టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాతగానీ ఏమీ మాట్లాడలేమని, అది తమకు ఇంకా అందలేదని రేవంత్ తరఫు న్యాయవాదులు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు రూ.50 లక్షలు ఇస్తూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు న్యాయవాదులు సోమవారం తెల్లవారుజామునే బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు.