానీ హీరోయిన్గా నటిస్తున్న సమంత మాత్రం మిస్సయ్యింది. దీంతో ఈ ప్రాజెక్ట్ లాంచ్కు సామ్ ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. సామ్ ఎక్కిడికెళ్లిందనే విషయంపై నెట్టింట చర్చ నడుస్తుంది. అసలు ఏమైందంటే.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం దుబాయ్లో హాలీడే ట్రిప్లో ఉంది. ఈ కారణంగానే మూవీ లాంచ్ ఈవెంట్కు ఆమె రాలేదని సమాచారం. కాగా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సమంత నటిస్తుండటం, రౌడీ హీరోతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో ఈ ప్రాజెక్ట్పై మరిన్ని అంచనాలు పెరిగాయి. చదవండి: ఆ హీరోయిన్ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్ -
హల్చల్ చేస్తోన్న బీఎండబ్ల్యూ నయా కార్...! ధర ఎంతంటే..?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ ఎక్స్4 సిల్వర్ షాడో ఎడిషన్ ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర రూ.71.9 లక్షల నుంచి ప్రారంభం. పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 252 హెచ్పీ పవర్తో 2 లీటర్ ఇంజన్, 6.6 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ 265 హెచ్పీ పవర్తో 3.0 లీటర్ ఇంజన్, 5.8 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం చేరుకుంటుంది. బుకింగ్స్ ప్రారంభ అయినట్టు కంపెనీ ప్రకటించింది. చదవండి: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..! -
సూపర్ ఫీచర్స్తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..?
భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ సిద్దమైంది. రెడ్మీ 10 సిరీస్లో భాగంగా రెడ్మీ 10 ఏ స్మార్ట్ఫోన్ను షావోమీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ భారత్లో ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. రెడ్మీ10ఏ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో టీజ్ చేసింది. Redmi 10A స్మార్ట్ఫోన్ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్లో కూడా లాంచ్ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్ఫోన్ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్ఫోన్ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది. Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది. Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా) 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్డ్రాప్ నాచ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ మీడియాటెక్ హెలియో జీ25 ప్రాసెసర్ పవర్వీ8320 జీపీయూ గ్రాఫిక్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4GB ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్..! -
మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా భారత మార్కేట్లోకి మరో మోటో జీ సీరీస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. తాజాగా మోటో జీ సిరీస్లో భాగంగా మోటో జీ52 అనే కొత్త స్మార్ట్ఫోన్ను యూరోప్ మార్కెట్లలోకి పరిచయం చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లలో కి లాంచ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలను చేస్తున్నట్లు సమాచారం. మోటో జీ52 సంబందించిన పలు ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఇక మోటో జీ 52 ఇండియా వెర్షన్ స్మార్ట్ ఫోన్ పీఓఎల్ఈడీ (pOLED) డిస్ప్లేతో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత తేలికైన, సన్నని స్మార్ట్ఫోన్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మోటో జీ 52 స్మార్ట్ ఫోన్ కొద్ది రోజుల క్రితం లాంచ్ ఐనా.. మోటో జీ 51 కి కొనసాగింపుగా రానుంది. యూరప్ లో మోటో జీ 52 249 యూరోలు (దాదాపు రూ. 20,600)గా నిర్ణయించారు. ఇక భారత మార్కెట్లలో ఈ స్మార్ట్ ఫోన్ ధర 20 వేల కంటే తక్కువ ధరలో వుండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ఫోన్ చార్కోల్ గ్రే, పింగాణీ వైట్ (Porcelain White) కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. మోటో జీ52 స్పెసిఫికేషన్ (అంచనా) 6.6-అంగుళాల FHD+ pOLED డిస్ప్లే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 12 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 30W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ -
అరవింద డిజైన్ స్టూడియోను ప్రారంభించిన లావణ్య త్రిపాఠి (ఫొటోలు)
-
హల్చల్ చేస్తోన్న యమహా సరికొత్త బైక్..! ధర ఎంతంటే..?
ప్రముఖ టూవీలర్ దిగ్గజం యహహా మోటార్స్ భారత మార్కెట్లలోకి న్యూ జనరేషన్ యమహా ఎంటీ15 వీ2.0 బైక్ను లాంచ్ చేసింది. ఈ బైక్ను యమహా ఆర్15 వీ4 బైక్ ఆధారంగా రూపొందించారు. డిజైన్, ఫీచర్స్లో కొత్తగా..! 2022 యమహా MT15 వీ2.0 డిజైన్స్లో సరికొత్త లుక్స్తో రానుంది. 2022 MT-15 సియాన్ స్టార్మ్ , రేసింగ్ బ్లూ , ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, మెటాలిక్ బ్లాక్ అనే నాలుగు కలర్ అప్షన్స్తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్తో సహా, కనుబొమ్మల ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో రానుంది. మస్కులర్ బాడీవర్క్, రైజ్డ్ టెయిల్ సెక్షన్, సైడ్-స్లంగ్ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్తో 2022 యమహా MT15 వీ2.0 స్టైలింగ్స్లో హైలైట్గా నిలుస్తోంది. ఈ బైక్లో పలు స్పెక్ హార్డ్వేర్ అప్డేట్స్, కొత్త ఫ్రంట్ ఫోర్క్తో రానుంది. బ్రేకింగ్ సిస్టమ్లో సింగిల్-ఛానల్ ఏబీఎస్ బదులుగా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో రానుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యమహా Y-కనెక్ట్ యాప్ను మద్దతు ఇస్తుంది. ఈ బైక్లో కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, రెగ్యులర్ క్విక్-షిఫ్టర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే..! 2022 యమహా MT15 వీ2.0 బైక్ వీవీఏ టెక్నాలజీతో కూడిన 155cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ను పొందింది. ఈ బైక్ 10,000rpm వద్ద 18.4 PS శక్తిని, 7,500rpm వద్ద 14.1 Nm గరిష్ట టార్క్ను విడుదల చేయనుంది. స్లిప్పర్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ను ఏర్పాటు చేశారు. ఈ బైక్ డ్యూక్ 125కు పోటీగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. MT15 కొత్త-తరం వెర్షన్ను రూ. 1.6 లక్షల ప్రారంభ ధరకు (ఎక్స్-షోరూమ్) లభించనుంది. చదవండి: మారుతి జోరులో టాటా పంచ్లు !? -
కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే
ఇండియన్ రోడ్లపై హల్చల్ చేస్తోన్న సెల్టోస్, సొనెట్ మోడల్ కార్లకు కియా సంస్థ మెరుగులద్దింది. సరికొత్త ఫీచర్లు జోడించి రిఫ్రెషెడ్ వెర్షన్ పేరుతో మార్కెట్లో రిలీజ్ చేసింది. అనతి కాలంలోనే కియా సంస్థ ఇండియన్ మార్కెట్లో పాగా వేయగలిగింది. ముఖ్యంగా కియా సంస్థ నుంచి వచ్చిన సెల్టోస్, సొనేటా మోడళ్లు ఇక్కడి వారికి బాగా నచ్చాయి. గడిచిన మూడేళ్లలో ఇండియాలో బాగా సక్సెస్ అయిన మోడళ్లలో సెల్టోస్ ఒకటి. అమ్మకాల్లో ఈ కారు రికార్డు సృష్టిస్తోంది. వెయింటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. తాజాగా రీఫ్రెష్ చేసిన తర్వాత సెల్టోస్లో కొత్తగా 13 ఫీచర్లు, సొనెట్లో అయితే 9 రకాల మార్పులు చేసినట్టు కియా పేర్కొంది. కియా సంస్థ సెల్టోస్, సొనెట్ కార్లలో చేసిన కీలక మార్పుల్లో ఎంట్రీ లెవల్ హై ఎండ్ అనే తేడా లేకుండా అన్ని వేరియంట్లలో 4 ఎయిర్బ్యాగ్స్ అందించనుంది. కియా కనెక్ట్ యాప్ను పూర్తిగా అప్గ్రేడ్ చేసింది. డీజిల్ వెర్షన్ కార్లలో కూడా ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని పరిచయం చేసింది. కియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ మోడలైన సెల్టోస్ ప్రారంభం ధర రూ.10.19 లక్షల దగ్గర మొదలవుతోంది. సోనెట్ ప్రారంభ ధర రూ.7.15 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు 2.67 లక్షల సెల్టోస్ , 1.25 లక్షల సొనెట్ కార్లు ఇండియాలో అమ్ముడయ్యాయి. చదవండి: Kia Motors: కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..! -
తక్కువ ధరలో...108ఎంపీ కెమెరాతో సూపర్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన రియల్మీ..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మీ భారత మార్కెట్లలోకి మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. కొద్దిరోజుల క్రితమే రియల్మీ 9 సిరీస్లో భాగంగా రియల్మీ 9 5జీ, రియల్మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, రియల్మీ 9ఐ, రియల్మీ 9 ప్రో 5జీ, రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ మోడల్స్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా రియల్మీ 9 సిరీస్లోకి మరో స్మార్ట్ఫోన్ రియల్మీ 9 4జీ ను తీసుకువచ్చింది. ధర ఎంతంటే..? హైఎండ్ స్పెసిఫికేషన్లతో స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు అందించేందుకుగాను రియల్మీ 9 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకువచ్చింది రియల్మీ. ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో రానుంది. రియల్మీ 9 4జీ (6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.17,999 కాగా, రియల్మీ 9 4జీ (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.18,999 గా ఉంది. సన్ బరస్ట్ గోల్డ్, స్టార్గేజ్ వైట్, మెటియార్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్లో రానుంది. రియల్ మీ 9 4జీ స్మార్ట్ఫోన్ లాంచ్ సందర్భంగా...హెచ్డీఎఫ్సీ కార్డుపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. కొనుగోలుదారులకు రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది.ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు ఏప్రిల్ 12న అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్కార్ట్, రియల్మీ వెబ్సైట్, రీటైల్ స్టోర్ల కొనుగోలు చేయవచ్చును. రియల్మీ 9 4జీ స్పెసిఫికేషన్స్ 6.4 అంగుళాల 90Hz అమొలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 108 ఎంపీ Samsung ISOCELL HM6 సెన్సార్ + 8ఎంపీ సూపర్ వైడ్ కెమెరా + 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 33వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు...! -
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్..రేంజ్లో కూడా అదుర్స్..! ధర ఎంతంటే...?
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేయనుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్ఫోలియోలోని ఆప్టిమా హెచ్ఎక్స్ సిరీస్కు అప్గ్రేడ్ చేస్తూ 2022 హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ స్కూటర్ను లాంచ్ చేయనుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. CX, CX ER వేరియంట్లలో రానుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ వేరియంట్ సింగిల్ బ్యాటరీతో వస్తుండగా..సీఎక్స్ ఈఆర్ డ్యూయల్ బ్యాటరీతో రానుంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్మునుపటి మోడల్ కంటే 25 శాతం ఎక్కువ శక్తివంతమైనదిగా అంచనా వేయబడింది.దాంతో పాటుగా ఎలక్ట్రిక్ మోటారు సామర్థ్యం మునుపటి కంటే 10 శాతం ఎక్కువగా ఉండనుంది. రేంజ్ ఎంతంటే..? హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ స్పెక్స్ వివరాలలోకి వెళితే...ఈ స్కూటర్లో 52.2Volt, 30ah లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ని కలిగి ఉంది. బేస్ CX వేరియంట్ 82 కిమీ పరిధిని అందించే ఒకే యూనిట్ను పొందుతుంది, అయితే CX ER డ్యూయల్ బ్యాటరీలతో అందించబడుతుంది. దీంతో ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కిమీల రేంజ్ వరకు ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్ 550W ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తాయి, ఇది గరిష్టంగా 45kmph వేగంతో 1.2kW (1.6 bhp) గరిష్ట అవుట్పుట్ను అందిస్తుంది. ఛార్జింగ్ సమయం దాదాపు 4-5 గంటలు. ఫీచర్ల విషయానికి వస్తే..! హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్, సీఎక్స్ ఈఆర్ రెండు వేరియంట్లలో ఒకే రకపు ఫీచర్లుతో రానున్నాయి. క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్, రివర్స్ మోడ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్ల్యాంప్లు, రిమోట్ కీతో కూడిన యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లను అందిస్తుంది. ధరల విషయానికొస్తే, Optima CX స్కూటర్ ధర Optima HX సిరీస్ కంటే కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఈ రెండు మోడల్స్ ధరలు రూ. 60,000 నుంచి రూ. 70,000 మధ్య ఉండవచ్చునని తెలుస్తోంది. ఆప్టిమా సీఎక్స్ రెండు వేరియంట్లు బ్లూ, గ్రే , వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి. చదవండి: కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన కియా ఇండియా..! -
హల్చల్ చేస్తోన్న మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ నయా మోడల్..! ధర ఎంతంటే..?
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పోర్ట్ఫోలియోలో సరికొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఈ కారు వ్యాగన్ఆర్ టూర్ హెచ్3గా పిలవనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్హెచ్3 సరికొత్త డిజైన్తో రానుంది. ఈ కారులో హ్యాచ్బ్యాక్ బాడీ కలర్ బంపర్స్, వీల్ సెంటర్ క్యాప్ అండ్ బ్లాక్-అవుట్ ఓఆర్వీఎంను అమర్చారు. కారు ఇంటీరియర్ విషయానికి వస్తే...ఇందులో ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్, టికెట్ హోల్డర్తో డ్రైవర్ సైడ్ సన్వైజర్, ఫ్రంట్ అండ్ రియర్ హెడ్రెస్ట్ ఉన్నాయి. అంతేకాకుండా సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, మాన్యువల్ ఏసీ, వెనుక పార్శిల్ ట్రే, రిక్లైనింగ్ అండ్ ఫ్రంట్ స్లైడింగ్ సీట్లు కలిగిన ఫ్రంట్ పవర్ విండోలతో రానుంది. గతంలో మారుతి సుజుకి పలు వేరియంట్లకు టూర్ వెర్షన్ మోడల్స్ను తీసుకొచ్చింది. ఇప్పుడు డిజైర్, ఎర్టిగా టూర్ వెర్షన్ మోడల్స్కు మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ కూడా వచ్చి చేరింది. వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో రానుంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.39 లక్షలు కాగా, సీఎన్జీ వేరియంట్ రూ. 6.34 లక్షలుగా ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే..! మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 కారులో డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, ఈబీడీ టెక్నాలజీతో ఎబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్స్, స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ డోర్ లాకింగ్తో రానుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో రానుంది. పెట్రోల్ పవర్ ట్రైన్తో..1.0-లీటర్, 3-సిలిండర్, K10C పెట్రోల్ ఇంజన్తో 5,500rpm వద్ద 64bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయనుంది. ఇది మారుతి సుజుకి డ్యూయల్జెట్ సాంకేతికతను ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్తో పొందుతుంది. దీంతో ఈ కారు 25.4km/l మైలేజ్ను అందిస్తుంది. సీఎన్జీ వేరియంట్లో డ్యూయల్ జెట్ సాంకేతికత లేదు. ఈ వెర్షన్ 5,300rpm వద్ద 56bhp శక్తిని, 3,400rpm వద్ద 82Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో రానుంది. ఈ వేరియంట్ గరిష్టంగా 34.73km/kg మైలేజ్ను అందించనుంది. చదవండి: హల్చల్ చేస్తోన్న టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..! లాంచ్ ఎప్పుడంటే..? -
ఏపీ కొత్త జిల్లాల అవతరణ
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్మేళా వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జాబ్ మేళా వెబ్సైట్ను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు హాజరయ్యారు. తొలి విడతలో 15 వేల ఉద్యోగాలు: ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో కనీసంగా 15 వేల ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఈనెల 16, 17న తిరుపతి.. 23, 24 తేదీలలో విశాఖపట్నం.. 30 మే 1 న గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ నుంచి పీహెచ్డీ వరకు చదివిన వారు అప్లై చేసుకోవచ్చన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు: కన్నబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. 1.22 లక్షల మందికి సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 2.59 లక్షల మంది వాలంటీర్లను నియమించామని మంత్రి పేర్కొన్నారు. -
వన్ప్లస్ నుంచి మరో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ భారత మార్కెట్లలోకి వన్ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. కాగా వన్ప్లస్ 10 ప్రో ఈ ఏడాది జనవరిలోనే చైనా మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్ఫోన్తో పాటుగా వన్ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్2 నెక్బ్యాండ్ను కూడా రిలీజ్ అయింది. క్వాల్కామ్ ఫాస్టెస్ట్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, అదిరిపోయే ఫీచర్లతో వన్ప్లస్ 10 ప్రో స్మార్ట్ఫోన్ రానుంది. ఇది వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ను మద్దతు పలకునుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఐఫోన్ 13 వంటి స్మార్ట్ఫోన్లతో వన్ప్లస్ 10 ప్రో స్మార్ట్ఫోన్ పోటీ పడనుంది. ధర ఏంతంటే..? వన్ప్లస్ 10 ప్రో రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. భారత్లో వన్ప్లస్ 10 ప్రో 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 కాగా, 12GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 71,999గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఎమరాల్డ్ ఫారెస్ట్, వాల్కానిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్తో రానుంది. వన్ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్ 6.7-అంగుళాల QHD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ 50 ఎంపీ+ 48 ఎంపీ+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5జీ సపోర్ట్ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ 80W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్ 50W AirVOOC వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ చదవండి: దేశవ్యాప్తంగా ఒకలా..హైదరాబాద్లో మరోలా.. విచిత్రమైన పరిస్థితి..!