ఉర్దూ భాషను అన్ని జిల్లాల్లో రెండో భాషగా గుర్తిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయం చెప్పారు. అలాగే జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూములను సొంతం చేసుకోడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిపై బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో కమిటీని నియమించామని, ఆ కమిటీ ఎక్కడెక్కడ వక్ఫ్ భూములున్నాయో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.