కేసీఆర్ తీరు వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఇది తెలంగాణకే నష్టమని అన్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ భవిష్యత్లో బీజేపీతో జత కడుతుందని, మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పొత్తు కోసం టీఆర్ఎస్ ప్రయత్నించిందన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి సిద్ధాంతం ఉండదన్నారు.