Jaipal Reddy
-
‘పంచాయతీ’ మాదే
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా కొన్ని సీట్లు గెలిచేదని.. కానీ వారికి ఆ అవకాశం లేకుండా పోయినట్టేనని వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యతను నాయకులుగా తామే తీసుకుంటామని చెప్పారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి వర్ధంతి సందర్భంగా.. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సభలో రేవంత్ పాల్గొన్నారు. కల్వకుర్తి సమీపంలోని కొట్ర చౌరస్తాలో జైపాల్రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు మొదలైనట్టేనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు అన్నారు.ప్రజలెవరికీ ఎలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ కుటుంబానికే కష్టం వచ్చింది. ఆ కష్టాలను కప్పిపుచ్చుకునేందుకే పేదలపై నెడుతున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రారని, తామే వస్తామని ఈ నెల 24న బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ చెప్పారు. కానీ మరుసటి రోజు ఉదయమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు. తండ్రీ కొడుకుల మధ్యలోనే సమన్వయం లేదు. వారిలో అధికారం కోల్పోయిన బాధ కనిపిస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చినా బుద్ధి రాలేదు. కేటీఆర్ సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బా కోసమే గోదావరి వెంట ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్నాడు.కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరినట్టే!పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓ సన్నాసి సవాల్ విసిరిండు.. ఆ సవాల్ స్వీకరించి ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతుల రుణమాఫీ చేశాం. నెలాఖరులోపు రూ.1.5 లక్షలలోపు రైతుల రుణాలు మాఫీ చేయబోతున్నాం. వచ్చే నెల 2 నుంచి 14వ తారీఖు వరకు విదేశీ పర్యటనకు వెళుతున్నా.. తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం. కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేరి తీరుతుందికల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్లుఆగస్ట్ 1న రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.100 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నాం. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.309 కోట్లు కేటాయిస్తున్నా.. హైదరాబాద్– కల్వకుర్తి– శ్రీశైలం జాతీయ రహదారిని హైదరాబాద్ నుంచి కల్వకుర్తి రోడ్ వరకు నాలుగు లేన్లుగా విస్తరిస్తాం..’’ అని రేవంత్ ప్రకటించారు.ప్రజాస్వామ్య విలువలతో కాంగ్రెస్ పాలన: మంత్రి దామోదరకాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య విలువలతో సాగుతోందని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి రాజకీయ నేతగానే కాకుండా తత్వవేత్తగా ఎదిగారని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో జైపాల్రెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ సభలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్రెడ్డి, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణలో ఆనాడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాకపోవడానికి కారణాలేమిటని పార్టీ పెద్దలు ఇటీవల నన్ను అడిగారు. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీఎం ఎవరన్నది చెప్పకపోవడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని నేను వివరించాను. నాడు పార్లమెంట్కు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు అంతా గందరగోళం నెలకొంది. తెలంగాణ బిల్లు పాస్ చేసే సమయంలో.. పార్లమెంట్లో ఉన్న హౌస్ ఆఫ్ మూడ్ను బట్టి, పార్లమెంటు తలుపులు మూసి బిల్లుకు ఆమోదం తెలపాల్సిందిగా నాటి స్పీకర్ మీరాకుమారికి జైపాల్రెడ్డి సూచించారు.ఆయన సలహా మేరకే తెలంగాణ బిల్లు పాస్ అయింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా జైపాల్రెడ్డిని ప్రకటించి ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది. ఈ విషయంలో పార్టీ విధానపరమైన లోపంతో కాంగ్రెస్కు నష్టం వాటిల్లిందని నేను వివరించాను. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా..చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారు. పదవులకే గౌరవం తెచ్చేలా వ్యవహరించారు. – సీఎం రేవంత్రెడ్డి -
బీఆర్ఎస్ పార్టీలో 'ఆకర్ష్ మంత్రం' ! కొత్త జయపాల్రెడ్డి చేరిక..
కరీంనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. నియోజకవర్గస్థాయిల్లో పేరున్న నేతలతో పాటు అర్ధబలం, అంగబలం, సామాజికవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరడమే ఖాయమని భావించిన స్థానిక మైత్రి గ్రూప్ అధినేత కొత్త జయపాల్రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకే మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్లు సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా సమ్మతించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణకే కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి జిల్లా నుంచి రానున్న ఎన్నికల్లో మరోసారి విజయ ఢంగా మోగించేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. జిల్లాకేంద్రంలో బలమైన సామాజిక వర్గం, గ్రానైట్, రియల్టర్, మీడియా గ్రూప్ల్లో భాగస్వామ్యుడైన కొత్త జయపాల్రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో మంతనాలు జరపడం, రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ చెప్పడం, వారం రోజుల్లోనే పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేయడంపై జిల్లాలో రాజకీయ చర్చ మొదలైంది. కొత్త జయపాల్రెడ్డి గతంలో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ అగ్రనాయత్వంతో సంప్రదింపులు జరపడం, కరీంనగర్ బీజేపీ టికెట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డితో సంప్రదింపులు పూర్తయ్యాయని కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఖాయమైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కరీంనగర్ బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో రెండు పార్టీల్లో నుంచి సరియైన సంకేతాలు రాకపోవడంతో జయపాల్రెడ్డి గమ్ముగా ఉన్నారు. దీంతో మంత్రి గంగుల అధిష్టానంతో కొత్త జయపాల్రెడ్డి చేరికతో లాభనష్టాలపై పార్టీకి విన్నవించడంతో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. త్వరలో మరిన్ని చేరికలు.. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు కొద్ది రోజుల్లోనే ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల్లో స్తబ్దత నెలకొనడం.. అధికార బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తుండడంతో ఆయా పార్టీల్లో గుర్తింపు లేని లీడర్లు బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమయం వరకు చేరికలు భారీగా ఉంటాయని ఆ పార్టీ లీడర్లు పేర్కొంటున్నారు. -
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు. తాను, జైపాల్రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఏర్పాటులో జైపాల్రెడ్డి పాత్ర కీలకం: రేవంత్
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్పేట్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ, ప్రధానిని ఒప్పించడంలో దివంగత మాజీ కాంగ్రెస్ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి కీలక పాత్ర పోషించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా బుధవారం పీవీమార్గ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద పలు పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జేసీ దివాకర్రెడ్డి, షబ్బీర్అలీ, మాజీ ఎంపీలు అంజన్కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీచంద్రెడ్డి, వినోద్, వివేక్, రాంచంద్రారెడ్డి, దయాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యులు జైపాల్రెడ్డికి అంజ లి ఘటించారు. కాగా, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తిత్వం జైపాల్రెడ్డిదని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మాట్లాడుతూ.. జైపాల్రెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్యాదవ్ తదితరులు నివాళులర్పించారు. -
జాతీయవాదమే భారతీయ ఆత్మ : ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత సాంస్కృతిక ఐక్యతే ఇవాళ దేశప్రజలను సమైక్యంగా మార్చిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాసిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తకం తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను వెంకయ్య నాయుడు ఆన్లైన్ ద్వారా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పువాటిల్లుతుందని గ్రహిస్తే.. ప్రజలంతా ఏకమై ఆ దాడిని ఎదుర్కునేందుకు సిద్ధపడతారని, ఇదే జాతీయవాదమన్నారు. భారతీయ ఆత్మలో జాతీయవాదం బలంగా ఉందని ఇటీవల ఎదురైన పరిణామాలు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు. ‘మతం, జాతి, భాష అనే వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదని నా అభిప్రాయం. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఈ విషయంలో మన దృష్టి కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని వెంకయ్య అన్నారు. (చదవండి: విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి) ప్రజాస్వామ్యం అనేది.. ఒక సామాజిక వ్యవస్థ పరిణామంలో పరిపక్వమైన పరిస్థితులకు సంకేతమన్నారు. ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాస్వామిక ప్రక్రియను ఉపయోగించుకుని తమ పరిపక్వతను ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామిక వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పటికీ.. ఈ లోపాలు పరిణామ క్రమంలో ఏర్పడినవే. వాటిపై చర్చిస్తూ, పరిష్కరించుకునే క్రమంలో ప్రజాస్వామ్యం తనను తాను మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే విస్తృత అధ్యయనం చేసే ఆసక్తితో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారు. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకరణ సంబంధాలతో, లాజికల్గా ఆలోచించడం జైపాల్ రెడ్డి ప్రత్యేకత. వాదన పటిమ, లోతైన విశ్లేషణతో, అరుదైన రాజనీతిజ్ఞుడిగా అందరి మనసులు గెలిచిన జైపాల్ రెడ్డి తన ఆలోచనలను ‘టెన్ ఐడియాలజీస్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు’ అని తెలిపారు. (చదవండి: కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర) ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని స్వయంగా ఆయనే తనను కలిసి బహుకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. ‘ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని జైపాల్ రెడ్డి వివరించారు. భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు జైపాల్ రెడ్డి ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడం కాకుండా.. సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ‘వ్యవసాయిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వరకు’ మారే క్రమంలో వివిధ దేశాల్లో జరిగిన అనేక పరిణామాలను, అన్వేషణలను, ఆవిష్కారాలను, భావజాలాలను అన్వేషించారు. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాల్ని ఆయన పది భావజాలాలుగా వర్గీకరించారు. ఈ పది భావజాలాల్లో ప్రధానమైనది జాతీయవాదం’ అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. (చదవండి: వీవీని కాపాడండి: హృదయం చెమ్మగిల్లుతోంది) రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం తప్పని సరిగా ఉండాలని.. సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృథా అని ఆయన అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తాయన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశానికి బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పర్చేందుకు దీర్ఘకాలిక దృష్టిని, కార్యాచరణను అందించేదే ఒక సైద్ధాంతిక దృక్పథమన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరంను, ఈ పుస్తక ప్రచురణ కర్తలు ‘ఓరియంట్ బ్లాక్ స్వాన్’ సంస్థ వారిని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు. -
రాష్ట్ర సాధనకు జైపాల్ కృషి
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు హైదరాబాద్ నగరం తెలంగాణకే చెందేలా నాడు కేంద్ర మంత్రి హోదాలో సూదిని జైపాల్రెడ్డి తీసుకున్న చొరవ, కృషి అభినందనీయమని పలు రాజకీయ పార్టీల నాయకులు కొనియాడారు. జైపాల్రెడ్డి 78వ జయంతి కార్యక్రమాన్ని గురువారం నెక్లెస్ రోడ్లోని జైపాల్ ఘాట్ వద్ద నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీలు డి.శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎ.రేవంత్రెడ్డి, మాజీ ఎంపీలు పల్లంరాజు, విశ్వేశ్వర్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తదితరులు హాజరై నివాళి అర్పించారు. రాష్ట్ర సాధనలో జైపాల్రెడ్డి కృషి మరువలేనిదని, ఆయన వల్లే తెలంగాణకు హైదరాబాద్ దక్కిందని గుత్తా సుఖేందర్రెడ్డి గుర్తు చేశారు. పదేళ్లపాటు జైపాల్రెడ్డి ఎంపీగా తాను ఎమ్మెల్యేగా కలసి పనిచేశామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ ఖ్యాతిని పెంచి పార్లమెంట్, శాసన సభ, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అద్భుత ప్రసంగంతో ఆయన చెరగని ముద్రవేసుకున్నారన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్కు జైపాల్రెడ్డి పేరు పెట్టినప్పుడే ఆయనకు సరైన నివాళి ఆర్పించినట్లవుతుందన్నారు. విలువల కోసం జీవితాంతం నిజాయితీగా, సిద్దాంతాన్ని కఠినంగా అమలు చేసిన వ్యక్తి జైపాల్రెడ్డి అని, ఆయన మరణం సెక్యులరిజానికి, సోషలిజానికి తీరని లోటని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి మచ్చలేని నాయకుడని, వామపక్షాలు బలంగా ఉండాలని కోరుకునే వారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. జయంతి కార్యక్రమంలో జైపాల్ కుమారుడు ఆనంద్రెడ్డి, సన్నిహితుడు వెంకట్రాంరెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, ఎన్ఆర్ఐ, ఆటా మాజీ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, దైవజ్ఞశర్మతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. -
ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి 78వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని జైపాల్ రెడ్డి మెమోరియల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జైపాల్రెడ్డి కుటుంబ సభ్యులు, వీ హెచ్ హనుమంతులు, రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లు రవి,తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన జైపాల్రెడ్డి తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే నెక్లెస్ రోడ్లో మెమోరియల్ హాల్ను నిర్మించాలన్నారు. అదేవిధంగా సీపీఐ అధ్యక్షుడు చాడ వెంకట్రెడ్డి కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డికి నివాళులు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి జైపాల్రెడ్డి అని, హైదరాబాద్కు మెట్రో వచ్చిందంటే అది జైపాల్ చొరవేనని ఆయన పేర్కొన్నారు. -
జైపాల్రెడ్డి కృషితోనే తెలంగాణ: రేవంత్
మాడ్గుల: దివంగత కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి కృషితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని, ఆయన అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న సుష్మాస్వరాజ్, అద్వానీని ఒప్పించి రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి స్వగ్రామం మాడ్గుల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి అధ్యక్షతన జైపాల్రెడ్డి సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. జైపాల్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా దేశ రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో జైపాల్రెడ్డి ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు. చట్టసభల్లో ఆయన నిజాయితీగా, హుందాగా వ్యవహరించి ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచారని కొనియాడారు. ఈ సభకు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
మమ్మల్ని తిరుపతి వేంకటకవులనేవారు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తనను, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డిని అందరూ తిరుపతి వేంకట కవులుగా పిలిచేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయకేంద్రంలో జైపాల్రెడ్డి సంస్మరణసభ ఏర్పాటు చేశారు. సభ లో వెంకయ్యతోపాటు ఆయన సతీమణి ఉశమ్మ, మాజీప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమం త్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి, కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్ సింగ్, అభిషేక్ సింఘ్వీ, జైరాం రమేశ్, కొప్పుల రాజు, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జైపాల్రెడ్డి సతీమణి లక్ష్మమ్మ, కుమారులు అరవింద్, ఆనంద్, కుమార్తె అరుణ, ఇతర కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ తాను నమ్మిన ప్రజాస్వా మ్య విలువలకు ఎల్లప్పుడూ కట్టుబడిన నాయ కుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. తామిద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలకు ముందు ఇంట్లో కలుసుకొని ఆరోజు సభ అజెండాపై చర్చింకుకొనే వారిమని అన్నారు. సభ లో ఎల్లప్పుడూ పక్కనే కూర్చొనేవాళ్లమని, అన్ని విషయాలపట్ల జైపాల్రెడ్డికి సునిశిత పరిశీలన, జాతీయ, అంతర్జాతీయ అంశాలపట్ల పరిజ్ఞానం ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ జైపాల్ రెడ్డి మరణంతో దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా జైపాల్ పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి తనకు మార్గదర్శి అని, అనేక ఆంశాలను ఆయన్నుంచి నేర్చుకొనేవాడినని ఏచూరి చెప్పారు. జైపాల్ రెడ్డి మరణంతో వ్యక్తిగత స్నేహితుడ్ని కోల్పోయినట్లు మురళీ మనోహన్ జోషి, డి.రాజా విచారం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సీనియర్లు, ఇతర పార్టీల నేతలు ప్రసంగించారు. -
జైపాల్రెడ్డి మంచి పాలనాదక్షుడు
సాక్షి, న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి మంచి పాలనాదక్షుడని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. సోమవారం ఇండియా ఇంటర్ నేషనల్ సెంటర్లో జైపాల్రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సభలో మన్మోహన్ సింగ్తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేయడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. పదేళ్లపాటు తన మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగారని చెప్పారు. ప్రసార భారతి బిల్లుతో దూరదర్శన్, ఆకాశవాణికి స్వయం ప్రతిపత్తి కల్పించారని చెప్పారు. వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినప్పటికీ అత్యుత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో నిశ్శబ్దంగా చాలా కీలక పాత్ర పోషించారన్నారని, ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం తీసుకోవడానికి పార్టీ నాయకత్వాన్ని ఒప్పించారని మన్మోహన్ సింగ్ తెలిపారు. -
గొప్ప చదువరి, అరుదైన మేధావి
దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉంటూ మనకు తెలిసినట్టు అనిపించే వ్యక్తుల్లో కూడా మనకు తెలియని అద్భుతపార్శ్వాలు ఉంటాయి. అవి ఒక్కోసారి హఠాత్తుగా వెల్లడై ఆశ్చర్యం కలిగిస్తాయి. జైపాల్ రెడ్డిగారు అలాంటి వ్యక్తి. విద్యార్థినాయకునిగా, శాసనసభ్యునిగా, ఎంపీగా, గొప్ప వక్తగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, కేంద్రమంత్రిగానే కాక; విలువలకు అంకితమైన వ్యక్తిగా ఆయన రాజకీయజీవితం తెరచిన పుస్తకమే. ఈ రాజకీయ జీవితమనే దండలో దారంలా ఆయనకు ఎంతో లోతు, వైశాల్యం కలిగిన మేధోజీవితం ఉంది. ఒక ఏడాది పరిచయంలో అది అనేక రూపాలలో నాకు తెలిసివచ్చింది. జైపాల్ రెడ్డిగారు ఆంగ్లంలో వెలువరించిన ‘టెన్ ఐడియాలజీస్–ది గ్రేట్ ఎసిమెట్రీ బిట్వీన్ ఏగ్రేరియనిజం అండ్ ఇండష్ట్రియలిజం’ అనే పుస్తకం గురించి ప్రముఖపాత్రికేయులు కె. రామచంద్రమూర్తిగారు చెప్పి, మీరు దానిని తెలుగులోకి అనువదించాలని సూచించినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. ఆ సందర్భంలో ఆయనతో కలసి మొదటిసారి జైపాల్రెడ్డిగారిని కలిసినప్పుడు, కాంగ్రెస్లో ఉంటూ అప్పటికే అనేక ఉన్నతపదవులను నిర్వహించిన ఒక ప్రముఖనాయకుని గురించి జైపాల్ రెడ్డిగారు ప్రస్తావించి, ఆయన హిందుత్వవర్గాలకు దగ్గరవడంపై మీ అభిప్రాయమేమిటని అడిగారు. ఆయనే ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, గాంధీ–నెహ్రూ ప్రభావాల మత్తులో రాజకీయాల్లోకి వచ్చి, వారు ప్రాతినిధ్యం వహించిన విలువలను ఉగ్గడిస్తూ దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్నా, హిందూత్వాభిమానం ఆయనలో సుప్తావస్థలో ఉందనీ; బాహ్యవాతావరణం హిందూత్వకు అనుకూలంగా మారగానే అదిప్పుడు బయటపడుతోందని ఒక సామాజికశాస్త్రవేత్తలా విశ్లేషించారు. ఈ సందర్భంలోనే, అత్యున్నతపదవిని నిర్వహించిన ఇంకొక ప్రముఖ కాంగ్రెస్ నాయకునికి కూడా ఈ విశ్లేషణను ఆయన అన్వయించారు. దేశంలో ఇప్పుడు ప్రాబల్యం వహిస్తున్న రాజకీయశక్తుల గురించి మాట్లాడుతూ, విప్లవవ్యతిరేక మితవాదశక్తుల విజృంభణ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనంటూ, దీనినొక అవాంతరదశగా పేర్కొని చారిత్రిక ఆశావాదాన్ని ధ్వనింపజేశారు. అనువాదాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆయనతో కలసి మూలంతో దానిని బేరీజు వేసుకునే కార్యక్రమం కొన్ని రోజులపాటు సాగింది. అప్పుడే ఆయన వ్యక్తిత్వ, మేధోజీవితాల తాలూకు బహు పార్శ్వాలు నాకు పరిచయమయ్యాయి. రకరకాల భావజాలాల మీదుగా సాగిన ప్రపంచ చరిత్రగమనంపై, సంస్కృతీసాహిత్యాలపై తన అవగాహనను, అనుభూతిని ఎదుటివారితో పంచుకోవాలన్న నిరంతరోత్సాహం ఆయనలో ఉరకలు వేసేది. దాంతో ఒక్కోరోజున మా అనువాదపరిశీలన రెండు, మూడు పేజీలను మించి సాగేది కాదు. ఇంకోవైపు, ఆయన రాజకీయమార్గదర్శనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు, ఆయన స్వస్థలానికి చెందిన చిన్నా, పెద్దా నాయకులు, అభిమానుల రాకతో అంతరాయం కలుగుతూ ఉండేది. ఆవిధంగా ఆయన రాజకీయ, మేధోజీవితపార్శ్వాలను రెంటినీ ఒకేసారి, ఒకేచోట చూడగల అవకాశం ఏర్పడేది. గాంధీ, బుద్ధుడు, ఫ్రాన్సిస్ బేకన్, జాన్ మేనార్డ్ కీన్స్, డేవిడ్ రికార్డో వంటి పేర్లు ఒకపక్కన; స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికతో సహా పలు అంశాలకు సంబంధించిన మాటలు ఇంకోపక్కన దొర్లుతూ ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పించేవి. మరోవైపు, ఎన్ని రోజులు తీసుకుంటున్నాసరే, ఒక్క మాటను కూడా విడిచిపెట్టకుండా అనువాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంలో ఒక పండితునిలో మాత్రమే ఉండే ఓపిక, శ్రద్ధ, దీక్ష ఆయనలో ఉండేవి. అవసరమైనప్పుడల్లా తన ముందున్న ఆంగ్లనిఘంటువులను, విజ్ఞానసర్వస్వాలను శోధిస్తూ నిర్దుష్టతకు ప్రాధాన్యమిచ్చేవారు. కొన్ని పదప్రయోగాలను, వాక్యాలను స్వయంగా సవరించుకుంటూ, కొన్ని చోట్ల కత్తిరిస్తూ మూలానికి మెరుగులు దిద్దే ప్రయత్నమూ చేశారు. జైపాల్ రెడ్డిగారిలో ప్రత్యేకించి ఆకట్టుకునేది, ఆయన మౌలిక ఆలోచనా సరళి. ఆయన ప్రధానంగా జ్ఞానవాది. భాషాసాహిత్యాలలో పాండిత్యం గొప్పదే కానీ, జ్ఞానానికి దోహదం చేయడం అంతకన్నా గొప్పదనేవారు. ఈ సందర్భంలోనే భాషా,సాహిత్యవేత్తగా ప్రసిద్ధికెక్కిన ఒక ప్రముఖకాంగ్రెస్ నాయకుని గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఆ రెండింటిలోనూ కూరుకు పోకుండా ఉంటే, జ్ఞానమార్గంలో ముందుకు పోగలిగిన సమర్థుడేననేవారు. అదే సమయంలో కదిలించే ఒక కవితావాక్యానికి, లేదా కథనానికి కంట తడిపెట్టే ఆర్ద్రత ఆయనలో ఉండేది. మౌలిక చింతనతోపాటు, ఆయనలోని మరో ఆకర్షణ, చారిత్రికదృక్కోణం. ఆయన పుస్తకమే ఈ రెండింటికీ నిలువెత్తు ఉదాహరణ. ఉదారవాదం, లౌకికవాదం, పెట్టుబడిదారీ వాదం, సామ్యవాదంతో సహా నేటి భిన్న భిన్న భావజాలాల వేళ్ళు–సాంస్కృతిక పునరుజ్జీవనం, మానవవాదం, సంస్కరణవాదం, శాస్త్రవిజ్ఞానవిప్లవమనే నాలుగు ఉద్యమాలలోనూ; ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవాలలోనూ ఎలా ఉన్నాయో అందులో ఆయన చర్చిస్తారు. మళ్ళీ నేటి సమస్యలు, సంక్షోభాల మూలాలను కూడా వాటిలోనే నిరూపిస్తూ, పరిష్కారమార్గాన్ని సూచిస్తారు. వివిధ భావజాలాల మధ్య నేడున్న ఘర్షణ పరిస్థితిని అధిగమించవలసిన అవసరం ఉందనీ; ప్రస్తుత సంక్షోభాలను సక్రమంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలంటే చారిత్రికదృక్కోణాన్ని పెంపొందించుకోవాలనీ ఆయన అంటారు. మన జీవనవిధానంపై సాంకేతిక అభివృద్ధి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా; దానికి తగినట్టే ఆలోచనాసరళులలో వచ్చిన మార్పుల ప్రభావం మాత్రం కనిపించడం లేదంటారు. ఉదారవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి భావనలను ఆధునిక సందర్భంనుంచి తప్పించి పురాతనకాలంనుంచీ ఉన్నవిగా భావించడంలోని పొరపాటును ఎత్తిచూపుతారు. అలాగే, చారిత్రిక పాశ్చాత్యానికీ, ఆధునిక పాశ్చాత్యానికీ తేడా గమనించకపోవడం కూడా మనలోని అనేక అయోమయాలకు కారణమంటారు. వలసదేశాలకు విముక్తి కలిగించినమేరకు జాతీయవాదం ఆహ్వానించదగినదే కానీ; భాష, జాతి, మతం వంటివి దానికి ఆధారం కాకూడదంటారు. పెట్టుబడిదారీ విధానం నుంచి సంక్షేమరాజ్యం ఎలా అవతరించిందో, కమ్యూనిజానికి సోషలిజానికి ఉన్న తేడా ఎలాంటిదో ఆయన వివరించిన తీరు ఆసక్తికరమే కాక; ఎంతో అవగాహనాకరంగా ఉంటుంది. నేటి అనేక సవాళ్ళకు మూలాలు, మన వ్యావసాయిక గతంలో ఉన్నాయనీ, పారిశ్రామికవిప్లవం ఆవిష్కరించిన సాంకేతిక అద్భుతాలతో, వ్యావసాయికదశకు చెందిన కరడుగట్టిన మన మనస్తత్వం తులతూగలేకపోవడమే అసలు సమస్య అనీ ఆయన చేసిన నిర్ధారణ చారిత్రికకోణం నుంచి మరింత ఆసక్తినీ, ఆలోచననూ కలిగిస్తుంది. గాంధీ–నెహ్రూ–అంబేడ్కర్ల భావధార సన్నగిల్లుతున్నదనీ, భావజాలాలకు ప్రాధాన్యం అడుగంటిందనీ భావించే కాలంలో వెలువడడం ఆయన పుస్తకానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పిస్తూనే, ఒక శకం అంతరించిందన్న స్ఫురణ కలిగిస్తుంది. రచయితలే కానీ, రాజకీయనాయకులే కానీ తమ భావజాల పాక్షికతను ప్రకటించుకుని తీరాలంటూ తనను ప్రగతిశీల ఉదారవాదిగా, లేదా సామాజిక ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకున్న జైపాల్ రెడ్డి అంతర్జాతీయవాదిగానూ తనను ఎలుగెత్తి చాటుకుంటారు. మతతత్వరాజకీయాలతో ఎప్పటికీ రాజీపడని ఒక నిబద్ధుడు ఆయనలో చివరివరకూ ఉన్నాడు. తన పుస్తకం తెలుగు అనువాదం అచ్చుప్రతిని చూడకుండానే ఆయన కన్ను మూయడం కుటుంబసభ్యులకూ, అనువాదకునిగా నాకూ కూడా తీరని వెలితి, తీవ్ర బాధాకరం. కల్లూరి భాస్కరం వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
జైపాల్రెడ్డికి కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా వీడ్కో లు పలికారు. సోమవారం ఉదయం ఆయన నివా సం నుంచి పార్థివదేహాన్ని 12:20 గంటల సమయం లో గాంధీభవన్కు తీసుకువచ్చారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన వేదికపై భౌతికకాయాన్ని ఉంచి పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఏఐసీసీ పక్షాన రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, మాజీ లోక్సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ సభ్యుడు పీసీ చాకో, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా తదితరులు జైపాల్ భౌతిక కాయం పై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గూడూరు నారాయణరెడ్డి, మర్రిశశిధర్రెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీనివాస కృష్ణన్, జగ్గారెడ్డి, సీతక్క, వి.హనుమంతరావు, మధు యాష్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు నగేశ్, ఈరవత్రి అనిల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎమ్మార్జీ వినోద్రెడ్డి, బొల్లు కిషన్, కుమార్రావు తదితరులు జైపాల్ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గాంధీభవన్కు వచ్చిన ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా గాంధీభవన్లో జైపాల్రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ తనకు జైపాల్తో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ఆయనతో పరిచయం ఉందని, యునైటెడ్ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటులో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. అరుదైన రాజకీయ నాయకుల్లో జైపాల్ ఒకరని, ఆయన ఆకస్మిక మరణం తనను చాలా బాధించిం దని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి నెక్లెస్రోడ్డులో జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు. సెక్యులర్ అంటే గుర్తొస్తారు: ఆజాద్ జైపాల్రెడ్డితో తనకు దశాబ్దాల పరిచయం ఉందని, ఇద్దరం వేరే పార్టీల్లో ఉన్నా మంచి మిత్రులుగా ఉన్నామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. సెక్యులర్ అంటే మొదట గుర్తొచ్చేది జైపాల్ రెడ్డేనని, సెక్యులరిజం, సోషలిజం మార్గంలో నడవడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. జైపాల్ ఉత్తమ పార్లమెంటేరియన్, బహుభాషా కోవిదుడని, ఏ శాఖ మంత్రిగా అయినా నిజాయతీతో పనిచేశారన్నారు. మన్మోహన్ మెచ్చిన నేత: ఖర్గే జైపాల్తో తనకు 1963 నుంచి పరిచయం ఉందని, తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే జైపాల్ తనకు తెలుసునని లోక్సభలో మాజీ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. మన్మోహన్సింగ్ మెచ్చిన నేత జైపాల్రెడ్డి అని, ఆయన మాట్లాడుతుంటే డిక్షనరీలు వెతుక్కునే వారమన్నారు. రాజ్యసభ సభ్యుడు చాకో మాట్లాడుతూ జైపాల్ రెడ్డితో కలిసి పనిచేశానని, నిబద్ధత, నిజాయతీకి ఆయన మారుపేరని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాట్లాడుతూ సోషలిజం, సెక్యులరిజంలకు జైపాల్ చాంపియన్ అని కొనియాడారు. కాంగ్రె స్ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భూమి పుత్రుడు జైపాల్రెడ్డి దేశరాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు. ఇక సెలవ్ సాక్షి, హైదరాబాద్ : సాగర తీరం శోకసంద్రమైం ది. తమ ప్రియతమ నేతకు వీడ్కోలు పలికేందు కు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చా రు. వీరందరి అశ్రునయనా ల సమక్షంలో.. నెక్లెస్రోడ్డు లోని పీవీ ఘాట్లో సోమ వారం మధ్యాహ్నం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సూదిని జైపాల్రెడ్డి పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాల తో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3.10 గంటలకు జైపాల్రెడ్డి పెద్ద కొడుకు అరవింద్రెడ్డి చితికి నిప్పంటించారు. కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్.. జైపాల్ రెడ్డి భౌతికకాయా న్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భారీ ర్యాలీగా అంతిమ యాత్ర అంతకుముందు ఉదయం అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఆయన నివాసం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీల నేతలు, అభిమానుల మధ్య అంతిమయా త్ర ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర గాంధీభవన్కు చేరుకుంది. హోంమంత్రి మహమూద్ అలీ, స్పీక ర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు జగదీ‹ష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల, నాగం జనార్దన్రెడ్డి, మల్లు రవి, గుత్తా సుఖేందర్రెడ్డి, నాయిని, మధుయాష్కీ గౌడ్, గండ్ర వెంకట రమణారెడ్డి, నేతి విద్యాసాగర్, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. నివాళులు అర్పించిన ప్రముఖులు కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, మంత్రి తల సాని, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ డీ ఎస్, మాజీ మంత్రి హరీశ్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేశవరావు, మేకపాటి రాజమోహన్రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కి, గుత్తా సుఖేందర్రెడ్డి, నన్నపనేని రాజకుమారి, గద్దర్ సహా పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. జైపాల్రెడ్డికి నివాళులర్పించిన రాజ్యసభ సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్రెడ్డికి రాజ్యసభ నివాళులర్పించింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు జైపాల్రెడ్డి మరణంపై సంతాప ప్రకటన చేశారు. ‘ఈ సభ మాజీ సభ్యుడు ఎస్.జైపాల్రెడ్డి తన 77వ ఏట నిన్న ఉదయం మరణించారు. ఆయన మరణంతో దేశం ఒక సీనియర్ పార్లమెంటేరియన్ను, ఒక అత్యుత్తమ వక్తను, సమర్థవంతుడైన అడ్మినిస్ట్రేటర్ను కోల్పోయింది. ఏపీ అసెంబ్లీలో రెండు పర్యాయాలు ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఒకే బెంచిలో కూర్చునేవాళ్లం. ప్రజాసంబంధ అంశాలపై ఎవరి మార్గంలో వాళ్లం వాదించేవాళ్లం. నాలుగు దశాబ్దాలుగా ఆయన నాకు స్నేహితుడు. ఆయన కంటే నేను ఆరేళ్లు చిన్నవాడిని. అందువల్ల ఆయన అనేక సందర్భాల్లో నాకు మార్గదర్శనం చేసేవారు. జైపాల్ రెడ్డి మరణానికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం..’అని చైర్మన్ అన్నారు. జైపాల్రెడ్డి మరణానికి సంతాపం తెలిపేం దుకు సభ్యులు లేచి మౌనం పాటించారు. -
గాంధీభవన్లో జైపాల్రెడ్డి భౌతికకాయం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డికి గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు కొనియాడారు. జైపాల్రెడ్డి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద జైపాల్రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. గాంధీభవన్లో జైపాల్కు ఘన నివాళి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులు జైపాల్ రెడ్డికి ఘనంగా అంజలి ఘటించారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ...‘జైపాల్రెడ్డి మన మధ్య లేరు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అన్నారు. మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1964 నుంచి జైపాల్ రెడ్డి తనకు తెలుసునని, విద్యార్థి దశ నుంచే పరిచయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. కాగా ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్లోని జైపాల్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకూ అంతిమ యాత్ర కొనసాగింది. అనారోగ్యంతో ఆయన ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. -
ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు...
సాక్షి, సిటీబ్యూరో: ఆయన పేరు వింటేనే అప్పట్లో క్రేజ్.. ఆయన చెప్పే మాటలు వింటే ఇక మహాజోష్. ఇక్కడి నుండే స్టూడెంట్ లీడర్గా తన రాజకీయ తొలి అడుగులేసి, నగరం నుండే చివరి సారి లోక్సభకు ప్రాతినిథ్యం వహించిన సూదిని జైపాల్రెడ్డికి మహానగరంతో అరవై ఏళ్ల అనుబంధం. 1960లో నిజాం కాలేజీలో చేరిన జైపాల్రెడ్డి స్టూడెంట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ తొలి అధ్యక్షునిగా ఎన్నికై పలు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి నాయకునిగా విషయ పరిజ్ఞానం, ఆకట్టుకునే ప్రసంగంతో తక్కువ సమయంలోనే మాస్ ఆండ్ క్లాస్ స్టూడెంట్ లీడర్గా ఎదిగిపోయారు. ఉస్మానియా పరిధిలోని అన్ని కళాశాలతో కలిపి జరిగిన తొలి ఎన్నికల్లోనే జైపాల్రెడ్డి అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో విజయం సాధించి దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. నిజాం కాలేజీ నుంచి మొదలైన జైపాల్రెడ్డి ప్రస్థానం అనేక మలుపులు, ఒడిదొడుకుల మధ్య తిరిగి 2009లో మహానగరానికే చేరింది. 2009లో చేవెళ్ల లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన మహబూబ్నగర్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలవటంతో జైపాల్రెడ్డిని తొలిసారిగా నాయకుడిని చేసిన రికార్డు నిజాం కాలేజీకి చెందితే, చివరి సారి ఎంపీ చేసే అవకాశం సైతం నగరప్రాంతంలో కలిసిపోయిన చేవెళ్ల లోక్సభలో చోటు చేసుకోవటం విశేషం. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైల్కు కావాల్సిన అనుమతులన్నీ జైపాల్రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చకచకా ఇచ్చేశారు. ఓయూలో.. జైపాల్ తార్నాక: ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఆయన 1964లో ఎంఏ ఇంగ్లీష్లో చేరారు. ఆ తరువాత 1966–67లో బ్యాచ్లర్ ఆఫ్ జర్నలిజం కోర్సులో చేశారు. ఓయూలో చదువుతున్న రోజుల్లో బి–హాస్టల్లో ఉండేవారు. ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు... ఆరోజుల్లో ఓయూకు చాలా సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే వచ్చేవారు. అయితే అప్పట్లో ఓయూ క్యాంపస్లో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో జైపాల్రెడ్డి ఒకరుగా చెప్పవచ్చు. అయితే అందరితో పోలిస్తే ఆయన తీరువేరు. ఆయన మాట్లాడే భాష, అందులో వాడే పదాలు ఒక్కోసారి అధ్యాపకులనే తికమకపెట్టించేవి అని పలువురు అధ్యాపకులు పేర్కొంటున్నారు. చురుకైన లీడర్.. జైపాల్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాలంలో ఆయన ఎన్ఎస్యూఐలో పనిచేశారు. వర్సిటీలో చురుకైన లీడరుగా ఆయనకు పేరుంది. విద్యార్థుల సమస్యలపట్ల స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. ఆ రోజుల్లో వర్సిటీకి జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో జైపాల్రెడ్డి పోటీచేసి రెండు పర్యాయాలు ఓయూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేశారు. బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి ... 1969లో జరిగిన ఓయూలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం వహించగా, జైపాల్రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అనుచరుడిగా కొనసాగారు. అప్పుడు తెలంగాణ జనసమితి చేస్తున్న ఉద్యమానికి ఆయన మద్దతునివ్వలేదంటారు. బ్రహ్మానందరెడ్డి శిష్యుడిగా ఉంటూ యూత్ కాంగ్రెస్లో చేరిన ఆయన తరువాత 1969లో కల్వకుర్తి నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఓయూనుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ చివరకు పార్లమెంటు వరకు తీసుకువెళ్లింది. బెస్ట్పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన మొదటి ఓయూ పూర్వవిద్యార్థిగా ఆయనకు పేరుంది. జర్నలిజం విభాగంతో అనుబంధం.. జైపాల్రెడ్డికి ఓయూ జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి ఆయన ఓయూ జర్నలిజం విభాగానికి వచ్చేవారని పలువురు అ«ధ్యాపకులు పేర్కొన్నారు. ఓయూ జర్నలిజం విభాగంలో జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు ఆయన హాజరయ్యేవారు. ఆయన పలుమార్లు జర్నలిజం విద్యార్థులకు గెస్ట్లెక్చర్ కూడా ఇచ్చారు. శతాబ్ది ఉత్సవాలకు హాజరు.. ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు జైపాల్రెడ్డి హాజరయ్యారు. శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్బంగా జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆంగ్లంలో చేసిన ప్రసంగం, తాను ఓయూలో గడిపిన రోజుల గురించి మాట్లాడిన మాటలు ఉత్తేజపరిచాయి. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులు ఆయనను స్పూర్తిగా తీసుకున్నారు. ఆయనతో విడదీయరాని అనుబంధం జైపాల్రెడ్డి నాకు ఐదేళ్లు సీనియర్.. ఆరోజుల్లో వర్సిటీలో ఇంగ్లీష్ మాట్లాడే అతికొద్ది మంది విద్యార్థుల్లో జైపాల్రెడ్డి ప్రముఖమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఆంగ్లభాషపై ఆయనకు మంచి పట్టు ఉండేది. అధికారులతో ఇంగ్లీష్లో అనర్గళంగా వాదించేవారు. ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తిచేశాక వెంటనే జర్నలిజం కోర్సులో చేరారు.జర్నలిజం విభాగం తొలి బ్యాచ్ విద్యార్థి. ఆయనకు జర్నలిజం విభాగంతో విడదీయరాని అనుబంధం ఉంది. తీరిక దొరికితే జర్నలిజం లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివేవారు. నేను అధ్యాపకుడిగా ఉన్న కాలంలో మూడు సార్లు ఆయన జర్నలిజం విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇచ్చి వారిలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిన మహానుభావుడు. –ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, జర్నలిజం మాజీ అధ్యాపకులు ఓయూ యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా ఉండి అసెంబ్లీకి.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా బాధ్యతలు చేపట్టిన జైపాల్రెడ్డి 1969లో జరిగిన ఎన్నికల్లో ఓయూ నుంచే నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. రెండు పర్యాయాలు ఓయూ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించారు. ఆయన భాష, మాట్లాడే తీరు అందరినీ కట్టిపడేసేవి. విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్రపోషించే వారు. –ప్రొఫెసర్ కృష్ణారావు, ఓఎస్డీ ఓయూ అందరికీ ఒక రోల్ మోడల్.. జైపాల్రెడ్డి అంటే అప్పుడూ...ఇప్పుడూ అందరికీ ఒక రోల్ మోడల్గా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజకీయ వేత్తగా ఎదిగిన గొప్ప నాయకుడు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తన భాషతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ఉస్మానియా యూనివర్సిటీకే పేరు ప్రఖ్యాతులు తెచ్చారు.జైపాల్రెడ్డి లాంటి మేధావి, సమస్యలపై స్పందించే గొప్పవ్యక్తి ఈరోజుల్లో కనిపించరు.–ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ, ఔటా అధ్యక్షులు -
ఉమ్మడి జిల్లాపై ‘జైపాల్’ చెరగని ముద్ర
సాక్షి, మిర్యాలగూడ : ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూదిని జైపాల్రెడ్డితో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎనలేని అనుబంధం ఉంది. ఆయన మృతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా నుంచి ఎన్నికై పదేళ్ల పాటు జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వెంటనే మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. యూపీఏ– 1లో జైపాల్రెడ్డి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దేశంలోని కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, సమాచార, సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మంత్రిగా పని చేశారు. ఆయన స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా అయినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతోనూ ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. జైపాల్రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు సూదిని జైపాల్రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీలకు భూగర్భ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అదే విధంగా అద్దంకి–నార్కట్పల్లి రహదారి విస్తరణకు కృషి చేశారు. విష్ణుపురం–జగ్గయ్యపేట రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీల్లో నాళాల ఆధునికీకరణ పనులకు నిధులు విడుదల చేశారు. 65వ జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణకు కృషి చేశారు. మిర్యాలగూడకు చివరి ఎంపీ.. మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గానికి జైపాల్రెడ్డి చివరి ఎంపీగా పని చేశారు. మిర్యాలగూడ పార్లమెంట్ 1962లో ఏర్పడగా 1999, 2004లో జైపాల్రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. కాగా 2008లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని తొలగించారు. దాంతో మిర్యాలగూడకు ఆయన చివరి ఎంపీగా పని చేసిన వారుగా మిగిలిపోయారు. మంత్రి జగదీశ్రెడ్డి సంతాపం తాళ్లగడ్డ ( సూర్యాపేట ) : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్రెడ్డి మృతికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో జైపాల్రెడ్డికి ఉన్న అనుబంధాన్ని మంత్రి జగదీశ్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్రెడ్డి ఓనమాలు నేర్చుకున్న ప్రభుత్వ పాఠశాల చండూరు : సూదిని జైపాల్రెడ్డికి చండూరు మండలంలోని నెర్మటతో విడదీయరాని అనుబంధం ఉంది. గ్రామానికి చెం దిన బాణాల క్రిష్ణారెడ్డి, వెంకనర్సమ్మల మనుమడు సూదిన జైపాల్రెడ్డి. 1942 జనవరి 16న నెర్మటలోని అమ్మమ్మ ఇంట్లో జైపాల్రెడ్డి జన్మించాడు. నాలుగేళ్లు నిండిన తర్వాత స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. అక్షరాలు నేర్చుకునే స మయంలో తండ్రి దుర్గారెడ్డి దేవరకొండ పాఠశాలలో చేర్పిం చినట్లు జైపాల్రెడ్డి బావమర్ది బాణాల నర్సిరెడ్డి చెప్పారు. జైపాల్రెడ్డి తండ్రి దుర్గారెడ్డి చాలా ఏళ్లు నెర్మటలో రైతులకు వర్తకాలు పెట్టేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. జైపాల్రెడ్డి మృతి తీరని లోటు -గుత్తా సుఖేందర్రెడ్డి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి మృతి వ్యక్తిగతంగా, రాజకీయంగా తీరని లోటని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి మృతిపట్ల ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. చురుకైన ఆలోచన, మంచి వాగ్ధాటిగా పేరు తెచ్చుకొన్ని గొప్ప వ్యక్తి జైపాల్రెడ్డి అని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్రెడ్డి చేసిన కృషి మరువులేనిదన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎంతో మంది నాయకులకు జైపాల్రెడ్డి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. జైపాల్రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అయన మృతి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జైపాల్రెడ్డి ఇక లేరు..
అలుపెరగని రాజకీయ యోధుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి (77) కన్నుమూయడంతో ఆ పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జాతీయ రాజకీయాల్లో విశిష్ట గుర్తింపు పొందిన ఈయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై చెరగని ముద్ర వేసుకున్నారు. సుమారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలోని ప్రస్థానాన్ని జిల్లా నేతలు నెమరువేసుకున్నారు. సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జైపాల్రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో అదే పార్టీతో విభేదించి జనతా పార్టీలో చేరారు. తొలిసారిగా 1980లో మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగి అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరాగాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లోనే చేరారు. జిల్లాపై చెరగని ముద్ర జాతీయ రాజకీయాల్లో విశిష్ట గుర్తింపు పొందిన జైపాల్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేసుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో స్థానిక సంస్థల నుంచి ఎంపీ వరకు ఏ ఎన్నికలయినా తాను నిశ్చయించుకున్న వారికే టిక్కెట్లు వచ్చేలా చక్రం తిప్పారు. తనను నమ్ముకున్న వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించారు. ఈ క్రమంలో నాలుగేళ్ల నుంచి సొంత పార్టీకి చెందిన జిల్లా నేతల నుంచే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యే.. ఎంపీగా ఇక్కడ్నుంచే ప్రస్థానం సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగి.. కేంద్రంలోనూ తనదైన ముద్ర వేసుకున్న జైపాల్రెడ్డి ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఉమ్మడి జిల్లా నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలిసారిగా 1969లో ఉమ్మడి జిల్లా పరిధిలోని కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన అప్పటి ఎస్.ఎస్.పి. అభ్యర్ధి బి.ఎస్.రెడ్డిపై 4,178 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించిన జైపాల్రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన ఇతర సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో 1984లో జనతా పార్టీ నుంచి మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్పై 80,103 ఓట్లతో గెలిచారు. ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన జైపాల్రెడ్డి ఈ ఏడాది మార్చి 25న.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. అనారోగ్యం.. పై బడ్డ వయస్సే తన ఈ నిర్ణయానికి కారణమన్నారు. ఈ ప్రకటన.. కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపింది. లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 1965 నుంచి 2009 వరకు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం మాడ్గుల (ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలిసింది) కు చెందిన సూదిని జైపాల్రెడ్డి.. 1942 జనవరి 16న అమ్మమ్మ ఊరైన నల్లగొండ జిల్లా చందూరు మండలం నెరమెట్టలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాపుచ్చుకున్న ఆయన విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారు. రెండుసార్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965 నుంచి 71 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1969–72 పీసీసీ జనరల్ సెక్రటరీగా, 1969–83 వరకు వరుసగా నాలుగుసార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో మహబూబ్నగర్ ఎంపీగా గెలుపొందారు. 1990–98 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991–92 జూన్లో రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. 1999–2000లో సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి చైర్మన్గా సేవలందించారు. 1999, 2004లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2005 వరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా, 2006లో పట్టణాభివద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో చేవేళ్ల నుంచి ఎంపీ గెలుపొంది కేంద్రపట్టణాభివద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన జైపాల్రెడ్డి దక్షిణ భారతదేశంలోని యువ పార్లమెంటేరియన్లలో ప్రథముడిగా గుర్తింపు పొందారు. ఐకె గుజ్రాల్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. మన్మోహన్సింగ్ హయాంలో పెట్రోలియం, కేంద్ర పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖలకు మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర జైపాల్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. అదే సమయంలో ఆంధ్రాలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించిన అధిష్టానం అదే నెల 24న తెలంగాణ ఏర్పాటు ప్రకటనను ఉపసంహరించుకుంది. దీంతో ఇక్కడా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉద్యమకారులు దాడులకు దిగారు. అధిష్టానం తీసుకున్న యూ టర్న్ నిర్ణయంపై కలతచెందిన జైపాల్రెడ్డి రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉన్న హోదాలో తెలంగాణ ఎంపీలందరితో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు నిర్వహించారు. అధిష్టానానికి తెలంగాణవాదం బలంగా వినిపించేలా కృషి చేశారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను సోనియాగాంధీకి వివరించి చివరకు ప్రకటన చేయించుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు తొలి సీఎం జైపాల్రెడ్డి అని కాంగ్రెస్లో జోరుగా చర్చలు కొనసాగాయి. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు. ఈ ఏడాది మార్చి 25న ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికారు. -
20వ తేదీ రాత్రి ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్ : జైపాల్రెడ్డి ఆకస్మిక మర ణం ఆయన కుటుంబ సభ్యుల్ని, సన్నిహితులు, అభిమానులను, పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కలిచివేసింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా జ్వరం బారిన పడటం, అది కాస్త తీవ్రమై వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించడం అంతా కలలాగే ఉం దని ఆయన సన్నిహితులంటున్నారు. శనివారం 20వ తేదీ మధ్యాహ్నం తనకు జ్వరంగా ఉందని జైపాల్రెడ్డి ఇంట్లో వారికి చెప్పాడు. ఆ సమయంలో జైపాల్రెడ్డి అల్లుడు (కూతురి భర్త) డాక్టర్ ఆనంద్ అక్కడే ఉన్నాడు. జైపాల్ రెడ్డిని పరిశీలించిన ఆయన జ్వరం తగ్గేందుకు మాత్ర ఇచ్చారు. దాంతో జ్వరం తగ్గినట్లే తగ్గినా.. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎక్కువైంది. దీంతో అల్లుడు ఆనంద్, పెద్దకుమారుడు అరవింద్రెడ్డి హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏషియయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రికి తరలించారు. చదవండి: జైపాల్రెడ్డి ఇక లేరు.. ఆదివారం నాటికి జైపాల్రెడ్డికి శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దాంతో వైద్యులు ఆయన్ను ఆదివారం రాత్రి ఐసీయూకి మార్చారు. గుండె కొట్టుకునే రేటు నెమ్మదిగా ఉండటంతో వెంట నే వెంటిలేటర్ అమర్చారు. ఇదే సమయంలో ఆయనకు నిమోనియా అటాక్ అయింది. రెండురోజుల తర్వాత ఊపిరితిత్తుల్లో నీళ్లున్నాయ ని గుర్తించిన వైద్యులు చికిత్సనందించారు. గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయి. వీటికి చికిత్స జరుగుతుండగానే.. ఈ సమస్యలకు కాస్త ముదిరి శనివారం రాత్రి (ఆదివారం తెల్లవారుజామున) 1.08 నిమిషాలకు జైపాల్రెడ్డి కన్నుమూసారు. 20 ఏళ్లుగా ఓఎస్డీ, డ్రైవర్లు కీలకం జైపాల్రెడ్డి జీవితంలో కుటుంబ సభ్యులు కాకుండా ఇద్దరు వ్యక్తులు రెండు దశాబ్దాలుగా ఆయనతోనే ఉన్నారు. ఒకరు ఓఎస్డీ వెంకటరామిరెడ్డి, రెండో వ్యక్తి కారు డ్రైవర్ పాషా. వీరిద్ద రూ 20 ఏళ్లకుపైగా జైపాల్రెడ్డి వద్దే పనిచేస్తున్నారు. వెంకటరామిరెడ్డి.. జైపాల్రెడ్డికి వీరాభిమాని, శ్రేయోభిలాషి, వీరిద్దరిది గురుశిష్యుల అనుబంధమని సన్నిహితులు చెబుతారు. 1999లో ఆయన వద్ద వీరిద్దరూ చేరారు. అప్ప టి నుంచి ఆదివారం తుదిశ్వాస విడిచేవరకు వీరిద్దరూ జైపాల్రెడ్డి వెన్నంటే ఉన్నారు. ఆయనో స్టేట్స్మన్: నరసింహారెడ్డి జైపాల్రెడ్డి స్వా ర్థం లేని, ముక్కుసూటి మనిషని ఆయన సన్నిహితుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పి.నరసింహారెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి తో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. జైపాల్రెడ్డి దేశప్రయోజనాల గురించే ఆలోచించేవారని నరసింహారెడ్డి అన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. రిలయన్స్ కంపెనీ నుంచి రావాల్సిన వేల కోట్ల రూ పాయల బకాయిలను చెల్లించాల్సిందేనంటూ నోటీసులు పంపే విషయంలో జైపాల్రెడ్డి ఏమాత్రం సం శయించలేదని గుర్తుచేశారు. ఈ నిర్ణయం సంచనలమై ఆ తర్వాత వివా దం రేపి ఆయన మంత్రిత్వ శాఖ మార్పుకు కారణమైనప్పటికీ.. జైపా ల్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదన్నా రు. తెలంగాణ ఉద్య మ సమయంలో ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన స్థానంలో వేరేవరున్నా.. సీఎం కుర్చీపై ఆశతో తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షల్ని తాకట్టు పెట్టి ఉండేవారన్నారు. నిత్యం ప్రజలు, ప్రజాస్వామ్య విలువల గురించే పరితపించే మహనీయుడని ప్రశంసించారు. ఎమర్జెన్సీలో పార్టీని వీడినా.. 1999లో మతశక్తులు బలపడటాన్ని చూసి సెక్యులర్ భావజాల పరిరక్షణకు ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరారని వెల్లడించారు. పార్టీ, దేశప్రయోజనాలకోసం నిజాయతీగా పనిచేసిన సైనికుడని నరసింహారెడ్డి కొనియాడారు. మధ్యలోనే ఆగిన జీవిత చరిత్ర! జైపాల్రెడ్డి రాజకీయ చాణక్యుడు, నడిచే గ్రంథాలయంగా మిత్రులు, సన్నిహితులు అభివర్ణిస్తారు. ఈ విషయం పలుమార్లు పార్లమెంటు వేదికగా ఆయన నిరూపించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా జైపాల్ రెడ్డి సామర్థ్యాన్ని ప్రశంసించేవారు. అద్భుతమైన వాగ్ధాటి కలిగిన జైపాల్రెడ్డి మంచి రచయిత కూడా. ఆయన తన రాజకీయ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలని ‘టెన్ ఐడియాలజీస్’అనే శీర్షికతో పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం అమేజాన్లో అందుబాటులో ఉంది. కొద్దికాలం క్రితమే ఆయన జీవిత చరిత్ర మొదలుపెట్టినట్లు సమాచారం. దురదృష్టవశాత్తూ ఈ పుస్తకం మధ్యలో ఉండగానే ఆయన కన్నుమూసారు. అదే చివరి రాజకీయ కార్యక్రమం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘటనలకు సాక్షీభూతంగా నిలిచిన జైపాల్రెడ్డి హైదరాబాద్లో తన చివరి రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జూన్ 8,9 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. ఇదే ఆయన చివరి రాజకీయ కార్యక్రమం. -
ఆ పుస్తకం.. ఆయన ఆలోచన
సాక్షి, హైదరాబాద్: ‘టెన్ ఐడియాలజీస్ ద గ్రేట్ అసిమెట్రీ బెట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజం’అనే పుస్తకం ద్వారా జైపాల్రెడ్డి తన ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రతిష్టాత్మకమైన పుస్తకం. పాత, కొత్త తరం రాజకీయాల్లో మునిగి ఉన్న నాయకుడు రచించినది. కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన సుదీర్ఘ అనుభవం పొందారు. ఒక సైద్ధాంతిక భావజాలం ఉన్న నాయకుడు జైపాల్రెడ్డి. ఆయన తన పుస్తకం ముందుమాటలో ’ఇటీవలి దశాబ్దాల్లో సైద్ధాంతిక చర్చలు మరుగునపడ్డాయి. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది’అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పునరుజ్జీవనం, మానవతావాదం, సంస్కరణలు, శాస్త్రీయ విప్లవం అనే 4 గొప్ప ఉద్యమాలు ఏయే దేశాలను ఎలా తీర్చిదిద్దాయో పుస్తకంలో విశదీకరించారు. అందులో భాగంగా పది భావజాలాలను ఆయన నొక్కిచెప్పారు. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం, పరిణామాత్మక సోషలిజం, విప్లవాత్మక సోషలిజం, స్త్రీ వాదం, పర్యావరణ వాదం, అణు, శాంతి వాదం, ప్రపంచ వాదం వీటిపై తన అభిప్రాయాలను తెలిపారు. పారిశ్రామిక విధానం ఎలా వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిందో వివరించారు. జాతీయ వాదంపై రాసిన అధ్యాయంలో భారతదేశం ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ దేశాల సాంస్కృతిక, మత, భాష, జాతి, భౌగోళిక లేదా సామ్రాజ్య భావాలతో పురాతన కాలం నుంచీ మమేకమైపోయారని రాశారు. కాబట్టి పాత సాంస్కృతిక భావనలను ప్రస్తుత రాజకీయ ఆలోచనల నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకుంది జైపాలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) చేయాలన్న సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల డిమాండ్కు అడ్డుగోడగా నిలబడి దాన్ని అడ్డుకోవడంలో ఎస్.జైపాల్రెడ్డి పాత్ర మరువలేనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలు పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ– 2013 బిల్లును అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపేందుకు సమావేశమైన సందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్రెడ్డి ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. సీమాంధ్ర ప్రజలకు పూర్తిరక్షణ కవచంగా ఉంటామని జైపాల్ ఇచ్చిన ధీమాతో కేబినెట్ వెనక్కి తగ్గి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఉమ్మడి రాజధాని ప్రాంతాన్ని యూటీగా ప్రకటిస్తే ఇబ్బంది ఉండదని అన్నారు. దీన్ని కేబినెట్లో ఉన్న ఒకే ఒక్క తెలంగాణ మంత్రి జైపాల్రెడ్డి తీవ్రంగా అడ్డుకున్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కుల మేరకు హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్రులకు రక్షణ ఉంటుంద న్నారు. యూటీ అవసరం లేకుండానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేర్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్(3) అధికరణ కేంద్రానికి సర్వాధికారాలను కల్పిస్తోందని చెప్పారు. జైపాల్ వాదనలతో ఏకీభవించిన కేబినెట్ యూటీకి మద్దతివ్వలేదు. -
ఓ ప్రజాస్వామ్యవాది అలుపెరుగని ప్రస్థానం
తనను తాను రాజకీయ మేరునగధీరుడిగా మలచుకున్న కృషీవలుడు జైపాల్రెడ్డి. దేశం గర్వించదగ్గ పార్లమెంటరీ నాయకుడిగా భారత రాజకీయాలపై ఆయనొక బలమైన ముద్ర. సమకాలీన రాజకీయాలు–మేధావిత్వాన్ని జతకలిపి ఆలోచించిన ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు గుర్తుకు రావాల్సిందే! ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమా సిద్ధాంతాలు, విలువల్లో రాజీపడకుండా ఓ సంపూర్ణ, సంతృప్తికర జీవితం గడిపారాయన. జైపాల్రెడ్డి ఎదుగుదలకు ఉపకరించిన అంశాలెన్నో ఉన్నా.. ప్రాథమికంగా ఆయన బలమైన ‘ప్రజాస్వామికవాది’కావడమే ఎదుగుదలకు ప్రధాన కారణం. ఇది మామూలు సందర్భాల్లోకన్నా సంక్లిష్ట సమయాల్లోనే ఎక్కువగా వెల్లడైంది. కాంగ్రెస్లో ఎదుగుదల, ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్ను వీడటం, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం, జనతాపార్టీలో చేరడం తిరిగి కాంగ్రెస్ గూటికి రావడం.. వరించి వచ్చిన పదవుల్నీ తృణప్రాయంగా నిరాకరించడం.. ఇలా ఏ పరిణామాన్ని తీసుకున్నా తన మౌలిక రాజకీయ సిద్ధాంత బలమే ఆయన్ని నడిపింది. అంతకుమించి ఆయన్ని నిరూపించింది. అందుకే, ఆయన్ని గమనిస్తున్న ఓ తరం రాజకీయ నేతలు, పరిశీలకులు ‘ఒక శకం ముగిసినట్టే’అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో వ్యక్తి అటువంటి రాజకీయ జీవితం గడపడం అసాధ్యమంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా విశ్వసించడమే కాకుండా దాని చుట్టే తన రాజకీయ మనుగడని అల్లుకొని, విలువల్ని వీడకుండా, అవకాశాల్ని వినియోగించుకుంటూ పైకెదిగిన నేత జైపాల్రెడ్డి. శారీరక వైకల్యం శాశ్వతమని గ్రహించిన క్రమంలోనే ఇతరులకన్నా తనని కాస్త విభిన్నంగా ఉంచగలిగిందేమిటనేదే ఆయనలోని మొదటి సంఘర్షణ. తెలివి, విజ్ఞానం కొంతమేర తన అవకాశాల్ని మెరుగుపరుస్తుందని విద్యార్థి దశలోనే నిర్ణయించుకొని, అందుకోసం ప్రత్యేకంగా కృషిచేశానని ఆయనే చెప్పేవారు. రేయింబవళ్లు విస్తృతంగా చదివేవారు. ఇంగ్లీష్పై మక్కువతో ఎమ్మే ఇంగ్లీష్ చదివినా, రాజకీయాలపై ఆసక్తితో చరిత్ర–రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసినా.. ఆ క్రమంలో తనకు తత్వశాస్త్రంపై మోజు పెరిగిందనేవారు. ఇటీవల ఆయన వెలువరించిన ‘టెన్ ఐడియాలజీస్’ఒక గొప్ప తత్వశాస్త్ర గని. తనకున్న సహజనాయకత్వ లక్షణాలకు విద్యార్థి దశలోనే పదునుపెట్టి భవిష్యత్ రాజకీయ మనుగడకు బాటలు వేసుకున్నారు. పీయూసీ చదివే రోజుల్లో, నిజాం కాలేజీ విద్యార్థిగా తెలివితేటలు పెంచుకోవడం, వీటిని ప్రదర్శించడం మొదలైంది. ఇతర కాలేజీల నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు కేవలం ఆయన ప్రసంగాల్లోని భాషా పటిమ, బలమైన భావాలు, పదునైన వ్యక్తీకరణ కోసమే నిజాం కాలేజీకి వచ్చేవారు. వేదికల మీద, కింద కూడా వక్తగా ఆయనొక ప్రభావశాలి! ఆయన ఎప్పుడు రెడ్డి హాస్టల్ సందర్శించినా.. అదొక చర్చావేదికయ్యేది. రహస్యమెరిగిన నిపుణుడు పార్లమెంటరీ ప్రసంగ నైపుణ్యమెరిగిన వాడు కనుకే సభ లోపలా, బయటా అధికుల్ని ఆకట్టుకునేలా జైపాల్రెడ్డి మాట్లాడేవారు. వాజ్పేయి ప్రభుత్వం పార్లమెంటులో ఒక ఓటు తేడాతో కూలిపోవడానికి ముందు, విపక్షం తరపున ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రసారమాధ్యమాలు ఆకాశానికెత్తాయి. ‘రాజ్యాంగ నిర్మాణ సభ’లో జరిగిన విస్తృత చర్చల్ని క్షుణ్ణంగా చదివేవారు. అందుకే, ఏదైనా అంశం సభలో వివాదాస్పదమైనపుడు, సదరు అంశానికి మూలాలు రాజ్యాంగంలో ఎక్కడున్నాయి? ఎందుకు? ఎలా పొందుపరిచారు? అప్పుడు ఏమనుకున్నారు? ఉటంకిస్తూ.. అదెలా తప్పో, ఒప్పో చెప్పే వారు. ఆయన ప్రసంగాలు సూటిగా, అతి ప్రభావవంతంగా ఉంటా యే తప్ప సుదీర్ఘంగా ఉండవు. దక్షిణాది నుంచి తొలి ఉత్తమపార్లమెంటేరియన్గా అవార్డు దక్కినపుడు, ఇంగ్లీష్ దినపత్రిక దిహిందూ ‘దేశంలోనే అత్యుత్తమ రాజకీయ పదసముచ్ఛయ కర్త’అని రాయడం ఆయనకు నిజమైన ప్రశంస. పదాల ఉచ్ఛరణ (ఫొనెటిక్స్) పైనా తగు అధ్యయనంతో ఆయన వాడే కొన్ని ఆంగ్ల పదాలకు చట్టసభ లేఖకులు, నేతలు, చివరకు జర్నలిస్టులు డిక్షనరీలు వెతకాల్సి వచ్చేది. బీజేపీ నేత సుష్మాస్వరాజ్ దీన్ని సభలోనే అంగీకరించారు. జర్నలిస్టుల్లో అత్యధికులు ఆయనకు ఆత్మీయులు. ఢిల్లీలో ఏటా ఓరోజు జర్నలిస్టులకు విందు ఇచ్చేవారు. తరచూ నియోజకవర్గాలు మారుతారు అనే విమర్శను సున్నితంగా తిప్పికొడుతూ, ‘నిజానికి మీడి యా నా స్థిర నియోజకవర్గం’అని ఛలోక్తి విసిరేవారు. సిద్ధాంతాలు, పార్టీ విధానాలు, రాజకీయ విలువలు, వాస్తవిక పరిస్థితులపై ఆసక్తిగా చర్చించే వారు కలిస్తే, సుదీర్ఘంగా ముచ్చటించడానికి ఇష్టపడేవారు. ఆయనతో అప్పుడప్పుడు భేటీ అయ్యే అవకాశం లభించిన వారిలో నేనొకడ్ని! తను రచించిన ‘టెన్ ఐడియాలజీస్’తొలి పలుకుల్లో ఓ ప్రస్తావన చేస్తూ, ‘గరిష్ట సంక్షేమం, కనీస యుద్ధకాంక్షను సాధించడమే రాజకీయ సిద్ధాంతాల అసలు లక్ష్యం’అన్నారు. ప్రజాస్వామ్యవాదమే పరమావధిగా సిద్దాంతాలు, విలువలు, మేధస్సు నడిపిన నేత జైపాల్రెడ్డి. చెదరని మనోధైర్యం శారీరక వైకల్యం ఉన్నా ఇతరరేతర నైపుణ్యాల్ని వృద్ధి చేసుకొని శారీరక లోపాల్ని అధిగమించవచ్చని నిరూపించిన జైపాల్రెడ్డి ఒక స్ఫూర్తిదాత! శరీర భౌతిక ధర్మాన్నే కాక అంతర్గత రసాయన ధర్మాల పట్లా ఆయనది లోతైన అవగాహన. దశాబ్దాలుగా తనలో భాగమై ఉన్న మధుమేహాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచేవారు. నిమోనియా తో బాధపడుతూ, పలురకాల ఇన్ఫెక్షన్లతో ఆహారం అరుగుదల క్షీణించిన చివరి రోజుల్లోనూ, ‘ఇక గుండె ఆగడం ఏ నిమిషమైనా జరగొచ్చు’అని కుటుంబీకులతో సాదాసీదాగా మాట్లాడిన నిబ్బ రత్వం ఆయనది. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. 1942లో జన్మించిన ఆయన, దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి బాలుడే అయినా, స్వాతంత్య్రానంతర తొలి దశకాల ఆదర్శ వాతావరణ ప్రభావం ఆయన ‘ప్రజాస్వామ్య’ఆలోచనా సరళిని ఆవిష్కరించింది. గాంధీ, రాజగోపాలచారి, నెహ్రూ తననెంతో ప్రభావితం చేశారని చెప్పేవారు. స్థిరమైన సిద్ధాంత బలం ఆయన ఆస్తి! ‘రచయితలు, రాజకీయ నేతలు తమ ఆస్తులు–అప్పుల వెల్లడి కన్నా తమ సిద్ధాంత వైరుధ్యాల్ని ప్రకటించడం ముఖ్యం’అనేవారు. కాంగ్రెస్లో కీలకస్థాయికి ఎదిగి, ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని వ్యతిరేకించి పార్టీని వీడిన సాహసం ఆయన సిద్ధాంత బలమే! సుదీర్ఘకాలం కాంగ్రెస్ను, వారి అవినీతిని వ్యతిరేకిస్తూ దేశవిదేశాల్లో పెరుతెచ్చుకొని కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారేమని జర్నలిస్టులడిగిన ప్రశ్నకు సమాధానమే ఆయన నిబద్ధతకు నిదర్శనం. ‘జనతాదళ్ విచ్ఛిన్నమవడం వల్ల బీజేపీ బలపడుతోంది, అందుకే, ఇన్నేళ్లు నేను సంపాదించుకున్న వ్యక్తిగత పేరు–ప్రతిష్టల్ని కూడా పణంగా పెట్టి, నా సిద్ధాంతమైన లౌకికవాద పరిరక్షణ కోసం కాంగ్రెస్లో చేరాల్సివస్తోందన్నా’రు. ఎన్టీఆర్ను అక్రమం గా గద్దె దించినపుడు జరిగిన ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన, ‘ఇది ఎన్టీయార్ కోసం కాదు, ప్రజాతీర్పు వక్రీకరణకు గుణపాఠం, ప్రజాభిప్రాయానికి పట్టం’అని తన ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెల్లడించారు. - దిలీప్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి -
అలుపెరగని రాజకీయ యోధుడు
సాక్షి, హైదరాబాద్: అలుపెరుగని రాజకీయ యోధుడు.. సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో కొనసాగుతూ.. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ తనదైన ముద్రవేసిన విలక్షణ నాయకుడు ఎస్ జైపాల్రెడ్డి. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఐదుసార్లు ఎంపీగా గెలుపొంది.. కేంద్రంలో కీలక మంత్రులు నిర్వహించిన జైపాల్రెడ్డి తాను చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారు. నిజాయితీ, నిర్భీతిగల నాయకుడిగా, అవినీతి మరక అంటని సచ్ఛీలుడిగా జాతీయ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్ రెడ్డికి విశిష్ట గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన జైపాల్రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీతో విభేదించి జనతా పార్టీలో చేరారు. అనంతర కాలంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి.. అనేక పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారని అంటారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా, నిరంతర కార్యశీలిగా, రాజకీయ దిగ్గజంగా పేరొందిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయిందని రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వ్యక్తమవుత్నునాయి. ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యే రాజకీయంగా తెలంగాణలోని మెదక్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలతో ప్రత్యక్ష పరిచయాలున్న జైపాల్ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్నగర్జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిట్రేచర్లో పట్టా పొందారు. విద్యార్థి దశనుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న జైపాల్రెడ్డి.. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. ఆ సమయంలో 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జన్సీ అనంతరం 1980లో ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి జైపాల్రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా.. ఇందిరకు దీటైన పోటీని ఇచ్చారు. అంతకుముందు 1969లో తొలిసారి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన జైపాల్రెడ్డి .. నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 1984లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1998, 1999, 2004 2009 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలుపొందారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1977లో కాంగ్రెస్ను వీడిన జైపాల్ తిరిగి 1999లో మళ్లీ అదే గూటికి చేరారు. 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్గా పనిచేశారు. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్సింగ్ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్గా పురస్కారం అందుకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఉద్యమం ఉదృతం సాగుతున్న సమయంలో కేంద్రమంత్రిగా కీలక బాధ్యతల్లో జైపాల్.. కేంద్రంచే బిల్లును ఆమోదం పొందించుటలో కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో నేతలు తెలంగాణ ఏర్పాటుకు ఒప్పిండంలో సఫలమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొన్నారు. డీకేతో విభేదాలు.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. అవే ఆయన ప్రత్యక్షంగా పొల్గొన్న చివరి ఎన్నికలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీని నడిపించడంతో జైపాల్ ముందున్నారు. అయితే కాంగ్రెస్కు చావోరేవోగా మారిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాజీమంత్రి డీకే అరుణతో విభేదాలు పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చాయి. జిల్లాపై పట్టుకు ఇద్దరు నేతలు పోటీపడి.. ఉన్న కార్యకర్తలను దూరం చేసుకున్నారు. జైపాల్ కొంత వెనక్కి తగ్గినా.. ఎన్నికల అనంతరం డీకే కాంగ్రెస్ను వీడారు. కాగా దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్రెడ్డి గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొత్తం ఐదుసార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. -
హ్యాట్రిక్ విన్
సాక్షి,సిటీబ్యూరో: ఎంఐఎంకు కంచుకోటగా నిలిచిన హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత సలావుద్దీన్ ఒవైసీ, ఆయన తనయుడు అసదుద్దీన్ ఒవైసీ వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ప్రత్యర్థులను మట్టికరిపించి,తిరుగులేని నేతలుగా రాణించారు. సలావుద్దీన్ ఒవైసీ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించి,డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ♦ సలావుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీని స్థాపించి నగరంలో అత్యంత ప్రభావితమైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ఎంఐఎం వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్దుల్ వాహెద్ ఒవైసీ తనయుడు సలావుద్దీన్ తండ్రికి రాజకీయ వారసుడిగా నిలిచారు. 1958 నుంచే నగర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగా రు. వాహెద్ మరణానంతరం ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1960లో తొలిసారి మల్లేపల్లి నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. 1962లో పత్తర్గట్టి, 1967లో యాకుత్పురా, 1972లో పత్తర్గట్టి అసెంబ్లీ స్థానాల నుంచి, 1978, 1983లలో చార్మినార్ నుంచి గెలిచారు. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 38.13 శాతం మెజారిటీతో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 1989 ఎన్నికల్లో 45.91 శాతం, 1991లో 46.18 శాతం మెజారిటీ సొంతం చేసుకున్నారు. 1996 ఎన్నికల్లో 34.57 శాతం, 1998లో 44.65 శాతం, 1999లో 44.36 శాతం మెజారిటీతో గెలిచారు. వరుసగా ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అనారోగ్యం కారణంగా 2004లో రాజకీయాలకు దూరమైన సలావుద్దీన్ 2008 సెప్టెంబర్లో మరణించారు. ♦ అసదుద్దీన్ ఒవైసీ సలావుద్దీన్ తర్వాత ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసదుద్దీన్ ఒవైసీ 1994 నుంచి వరుసగా మూడుసార్లు చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004లో తన తండ్రి సలావుద్దీన్ క్రియాశీలక రాజకీయాల కు దూరం కావడంతో హైదరాబాద్ పార్లమెంట్ సానం పోటీ చేసి విజయం సాధించారు. 2009లో అసద్ను ఓడించేందుకు టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలన్నీ ఏకమయ్యాయి. అసద్కు వ్యతిరేకంగా సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ ను బరిలోకి దింపాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొంది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హైదరాబాద్ ఎంపీగా తిరుగులేని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం నాలుగో పోటీకి సిద్ధమవుతున్నారు. ♦ సూదిని జైపాల్రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన సూదిని జైపాల్రెడ్డి అపర మేధావి. ఆయన పార్లమెంట్లో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాల్సిన పరిస్థితి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థుడిగా పేరొందిన జైపాల్రెడ్డికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కీలకమైన పదవులే లభించాయి. కాంగ్రెస్లో గొప్ప నేతగా ఎదిగిన జైపాల్రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు. మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశారు. శాస్త్ర సాంకేతిక, ప్రసార, సమాచార శాఖలు చూశారు. యూపీఏలో కీలకమైన నేతగా ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ తన కర్తవ్యాన్ని నిర్వహించారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో మిర్యాలగూడ రద్దయింది. కొత్తగా చేవెళ్ల నియోజకవర్గం ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి జైపాల్రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొందారు. మన్మోహన్ కేబినెట్లోనూ కేంద్రమంత్రిగాసేవలందించారు. -
సీట్ల లొల్లి!
సాక్షి, నాగర్కర్నూల్: పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ముందస్తు వ్యూహంతో వ్యవహరిస్తున్నప్పటికీ నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపికపై ఎటూ తేలడం లేదు. గాంధీభవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఒక్కో పార్లమెంట్ స్థానానికి నాలుగు నుంచి, ఐదుగురి ఆశావహులతో కూడిన జాబితాను ప్యానెల్ ఖరారు చేసింది. ఈ జాబితాలో తమకు అనుకూలమైన వారి పేర్లు లేకపోవడంపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే మరోసారి సీనియర్ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపినట్లు సమాచారం. మహబూబ్నగర్లో పోటీకి జైపాల్ అనాసక్తి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంíపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీపట్ల విధేయత లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారిలో పీఏసీ జాబితా తయారు చేసి పంపినట్లు సమాచారం. ఈ జాబితాలో జైపాల్రెడ్డి పేరు లేకపోవడంపై మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. గాంధీభవన్ వేదికగా నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయపడ్డాయి. జైపాల్రెడ్డి మహబూబ్నగర్ ఎంపీ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపకపోగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిని తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో జైపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా మరోసారి మహబూబ్నగర్ ఎంపీ బరిలో ఆయనే ఉంటారని చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మక్తల్, మహబూబ్నగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంలోనూ, నారాయణపేట నుంచి శివకుమార్రెడ్డికి కాంగ్రెస్ తరఫున టికెట్ రాకుండా చూడడం, దేవరకద్ర నియోజకవర్గం ఆలస్యంగా పవన్కుమార్కు కేటాయించడం వంటి అంశాల్లో జైపాల్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు పోటీచేయకుండా తప్పుకుంటున్నారని డీకే అరుణ వంటి సీనియర్ నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. జైపాల్రెడ్డి లేదా రేవంత్రెడ్డి వారు ఇరువురు కాకుంటే మహబూబ్నగర్ లోక్సభ పరిధిలోని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, అనిరుధ్రెడ్డిలను పోటీలో ఉంచాలని ఆమె ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోసారి నంది ఎల్లయ్య? తెలంగాణలోనే ఏకైక కాంగ్రెస్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్య మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నంది ఎల్లయ్య పోటీ చేయాలని భావిస్తే సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన పోటీ చేయకపోతే దరఖాస్తు చేసుకున్న వారిలోనే అన్ని కోణాల్లో ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ టికెట్ ఆశించినప్పటికీ అవకాశ రాలేదని ఈ సారైన అవకాశం ఇవ్వాలని కోరుతున్న వికారాబాద్ కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ పాటు సతీష్ మాదిగ పేర్లను డీకే అరుణ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరితో పాటు నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణకూడా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. వీరందరితో పాటు డీసీసీ సెక్రెటరీ బాలకిషన్ పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది వేచి చూడాలి. మొత్తంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మరోసారి కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. -
పరీకర్.. మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి?!
పనాజి : తాను పదవిలో కొనసాగడం కోసం గోవా సీఎం మనోహర్ పరీకర్ ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి ఎద్దేవా చేశారు. పరీకర్ అనారోగ్యం కారణంగా గోవా అభివృద్ధి కుంటుపడిందని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ‘జన్ఆక్రోష్’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాటి ర్యాలీలో జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైతికత గురించి మాట్లాడే మనోహర్ పరీకర్ స్వప్రయోజనాల కోసం సీఎం కుర్చీని జలగలా పట్టుకున్నారని విమర్శించారు. ‘ నాకు తెలిసి ఆయన తన సీటు కోసం ప్రధాని మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో? ఇందుకోసం రఫేల్ డీల్ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారేమో’ అంటూ జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందిన పరీకర్ అక్టోబర్లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన పరీకర్ ఆ సమయంలో తాను తెలుసుకున్న విషయాల ఆధారంగా మోదీజీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. -
కేసీఆర్ శక్తి ఎంత..?
సాక్షి, హైదరాబాద్: కొడంగల్లో రేవంత్రెడ్డిని అరెస్టు చేసిన దుర్మార్గం అనుపమానమైందని, గతంలో ఇలాంటి దుష్టాంతాలు ఎప్పుడూ లేవని ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు దొంగల్లా వెళ్లి రేవంత్ బెడ్రూం తలుపు పగులగొట్టి అరెస్టు చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున రేవంత్ భార్య, తన తమ్ముడి కూతురు తనకు ఫోన్ చేసి విషయం చెప్పిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి నోటీసుల్లేకుండా కేసీఆర్ కూతురు ఇంటి బెడ్రూం తలుపులు పగులగొడితే ఒప్పుకుంటారా.. నువ్వు ఒప్పుకున్న రాజ్యాంగం, సమాజం ఒప్పుకుంటుందా అని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ మీడియా ఇన్చార్జి మెహ్రోజ్ఖాన్, న్యాయవాది జంధ్యాల రవి శంకర్లతో కలసి జైపాల్రెడ్డి మాట్లాడారు. కొడంగల్లో రాహుల్ బహిరంగసభ అనంతరం పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి వారంట్లు లేకుండా తలుపులు పగులగొట్టి భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. దీనికి ప్రతిగానే రాజ కీయ నిరసనల్లో భాగంగా బంద్కు పిలుపునిచ్చారని, సీఎం కార్యక్రమం ఉన్నందున బంద్ను ఉపసంహరించుకున్నారని చెప్పారు. కేసీఆర్ తన పోలీసు బలగాలతో కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భాగంగా చేసిన రాజకీయ కార్యక్రమమే తప్ప ఇందులో అభ్యంతరకరమేదీ లేదన్నారు. దీన్ని నెపంగా పెట్టి పిల్లలు, భార్యతో బెడ్రూంలో ఉండగా అరెస్టు చేయడమేం టని దుయ్యబట్టారు. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు.. తాను 4 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా పనిచేశానని, ఇలాంటి చర్యను తానెప్పుడూ చూడలేదని జైపాల్రెడ్డి పేర్కొన్నారు. ఆపద్ధర్మ సీఎంకి ఇంతటి అధికారాలు ఎక్కడివని, అసలు సీఎం కంటే ఎక్కువ అధికారాలు చెలాయించడం గర్హనీయమని మండిపడ్డారు. ఓడిపోతాననే భయం పట్టుకున్నందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. ‘లేకలేక సీఎం అయితేనే ఇంత నికృష్టంగా నియంతలా వ్యవహరిస్తున్నాడు. అసలు నీ శక్తి ఎంత? అసలు ఎవరు నువ్వు?’ అని కేసీఆర్పై మండిపడ్డారు. రేవంత్ అరెస్టుపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని, పోలీసు యంత్రాంగం చెప్రాసీల్లా ఎందుకు తిరుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపద్ధర్మ సీఎం ఎమర్జె న్సీ సీఎంగా పనిచేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రేవంత్ అరెస్ట్ నీచం.. రేవంత్ అరెస్టు అక్రమమని, పోలీసుల నీచమైన చర్య అని కుంతియా మండిపడ్డారు. నోటీసులు, వారంట్ లేకుండా రేవంత్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖం డిస్తున్నామని, ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారన్నారు. రేవంత్ నలుగురు అన్నదమ్ములు, 140 మంది నేతలను అరెస్టు చేశారని, దీని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన లు తెలపాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థు లు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ నేతలు, కార్యకర్తల ను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్కు తెలుసన్నారు. రానున్న మూడు రోజులు కీలకమైనవని, అధికార పార్టీ డబ్బు పంపిణీ పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు పహారాతో, ఎన్నికల సంఘం సహకారంతో కొడంగల్లో గెలిచేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది రవిశంకర్ అన్నారు. -
రేవంత్రెడ్డి అరెస్ట్ సరికాదు
-
కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డ జైపాల్రెడ్డి
హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలా కాకుండా ఎమెర్జెన్సీ ముఖ్యమంత్రిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..అందరి హక్కులూ కేసీఆర్ హరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపద్ధర్మ సీఎంగా అసలు సీఎం కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని విమర్శలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం అని వ్యాక్యానించారు. ఇంతకు ముందు ఇలాంటి దుష్టాంతాలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. రాహుల్ గాంధీ మీటింగ్కు తాను కూడా కొడంగల్ వెళ్లానని, తాము వచ్చాక ఎలాంటి సెర్చ్ వారంట్ లేకుండా కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లల్లో దుర్మార్గంగా సోదాలు చేశారు..దానికి నిరసనగానే రేవంత్ రెడ్డి ప్రొటెస్ట్ కాల్ ఇచ్చారు.. మొదట ఇచ్చిన బంద్ పిలుపును విరమించుకుని నిరసన పిలుపు ఇచ్చారని తెలిపారు. అది కూడా సీఎం మీటింగ్ జరిగే కోస్గిలో కాదని, కోస్గి అవతల ఉన్న కొడంగల్లో అని వెల్లడించారు. కానీ నేరుగా అర్దరాత్రి పోలీసులు దొంగళ్లా వెళ్లి భార్యా పిల్లలతో బెడ్రూంలో ఉన్నప్పుడు డోర్ పగలగొట్టి అరెస్ట్ చేశారని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ..‘ రేవంత్ రెడ్డి భార్య నా తమ్ముడి కూతురు. నాకు రాత్రి ఫోన్ చేసింది. నేను కేసీఆర్ను అడుగుతున్నా. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీ కూతురిని అలానే డోర్ పగలగొట్టి అరెస్ట్ చేస్తే ఊరుకుంటావా. కొన్ని వందల మంది రేవంత్ రెడ్డి అనుచరులను అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కేర్ టేకర్ మాత్రమే పూర్తి సీఎం కాదు. అయినా పోలీసు అధికారులు కేసీఆర్కు వంత పాడుతున్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతాం. ఓటమి భయం పట్టుకునే సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. అందుకే సంగారెడ్డిలో జగ్గారెడ్డి, గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి, కొడంగల్లో రేవంత్ రెడ్డి పట్ల దుర్మార్గం వ్యవహరిస్తున్నారు. లేక లేక సీఎం అయిన నువ్వెంత? నీ శక్తి ఎంత? అసలు నువ్వెవరు?. పోలీసులు సీఎం కేసీఆర్కు ఛప్రాసీల్లా ఎందుకు పనిచేస్తున్నారని’ జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
బుజ్జగించారు..ఉపసంహరించుకున్నారు...
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా నేతలందరూ ఒక తాటి మీదకు వస్తున్నారు. ముఖ్యంగా టికెట్లు దక్కక అసంతృప్తితో నామినేషన్లు వేసిన నేతల్లో కొందరిని బుజ్జగించే పని మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు దక్కక మూడు చోట్ల రెబల్స్ నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ తరఫున ఒక స్థానంలో రెబెల్ బరిలోకి దిగారు. ఆయా నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే.అరుణను రంగంలోకి దింపింది. దీంతో ఆమె మహబూబ్నగర్లో కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా రెబెల్స్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. అలాగే దేవరకద్ర విషయంలో జైపాల్రెడ్డి జోక్యంతో పార్టీ నేత జి.మధుసూదన్రెడ్డి(జీఎంఆర్) తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇక నారాయణపేటలో రెబెల్గా బరిలోకి దిగిన కుంభం శివకుమార్రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడంలేదు. బీఎల్ఎఫ్ అభ్యర్థిగా కొనసాగేందుకు ఆయన నిర్ణయించుకోగా.. మక్తల్లోనూ టీఆర్ఎస్ రెబెల్ నేత ఎం.జలందర్రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. నచ్చజెప్పిన డీకే.అరుణ మహాకూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించిన మహబూబ్నగర్ స్థానం విషయంలో నెలకొన్న చిక్కులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి డీకే. అరుణకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రంగప్రవేశం చేసిన అరుణ... కూటమిలో భాగస్వామ్యమైన తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి నేతలతో సంప్రదింపులు చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ తరఫున బరిలో నిలిచిన యెన్నం శ్రీనివాస్రెడ్డిని మహబూబ్నగర్లోని తన నివాసం వద్దకు పిలిపించుకుని సర్దిచెప్పారు. భవిష్యత్లో కూటమి భాగస్వామ పక్షాలకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ జన సమితి నేత జి.రాజేందర్రెడ్డికి సైతం నచ్చజెప్పారు. ఇలా సంప్రదింపులు చేసి ఇరువురు నేతలతతో నామినేషన్లు ఉపసంహరింప చేశారు. అలాగే కూటమి భాగస్వామ అభ్యర్థి ఎర్ర శేఖర్కు మద్దతుగా ప్రచారం చేయాలని సూచించారు. అందుకు ఇరువురు నేతలు కూడా సమ్మతి తెలిపి... ప్రచారంలో పాల్గొంటామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ టికెట్ దక్కక బయటకు వెళ్లి ఎన్సీపీ తరఫున బరిలో ఉన్న ఎం.సురేందర్రెడ్డి, బీఎస్పీ తరఫున బరిలో ఉన్న సయ్యద్ ఇబ్రహీం మాత్రం తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. అలాగే దేవరకద్రలో సైతం జైపాల్రెడ్డి వర్గంగా ముద్రపడిన జీఎంఆర్ సైతం బుజ్జగింపుల పర్వంలో భాగంగా తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న డోకూరు పవన్కుమార్కు మద్దతుగా ప్రచారంలో సైతం పాల్గొంటామని ప్రకటించారు. నారాయణపేటలో సీన్ రివర్స్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు మూడు చోట్ల రెబెల్స్ బెడద ఉండగా రెండు చోట్ల కాస్త సద్గుమణిగింది. కానీ నారాయణపేటలో మాత్రం టికెట్ దక్కక స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శివకుమార్రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ముఖ్యులు డీకే.అరుణను రంగంలోకి దించగా.. ఆమె కూడా నారాయణపేట విషయాన్ని పట్టించుకోలేదు. ‘పేట’లో గెలిచే అవకాశం ఉన్న శివకుమార్రెడ్డికి టికెట్ కేటాయించకపోవడం దారుణమని... అందువల్ల పోటీ నుంచి వైదొలగాలని ఆయనకు తాను చెప్పబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని సర్వేల్లో మెరుగైన నివేదికలు ఉన్న శివకుమార్ను అవసరమైతే గెలిపించుకుంటానని అరుణ చెప్పినట్లు తెలిసింది. -
మోదీకి కేసీఆర్ రహస్య మిత్రుడు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీకి టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ రహస్య మిత్రుడని, ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న చోట టీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను పోటీలో నిలిపిందని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే రీతిన ఇరు పార్టీలు పోటీ చేస్తాయన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక కేసీఆర్కు లెక్కలేనంత అహంకారం పెరిగిందని, రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణావతారం ఎత్తితే, తర్వాత లంచావతారం ఎత్తారని దుయ్యబట్టారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్కు ముందస్తు ఎన్నికలతో భంగపాటు తప్పదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగానే 75 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీట్ ది మీడియా కార్యక్రమానికి జైపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మట్లాడారు. ముందస్తుపై ఆయనే బాధపడుతున్నారు ఇందిరాగాంధీ ఒక్కరు మినహా ఎవరూ ముందస్తుకు వెళ్లినా గెలిచిన వారు లేరని.. కేసీఆర్ సైతం ఎందుకు ముందస్తు కాల్వలో కాలుపెట్టానని బాధపడుతున్నారని జైపాల్ వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, ఇంటింటికీ తాగునీరు.. వంటి ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. 70 ఏళ్లలో రూ.70 వేల కోట్ల అప్పులు చేస్తే కేవలం నాలుగున్నరేళ్లలో రూ.1.50లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని చెప్పారు. కేటీఆర్ను రాజకీయ నేతగా గుర్తించట్లేదు రాజకీయాలు జీవనదిలాంటివే తప్ప మురికిగుంట కాదని జైపాల్ చెప్పారు. ఈ జీవనదిలోకి అనేక నదులు కలసి ఉప్పొంగిన మాదిరే టీడీపీ కాంగ్రెస్తో కలసి వస్తోందన్నారు. ప్రస్తుతం మోదీని ఓడించాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకే చంద్రబాబుతో కలసి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నా నదీజలాల విషయంలో బాబుతో ఎలాంటి రాజీ ఉండదన్నారు. పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు ముమ్మాటికీ పాతవేనని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావే లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా.. ‘కేటీఆర్ను రాజకీయ నేతగా గుర్తించలేదు. రాజకీయ సన్యాసంపై స్పందించను. కేసీఆర్ను మాత్రమే రాజకీయ నేతగా గుర్తిస్తా’అని వ్యాఖ్యానించారు. స్వతంత్ర సంస్థల స్వేచ్ఛను దెబ్బతీసిన మోదీ మోదీవి అవాస్తవిక వాగ్దానాలు చేశారని జైపాల్ మం డిపడ్డారు. ఇతర దేశాల్లో దాచుకున్న రూ.80 లక్షల కోట్ల నల్లధనం తీసుకొస్తానని, ప్రతి పౌరుడి ఖాతా లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పారని గుర్తుచేశారు. కనీసం 15 పైసలు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. స్వతంత్ర సంస్థల స్వేచ్ఛను దెబ్బతీశారని ఆరోపించారు. మోదీ హయాంలో నోట్ల రద్దు అతి పెద్ద తప్పిదమని విమర్శించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా నష్టపోయిందన్నారు. -
‘కేటీఆర్ను గుర్తించను.. కేసీఆర్ మాట్లాడితేనే స్పందిస్తా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కూటమి 75 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎవరు సీఎం అయినా.. ఏక ఛత్రాధిపత్యం ఉండదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జైపాల్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు సీఎం అయినా కాంగ్రెస్ పెద్దలు వారికి అండగా ఉంటారని చెప్పారు. టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు, కాంగ్రెస్కు అనుకూల పవనాలు వీస్తున్నాయని పేర్కొన్నారు. టీడీపీతో ఎలాంటి రాజీ ఉండదని, రివర్ వాటర్ అగ్రిమెంట్ పార్టీల మధ్యకాదు, ప్రభుత్వాల మధ్య ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ముఖ్యంగా నీటి విషయంలో రాజీపడమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉన్నా.. మరొకరు ఉన్నా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘నేను కేటీఆర్ను గుర్తించను, కేసీఆర్ మాట్లాడితేనే స్పందిస్తా. ఉత్తమ్ భార్య సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆమెకు మినహాయింపునిచ్చాం. కూటమిలో ఇతర పార్టీలు నిలబడ్డచోట కాంగ్రెస్ కూడా బీ-ఫార్మ్స్ దాదాపు వాపస్ తీసుకుంటుంది. కాంగ్రెస్ 24, టీడీపీ 3, కూటమి బీసీలకు 27 సీట్లు ఇచ్చింది. టీఆర్ఎస్ 22 మాత్రమే ఇచ్చింది. కాళేశ్వరం రీడిజైన్ పేరిట అంచనా పెంచారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లులేవు, నీళ్లివ్వకుంటే ఓటడగనన్నారు. గవర్నర్లలో చెంచాలను పెట్టుకున్నారు. వాళ్ళు స్వైరవిహారం చేస్తున్నారు. 70ఏళ్లలో 70కోట్ల అప్పు చేస్తే.. నాలుగున్నరేళ్లలో లక్ష కోట్ల అప్పు చేసింది టీఆర్ఎస్ . ఎన్నికల తర్వాతే మహాకూటమి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాం. రాజకీయాలు జీవనది లాంటివి. సందర్భం, సైద్ధాంతిక అంశం రాజకీయాల్లో ప్రధానమైనవి. నరేంద్ర మోదీ సాధ్యం కానివి, అవాస్తవాలైన వాగ్దానాలు చేశారు. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్నారు. కనీసం 15పైసలు కూడా వేయలేదు. మోదీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారు. ప్రపంచంలో ఏ ఆర్థికవేత్తలు నోట్లరద్దును ఒప్పుకోలేదు. రాఫెల్ విషయంలో ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు.. ‘అంబానీ కంపెనీని మేము ఎంపిక చేసుకోలేదు.. బలవంతంగా మాకు అంటగట్టార’ని చెప్పారు. ఎంతమంది చెప్పినా మోదీ నోరు విప్పరు. విప్పితే అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. చారిత్రక నేపథ్యం లేకుండా.. స్నేహాలు, శత్రుత్వాలు ఉండవు. టీఆర్ఎస్ బీజేపీతో చాటుమాటుగా అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. కేసీఆర్! ప్రజాసంఘాలు, మేధావులు, మైనార్టీలను మోసం చేసేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. కేసీఆర్కు ఓటు వేస్తే.. మోదీకి ఓటేసినట్లే..!’’ అని అన్నారు -
నా వయసు పెరిగిపోయింది నాకు సీఎం పదవి...
శంషాబాద్: ‘నేను సీఎం పదవిని కోరుకోవడం లేదు.. ఇప్పుడు నా వయసు కూడా పెరిగిపోయింది.. ఒంటి చేత్తో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టించడంలో కీలక పాత్ర వహించా..నా నైతిక బాధ్యతగా రాష్ట్రంలో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నా ’ అని కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకుడు ఎం. వేణుగౌడ్ను బుజ్జగించడానికి ఆయన శంషాబాద్లోని వేణుగౌడ్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహాకూటమి గాలి వీస్తోందని, ప్రస్తుతం ప్రభుత్వపై కొనసాగుతన్న నిశ్శబ్ద విప్లవ ఫలితాలు ఎన్నికల రోజు భయటపడుతాయన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి తాను ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించానని, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అప్పట్లో అధికారంలోకి రాకపోవడం బాధాకరమన్నారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీయే సొంతంగా ఎనిభైకి పైగా స్థానాల్లో గెలుపొందుతుందన్నారు. ప్రధాని మోదీతో దోస్తీ చేసిన కేసీఆర్ను మైనార్టీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ సంస్కృతి నచ్చకనే చేవెళ్ల ఎంపీ విశేశ్వర్రెడ్డి ఆ పార్టీని వీడారన్నారు. వేల కోట్లు సంపాదించిన అహంభావంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడన్నారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారెవరూ విజయం సాధించలేదని జైపాల్రెడ్డి చెప్పారు. రాజకీయాలు సంక్లిష్టమైనవి... రాజకీయాలు ఎంతో సంక్లిష్టంగా ఉంటాయని, అవసరమైనపుడు పార్టీ భవిష్యత్తు కోసం త్యాగాలు కూడా అనివార్యంగా మారుతాయని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పీసీసీ సభ్యుడు ఎం. వేణుగౌడ్ వేసిన నామినేషన్ను ఆయన ఉపసంహరింపజేశారు. అనంతరం శంషాబాద్ పట్టణంలోని వేణుగౌడ్ నివాసంలో ఆయన మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవచేసిన వేణుగౌడ్కు రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం రావల్సి ఉన్నప్పటికి కొన్ని సమీకరణాలతో సాధ్యం కాలేదన్నారు. క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా సేవలందిస్తున్న ఆయనకు సమీప భవిష్యత్తులోనే కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవిస్తుందన్నారు. జిల్లా పరిషత్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశముంటుందన్నారు. చేవెళ్ల పార్లమెంటు ఎంపీగా తాను పోటీ చేసిన సమయంలో తన గెలుపులో వేణుగౌడ్ది కీలకమైన భాగస్వామ్యముందన్నారు. మహాకూటమి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన సూచించారు. జైపాల్రెడ్డి సూచనతో వేణుగౌడ్కు అక్కడికక్కడే నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకం చేశారు. పార్టీ నిర్ణయం మేరకు కూటమి అభ్యర్థికి విజయానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో శంషాబాద్ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్, నందరాజ్గౌడ్ తదితరులున్నారు. -
జైపాల్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ!
సాక్షి, హైదరాబాద్ : నామినేషన్లకు సోమవారం గడువు ముగియనుండటంతో కాంగ్రెస్లో మిగిలిన ఆరు స్థానాలపై ప్రతిష్టంబన నెలకొంది. పార్టీ ముఖ్యనేతల ఆధిపత్య పోరుతో స్క్రీనింగ్ కమిటీ ఎటు తేల్చుకోలేకపోతుంది. మిర్యాలగూడ, నారాయణపేట, నారాయణ్ఖేడ్, కోరుట్ల, హుజూరాబాద్, దేవరకద్ర అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించనుంది. అయితే నారాయణపేట్, దేవరకద్ర నియోజకవర్గాల విషయంలో సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, డీకే అరుణల మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. తమ అభ్యర్థులకే ఈ సీట్లు కేటాయించాలని ఇద్దరు నేతలు పట్టుబడుతుండటంతో అధిష్టానం ఇప్పటి వరకు ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్లో ఉంచింది. గత ఎన్నికలప్పుడు ఈ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం తాజా ఎన్నికల నేపథ్యంలో తారాస్థాయికి చేరినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాలు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయని, ఇక్కడి నుంచి తాను పోటీచేస్తాను కాబట్టి తమ వారికే ఇవ్వాలని జైపాల్రెడ్డి వాదిస్తున్నారు. మరోవైపు తమ అభ్యర్థులకే గెలిచే అవకాశం ఉందని డీకే అరుణ పట్టుబడుతున్నారు. దేవరకద్ర నుంచి తన అనచురుడైన పవన్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేస్తుండగా.. ప్రదీప్ గౌడ్కు ఇవ్వాలని జైపాల్ రెడ్డి కోరుతున్నారు. ప్రదీప్ గౌడ్ బలహీనమైన అభ్యర్థిగా భావిస్తే.. పరమేశ్వర్ గౌడ్కు ఇవ్వాలని అడుగుతున్నారు. ఆయనకు కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకుంటే టీడీపీకి కేటాయించి అక్కడి నుంచి బరిలోకి దింపేలా జైపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారు. నారాయణపేట టికెట్ను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన, తన బంధువైన శివకుమార్ రెడ్డికి ఇవ్వాలని డీకే అరుణ కోరుతున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని, అతను గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె అధిష్టానం ముందు వాపోయినట్లు తెలుస్తోంది. జైపాల్ రెడ్డి తన అనుచరుడు కృష్టకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. ఇక మిగిలిన నాలుగుస్థానాల్లోను అదిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుంది. హుజురాబాద్ నుంచి కౌశిక్ రెడ్డికి ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఇక సీనియర్ నేత జానారెడ్డి తన కొడుకు కోసం మిర్యాలగూడను.. నారాయణ్ఖేడ్ కోసం మాజీ ఎంపీ సురేష్ షెట్కార్లు పట్టుబడుతున్నారు. కోరుట్లలో జువ్వాడి నర్సింగ్ రావు, కొమిరెడ్డి రాములు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. హైకమాండ్ బుజ్జగింపు చర్యలు చేపట్టింది. -
జైపాల్రెడ్డి,డీకే అరుణ మధ్య ముదిరిన వివాదం
-
పార్టీలో చేర్చేందుకేనా...!
సాక్షి, జహీరాబాద్: తాజా మాజీ మంత్రి టి.హరీశ్రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్రెడ్డిని సోమవారం రాత్రి హైదరాబాద్లో కలిశారు. జైపాల్రెడ్డి సుడోకు పోటీల్లో పాల్గొని విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఈ మేరకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లినట్లు చెబుతున్నా రాజకీయ కోణంలో వెళ్లి ఉంటారనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్లో చేరాల్సిం దిగా ఆహ్వానించి ఉంటారనే అభిప్రాయాన్ని జైపాల్రెడ్డి సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా జహీరాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే జె.గీతారెడ్డితో జైపాల్రెడ్డికి విభేదాలు ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దసరా మరుసటి రోజున గీతారెడ్డి జైపాల్రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్ పాగా వేయాలనే ఉద్ధేశంతో మంత్రి వూహ్యాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లోకి వెళ్లారు. మాజీ మంత్రి ఎం.డీ ఫరీదుద్దీన్ సైతం టీఆర్ఎస్లో చేరగా అధిష్టానవర్గం ఎమ్మెల్సీ పదవితో సత్కరించింది. జైపాల్రెడ్డిని సైతం టీఆర్ఎస్లోకి తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై జైపాల్రెడ్డి మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. -
టీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య పొత్తు
న్యూఢిల్లీ: టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య పొత్తు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి ఆరోపించారు. సీఎం రేసులో తాను లేనని.. తనకూ పరి మితులున్నాయని, వయసు కూడా సహకరించదని.. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయడం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైపాల్ పలు అంశాలపై మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఖాయమైందని.. సీపీఐ, టీజేఎస్తో చర్చలు జరుగుతున్నాయని జైపాల్ తెలిపారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ‘అందుకు 100 శాతం అవకాశం ఉంది. రహస్య పొత్తులపై సీఎం కేసీఆర్, ప్రధాని మోదీల మధ్య ఓ అవగాహన ఉంది. కేసీఆర్ ఈ సారి 50 శాతం సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. ఇటు బీజేపీ కూడా 6 నుంచి 7 సీట్ల వరకే పరిమితమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ లేదా ఎంఐఎంతో పొత్తు అనివార్యమవుతుంది. ఒకవేళ టీఆ ర్ఎస్ బీజేపీని ఆశ్రయిస్తే ఎంఐఎంకు విపత్కర పరిస్థితులే ఎదురవుతాయి’ అని చెప్పారు. అయితే అలాంటి పరిస్థితి రాబోదని.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా మెజారిటీ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీని కేసీఆర్ బఫూన్ అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేసీఆర్ ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. తాను తీసుకున్న ముందస్తు ఎన్నికల నిర్ణయం వల్ల ఆయనే అసంతృప్తితో ఉన్నారని తెలి పారు. ఎన్నికలకు సంబంధించి సర్వేల ఫలితాలన్నీ కేసీఆర్కు అనుకూలంగా ఉన్నాయి కదా అని ప్రశ్నిం చగా.. ‘ఆ సర్వేలన్నీ పనికిరానివే. బయట పరిస్థితి ఎలా ఉన్నా అంతర్గతంగా కాంగ్రెస్కి అనుకూల పవనాలు వీస్తున్నాయి’ అని జైపాల్ వెల్లడించారు. గజ్వేల్లో కేసీఆర్ ఓటమి ఖాయం: వీహెచ్ సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్రావుకు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో ఈసారి ఓటమి ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. గజ్వేల్లో సీఎం కేసీఆర్కు ప్రజా ఆదరణ తగ్గిపోయిందని, ఆ ప్రాంతం లో కాంగ్రెస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాకూటమిలో మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే ఓ కొలిక్కివస్తుందని వీహెచ్ అన్నారు. -
హ్యాట్రిక్ వీరులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఆ నేతలు ఒక్కసారి కాదు..రెండుసార్లు కాదు.. ఏకంగా ఐదు, నాలుగు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ బరిలో ఒక్కసారి నెగ్గడమే కొందరికి మహాకష్టం. అటువంటిది ఈ నేతలు వరుసగా మూడుసార్లు శాసనసభలో అడుగుపెట్టి తమ సత్తా చాటారు. మరికొందరు ఐదు, నాలుగుసార్లు కూడా నెగ్గి ప్రజాసేవలో తరించారు. జిల్లా పరిధిలో హ్యాట్రిక్ ఘనత ఏడుగురు నేతలకు దక్కింది. ఈ జాబితాలో వికారాబాద్కు చెందిన ఎ.చంద్రశేఖర్ అందరి కంటే ముందు ఉన్నారు. ఏకంగా వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించి రికార్డులకెక్కారు. మేడ్చల్లో దేవేంద్రుడు టీడీపీ సీనియర్ నేత తూళ్ల దేవేందర్గౌడ్ మూడు వరుస విజయాలు నమోదు చేశారు. మేడ్చల్ సెగ్మెంట్ నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. ఈ స్థానం నుంచి మూడుసార్లు బరిలో నిలిచిన ఆయన.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగలేదు. 1962 మినహా 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1985లో టీడీపీ ఖాతా తెరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి జి.సంజీవరెడ్డిపై కె.సురేంద్రరెడ్డి విజయం సాధించారు. ఈ తదుపరి నుంచి మూ డుసార్లు దేవేందర్గౌడ్ నెగ్గారు. ఆయన 2008లో టీడీపీని వీడారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపీ)ని స్థాపించారు. అనతి కాలంలోనే ఎన్టీపీని.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. ఈ పార్టీ గుర్తుపై ఒకేసారి మ ల్కాజిగిరి పార్లమెంట్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీచేసి రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. లక్ష్మీనరసయ్యది తొలి హ్యాట్రిక్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత ఎంఎన్ లక్ష్మీనరసయ్య హ్యాట్రిక్ సాధించారు. 1957 నుంచి 1967 ఎన్నిక వరకు ఆయనకు తిరుగులేదు. వరుసగా మూడుసార్లు భారీమెజార్టీతో విజయం సాధించారు. 1957లో పీడీఎఫ్ అభ్యర్థిపై నె గ్గారు. ఆ తర్వాత 1962, 1967 లో స్వతంత్ర అభ్యర్థులు కేపీ.రెడ్డి, డి.మోహన్రెడ్డిపై గెలిచా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగాహ్యాట్రిక్ విజయం నమోదు చేసింది ఈయనే. విజ‘ఇంద్రుడు’ చేవేళ్ల నియోజవర్గం నుంచి పట్లోళ్ల ఇంద్రారెడ్డి సరికొత్త రికార్డును సృష్టించారు. పార్టీ మారినా వరుసగా నాలుగుసార్లు విజయకేతనం ఎగురవేశారు. 1985 నుంచి 1999 వరకు విజయ పరంపర కొనసాగింది. 1983లో ఆయన తొలిసారిగా లోక్దళ్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి కె.లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన 1985 నుంచి 1994 వరకు కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తు చేసి వరుస విజయాలు సాధించారు. ఈ సమయంలో హోంశాఖతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం నెలకొనడంతో ఆ పార్టీని వీడిన ఇంద్రారెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఎదురులేని హరీశ్వర్రెడ్డి.. కె.హరీశ్వర్రెడ్డి పరిగి నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించారు. ఆ సెగ్మెంట్లో తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీ అభ్యర్థి గెలుపొందడం హరీశ్వర్ రెడ్డితోనే మొదలైంది. 1994 నుంచి 2009 వరకు వరుస విజయాలు నమోదు చేశారు. రెండుసార్లు కాంగ్రెస్ తరఫున, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కమతం రామిరెడ్డిపైనే నెగ్గారు. చివరిసారిగా 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి టి.రాంమోహన్రెడ్డిపై ఘన విజయం పొందారు. అంతకుముందు 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్పై గెలిచారు. పరిగి నియోజకవర్గానికి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా.. ఐదుసార్లు హరీశ్వర్రెడ్డి విజయం సాధించడం విశేషం. మాణిక్ విజయ పరంపర.. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.మాణిక్రావు కూడా విజయ పరంపర సాగించారు. వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత ఈయ న సొంతం. 1969లో జరిగిన ఉప ఎన్నిక మొదలు.. 1983 ఎన్నికల వరకు ఈయనదే విజయం. 1983లో రాష్ట్రమంతటా ఎన్టీఆర్ గాలి వీచినా ఇక్కడ మాణిక్రావు గెలుపును అడ్డుకోలేకపోయారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికా ర్డుల కెక్కారు. మిగిలిన మూడు ఎన్నికల్లో ప్రత్యర్థులపై భారీమెజార్టీ సాధించారు. పీవీ నర్సింహారావు, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్రెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జల గం వెంగళరావు మంత్రివర్గాల్లో 14 ఏళ్లపాటు మంత్రిగా సేవలందించారు. రెం డు దఫాలుగా ఎమ్మెల్సీగా కొనసాగారు. 1969లో జరిగిన తొలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక పా త్ర పోషించిన మాణిక్రావు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. 1959లో తాండూరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రవేశం చేసి న మాణిక్.. 2016లో భౌతికంగా దూరమయ్యారు. జయ‘కేతనం’ రాజకీయ దురంధరుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి కల్వకుర్తి సెగ్మెంట్ నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం ఎగురవేశారు. తొలి రెండుసార్లు కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రెండుసార్లు జనతా పార్టీ నుంచి గెలిచారు. 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. 1983 ఎన్నికల వరకు క్రమం తప్పకుండా విజయాలు నమో దు చేశారు. దీంతో పాటు నాలుగుసార్లు లోక్సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయారు. 2009లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. కేంద్ర సమాచార, సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. శేఖరుని జైత్రయాత్ర వికారాబాద్లో ఎ.చంద్రశేఖర్ జైత్రయాత్ర సాగించారు. ఈ సెగ్మెంట్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఈయన మినహా.. మరెవరూ ఐదుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. 1985 నుంచి 2004 వరకు వికారాబాద్ సెగ్మెంట్లో ఓటర్లు ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడం విశేషం. 23 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేయడం అరుదైన విషయంగా చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో ఇద్దరు చొప్పున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లను ఓడించి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్టీ మారిన ఆయన 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బి.మధురవేణిపై నెగ్గారు. ఆ తర్వాత తెలంగాణ వ్యూహంలో భాగంగా 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లోనూ పోటీచేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి జి.ప్రసాద్కుమార్ చేతిలో ఓటమిని చవిచూశారు. -
‘కేసీఆర్ వాగ్ధాన వీరుడు - అబద్ధాల ధీరుడు’
సాక్షి, కామారెడ్డి : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ‘‘వాగ్ధాన వీరుడు- అబద్ధాల ధీరుడు’’, కాంట్రాక్టర్ల ప్రియుడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు లక్ష బిక్షం వేస్తావా? ఎలా ఇస్తావంటూ మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణను దోచుకుని దాచుకుంటాడని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో చూసిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ను దరిద్రమైన ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. బహుభాశా కోవిదుడు పీవీ నరసింహారావ్ పుట్టిన తెలంగాణ గడ్డపై మురికి భాషను ప్రవేశ పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భాషను యాసను కేసీఆర్ మలినం చేశారని అన్నారు. కేసీఆర్! నరేంద్ర మోదీతో రహస్య ఒప్పందం మేరకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని ఆరోపించారు. -
ఉనికి కోసం జైపాల్రెడ్డి పోరాటం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి విమర్శలు ఆ పార్టీ లో తన ఉనికి కోసం పోరాడుతున్నట్లు ఉం దని మంత్రి హరీశ్రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. పదేళ్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలన లో ఆయకట్టు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, చింతా ప్రభాకర్లతో కలసి తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘ప్రాంతీయ వాదినో, ఉప ప్రాంతీయవాదినో కాదని ఆనాడు ఉద్యమాన్ని అవమానపరిచిన పెద్ద మనిషి.. ఇప్పుడు నోటికొచ్చినట్లు అబద్ధాలాడారు. ఏనాడూ ఉద్యమాన్ని పట్టించుకోలేదు. జైపాల్రెడ్డి మాటలు టీఆర్ఎస్కు లాభించాయి. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఎంత ఎక్కువ మా ట్లాడితే టీఆర్ఎస్కు అంతమేలు. కాంగ్రెస్ వారు చేపట్టింది జలయజ్ఞం కాదని, ధనయజ్ఞమని ఇప్పటి వాళ్ల దోస్తు చంద్రబాబు అప్పుడు విమర్శించారు. జైపాల్రెడ్డి మాట్లాడితే అతికేటట్లు ఉండాలె. ఒక్క ఇంటికన్న నీళ్లు ఇచ్చిన్రా.. పైపులు తప్ప ఏమున్నయని అడిగిండ్రు. ఆయన మాటల కు నవ్వుకుంటున్నారు. రోజూ ఆ నీళ్లు తాగేవారు జైపాల్ను ఏమనుకోవాలి’అని అన్నారు. మా చిత్తశుద్ధిని రైతులు చెబుతారు.. ‘ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలేదన్న మీ మాటలకు నవ్వాల్నో, ఏడవాల్నో తెలుస్తలేదు. మీ కల్వకుర్తికి, మహబూబ్నగర్ జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ మాది. పదేళ్లు అధికారంలో ఉండి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు రికార్డులో రాసుకున్నారు. ఎన్ని విభజన సమస్యలు ఉన్నా నాలుగేళ్లలో 12 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చాం. మరో 13 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. మా చిత్తశుద్ధి ఏమిటో రైతులు చెబుతారు. మీ లాంటి పెద్దలు వాస్తవాలు తెలుసుకోవాలి. జైపాల్రెడ్డి నోరుపారేసుకుని విలువల్లేని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు’అని హరీశ్ మండిపడ్డారు. అవినీతి గురించి మీరా మాట్లాడేది? ‘కాంగ్రెస్లో చాలా మంది నేను సీఎం అంటే నేను సీఎం అని కొట్టుకుంటున్నారు. ఆ జాబితాలో జైపాల్ పేరు కనబడుతలేదు. ఉనికి చాటుకోవడానికి సీఎం రేసులో ఉన్నానని చెప్పుకునేందుకు అలా మాట్లాడారు. అవినీ తి గురించి మాట్లాడేది మీరా. ప్రాజెక్టులో అవినీతి గురించి మాట్లాడే నైతికత, హక్కు కాంగ్రెస్కు ఉందా? జైపాల్రెడ్డి నిన్న చెప్పిన విషయాలు అన్నీ బహిరంగమే. సర్వే డిజైన్ల పేరిట పనులు కాకుండానే బిల్లులు తీసుకున్నది మీరు. మీ దోస్తు చంద్రబాబే ఈ విషయాలను చెప్పాడు. ఆంధ్రా కంపెనీలను పెంచి పోషించింది మీరు. నవరత్నాలని 9 కంపెనీలను మీ ప్రభుత్వమే ఎంపిక చేసింది. ఆ కంపెనీలను పెంచి పోషించింది కాంగ్రెస్. ఆ పనులు రిలయన్స్, వేదాంత కంపెనీలకు వచ్చాయి’అని వివరించారు. సర్వే డిజైన్ల పేరిట దోచుకున్నారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలను రూ.16వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారు. నాలుగేళ్లలో నీళ్లు ఇస్తామని చెప్పి మోసంచేశారు. 2012లో సర్వే కోసం రూ.1,480 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. రూ.140 కోట్ల పనులు చేశారు. ప్రాణహితలో 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. ఆ రోజు వాళ్లు చెప్పిన కంపెనీలే ఉన్నాయి. అన్ని ప్యాకేజీల్లోనూ 4.8% పైనే ఉన్నాయి. టీఆర్ఎస్లో మైనస్ 4 శాతంతో టెండర్లు ఇచ్చాం. ప్రభుత్వానికి 10% లాభం వచ్చింది. ఒక్క ప్రాణహితలో రూ.1,205 కోట్లు సర్వే డిజైన్ల పేరిట బిల్లులు దోచుకుం టున్నారు. మేం వచ్చాక వాప్కోస్తో సర్వే చేయించాం. అవినీతి విధానాలకు మీరు తెరలేపితే ఆ రోజు జైపాల్రెడ్డి గొంతు ఎందుకు మూగబోయింది. మేం పారదర్శక పద్ధతి తెస్తే పైశాచిక ఆనందం కోసం విమర్శలు చేస్తున్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు కడుతుంటే జైపాల్ నోరు మూసుకున్నారు. పాల మూరు ఎత్తిపోతలపై కోర్టులో కేసులు వేస్తే కోర్టులు మొట్టికాయలు వేశాయి. కేసీఆర్ నిజంగానే నీళ్లు ఇస్తరని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్ వాళ్లు చనిపోయిన వారి పేర్లతో కేసులు వేశారు’అని సవాల్ విసిరారు. తెలంగాణ సాధకులు, ద్రోహులకు మధ్యే పోటీ రానున్న ఎన్నికలు తెలంగాణ సాధకులు, తెలంగాణ ద్రోహులకు మధ్యే జరుగుతున్నాయని, ప్రజలు ఎవరివైపు నిలబడతారో చూడాలని హరీశ్రావు అన్నారు. తెలంగాణ సాధన కోసం త్యాగాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని, ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డు నిలిచింది కాంగ్రెస్ నేతలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల నిర్వాకంతోనే తెలంగాణ యువకుల ప్రాణత్యాగాలు చేయాల్సి వచ్చిందని మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హరీశ్ వారికి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. తెలంగాణ ఇవ్వొద్దంటూ సోనియాకు లేఖరాసిన చరిత్ర జగ్గారెడ్డిదన్నారు. అమెరికాకు మనుషులను అక్రమ రవాణా చేసిన జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ దేశద్రోహానికి పాల్పడిందన్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న జగ్గారెడ్డికి ఓటు వేస్తారా, అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తికి ఓటు వేస్తారో ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు. -
దేశచరిత్రలోనే అవినీతి చక్రవర్తి
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఓ అవి నీతి చక్రవర్తి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్రెడ్డి అభివర్ణించారు. సీఎంగా ఎంత గొప్పవారు వచ్చి నా ఎంతో కొంత అవినీతి జరుగుతుందని, కానీ దేశచరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అవి నీతి ఎప్పుడూ జరగలేదన్నారు. గత నాలుగేళ్లుగా దోచుకుని దాచుకోవడమే కేసీఆర్ పని గా పెట్టుకున్నారని దుయ్యబట్టా రు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఇచ్చి న అధికారాన్ని కేసీఆర్ పూర్తిగా దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీభవన్లో జైపాల్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గడచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండు కంపెనీలకు రూ.77 వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తనకింత.. తన కుటుంబ సభ్యులకింత.. మంత్రులు, ఎమ్మెల్యేలకింత.. అని నిర్ణయించి కేసీఆర్ నొక్కేశారన్నారు. ఒక కంపెనీకి కాళేశ్వరం 1, 2, 3 దశల్లో రూ.27,407 కోట్లు, పాలమూరులో రూ.12,444 కోట్లు, సీతారామ ప్రాజెక్టు లో రూ.2,775 కోట్లు, డిండిలో రూ.850 కోట్లు, మిష న్ భగీరథలో రూ.14వేల కోట్ల కాంట్రాక్టులను ఇచ్చారన్నారు. మరో కంపెనీకి సాగునీటి శాఖలో రూ.17 వేల కోట్ల విలువైన పనులను అప్పగించారన్నారు. నిరూపించేందుకు రెడీ.. కేసీఆర్ ఎంత అవినీతిపరుడో నిరూపించేందుకే గణాంకాలతో కూడిన కఠిన వాస్తవాలను తాను మీడియాకు వెల్లడిస్తున్నానని జైపాల్ చెప్పారు. తాను చెప్పిన గణాంకాలపై ఎవరైనా చాలెంజ్ చేస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అమ్మేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్న కేసీఆర్.. గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రెండు కాంట్రాక్టు కంపెనీలకు అమ్మేయలేదా అని ప్రశ్నించారు. ఆ కంపెనీలకు కేసీఆర్ కట్టుబానిసలా మారారని ఎద్దేవా చేశారు. ఇలాంటి దురదృష్టకర పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. ఆ రెండు కంపెనీలకు కట్టబెట్టిన కాంట్రాక్టుల విలువలో కనీసం 30 శాతం అధిక అంచనాలున్నాయని, మొత్తం 77వేల కోట్లకుగాను అసలు విలువ రూ.50 వేల కోట్లే ఉంటుందని, మిగిలిన రూ.20 వేల కోట్లు కాంట్రాక్టర్లు, కేసీఆర్, వందిమాగధులు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే రూ.2 లక్షల కోట్ల అప్పు.. తెలంగాణను అప్పుల ఊబిలోకి దించిన కేసీఆర్ రూ.2 లక్షల కోట్ల అప్పు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికే చేశారని జైపాల్ దుయ్యబట్టారు. ఒక ఎకరాన్ని నీటితో తడపకుండా, ఒక్క ఇంటికీ నీళ్లివ్వకుండా, ఒక్క కంపెనీకే రూ.60 వేల కోట్ల కాంట్రాక్టులిచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంట్రాక్టులు ఆంధ్ర వాళ్లకే కాదు, అమెరికా వాళ్లకు ఇచ్చినా తమ కు అభ్యంతరం లేదని, అయితే, అది న్యాయబద్ధం గా జరగాలని వ్యాఖ్యానించారు. ఈ కంపెనీలకు ఇచ్చిన టెండరింగ్ ప్రక్రియ అంతా బోగస్ అని అన్నా రు. దీనిపై కేసీఆర్ తనకు, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ ఇచ్చిన సాగు నీటి కాంట్రాక్టులపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. అవినీతికి బాధ్యులైన వారికి తగిన శిక్ష వేయిస్తామని, ఆ బాధ్య త తాను తీసుకుంటానని జైపాల్ చెప్పారు. -
‘కేసీఆర్ కమీషన్ల లెక్క నా దగ్గర ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి కాంగ్రెస్ అమ్ముడపోయిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్పై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమిపై కొందరు పనికట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు సీఎం కేసీఆర్ తనకు నచ్చిన కంపెనీలకే ఇస్తున్నారని, కమీషన్లు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే కట్ట బెడుతున్నారని దుయ్యబట్టారు. దానిలో భాగంగానే మెగా కృష్ణా రెడ్డి కంపెనీలకు 43,436 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ల పనులు అప్పగించారని, నవయుగ కంపెనీకి 17 వేల కోట్లు, అదేవిధంగా ఒకే కంపెనీకి 60,436 కోట్ల విలువచేసే ప్రాజెక్టుల నిర్మాణాలను అప్పజెప్పాడాన్ని ఆయన ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో ఈ విధంగా ఒకే కంపెనీకి ఇంతలా పనులు ఇవ్వలేదని గుర్తుచేశారు. కంపెనీలకు అధిక లాభం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మూడింతలు పెంచిందని విమర్శించారు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని.. మెగా కృష్ణా రెడ్డి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మెగా కృష్ణా రెడ్డి కేసీఆర్కు ఏజెంటని, మిగతా వారు సబ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. (‘ఆ మంత్రులు మా సర్పంచ్తో సమానం’) టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరిట పట్టపగలే నిలువుదోపిడి చేస్తోందని.. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నుల్లోనే జరుగుతుందని ఆరోపించారు. ఎక్కడ, ఎప్పుడు ఏ కంపెనీలు కేసీఆర్కు ఎంత కమీషన్లు ఇచ్చాయో లెక్కలతో సహా నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రభుత్వ సొమ్మును కట్టుబెడుతున్నారన్నారు. ఇవన్నీ చేస్తూ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారని కేసీఆర్ ఎలా అంటాడని ప్రశ్నించారు. తాను అడిగిన వాటన్నింటికీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (కూటమి పొత్తుల్లో కొసమెరుపు!) -
మెత్తగా మాట్లాడితే ఎలా?.. జానాకు జైపాల్రెడ్డి సలహా!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి గురించి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి ఎప్పుడూ వెనుకంజ వేసే వ్యక్తి కాదని, అలాగని దూకుడుగా కూడా ఉండరని ఆయన చెప్పుకొచ్చారు. జానారెడ్డి ప్రత్యేక వక్తిత్వం కలిగిన వ్యక్తి అని, పుస్తకాల్లో ఉన్నవి తెలుసుకోవడమే కాకుండా నిపుణులతో చర్చించి పలు విషయాల మీద మాట్లాడుతారని జైపాల్రెడ్డి అన్నారు. జానారెడ్డి నిజం చెప్పేందుకు వెనకంజ వేయబోరని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో జానారెడ్డి అంతా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మరొకరు లేరని పేర్కొన్నారు. రాజకీయంలో అజాత శత్రువుగా ఉండడం ఎంత ముఖ్యమో.. అవసరమైనప్పుడు ధర్మాగ్రహం ప్రదర్శించాలని, మెత్తగా మెల్లగా మాట్లాడితే బలహీనతగా చూస్తారని, అందుకే అప్పుడప్పుడు దూకుడుగా ఉండాలని జానారెడ్డికి జైపాల్రెడ్డి హితవు పలికారు. -
టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగెత్తారు
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను చూసి తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయ మని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన లంబాడీ గర్జన లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ వల్లే పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను ఓబీసీ నుంచి ఎస్టీలుగా గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. ఇందిరా గాంధీ వల్లే గిరిజను లంతా ఎస్టీ జాబితాలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేయా ల్సిన సీఎం కేసీఆర్ ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. గిరిజన తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తే సరిపోదని, వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తేనే గిరిజనులు అభివృద్ధి చెందుతారన్నారు. గిరిజనులే తగిన బుద్ధి చెబుతారు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కేసీఆర్కు గిరిజనులే తగిన బుద్ధి చెబుతారని జైపాల్రెడ్డి అన్నారు. లంబాడీలకు, ఆదివాసీలకు మధ్య కేసీఆర్ చిచ్చుపెట్టారని, వారి మధ్య జరిగిన గొడవ తమకేమీ తెలియనట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన నాలుగున్నరేళ్ళలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. గిరిజన తండాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారన్నారు. టీఆర్ఎస్ నేతల మాయమాటలను నమ్మొద్దని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సభలో నాయకులు అగ్గునూరు విశ్వం, యాదయ్య యాదవ్, కట్టా వెంకటేశ్గౌడ్, శివశంకర్గౌడ్, దంగు శ్రీనివాస్ యాదవ్, రాజునాయక్, గోపాల్ నాయక్, మహమూద్బేగం తదితరులు పాల్గొన్నారు. -
రాఫెల్తోనే మోదీ పతనం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో తేలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్రెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది నిజమని రుజువైందని, మోదీ పతనం రాఫెల్తోనే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక దేశానికి సంబం« దించిన వ్యాపార ఒప్పందాన్ని మరో దేశ ప్రభుత్వం ఖండించడం చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. మోదీ ప్రభుత్వ ఒత్తిడితోనే తాము ఈ డీల్ను అంగీకరించామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్య లపై బీజేపీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిం చారు. రాఫెల్ వ్యవహారంలో భారత దేశ ప్రజలకు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, నిర్మలా సీతారామన్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబానీ మోదీకి బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని, రాఫెల్ డీల్ తో నాలుగేళ్లలో అంబానీకి రూ.లక్ష కోట్ల లబ్ధి కలగనుందన్నారు. నోరు తెరిస్తే బయటపడతాననే భయంతోనే మోదీ మాట్లాడడం లేదన్నారు. -
‘సెంచరీ కాదు.. ఎన్ని వికెట్లు పోతాయో చూస్కో’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ కుటుంబ పాలన, కాంగ్రెస్ వల్ల దేశంలో వచ్చిన సమస్యలను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళతామని బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మంచి పాలనను బీజేపీ మాత్రమే అందిస్తుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల దృష్ట్యా పార్టీ యంత్రంగాన్ని అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ మొదటివారంలో కరీంనగర్లో అమిత్ షా సభ ఉంటుందని తెలిపారు. ఉత్తర తెలంగాణలో షా సభ తర్వాత కేసీఆర్, కేటీఆర్ సీట్లకు ఎసరు వస్తుందన్నారు. కేటీఆర్ సెంచరీ కాదు కదా..ఎన్ని వికెట్లు ఉంటాయో, ఎన్ని వికెట్లు పోతాయో చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. వచ్చే నెల 3 నుంచి 5లోపు కోర్ కమిటీతో భేటి అయి అభ్యర్థుల మీద అభిప్రాయాలను చెబుతామన్నారు. అమిత్ షా పర్యటన తర్వాత మోదీ సభ ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. అపవిత్ర కలయికతో మహాకూటమి సిద్ధాంత వైరుద్యం ఉన్న పార్టీలు కూటమి ఏర్పాటుకు ఆపసోపాలు పడుతున్నాయని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. అడ్రస్లేని టీడీపీ, సీపీఐలతో కాంగ్రెస్ అపవిత్ర పొత్తు పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ గురించి చంద్రబాబు ఏం మాట్లాడడో ప్రజలకు తెలుసునన్నారు. రంగులు మార్చే మహాకూటమిని ఎండకట్టి ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదని, ప్రజల కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నారని కిషన్రెడ్డి అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది బోపోర్స్, 2జీస్కామ్లలో లక్షల కోట్లు దోపిడీ చేసిన కాంగ్రెస్కు బీజేపీని విమర్శించే హక్కులేదని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అవినీతి వల్ల దేశం భ్రష్టు పట్టిందని విమర్శించారు. అవినీతి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబాల దగ్గర ఊడిగం చేసిన జైపాల్ రెడ్డి మోదీని మధ్యయుగపు చక్రవర్తి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం కోసం జైపాల్ ఏదైనా చేస్తాడని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణం గురించి జైపాల్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాఫెల్ పై రాహుల్ గాంధీ మాట్లాడి ప్రజల ముందు నవ్వులపాలయ్యారని ఎద్దేవా చేశారు. అవినీతి మీద నరేంద్ర మోదీ క్రెడిబిలిటీ ఏమిటో ప్రజలకు బాగా తెలుసన్నారు. అబద్ధం అనేకమార్లు వల్లించి నిజం చేయాలనుకున్ననిజం కాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘మోదీకి అంబానీ బ్రోకర్’
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తాజాగా నిజమయ్యాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. రాఫెల్ స్కామ్ జరిగింది నిజమని.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. రాఫెల్ డీల్తో నాలుగేళ్లలో అంబానీకి లక్ష కోట్ల లబ్ధి జరుగుతందన్నారు. లక్షల కోట్ల రాఫెల్ డీల్లో ప్రధాని నరేంద్ర మోదీ వెంట ఒక్క మంత్రి లేరని, కానీ అంబానీ మాత్రం ఉన్నారని ఎద్దేవ చేశారు. అప్పటి రక్షణ మంత్రి పారికర్కు కూడా తెలియకుండా, ప్రధానే నేరుగా ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్నించారు. మోదీ ఒత్తిడితోనే అంగీకరించామని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి కామెంట్స్పై బీజేపీ ఏం చెబుతుందని ప్రశ్నించారు. రాఫెల్తో మోదీ పతనం ఈ ఒప్పందంపై మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్లు పార్లమెంట్లో అబద్దం చెప్పారని మండిపడ్డారు. జాతికి అబద్దం చెప్పినందుకు వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పతనం ఈ స్కాంతో ప్రారంభమైందన్నారు. దేశానికి సంబంధించిన డీల్ను మరో దేశ ప్రభుత్వం ఖండించడం దేశ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. నోరు తెరిస్తే బయటపడతాననే ప్రధాని రాఫెల్పై మాట్లాడటం లేదని, ఆయన నాటకం తేలిపోయిందని విమర్శించారు. మోదీకి జైట్లీ లాయల్ లాయర్ నరేంద్ర మోదీ క్రోనీ క్యాపిటలిజంతో కావల్సిన వారికి వేల కోట్లు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మోదీకి లాయల్ లాయరని అంతేకాని దేశానికి కాదన్నారు. ఈ డీల్ పారదర్శికంగా ఉండాలన్నదే కాంగ్రెస్ వాదన అని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఈఎల్కు కాకుండా అంబానీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో ఏ రక్షణ ఒప్పందంలో కూడా హెచ్ఈఎల్కే నాటి ప్రభుత్వాలు భాగస్వామ్యం కల్పించాయన్నారు. నిజాలు ఆపలేరని, రాఫెల్లో జరిగిన అవినీతిని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. -
అసెంబ్లీ బరిలో జైపాల్రెడ్డి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు జైపాల్రెడ్డి స్వయంగా ఫోన్లు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం అంటే 1985కు ముందు అసెంబ్లీకి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఢిల్లీ బాట పట్టారు. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వంలోనే కాకుండా యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాల్లో కీలకమైన మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. పార్లమెంట్ ఎన్నికలు లేకపోవడంతో సీనియర్లందరూ అసెంబ్లీ బరిలో ఉండాలని అధిష్టానం సూచిస్తోంది. కల్వకుర్తిలో జైపాల్రెడ్డికి మొదటి నుంచీ కొంత వర్గం ఉంది. గతంలో ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కొందరు స్థానిక నేతలు తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డితో నడిచేందుకు ససేమిరా అంటుండటంతో ‘అభ్యర్థి ఎవరనేది విడిచిపెట్టండి. మనం ఎమ్మెల్యే సీటు గెలవాలి. ఎందుకంటే సీఎం రేసులో నేనే ఉన్నా. మిమ్మల్ని నేను చూసుకుంటా’ అంటూ జైపాల్రెడ్డి ఫోన్లు చేస్తుండడం చర్చనీయాంశమైంది. -
రెడ్ల సమస్యలు నెరవేరుస్తారా.. లేదా?
హైదరాబాద్: రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు నెరవేరుస్తారా.. లేదా? అనేది సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభలోనైనా స్పష్టత ఇవ్వాలని రెడ్డి జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం సికింద్రాబాద్లోని రాయల్ రివే హోటల్లో రాష్ట్ర స్థాయి రెడ్డి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం జేఏసీ కో చైర్మన్లు జైపాల్రెడ్డి, పైళ్ల హరినాథ్రెడ్డి, వసంతరెడ్డి, అసోసియేట్ చైర్మన్ రాంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్, విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే రెడ్డి విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకం వర్తింపజేసి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. రెడ్డి భవన్కు 100 ఎకరాలు, సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. -
‘ముందస్తు’ ఓటమి కోసమే: జైపాల్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న సీఎం కేసీఆర్ ఆ అసంతృప్తి పెరగకుండా చూసుకునేందుకే ముందస్తు ఎన్నిలకు సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైపాల్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ముందు ఎన్నికలకు వెళ్లే ఆయనకు ఎదురయ్యేది ముందుస్తు ఓటమేనని జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారం చేపట్టొచ్చని ప్రగతి భవన్లో కూర్చొని కేసీఆర్ కలలు కంటే నాడు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అందుకే ప్రజల్లో ఉన్న వ్యతి రేకత పెరుగుతుందనే భయంతోనే ముందస్తుకు వెళ్తున్నారని చెప్పారు. ‘ముందస్తుతో ఎక్కువ సంతో షించేది కాంగ్రెసే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. మాపై సాను కూలత ఏర్పడింది’ అని జైపాల్ చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో సీఎం అభ్యర్థిత్వంపై పోటీ ఉండటం సహజమేనని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని అన్నారు. నేతలను చూసి కాకుండా కాంగ్రెస్ను చూసే ఓటేస్తారని, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనేందుకు ఇదే తమ ధీమా అని వివరిం చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై అధిష్టా నానిదే తుది నిర్ణయం అని అన్నారు. -
‘ముందస్తు ఎన్నికలు.. కాంగ్రెస్కు సంతోషం’
ఢిల్లీ: ముందస్తు వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిథి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా టీఆర్ఎస్కు ముందస్తు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వెళ్లినపుడు సింహంలా దూకుతుందని అభివర్ణించారు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందనే కారణంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపించారు. మోదీతో మిత్రత్వం దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయపార్టీ అని, కొంత మంది అసంతృప్తివాదులు ఉంటారని.. కానీ యుద్ధంలోకి దిగేటపుడు అందరూ ఒక్కటవుతారని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా ఎవరికీ నీరు రాలేదని, కేవలం కాంట్రాక్టర్లకు నిధులు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు ప్రచారం నిర్వహించాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సభలు బ్రహ్మాండంగా విజయవంతం అయ్యాయని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ మారుమూల ప్రాంతాలకు కూడా తెల్సిందని అన్నారు. కేసీఆర్ హామీలను విస్మరించారని, మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ఓటమి తప్పదన్నారు. -
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ జోడీ: జైపాల్రెడ్డి
జడ్చర్ల: ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జోడీ కట్టారని మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మోదీ సహకారంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయంలో బాహాటంగా బీజేపీతో కలిసి వెళతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ 1971లో గరిబీ హఠావో నినాదంతో ముందస్తుకు వెళ్లినప్పుడు గెలిచారని, తర్వాత వెళ్లిన అన్ని సందర్భాల్లో ఓడిపోయారని గుర్తుచేశారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వాజ్పేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా మంచి ఫలితాలు రాలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం గ్రామాల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్ధాలు: నాగం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. 2003లో కేఎల్ఐ ప్రారంభించామని, 2004లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత జిల్లాలో కేఎల్ఐ, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడం దారుణంగా ఉందన్నారు. రూ.1,000 కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదన్నారు. దక్షిణ తెలంగాణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 30 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి, 33 నెలలు గడిచినా పూర్తి కాలేదన్నారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి, రాంచంద్రారెడ్డి, మినాజ్ పాల్గొన్నారు. -
పీఎం, సీఎం మధ్య రహస్య ఒప్పందాలు
నారాయణపేట: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందాలున్నాయని కేంద్ర మాజీమంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్రెడ్డి విమర్శించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇక్కడ ఓ వైపు కేంద్రంపై విమర్శలు చేస్తూ, మరోవైపు ఢిల్లీకి వెళ్లి ప్రధా నిని కలసి రహస్య మంతనాలు చేస్తుంటారని ఆరోపించారు. రాష్ట్ర వనరులను కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు బలంగా వీస్తున్నాయని, ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రంలోలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయ మన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్కు 14 స్థానాలు వస్తాయని.. టీఆర్ఎస్కు ఒకే సీటు వస్తుందంటూ కేసీఆర్ చేయించిన సర్వేలో తేలినట్లు సమాచారం ఉందన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒకేవిడతలో రైతుల రుణాలు మాఫీ చేశారని గుర్తు చేశారు. -
ఇక రామ-రావణ యుద్దమే
సాక్షి, హైదరాబాద్ : జరగబోయేది రామ-రావణ యుద్దమేనని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ను హెచ్చరించారు. శేరిలింగంపల్లిలో ఆంధ్ర సెటిలర్లతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని, కానీ సీతను రావణుడు తస్కరించినట్టు కేసీఆర్ తెలంగాణను తస్కరించాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేతిలో ఓటమి తప్పదని కేసీఆర్ను హెచ్చరించారు. హైదరాబాద్లో సీమాంధ్రుల ఆస్తుల రక్షణపై అప్పుడు పార్లమెంట్లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందిరాలేదని, కానీ తెలంగాణ వారికే ఇబ్బందులొచ్చాయన్నారు. 70 ఏళ్లలో రూ. 70 కోట్ల అప్పుతో తెలంగాణ ఇస్తే నాలుగేళ్లలో రూ. లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. ఉస్మానియాకు రాహుల్ గాంధీని రానివ్వకపోవడం సరికాదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కొడుకు వస్తానంటే విద్యార్థులు అడ్డుకోవాలి కానీ వీసీతో ఆపించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఓయూకు వెళ్లాలని కాంగ్రెస్ ఎలాంటి ఆటంకాలు కల్పించదన్నారు. కానీ విద్యార్థులే కొట్టి చంపుతారని హెచ్చరించారు. ఎంత మంది పోలీసులు ఉన్నా, కేంద్ర బలగాలు కూడా కాపాడలేవన్నారు. ఉస్మానియానే కాదు రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకైనా వెళ్లి మాట్లాడగలవా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం పథకాలు ప్రారంభిస్తున్నారని, దమ్ముంటే సెప్టెంబర్, అక్టోబర్లో ఎన్నికలు పెట్టు ఎదుర్కునేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చెంచా అన్నారు. కేసీఆర్ తెలంగాణలో సెటిలర్లు తమ వాళ్లే అంటాడు.. కానీ ఆంధ్రకు హోదా ఇస్తే అడ్డుకుంటాడని దుయ్యబట్టారు. -
రాహుల్ పర్యటన: జైపాల్ రెడ్డికి చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ నేత అయిన జైపాల్ రెడ్డిని సెక్యురిటీ సిబ్బంది ఎయిర్పోర్ట్లోకి అనుమతించలేదు. రాహుల్కు స్వాగతం పలికేందుకు పోలీసులు 10 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ జాబితాలో తెలంగాణ పీసీసీ జైపాల్ రెడ్డి పేరు పేర్కొనలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో హౌజ్ టెర్మినల్ వద్దే జైపాల్ రెడ్డి వేచి చూస్తున్నారు. ఆయనతో పాటు పోన్నాల లక్ష్మయ్య, మర్రిశశిధర్ రెడ్డి, వీహెచ్, జీవన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డిలు బయటే వేయిట్ చేస్తున్నారు. వీవీఐపీ టెర్మినల్కు 2 కిలోమీటర్ల దూరం వరకే పోలీసులు కాంగ్రెస్ నేతలకు అనుమతినిచ్చారు. రాహుల్ పర్యటన సందర్భంగా శంషాబాద్కు 500 బైక్లతో ర్యాలీ వెళ్లాలనుకున్న పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టించుకోని కార్యకర్తలు బైక్ ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. దీంతో భారీగా ట్రాఫీక్ జామ్ అయింది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. -
కేజ్రీవాల్తో కోదండరామ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. టీజేఎస్ పార్టీ స్థాపించిన అనంతరం తొలి సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కోదండరామ్ జాతీయ నేతలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి రచించిన ‘టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన కోదండరామ్ గురువారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను కోదండరామ్ వివరించారు. టీజేఎస్ భవిష్యత్ కార్యచరణ, రానున్న ఎన్నికలో తమ పార్టీ అనుసరించనున్న వ్యూహాల గురించి కేజ్రీవాల్తో చర్చించారు. ఈ సమావేశంలో కోదండరామ్తో పాటు సౌత్ ఇండియా ఇంచార్జ్ సోమనాథ్ భారతి, తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రను కొత్తకోణంలో వివరించే ప్రయత్నం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆధునిక చరిత్రను కొత్త కోణంలో వివరించేందుకు జైపాల్రెడ్డి చేసిన యత్నం అభినందనీయమని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్రెడ్డి రాసిన మొదటి పుస్తకం ‘టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్’ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పునరుజ్జీవన కాలం నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన వివిధ ముఖ్యమైన భావా లు, ఆలోచనలను ఇందులో తెలియజెప్పారన్నారు. జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో భిన్న ఆలోచనా విధానాలపై పట్టింపులేని ధోరణి పెరుగుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో వివిధ భావాలు, మేథావుల ఆలోచనలపై చర్చలు కనుమరుగవుతున్నాయన్నారు. రాజకీయాల్లో మేథావులకు తిరిగి ఆసక్తి కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకమన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జైపాల్రెడ్డికి శుభాకాంక్షల సందేశం పంపారు. మొత్తం 15 అధ్యాయాలతో కూ డిన ఈ పుస్తకంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, స్త్రీవాదం, పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ మొ దలైన విధానాలను ప్రస్తావించారు. మహాత్మాగాంధీ మునిమనవడు గోపాలకృష్ణ గాంధీ ముందుమాట రాశారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, శరద్ పవార్, షీలాదీక్షిత్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కేశవరావు, జితేందర్రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, టీడీపీ నుంచి దివాకర్రెడ్డి, గల్లా జయదేవ్, ఎ.శ్రీనివాస్, విరసం నేత వరవరరావు తదితర నేతలు, మేథావులు పాల్గొన్నారు. -
అరుణ వర్సెస్ జైపాల్!
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. జిల్లాలో కీలక నేతలైన కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి డి.కె. అరుణల మధ్య రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. నాగం జనార్దన్రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో అరుణకు వ్యతిరేకంగా జైపాల్ కుట్ర చేశారన్న ఆరోపణలతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ పరిణామం అనంతరం అరుణ కూడా దూకుడుగానే వెళ్తూ వీలున్నప్పుడల్లా జైపాల్ను ఇబ్బందుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో స్థానం లభిస్తుందని, అధిష్టానం వద్ద చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆశించిన జైపాల్రెడ్డికి ఈ విషయంలో ఆశాభంగం జరగ్గా ఇదే అదనుగా అరుణ ఏకంగా జైపాల్ లోక్సభ టికెట్కు ఎసరు పెట్టే వ్యూహాలు రచిస్తున్నారు. మహబూబ్నగర్ లోక్సభ టికెట్తోపాటు దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలనూ బీసీలకు కేటాయించాలని ఆమె ప్రతిపాదిస్తున్నారు. అయితే జైపాల్ శిబిరం మాత్రం అధిష్టానం తమకే ప్రాధాన్యమిస్తుందని ధీమాగా ఉంది. తెరపైకి చిత్తరంజన్దాస్ పేరు... మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలో అరుణ, జైపాల్ వర్గాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా లోక్సభతోపాటు ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో తమ వర్గానికి చెందిన నేతలకే టికెట్లు దక్కించుకోవాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో మహబూబ్నగర్ లోక్సభ నుంచి టికెట్ ఖాయం అని ప్రచారం జరుగుతున్న జైపాల్రెడ్డికి కాకుండా బీసీ వర్గాలకు చెందిన చిత్తరంజన్దాస్ పేరును అరుణ తెరపైకి తెచ్చారు. గతంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి లేదా చిత్తరంజన్దాస్లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించిన అరుణ ఇప్పుడు బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. మహబూబ్నగర్ లోక్సభతోపాటు అసెంబ్లీ స్థానాన్ని కూడా బీసీలకే ఇవ్వాలని ఆమె వాదిస్తున్నారు. గతంలో ఎన్.టి. రామారావును ఓడించి సంచలనం సృష్టించిన ప్రస్తుత కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ చిత్తరంజన్దాస్కు లోక్సభ సీటు ఇవ్వాలంటున్నారు. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలకు లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లు ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని వాదిస్తున్నారు. కానీ ఈ వాదనను జైపాల్ వర్గం కొట్టిపారేస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన జైపాల్రెడ్డికే మహబూబ్నగర్ లోక్సభ టికెట్ వస్తుందని చెబుతోంది. లోక్సభకు పోటీ చేయించే ఆలోచనతోపాటు రాష్ట్రంలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు ఉన్నందునే అధిష్టానం జైపాల్ను సీడబ్ల్యూసీలోకి తీసుకోలేదని పేర్కొంటోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలపై కిరికిరి... మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ్పేట్, కొడంగల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో షాద్నగర్ నుంచి సి.ప్రతాప్రెడ్డి, జడ్చర్ల నుంచి మల్లు రవి, కొడంగల్ నుంచి ఎ. రేవంత్రెడ్డిలకు టికెట్లు ఇచ్చే విషయమై ఇరువర్గాల్లోనూ ఏకాభిప్రాయముంది. మిగిలిన నాలుగు చోట్ల అరుణ, జైపాల్ వర్గాలు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాయి. మహబూబ్నగర్లో జైపాల్ వర్గం సురేందర్రెడ్డి పేరును ప్రతిపాదిస్తోంది. ఒకవేళ మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఇబ్రహీంకు ఇవ్వాలంటోంది. అయితే అరుణ మాత్రం ఈ రెండు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ విషయంలో అరుణ వ్యతిరేక అభిప్రాయంతో లేనప్పటికీ అక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని ఆమె అంటున్నారు. ఇందుకోసం స్థానిక నేత ఎన్.పి. వెంకటేశ్ పేరును ఆమె ప్రతిపాదస్తున్నారు. లేదంటే ఎర్ర శేఖర్కు ఇవ్వాలని చెబుతున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో గతంలో పోటీచేసి ఓడిపోయి నాలుగేళ్లు పార్టీని కాపాడిన పవన్కుమార్రెడ్డిని అరుణ వర్గం ప్రతిపాదిస్తోంది. అయితే ఇక్కడ జైపాల్రెడ్డి మాత్రం బీసీ కోటాలో కాటం ప్రదీప్కుమార్గౌడ్ పేరు తెరపైకి తెస్తున్నారు. బంగారం వ్యాపారి షరాబు కృష్ణను నారాయణపేట సీటుకు జైపాల్ ప్రతిపాదిస్తుంటే తన బంధువు శివకుమార్రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచనతో అరుణ ఉన్నారు. గతంలో ఆయన పార్టీలో చేరాలనుకున్నా తమ్ముడు రామ్మోహన్రెడ్డి కోసం తానే అడ్డుకున్నానని, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన శివకుమార్రెడ్డికి ఈసారి ఎలాగైనా టికెట్ ఇప్పిస్తానని అరుణ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఇక పూర్తిగా అరుణ హవా నడిచే మక్తల్ నియోజకవర్గంలో ఆమె ప్రస్తుత జెడ్పీటీసీ శ్రీహరి పేరు ప్రతిపాదిస్తున్నారు. కానీ జైపాల్ మాత్రం స్థానిక నేత నిజాం పాషాకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ జైపాల్, అరుణల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. -
మేమొచ్చి కేసీఆర్ పనిపడతాం
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచి తీరుతుందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పనిపడతామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తనకు తానే తెలివిగలవాడినని, అందరినీ మోసం చేయగలనని అనుకుంటున్నాడు. ఇన్నాళ్లూ ఫెడరల్ ఫ్రంట్ పాట పాడాడు. ఇప్పుడు ప్రధాని మోదీతో స్నేహం చేస్తున్నాడు’’అని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడెక్కడుందో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందని, టీఆర్ఎస్ను గద్దె దించే శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉందని చెప్పారు. ఇందిరది చెరగని ముద్ర దివంగత ప్రధాని ఇందిరా గాంధీని బీజేపీ నేతలు హిట్లర్తో పోల్చడాన్ని జైపాల్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఇటీవల పాస్పోర్ట్ రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న ఒక హిందూ ముస్లిం జంట విషయంలో కేంద్రంలోని పెద్దలు వివక్ష చూపారని జైపాల్ ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అనుచరులు ఆ జంటపై సోషల్ మీడియాలో అసభ్య విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇలాంటి వారే హిట్లర్ మనస్తత్వం కలవారని ఎద్దేవా చేశారు. ఇందిరపై దాడి రాజకీయ కుట్రలో భాగమేనని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. మోదీ నేతృత్వంలో దేశ సార్వభౌమత్వంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ఇందిర ఇమేజ్ను బీజేపీ నేతలు ఏమీ చేయలేరన్నారు. రెండు చోట్లా మా ప్రభుత్వాలే దేశంలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశముందని జైపాల్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ సొంత ప్రభుత్వం ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులందరికీ అందడం లేదన్నారు. తన డ్రైవర్ కుమార్తె పెళ్లి జరిగి మూడేళ్లవుతున్నా ఇంతవరకు కల్యాణలక్ష్మి డబ్బులు రాలేదని చెప్పారు. -
ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం
-
ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ?: జైపాల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉందని సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పాలనా విధానాలను ఎండగట్టిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పైనా విమర్శలు గుప్పించారు. ‘బీజేపీ ప్రభుత్వ విధానాలు దారుణంగా ఉన్నాయి. ఆ పార్టీలో చదువుకున్న నేతలు లేరు. పేదల బాగోగుల గురించి ఆలోచించరు. మతాంతర వివాహం చేసుకున్న జంటను పాస్ పోర్ట్ విషయంలో అష్టకష్టాలకు గురి చేశారు. పాస్ పోర్ట్ రీ వెరిఫికేషన్ పేరిట వివక్ష ప్రదర్శించారు. మోదీ అనుచరులు, స్మృతి ఇరానీ(కేంద్ర మంత్రి) అనుచరులు ఆ జంటను పత్రికల్లో రాయలేని పదజాలంతో సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లు నియంత మనస్తత్వం కలిగి ఉంటారు. అల్ప సంఖ్యాక వర్గాలను అణగదొక్కేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దూషణలకు దిగేవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’ అని జైపాల్రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం రేట్లు పెరిగిపోతున్నాయని, టాక్స్ను కూడా ప్రభుత్వం తగ్గించలేకపోతోందని విమర్శించారు. ‘పెట్రోల్ టాక్స్ల ద్వారా ద్రవ్య లోటు పూడ్చాలని ఈ ప్రభుత్వం యత్నిస్తోంది. కానీ, పెట్రోల్ రేట్లు పెరిగితే అన్ని వస్తువులపై ధరలు పెరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి’ అని ఆయన అన్నారు. ‘కేసీఆర్ పని పడతాం’... ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ఎన్నికలయ్యాక కేసీఆర్ పనిపడతామని ఆయన అంటున్నారు. ‘కేసీఆర్ తనకు తానే తెలివైనోడిని అనుకుంటున్నాడు. అందరినీ మోసం చేయగలను భావిస్తున్నాడు. ఓవైపు మోదీతో దోస్తాన్ చేస్తున్నాడు. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్నాడు. ఇప్పుడా ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది?’ అని జైపాల్రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ చాలా బలహీనంగా ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
భయపడి ఇంట్లో కూర్చోను: డీకె అరుణ
సాక్షి, మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారంతో నేపథ్యంలో ఆయనతో మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ...‘ దామోదర్రెడ్డిని కలిసి మాట్లాడాను. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని చెప్పాను. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్కు అండగా ఉన్న వ్యక్తి దామోదర్ రెడ్డి. 2004లో కేవలం 1400 ఓట్లతో ఓడిపోయారు. అప్పుడు పొత్తులో భాగంగా టీఆర్ఎస్లోకి వెళ్లినా టీఆర్ఎస్ నుండి పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచారు.క్యాడర్ ఆయన వెంట ఉంది. నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి కాంగ్రెస్లో చేరిక సమయంలో తన బాధ ఎవరూ వినలేదని దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశం, ఆవేదన, బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి, వ్యక్తిగత నిర్ణయం అని చెప్పాను. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మరోసారి ఆయనను కోరాను. డీకే అరుణ చెబితే దామోదర్ రెడ్డి వింటారని నన్ను ఇబ్బంది పెట్టే ప్రక్రియ అది. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను టార్గెట్ చేసినా... నేను సిన్సియర్ కార్యకర్తను. కాంగ్రెస్ గెలుపే నా లక్ష్యం. ఎవరు టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చోను. నా వ్యక్తిగతం కోసం పని చేయడం లేదు. మహబూబ్ నగర్లో ఎప్పుడూ వర్గం లేదు. ఇప్పుడే వినిపిస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే పని చేస్తున్నా. నన్ను డీ మోరల్ చేస్తే పార్టీకే నష్టం. నాకేం ఉంటుంది. బలం చేకూరే నాయకులు వస్తే తప్పులేదు. కానీ ఉన్న బలం పోతే లాభం ఏంటి?. నాగం టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చు కానీ కాంగ్రెస్లో కాదు. వాళ్లు బలమైన నాయకులు అయితే అక్కడే గెలవాలి కదా??’ అని ప్రశ్నించారు. కాగా నాగం జనార్దన్రెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకపోవడంతో.. మనస్తాపానికి గురైన తానే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో డీకే అరుణ, జైపాల్రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటూ పలు అంశాల్లో విబేధాలు వస్తుండడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్లో నాగం జనార్దన్రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డికి డీకే అరుణ మద్దతుగా నిలవగా, ఇక నాగంకు సీనియర్ నేత జైపాల్రెడ్డి మద్దతుగా నిలిచి పార్టీలోకి తీసుకున్న విషయం విదితమే. -
‘కాంగ్రెస్ను ముంచింది జైపాల్ రెడ్డే’
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గొంతుకగా ఓబీసీ మోర్చా పాల్గొంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. అయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఓబీసీ మోర్చా కొత్తగా ఏర్పడినప్పటికీ అనేక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుపుకుంటున్నామని.. జిల్లాలో కూడా కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతున్నామన్నారు. ఈ నెల నుంచి పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, యాత్రలు చేపట్టబోతున్నామని తెలిపారు. భారత్ దేశం మొత్తం సాఫ్ నియంత్ సహీ వికాస్ పేరిటముందుకెళ్తున్నామని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన స్పష్టమైన అధికారం కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో పేదవ్యక్తి ప్రధానిగా కొనసాగుతున్నారని, మోదీ పాలనను ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మోదీపై కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మోదీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఎన్ని పార్టీలు మారారో అందరికి తెలుసనన్నారు. జైపాల్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆపార్టీని ముంచిన వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మోర్చా సేవలు గ్రామ గ్రామన, పల్లె పల్లెకు విస్తరిస్తామన్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిపారు. ఒక్క బీసీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. వేల కోట్లు ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నారు కానీ, పేద వారికి ఇల్లు కట్టించలేని దుస్థితిలో కేసీఆర్ పాలన ఉందన్నారు. తెలంగాణ దేశంలో ఆఖరి స్థానంలో ఉందని జాతీయ నాయకులు అంటున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
జైపాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని ప్రజలకు ఏం చేశారని జైపాల్రెడ్డి ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు బీజేపీ, మోదీ ఏమీ చేయకపోతే 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలన్నారు. పెట్రోల్ ధరలపై జైపాల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన పెట్రోల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ధరలు పెంచారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. -
ప్రధాని మోదీది రాక్షసానందం: జైపాల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మధ్యతరగతి ప్రజలపై ప్రధాని నరేంద్రమోదీ యుద్ధం చేస్తున్నారని, ఆయనలో రాక్షసానందం పొందే అలవాటు ఉండి శాడిస్టులా ప్రవర్తిస్తున్నారని కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి అన్నారు. ఇంకో ఏడాదిలో ఆయనకు ప్రజల చేతిలో మూడటం ఖాయ మన్నారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పటి కంటే 4 రెట్లు అంతర్జాతీ య మార్కెట్లో చమురు బ్యారెల్ ధరలు తగ్గాయని, కానీ పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఇప్పటికి 9 సార్లు ఎక్సైజ్ పన్ను లు పెంచారని, తాను మంత్రిగా ఉన్నప్పుడు పన్ను రేటు రూ.1.30 లక్షల కోట్లుంటే, ఇప్పుడు అది రూ.2.70 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా.. అనే అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘బీజేపీ హయాంలో పెట్రోల్ ధరలు భగ్గు’ సాక్షి, హైదరాబాద్: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలపై దాడులు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయ ని ఏఐసీసీ సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ అన్నా రు. సోమవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ సేవాదళ్ ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా సేవాదళ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. కొత్త తరం నేతలను కలుపుకుని సేవాదళ్ను పటిష్టం చేస్తామని, త్వరలోనే డ్రెస్ కోడ్ కూడా మారుస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆయన వల్లే కాంగ్రెస్కు బ్రహ్మాండమైన మెజారిటీ
హైదరాబాద్ : 2004లో అంజన్ కుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం వల్లే కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..గత 4 ఏళ్లలో కాంగ్రెస్ కొంత పట్టుకోల్పోయింది కానీ అంజన్ నాయకత్వంలో మళ్లీ పూర్వ వైభవం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందని అన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకలు అన్ని పార్టీల వేడుకగా జరగాలి కానీ కేసీఆర్ సొంత వేడుకలా జరుపుతున్నారని ధ్వజమెత్తారు. మెట్రో ట్రైన్ కేసీఆర్ సాధించారని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంగా వైఎస్ఆర్, కేంద్రమంత్రిగా తాను మెట్రో సాంక్షన్ చేయించుకోగలిగామని తెలిపారు. ‘ కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో స్నేహం చేస్తున్నారు. అది అక్రమ సంబంధం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కంటే ఎక్కువగా వినయం ప్రదర్శిస్తున్నారు. తన అవినీతిపై కేసులు పెడతారేమోనని భయపడుతున్నారు. తాను పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ముడి చమురు ధర ఇప్పటికి డబుల్ ఉంది. అయినా ధర తగ్గటం లేదు. బీజేపీ నాయకులు మా చేతుల్లో ఏం లేదంటున్నారు. టాక్సులు పెంచి రేట్లు తగ్గించకుండా ప్రజలను మోదీ వంచిస్తున్నారు. మోదీ టాక్స్ టెర్రరిస్ట్, ఎక్సైజ్ టాక్స్ టెర్రరిస్ట్ లేకపోతే ఈ రేట్లు ఏంటి. 2019లో కాంగ్రెస్ రాహుల్ నాయకత్వంలో మిగిలిన పక్షాలను కలుపుకుని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామ’ ని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్లో ఎన్నికల టీం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్లో త్వరలోనే ఎన్నికల టీం రెడీ కానుంది. ఒడిశాలో ఏర్పాటు చేసినట్టుగానే తెలంగాణలోనూ పార్టీ కమిటీల నియామకానికి ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, కోర్ కమిటీలను వచ్చే నెలలో ప్రకటించే దిశగా ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ యోచిస్తున్నారని సమాచారం. సామాజిక సమతుల్యత ఆధారంగా ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారని, ఎస్సీ, బీసీ నాయకులకు ప్రాధాన్యమివ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆశావహుల జాబితా చాంతాడంత పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్లో సహజంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికల టీంను నియమించేందుకు కసరత్తు చేస్తుండడంతో ఈ పోటీ మరింత పెరిగింది. ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించే ప్రచార, మేనిఫెస్టో, కో ఆర్డినేషన్, కోర్ కమిటీల పగ్గాల కోసం, ఆ కమిటీల్లో స్థానం కోసం టీపీసీసీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతుండగా.. అదనంగా ఒకరు లేదా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను ఈ కమిటీలతో పాటు ప్రకటించనున్నారు. ఈ నెల19న విడుదల చేసిన ఒడిశా కమిటీలతోపాటు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. అదే తరహాలో రాష్ట్రంలోనూ ముగ్గురికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి ఈ హోదాలో ఉండగా.. కొత్తగా నియమించే ఇద్దరిలో ఒకరిని ఓసీ, మరొకరిని బీసీ వర్గం నుంచి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రేవంత్రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నంను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని ఎప్పట్నుంచో అంటున్నా అది కార్యరూపం దాల్చలేదు. అలాగే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్కు కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. యాష్కికి కీలక బాధ్యతలు ఏఐసీసీలో ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో రాహుల్ ఉన్నట్టు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న యాష్కికి ఈసారి పదోన్నతి వస్తుందని పీసీసీ వర్గాలంటున్నాయి. ఆయన్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలకు ఇచ్చే ఈ హోదాను ఇవ్వడం ద్వారా బీసీలకు పెద్దపీట వేశామనే సంకేతాలు పంపాలన్నది రాహుల్ యోచనగా కనిపిస్తోంది. యాష్కికి పదోన్నతి రాకపోతే ఆయన్ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా నియమించే అవకాశాలున్నాయి. ఒకవేళ పదోన్నతి వస్తే ప్రచార కమిటీ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు అప్పగించనున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సీనియర్ నేత జైపాల్రెడ్డికి చోటు ఖాయమని తెలుస్తోంది. సీడబ్ల్యూసీలో జైపాల్కు చోటివ్వకపోతే రాష్ట్ర పార్టీ సలహాదారుగా లేదా పార్టీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో కమిటీకి రాజనర్సింహ ఇతర కమిటీల విషయానికి వస్తే.. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను నియమించే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధా న్యం పెంచాలనే కోణంలో హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈయన నేతృత్వంలో ఉండే ఈ కమిటీకి కన్వీనర్గా ఓసీ సామా జిక వర్గ నేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కో ఆర్డినేషన్ కమిటీలో పార్టీ సీనియర్ నేతలందరికీ స్థానం కల్పించనున్నారు. కోర్కమిటీలో సభ్యుల సంఖ్య తక్కువే అయినా.. చైర్మన్, కన్వీనర్లుగా ఓసీ, బీసీ నేతలను ఎంపిక చేయనున్నా రని టీపీసీసీ వర్గాలంటున్నాయి. టీపీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ కమిటీల ఏర్పాటుపై ప్రాథమికంగా చర్చ జరిగినా.. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే ఆక్రోశ్ర్యాలీకి వెళ్లే సందర్భంగా టీపీసీసీ ముఖ్యులతో కమిటీల ఏర్పాటుపై రాహుల్, గెహ్లాట్ చర్చలు జరపనున్నారు. -
ఒక్కటైన నాగం వ్యతిరేకులు
సాక్షి, నాగర్కర్నూల్: సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకొచ్చే విషయంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నాగం రాకను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య నేతృత్వంలో ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి తదితరులు రోజంతా ఈ అంశంపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీకి రాజీనామా చేసిన నాగం జనార్దన్రెడ్డి స్థానిక నేతలైన కూచకుళ్ల దామోదర్రెడ్డి, నంది ఎల్లయ్యకు కనీస సమాచారం ఇవ్వకుండా.. పార్టీలోకి వస్తున్నట్లు తానంతట తాను ప్రకటించుకోవడంపై వీరు మండిపడుతున్నారు. మరోపక్క తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ను గల్లంతు చేస్తానంటూ నాగం చెప్పుకోవడంపై డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారని, ఇతరుల నియోజకవర్గాల్లో ఆయన అనవసర జోక్యాన్ని తీవ్రంగా ఖండించకపోతే మున్ముందు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. నాగం జనార్దన్రెడ్డి విషయంలో వాస్తవ పరిస్థితులను రాష్ట్ర, జాతీయ పార్టీల అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారి అపాయింట్మెంట్ తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదిలా ఉండగా వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, అలంపూర్ నేత సంపత్కుమార్ మాత్రం ఈ వర్గంతో జత కట్టనట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ సీనియర్లకు ‘వయసు’ గుబులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ‘వయసు’ గుబులు పట్టుకుంది. 70 ఏళ్లు దాటిన వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్ ఉండదని, వారి సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని ఇటీవల జరిగిన ప్లీనరీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడంతో తమకు సీట్లు వస్తాయా రావా అనే సందేహం వారిని వేధిస్తోంది. రాహుల్ చెప్పినట్టు చేస్తే రాష్ట్రం నుంచి ఐదారుగురు ముఖ్య నేతల టికెట్లు గల్లంతయ్యే అవకాశముందన్న చర్చ టీపీసీసీ వర్గాల్లో జరుగుతోంది. ఈ లెక్కన ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుల టికెట్లు సైతం గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి, నల్లగొండ జిల్లా సీనియర్ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జాతీయ విపత్తు నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి ఉన్నారు. వీరందరి వయసు 70 కన్నా ఎక్కువ ఉండటంతో ఈసారి వీరికి టికెట్లు రావన్న చర్చ గాంధీభవన్లో జరుగుతోంది. లోలోన గుబులుగానే ఉన్నా తమకు టికెట్ కచ్చితంగా వస్తుందని వారు పేర్కొంటున్నా రు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఆశతో ఉన్న జానారెడ్డి.. తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ తెచ్చుకుంటానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం ఈసారి తన గెలుపు కచ్చితమన్న అంచనాతో ఉన్నారు. గీతారెడ్డి తన కుమార్తెను రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా.. ఈసారికి తానే పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక జైపాల్రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను టార్గెట్గా చేసుకుని మాజీ మంత్రి డీకే అరుణ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుండటం సీనియర్లకు తలనొప్పిగా మారింది. జైపాల్కు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయన మాత్రం మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మర్రిÔ¶ శశిధర్రెడ్డి పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్గా క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే టికెట్పై ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోని కొందరు యువనేతలు ప్రచారం చేస్తున్నట్టు వీరి ఆశలు నిరాశలవుతాయా? లేదా రాహుల్ ప్రత్యేక నిర్ణయం తీసుకుని వీరికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సిందే! వారసులొస్తారా? వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారు పోటీ చేసే అవకాశం లేదని పార్టీ కచ్చితంగా నిర్ణయిస్తే ఆయా నేతల వారసులకు లైన్క్లియర్ అవుతుందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేతల్లో జైపాల్రెడ్డికి రాజకీయంగా వారసులు లేకపోయినా జానా కుమారుడు రఘువీర్రెడ్డి, పొన్నాల కోడలు వైశాలి, శశిధర్రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి లాంటి యువ నాయకత్వం ఈసారి బరిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాహల్ మదిలో ఏముంది? వాస్తవానికి కాంగ్రెస్లో ఎప్పుడూ సీనియర్ల హవానే కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద వయసున్న నేతలే అటు పార్టీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ కనిపిస్తుంటారు. అయితే రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన విభాగాలకు ఎన్నికలు నిర్వహించడం మొదలు పార్టీలో సీనియర్లు, జూనియర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆయన తనదైన ఆలోచనతో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ‘‘20–40 ఏళ్ల వయసున్న వారిని వర్కింగ్ యూత్గా, 40–60 వరకు సీనియర్ యూత్గా, 60–70 సలహా సంఘంగా, 70 కన్నా ఎక్కువ వయసున్న వారిని పూర్తిగా పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. 60–70 ఏళ్ల వయసున్న వారికి టికెట్లు ఇచ్చే విషయంలో కొంత రిజర్వ్డ్గానే ఉండాలని ఆయన ఉన్నారు. ఇదే విషయాన్ని ప్లీనరీలో ప్రకటించారు’’ అని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఎక్కడా చెప్పలేదు: ఉత్తమ్ సీనియర్ నేతలకు టికెట్ల అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. 70 ఏళ్లు దాటిన నాయకులకు టికెట్లు ఇవ్వబోమని పార్టీలో ఎక్కడా చెప్పలేదంటూనే.. ఈసారి యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ చెప్పినట్లు వ్యాఖ్యానించడం గమనార్హం. -
వారికి పుట్టగతులు లేకుండా చేస్తాం: తలసాని
సాక్షి, మహబూబ్నగర్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, డీకే అరుణకు మహబుబ్నగర్లో పుట్టగతులు లేకుండా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక్కడి నుంచి గెలిచి, ఒక్క పని చేయకుండా ఎన్నికల కోసం మళ్లీ వచ్చి పేదలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలకుంటున్నారని విమర్శించారు. సోమవారం జిల్లాలోని హన్వాడలో గొర్రెల దాణా పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్ నగర్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్సిడీపై ఇచ్చిన గొర్రెలు చనిపోతే ఐదు రోజుల్లో మరో గొర్రెను ఇస్తామని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే పాత జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కానీ అలా జరగకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్రలు, పాదయాత్రలు చేపట్టి వారికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఏనాడు ప్రజల కోసం పనిచేయని వారు ఇప్పుడు కాగ్ నివేదిక గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందని మండిపడ్డారు. -
పీఎస్ కృష్ణన్ కృషి ఎనలేనిది
సాక్షి, హైదరాబాద్: వీపీసింగ్ ప్రధానిగా ఉండగా మండల్ కమిషన్ సిఫార్సుల విషయంలో ప్రముఖ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ కృషి మరువలేనిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి అన్నారు. ఎమెస్కో ప్రచురించిన పీఎస్ కృష్ణన్ జీవిత చరిత్ర ‘సామాజిక న్యాయ మహాసమరం’తెలుగు అనువాదాన్ని జైపాల్రెడ్డి సోమాజిగూడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఆదివారం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణకర్త ఎమెస్కో విజయ్కుమార్ నేతృత్వంలో ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫార్సుల విషయంలో నాటి ప్రధాని వీపీ సింగ్ సంకల్పం ఏదైనా దానికి రాజ్యాంగబద్ధత కల్పించడంలో కృష్ణన్ కృషి ఎనలేనిదని, కృష్ణన్ వల్లనే ఎంతో ఉన్నతమైన ఉత్తర్వులు వెలువడ్డాయని గుర్తుచేశారు. రచయిత పీఎస్ కృష్ణన్ మాట్లాడుతూ.. తాను కొన్ని ఆదర్శాలు, ఆశయా ల సంఘర్షణతో ఆంధ్రప్రదేశ్కి వచ్చానని, తనకు జన్మభూమి కేరళ అయితే, కర్మభూమి ఏపీ అని అన్నారు. ఈ పుస్తకంలోని అస్పృశ్యతాం శం పుస్తక ప్రచురణకర్తలకు సైతం అస్పృశ్యమైనదేనని, అయితే ఉన్నతాశయంతో పుస్తకాన్ని ప్రచురించిన విజయ్కుమార్కి, పుస్తక రచనకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన పాత్రికేయులు టంకశాల అశోక్, డాక్టర్ వాసంతీదేవికి కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్ కృష్ణన్ భార్య శాంతా కృష్ణన్ తోడ్పాటుని అందరూ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కేఆర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎస్ఆర్ శంకరన్ సహా అందరం పీఎస్ కృష్ణన్ని ఆదిగురువుగా భావించేవారమన్నారు. ముస్లిం రిజర్వేషన్లలో కీలక పాత్ర ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్ ప్రముఖ పాత్ర వహించార ని కాకి మాధవరావు అన్నా రు. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్లు ఈ సమాజానికి, భవిష్యత్ తరాలకు తమ అనుభవాలను జీవితచరిత్రల రూపంలో అందించాల్సిన ఆవశ్యకతను సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి గుర్తుచేశారు. పీఎస్ కృష్ణన్ పుస్తకం ఆవిష్కరణకు ఇది అత్యంత కీలక సమయమని సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి వసంత కన్నాభిరాన్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కల్పనా కన్నా భిరాన్, మాజీ డీజీపీ హెచ్జే దొర, మాజీ ఐఏఎస్ అధికారి టీఎల్ శంకర్, చక్రవర్తి, జయప్రకాశ్ నారాయణ్, విద్యాసాగర్రావు, ఐఏఎస్ అధికారి మురళి, జ్యోతి బుద్ధప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
టీఆర్ఎస్ బీజేపీకి తోక పార్టీ: జైపాల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తోకపార్టీ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ ఏకమై అవిశ్వాసం పెడితే.. టీఆర్ఎస్ అడ్డుకుందని ఆరోపించారు. శనివారం గాంధీభవ న్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా ఓ వ్యాపారి అని, ఆయనకు కొనడం అమ్మడమే తెలుసని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెంచుతున్నా మోదీకి సీఎం కేసీఆర్ సహకరించడాన్ని తప్పుపట్టారు. కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నా కేసీఆర్ మోదీని వదలరని ఎన్నికలు వచ్చే వరకు మోదీకి మిత్రపక్షంగా ఉంటారని జోస్యం చెప్పారు. విభజన హామీలైన ఎయిమ్స్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిధుల కోసం కేసీఆర్ కేంద్రంతో పోరాడం లేదని విమర్శించారు. లేని ఆస్తులను తెలంగాణ పేరిట చూపించి అప్పులు తెచ్చారని దానివలన ద్రవ్యోల్బణంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. మన వ్యవస్థలో కాగ్కి ప్రత్యేక స్థానం ఉందని, కానీ టీఆర్ఎస్ నేతలకు అవి కాకి లెక్కల్లా కనిపిస్తున్నాయని అన్నారు. -
‘కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని అమ్మొద్దు’
సాక్షి, హైదరాబాద్ : బీజేపీకి చెందిన ఓ తోకపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడికి పోయిందో చెప్పాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీకి సిద్ధాంతాల గురించి ఏ మాత్రం తెలియదన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ వ్యాపారి అని.. ఆయనకు అమ్మడం, కొనడం మాత్రమే తెలుసునని జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెంచుతున్నా మోదీకి సీఎం కేసీఆర్ సహకరించడాన్ని తప్పుపట్టారు. ఎన్నికలు వచ్చే వరకు మోదీకి మిత్రపక్షంగా కేసీఆర్ ఉంటారని, కానీ టీఆర్ఎస్ పార్టీని మాత్రం బీజేపీకి అమ్మవద్దని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇచ్చిన హామీలతో పాటు తెలంగాణకి సమానంగా ఐటీఐఆర్, ఉక్కు ఫ్యాక్టరీలను నెలకొల్పాలని.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం నిధులు కేంద్రాన్ని అడగాలని కేసీఆర్ను సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని కాగ్ రిపోర్ట్ ద్వారా తేలిందన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ ప్రకారం ఆర్థిక, ద్రవ్య భద్రత కోసం లోన్ తీసుకోవచ్చన్నారు. ద్రవ్యోల్బణంతో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నవని, ద్రవ్యలోటు 4.7 శాతం పెరిగిందని తెలిపారు. 60 వేల కోట్ల రూపాయల అప్పును 2.21 లక్షల కోట్ల రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్దేనని చురకలు అంటించారు. 70 ఏళ్లలో చేసిన అప్పుల కంటే 4 ఏళ్లలోనే రెండింతల అప్పులు ఎక్కువ చేశారంటూ మండిపడ్డారు. మన వ్యవస్థలో కాగ్కి ప్రత్యేక స్థానం ఉంది. టీఆర్ఎస్ నేతలకు అవి కాకి లెక్కల్లా కనిపిస్తున్నవని, అయినా వారికి ఇంత పెద్ద విషయాలు అర్థం కావని అభిప్రాయపడ్డారు. ముందు తరాలను నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని కేసీఆర్ను కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
ప్రధాని మోదీ వారణాసిలోనూ ఓడిపోతారు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న థర్డ్ఫ్రంట్.. ఒక పెద్ద స్టంట్ అని ఆయన కొట్టిపారేశారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేసీఆర్తో కలిసి వెళ్లబోరని, ఆమె తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రస్తావిస్తూ.. ఇక పార్టీకి అన్ని పరాజయాలేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 లోక్సభ ఎన్నికల్లో తన నియోజకవర్గం వారణాసిలో ఓడిపోతారని జైపాల్రెడ్డి జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు బాధాకరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాలను రద్దుచేసిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యమా?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఏ ఫ్రంట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ లేదా బీజేపీలలో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా ప్రధాని అయిన సందర్భం లేదని, అందరికంటే తెలివి కొంచెం ఎక్కువ ఉన్న కేసీఆర్కు ఆ విషయం తెలియదా అని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యమయ్యే ప్రసక్తే లేదని అన్నారు. నాలుగేళ్లు ప్రధాని మోదీకి బానిసగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు కుట్రపూరితంగా ఆయనకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారని, ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ పంచనే చేరుతాడని అన్నారు. -
క్యాషియర్ జైపాల్రెడ్డిపై అక్రమాస్తుల కేసు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు జైపాల్రెడ్డిపై సీబీఐ గురువారం మరో కేసు నమోదు చేసింది. బ్యాంకు కుంభకోణంలో రూ.9 కోట్ల వరకు దోపిడీకి గురైన సంగతి తెలిసిందే. కుంభకోణంలో బ్యాంక్ క్యాషియర్ జైపాల్రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు సీబీఐ గుర్తించింది. 2011 నుంచి 2018 ఫిబ్రవరి వరకు ఆయన సంపాదించి న ఆస్తులు, భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరించింది. జైపాల్రెడ్డి, ఆయన భార్య శాలిని పేర్ల మీద రూ.73.38 లక్షల ఆస్తి ఉంది. రాబడి ద్వారా వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఆయనకున్న ఆస్తుల విలువ 144 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది. దీంతో ఈ ఆస్తి అక్రమార్జనగా ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ 1988 ప్రకారం రెడ్ విత్ 13 (2), 13 (1) (ఈ) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు హైదరాబాద్ రేంజ్ సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ తెలిపారు. -
హోంమంత్రి రేంజ్ హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్కు తక్కువ!
సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ బతికే ఉందా అని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును నీరుగార్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నల్లగొండలో జరిగిన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు కాపలా కుక్కలా మారారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్పై పోరాటం చేయడమే శ్రీనివాస్ హత్యకు కారణమన్నారు. రంజిత్, సుధీర్ కాల్ డేటా బయటపెడితే ఎమ్మెల్యే వీరేశం కుట్ర బయటపడుతుందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశానిది మొదటినుంచి నేరచరిత్రే అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ పార్టీ విశ్వాసం లేదన్నారు. హోంమంత్రి నాయిని రేంజ్ హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్కు తక్కువ అని విమర్శించారు. సంతాపసభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్గం గాంధేయ మార్గమని చెప్పుకొచ్చారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసు రీ ఓపెన్ చేసి అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా నేతలను పార్టీలు మార్పించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. -
కేసీఆర్ వ్యతిరేకులు ఏకం కావాలి: జైపాల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలోనూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులోనూ విఫలమైన ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా అన్ని శక్తుల పునరేకీకరణ జరగాలని కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో నిరంతరం శ్రమించి, ఎన్నో త్యాగాలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పాలన ఉందని సోమవారం ఒక ప్రకటనలో జైపాల్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు కావస్తున్నా రాష్ట్ర ఏర్పాటు ఫలితాలు ఉద్యమకారులకు అందలేదన్నారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉందన్నారు. కేసీఆర్ హామీలు ఇచ్చి మభ్యపెడుతూ, రాజకీయ భ్రమలు కల్పించి కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 4వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, నిరుద్యోగులు ప్రాణాలు వదులుతున్నా సీఎంకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అవినీతిని పెంచిపోషించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ, వారిని కులవృత్తులకు పరిమితం చేసి పాలనాధికారాలను తన చేతిలో పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారని, రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని జైపాల్రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించుకోవడానికి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాలని జైపాల్ పిలుపునిచ్చారు. దీనికోసం ఈనెల 20న జడ్చర్లలో జనగర్జన పేరుతో జరిగే బహిరంగసభకు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ హాజరు కావాలని కోరారు. జడ్చర్లలో జరగబోయే బహిరంగ సభ టీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల ఐక్యతకు నాంది పలుకుతుందని ఆయన అన్నారు. -
అంబేద్కర్ సిద్ధాంతానికి ప్రభావితమయ్యాను
హైదరాబాద్ : తాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి ప్రభావితం అయ్యానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఆదర్శాలలో ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలకు తేడా ఏమీ లేదన్నారు. కేవలం ప్రాధ్యాన్యతల్లోనే విబేధాలు ఉన్నాయని వివరించారు. దేశ స్వాతంత్రం గాంధీ ప్రాధాన్యతగా భావించారని, దాంట్లో దళితుల స్థానాన్ని అంబేద్కర్ ప్రయారిటీగా భావించారని తెలిపారు. అంబేద్కర్ ఎంత సోషలిస్ట్ కావాలో అంత కాలేదని అన్నారు. ప్రస్తుతం కొందరు నాయకులు మతం రంగు పులుముకొని వస్తున్నారని ప్రజలు దాన్ని గమనించాలని కోరారు. ప్రస్తుత రాజకీయాల్లో కులంతో పాటు డబ్బు ప్రభావం పెరిగిందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ లక్ష్యం పూర్తి కాలేదని, అలాగే ఆదర్శవాదుల లక్ష్యాలు కూడా పూర్తి కాలేదని తెలిపారు. ఆదర్శాల విషయంలో గాంధీ, అంబేద్కర్ల మధ్యలో తేడా లేదని తెలిపారు. -
బీజేపీ అంటే కేసీఆర్కు భయం: జైపాల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కారు అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు వణుకని, ఆయన చేస్తున్న తప్పులు ఈడీ, సీబీఐలకు తెలుస్తాయన్న భయంతో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేత రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి వస్తున్నారనే సమాచారం తనకు లేదని, ఎవరు పార్టీలోకి రావాలో హైకమాండ్ నిర్ణయిస్తుందని, అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలతో సంబంధంలేని ఏ పార్టీ తమతో కలసివచ్చినా మంచిదేనని జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజ్మహల్ మన దేశ సంస్కృతిలో భాగంకాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ అభిప్రాయమేమిటో స్పష్టం చెయ్యాలని కోరారు. ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాజెక్ట్ పూర్తికావాలంటే రూ.2వేల 150 కోట్లు కావాలని అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో అంత మొత్తం నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. -
సీడబ్ల్యూసీలోకి జైపాల్రెడ్డి?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నాలకు అవకాశం ► టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పొన్నం? ► పార్టీపై పట్టు బిగిస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ► సీనియర్లకు చెక్ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పట్టు బిగిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకూ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అంతర్గత అంశాల్లో అవరోధంగా మారవచ్చనే అన్ని అంశాలపైనా ఉత్తమ్ దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరికీ చెక్ పెట్టేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అంతర్గత అంశాలు, నిర్ణయాలపై పూర్తిగా పట్టు చిక్కిన తర్వాతే ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికి వీలుంటుందనే వ్యూహంతో ఉత్తమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే పార్టీలోని సీనియర్ల ప్రభావాన్ని రాష్ట్రంలో తగ్గించడానికి, తనదైన ముద్ర వేసుకోవడానికి ఆయన ఎత్తులు వేస్తున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్లు ఎస్.జైపాల్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి వారిని జాతీయ పార్టీలోకి తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్గాంధీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కీలకమైన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి జైపాల్ వెళ్లనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నాలకు అవకాశం దక్కనుంది. ఈ ప్రతిపాదనలపై కుంతియా, ఉత్తమ్తోనూ చర్చించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరి ప్రమేయం, జోక్యాన్ని రాష్ట్ర పార్టీకి సంబంధించి పరిమితం చేయవచ్చనే ఎత్తుగడతో ఉత్తమ్ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. పార్టీకి సీనియర్లుగా ఉన్న సీఎల్పీ నేత కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా పొన్నం..? టీపీసీసీకి అదనంగా మరో కార్యనిర్వాహక అధ్యక్షుడు వస్తాడని ఉత్తమ్ స్వయంగా వెల్లడించారు. ఉత్తమ్ ఎత్తుగడలో భాగంగానే అదనంగా మరొకరిని నియమించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మల్లు భట్టివిక్రమార్క ఒక్కరే ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉన్నారు. అయితే సంస్థాగతమైన అంశాలు, నిర్ణయాలు, కార్యక్రమాలకు సంబంధించి ఉత్తమ్కు, భట్టివిక్రమార్కకు పొసగడం లేదని చాలాకాలంగా పార్టీలో చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా భట్టి కూడా పార్టీలో పట్టుకోసం ఎత్తులు వేస్తున్నారు. ఒక్కరే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటే అనివార్యంగా ప్రాముఖ్యత పెరుగుతుందని, కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుందనే అలోచనతో మరో వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని ఉత్తమ్ అధిష్టానాన్ని కోరినట్టుగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరో సామాజిక వర్గం నుంచి... భట్టివిక్రమార్కను కదిలించకుండానే స్థాయిని తగ్గించడం ద్వారా తన పట్టును మరింత పెంచుకోవడానికి మరో నాయకుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని ఉత్తమ్ కోరినట్టుగా వారంటున్నారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెరో సామాజికవర్గం నుంచి ఉన్నారు. ఓసీలకు సంబంధించి ఉత్తమ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి భట్టి ఉండటంతో బీసీల నుంచి ఒకరికి మరో వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తారని దాదాపుగా తేలిపోయింది. బీసీలకు చెందిన పలువురు నేతలు పోటీపడుతున్నా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి దానం నాగేందర్ తన ప్రయత్నాలను చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్లుగా ఉన్న మరికొందరు నాయకులకు ఏఐసీసీలో అవకాశాలు వరించనున్నాయి. -
సీసీఎంబీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు
పీఎం.భార్గవ సంతాప సభలో జైపాల్ రెడ్డి హైదరాబాద్ : సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి పీఎం భార్గవ అని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. భార్గవ లాంటి వ్యక్తులను దేశం పుట్టించకపోతే భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవ సంతాప సభలో పలువురు ఘనంగా నివాళులర్పించా రు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భార్గవ ఒక వ్యక్తి కాదు సంస్థగా ఎదిగారని..సైన్స్కు సమాజానికి మధ్య సంబంధాన్ని పెంచాలనే తపన భార్గవలో కనిపించేదన్నారు. నెహ్రూ తరం ఆఖరి ప్రతినిధిగా భార్గవను పేర్కొనవచ్చు అన్నారు. శాస్త్రవేత్తలు మౌనం వహించటం సమాజానికి తీవ్రవాదం కంటే ప్రమాదకరమని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. సైన్స్ ప్రభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానని అందుకే శాస్త్రవేత్తలంటే నాకు ఎంతో గౌరవం అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రొఫెసర్ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణసీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ శర్మ, మాజీ డైరెక్టర్లు లాల్జీసింగ్, డాక్టర్ సీహెచ్.మోహన్ రావు, డాక్టర్ మెహతాబ్, ఎస్.బామ్జీ, ఐఐసీటీ మాజీ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ కమాల్, డాక్టర్ హర్ష గుప్త, ప్రొఫెసర్ బీఎన్.రెడ్డి, సత్యప్రసాద్, టి.రమేశ్, శ్రీనా«థ్, ఎ.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతో ఉన్నది అభివృద్ధి ఒప్పందమే: కర్నె
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో తమకున్నది అభివృద్ధి ఒప్పందం మాత్రమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి కార్యకర్త స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేదన్నా రు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ఎన్డీఏ టీఆర్ఎస్ను సంప్రదించగా, సీఎం కేసీఆర్ సూచన మేరకే దళిత నేతను అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. గతంలో అంబేడ్కర్ను ఎన్నికల్లో ఓడించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ను కూడా మోసం చేసిందని, రాజకీయాల కోసం లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను బలి చేయొద్దని హితవు పలికారు. -
జైపాల్రెడ్డివి పగటి కలలే: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ 2019లో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జైపాల్రెడ్డి పగటి కలలు కంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పైనా జైపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 60 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందన్నారు. కేసీఆర్ వచ్చి కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదని అనడం జైపాల్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేసీఆర్వి త్యాగాలు.. జైపాల్రెడ్డివి భోగాలు... తెలంగాణ కోసం 15 ఏళ్లు ప్రాణాలకు తెగించి పోరాడి రాష్ట్రం సాధించిన చరిత్ర సీఎం కేసీఆర్దని ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. తెలంగాణలో లేకుండా ఎప్పుడూ ఢిల్లీలో కాలం గడిపే జైపాల్రెడ్డిది భోగాల చరిత్ర అని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా ఒక్కరోజైనా తెలంగాణ గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారం పోయిందనే బాధతో ప్రజలపై ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు. -
కేసీఆర్ పగటి కలల వ్యాపారి
‘మీట్ ది ప్రెస్’లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి ► తెలంగాణ ఏర్పాటులో ఆలస్యం వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్కు నష్టం సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పగటి కలల వ్యాపారి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చి, వాటితో ప్రజలకు పగటి కలల ప్రపంచాన్ని చూపి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఒంటరిగా ఎన్నికలకు పోవడానికి కేసీఆర్ భయపడ్డారని, అందుకే ఆచర ణ సాధ్యంకాని హామీలన్నీ ఇచ్చారని ఆరోపించా రు. తెలంగాణ ఏర్పాటును అధిష్టానం ఆలస్యం చేయడం, టీఆర్ఎస్ను విలీనం చేసే విషయమై కాంగ్రెస్ స్థానిక నాయకులు అధిష్టానాన్ని తప్పు దారి పట్టించడం వల్ల గత ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ దశల్లో ప్రభుత్వ, బంజరు, సాగు భూము లను ప్రభుత్వం పంచిందని, కొత్తగా ఇవ్వడానికి భూమి లేదని, కొత్తగా భూమిని సృష్టించడానికి కేసీఆర్ బ్రహ్మా అని ప్రశ్నించారు. రుణమాఫీ విధా నం సరిగా లేకపోవడంతో వడ్డీల భారం రైతులపై పడిందని ఆరోపించారు. బ్యాంకుల్లో మరోసారి రుణాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఆచరణ సాధ్యంకాని హామీలనే ఇచ్చారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం కేసీఆర్ గతంలో మంచి దోస్తులని, అందుకే ఓటుకు కోట్లు కేసు వంటివాటిపై ఏం మాట్లాడలేనని తెలిపారు. ప్రజలకు దండగ.. కేసీఆర్కు పండగ ఇప్పుడున్న సచివాలయం పూర్తిగా నింపడానికే ప్రభుత్వానికి శక్తి చాలదని, కొత్త సచివాలయం అవ సరం లేదని జైపాల్రెడ్డి అన్నారు. సచివా లయంలోని భవనాలన్నీ కొత్తవే అయినా వాటిని వదిలిపెట్టి కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా ఏమైనా నిర్మిస్తే తప్ప తనకు ఆదాయం రాదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు దండగ అయితే కేసీఆర్కు పండుగని ఎద్దేవా చేశారు. చరిత్రను ధ్వంసం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్.. హైదరా బాద్ను తామే నిర్మించినట్టుగా, అంతకుముందు హైదరాబాద్ అనేదే లేనట్టుగా చెప్పుకునే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని, కేవలం రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం మాత్రమేనని వివరించారు. హైదరాబాద్ వల్ల రూ.25 వేల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ కేసీఆర్ చేశారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం విద్యుత్లో 54 శాతం తెలం గాణకు ఇవ్వాలని బిల్లులో నాటి కేంద్ర ప్రభుత్వం పెట్టడం వల్లనే తెలంగాణలో మిగులు విద్యుత్ ఉందని వివరించారు. అమెరికాలో ట్రంప్.. భారత్లో మోదీ అమెరికాలో ట్రంప్నకు, భారత్లో మోదీకి తేడా లేదని జైపాల్రెడ్డి అన్నారు. అంతర్జాతీ యంగా ఆయిల్ ధరలు పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.1.20 లక్షల కోట్లు ఆదా అయినా వినియోగదారులకు మాత్రం తగ్గించలేదన్నారు. స్వాతంత్య్ర పోరాట కాలం లోనే గోవధ నిషేధం కాంగ్రెస్ అజెండాలోని అంశమని, అమలు బాధ్యత రాష్ట్రాలకు వదిలిపెట్టామన్నారు. ఇలాంటి లోతైన అంశా ల్లో దేశంలో రాజకీయ సైద్ధాంతిక నిరక్షరాస్యత పెరిగిందని తెలిపారు. -
మూడేళ్లలో సాధించిందేమీలేదు
-
పట్టపగలు పెట్రోల్ దోపిడీ
- ఏడాదికి లక్షల కోట్లు ఆదా.. అయినా సామాన్యుడికి దక్కని ఊరట - గోవధ నిషేధాన్ని ఏనాడో ఎజెండాలో చేర్చాం: జైపాల్ రెడ్డి -2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి - టీఆర్ఎస్పై కోపంతోనే సంగారెడ్డి సభకు జనం - ‘మీట్ ది ప్రెస్’లో కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలు హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అయిల్ పరిశ్రమ పడిపోయిందని, ఆ ప్రభావంతో ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయేతప్ప ఇందులో నరేంద్ర మోదీ ప్రభావమేదీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్రెడ్డి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ దిగుమతుల్లో మన దేశానాకి ఏటా రూ. 1.20 లక్షల కోట్లు ఆదా అవుతున్నదని, అయితే ఈ ఫలాలు మాత్రం వినియోగదారుడికి దక్కడంలేదని ఆయన ఆవేదన చెందారు. యూపీఏ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ. 71 ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు అదే స్థాయిలో ఉందని, ఎన్డీఏ పట్టపగలు పెట్రోల్ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. హైదరాబాద్లోని ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న జైపాల్రెడ్డి.. గోవధ, కేసీఆర్ పాలన తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవధ నిషేధం పాతదే: స్వాతంత్ర సమరం కాలంలోనే గోవధ నిషేధం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చేర్చామని జైపాల్ రెడ్డి గుర్తుచేశారు. అయితే గోవధ నిషేధం అమలు బాధ్యతను ఆయా రాష్ట్రాలకు వదిలేశామని, రాష్ట్రాలు శక్తికొలదీ తమ బాధ్యతను నెరవేర్చాయని చెప్పుకొచ్చారు. గోవధతోపాటు చాలా విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని జైపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదు: సచివాలయంలో భవనాలన్ని కొత్తగానే ఉన్నా, వాటిని వదిలేసి కొత్తవి కట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, నిజానికి తెలంగాణ రెవెన్యూ మిగులున్న రాష్ట్రమేకానీ, ధనిక రాష్ట్రం మాత్ర కాదని జైపాల్రెడ్డి అన్నారు. ‘మిగులు విద్యుత్ సాధించామని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్ సొంతగా విద్యుత్ సృష్టించారా? మొత్తం విద్యుత్లో 54 శాతం తెలంగాణకు ఇవ్వాలని నాటి కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లులో పెట్టడం వల్లే ఇవాళ తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారైంది’ అని జైపాల్ వివరించారు. ధర్నాచౌక్ వద్దన్నవాళ్లు ఢిల్లీలో ధర్నా చేస్తారా?: ‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ భూమిని సృష్టిస్తున్నారా? నిజానికి ఆ హామీ సాధ్యంకాదని ఆయనకు కూడా తెలుసు. ఇక హైదరాబాద్లో ధర్నాచౌక్ను ఎత్తేసిన ఆయన.. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తాననడం హాస్యాస్పదం’ అని జైపాల్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్పై ప్రేమకంటే కేసీఆర్పై కోపం ఉండబట్టే మొన్నటి సంగారెడ్డి సభకు ప్రజలు భారీగా తరలివచ్చారని జైపాల్ అన్నారు. -
బీజేపీతో అంటకాగే టీడీపీతో పొత్తా?
జైపాల్రెడ్డిపై మండిపడ్డ పొంగులేటి సాక్షి, హైదరాబాద్: టీటీడీపీతో వ్యతిరేకత ఏమీ లేదన్న కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్రెడ్డి వ్యాఖ్యలపై శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులతో కలసి ఎన్నికల్లో పోటీచేస్తామని జైపాల్రెడ్డి ఎలా అంటారని పొంగులేటి ప్రశ్నించారు. పొత్తులపై మాట్లాడే అధికారం జైపాల్రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఇప్పుడు ఎవరితోనైనా పొత్తులెందుకని, అసలు ఈ చర్చే అసందర్భమన్నారు. కేంద్రంలో బీజేపీతో అంటకాగుతున్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటామని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో పొత్తుల విషయం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. విధానపరమైన నిర్ణయాల గురించి జైపాల్రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. ప్రజల సమస్యలపై పోరాటంలో ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని, ఎన్నికల్లో పొత్తుల విషయంలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో బలహీనపరిచే విధంగా జైపాల్రెడ్డి మాట్లాడటం సరికాదని పొంగులేటి అన్నారు. -
కేసీఆర్ బహురూపి
- కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి - అబద్ధాలు, మోసం కేసీఆర్ అసలు నైజం - కేసీఆర్కు మోదీ అంటే భయం - బీజేపీ, టీఆర్ఎస్ మినహా ఎవరితోనైనా కలుస్తాం.. సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బహురూపి అని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గురువారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ అబద్ధాలు, మోసగించడం, అవకాశవాదం కేసీఆర్ అసలు నైజం అని విమర్శించారు. అవసరాన్ని బట్టి కమ్యూనిస్టుగా, నక్సలైటుగా మాట్లాడుతారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, లక్ష కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధికి ఇచ్చామని అంటే సీఎం కేసీఆర్ ఏదో యుద్ధం చేసినట్టు మాట్లాడారని అన్నారు. ఇదంతా లాలూచీ కుస్తీ అని ఆయన కొట్టి పారేశారు. బీజేపీతో కేసీఆర్కు రహస్యఒప్పందం ఉందని, అది 2009 నుంచే కొనసాగుతోందని పేర్కొన్నారు. బీజేపీతో కేసీఆర్కు వైరముంటే రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే వ్యతిరేకకూటమికి మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. మోదీ,–కేసీఆర్ లాలూచీ.. సీఎం కేసీఆర్ బీజేపీతో పోరాటం చేస్తున్నట్టు ప్రజలకు భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వైరం లేదని, అమిత్ షా తోనే పంచాయతీ వచ్చిందని కేసీఆర్ మాట్లాడటం దీనికి నిదర్శనమన్నారు. మోదీ,–కేసీఆర్ది లాలూచీ కుస్తీ వంటిదన్నారు. బీజేపీ పాము అయితే నరేంద్ర మోదీ పడగ అని, అమిత్ షా తోక అని జైపాల్రెడ్డి విశ్లేషించారు. అమిత్ షా మూడు రోజుల పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని, అమిత్ షా లెక్కలన్నీ కాకిలెక్కలేనని అన్నారు. టీటీడీపీ అంటే వ్యతిరేకత లేదు... రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కలసి పోటీచేసే అవకాశాలున్నాయని జైపాల్రెడ్డి వెల్లడించారు. ఈ రెండు పార్టీలు మినహా ఎవరితోనైనా కలుస్తామన్నారు. కాగా, టీటీడీపీపై తమకు వ్యతిరేకత ఏమీ లేదన్నారు. అప్పటి అవసరాలను, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పొత్తుల గురించి మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటు భ్రాంతి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వస్తే కాంగ్రెస్, లేకుంటే టీఆర్ఎస్ అని అన్నారు. మూడోపార్టీకి, కూటమికి అవకాశమేలేదన్నారు. మోదీ అంటే కేసీఆర్కు భయం ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని జైపాల్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, ఆయన మంత్రుల అవినీతి, వారు కూడబెట్టిన సంపదకు సంబంధించిన లెక్కలన్నీ మోదీ దగ్గర ఉన్నాయన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీల వద్ద ఉన్న లెక్కలకు సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారన్నారు. దానివల్లే మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడలేకపోతున్నారని జైపాల్రెడ్డి ఆరోపించారు. -
మోదీతో స్నేహం..అమిత్షాతో శతృత్వమా?
-
కలకలం సృష్టిస్తున్న జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమన్న ఆయన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలే తీవ్రంగా విభేదిస్తున్నారు. పొత్తులపై మాట్లాడే అధికారం జైపాల్ రెడ్డికి ఎవరిచ్చారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు పొత్తులు ఎందుకని అన్నారు. పొత్తులు అనేవి పార్టీ విధాన నిర్ణయం ప్రకారం ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో బలహీనపరిచే మాటలు చేయడం సరికాదని, జైపాల్ రెడ్డి మాటలు అప్రస్తుతమని పొంగులేటి పేర్కొన్నారు. బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీతో పొత్తు ఎలా సాధ్యమని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాగా టీడీపీ అంటరాని పార్టీ కాదని, ఆ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పొత్తుల విషయంలో టీడీపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుపోతామని అన్నారు. -
'మోదీతో స్నేహం..అమిత్షాతో శతృత్వమా?'
హైదరాబాద్: కాకి లెక్కలు చెప్పడంలో అమిత్షా సిద్ధహస్తుడు. గతంలో చాలా చోట్ల ఇలాంటి కాకిలెక్కలు చెప్పారు. ఆయన మాటల వల్ల రాష్ట్రానికి చేకూరిన లబ్ది శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ద్వంద వైఖరి ఇప్పుడిప్పుడే జనానికి అర్థమవుతోందన్నారు. మోదీతో స్నేహం చేస్తూ.. అమిత్షాతో శతృత్వమా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు చిత్త శుద్ధి ఉంటే విపక్షాలు ఎంచుకున్న రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించాలన్నారు. కేసీఆర్ సిద్ధాంత వాది కాదు. రాద్ధాంత వాదని.. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ అసలు రంగు బయటపడిందని, టీఆర్ఎస్ సర్కార్లో జరుగుతున్నఅవినీతి లెక్కలు మోదీ దగ్గర ఉన్నాయన్నారు. అందుకే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో కలిసిపోయే టీఆర్ఎస్, బీజేపీలను కాంగ్రెస్ ఎందుర్కొంటుందని ఆయన అన్నారు. -
ఓయూ మట్టిలోనే మహత్మ్యం ఉంది
ఎంతోమంది మహానుభావులను కన్నతల్లి - నా జీవితానికి దారి చూపింది ఓయూనే.. - మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు - ఉల్లాసంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: ఎంతో మంది మహానుభా వులను, పోరాటయోధులను, ప్రముఖులను, మేధావులను కన్నతల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయం అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు అన్నారు. ఉస్మానియా మట్టిలోనే ఎంతో మహత్మ్యం ఉందని పేర్కొ న్నారు. జీవితంలో ఎంతో సంఘర్షణకు గురైంది కూడా వర్సిటీలోనే. ఈ సంఘర్షణలో నా జీవితానికి దిశానిర్దేశాన్ని అందజేసిన గొప్ప తల్లి ఉస్మానియానే’ అని చెప్పారు. విభిన్న భావజాలాలు, సిద్ధాంతాల మధ్య ఒక స్పష్ట మైన కార్యాచరణను ఎన్నుకునేందుకు అవ కాశం కలిగించింది ఓయూనే అని పేర్కొ న్నారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది వారోత్స వాల్లో భాగంగా గురువారం ఓయూ అలుమ్ని అసోసియేషన్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యా ర్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్రెడ్డి, తమిళనాడు మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ టి.మీనాకుమారి, ఉస్మానియా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.శ్యామ్మోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాసాగర్రావు మాట్లాడుతూ.. నూరేళ్ల ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎన్నో ఘనకీర్తులను సాధించిం దని అన్నారు. స్వాతంత్య్రోద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉస్మానియా త్యాగాల బాటలో నడిచిందని, ఎన్నో గొప్ప పోరాటాలు చేసిందని గుర్తు చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో చిందిన అమరుల రక్తం సుగంధమై, సువర్ణమై, విజయ బావుటాగా ప్రపంచమంతటా ఎగిసిందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తానూ పోలీసు దెబ్బలు తిన్నానని చెప్పారు. ఓయూ విద్యార్థులకు ప్రపంచ దేశాలు తలుపులు తెరిచి సాదరంగా స్వాగతం పలి కాయని, ఉస్మానియా నుంచి అందుకున్న డిగ్రీ పట్టానే పాస్పోర్టు, వీసాల కన్నా విలువైనదిగా భావించాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఓయూను సమున్నతంగా నిలిపేందుకు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన 200 వర్సిటీల్లో ఓయూ స్థానాన్ని పొందేందుకు పూర్వ విద్యార్థుల సమాఖ్య కృషి చేయాలని, అందుకు తన వంతు సహకారం అందజేస్తానని విద్యాసాగర్రావు ప్రకటించారు. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: జైపాల్రెడ్డి జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సి టీ విద్యార్థిగా, విద్యార్థి సంఘం నాయకుడిగా తన రాజకీయ జీవితానికి ఇక్కడే పునాదులు పడ్డాయని చెప్పారు. విద్యార్థులు సామాజిక స్పృహను, చైతన్యాన్ని కలిగి ఉండాలని, నిరంతరం జ్ఞాన తృష్ణతో ముందుకు సాగాలని సూచించారు. డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలు ఎంత ముఖ్యమో.. తెలుసుకోవాలనే తపన కూడా అంతే ముఖ్యమన్నారు. ఎంతో గొప్పగా జరుగుతున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థుల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉండడం అపశకునంగా కనిపిస్తోందని విచా రం వ్యక్తం చేశారు. జస్టిస్ మీనాకుమారి మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన గొప్ప వ్యక్తులు ఈ వర్సిటీలో చదువుకున్నారని, ఎంతోమంది మహిళలు సైతం ఇక్కడ చదువుకుని ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని చెప్పారు. అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని 100 మారుమూల గ్రామాలను దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి చేయను న్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ తెలిపారు. వర్సిటీ అభివృద్ధికి రూ.200 కోట్లు: దత్తాత్రేయ కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఉస్మానియా అభివృద్ధికి కేంద్రం ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకు అందజేసిందన్నారు. త్వరలోనే వర్సిటీలో ఒక ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్ను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎంపీ నిధుల కింద వర్సిటీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. -
తెలంగాణ నిర్మాణంలో ఓయూ కీలకం
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి హైదరాబాద్: తెలంగాణ నిర్మాణంలో ఉస్మానియా వర్సిటీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మాజీ మంత్రి, ఓయూ పూర్వ విద్యార్థి జైపాల్రెడ్డి అన్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో ‘రోల్ ఆఫ్ ఓయూ ఇన్ తెలంగాణ అండ్ నేషన్ బిల్డింగ్’అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు, ఓయూ పూర్వ విద్యార్థి కె.కేశవరావు అధ్యక్ష త వహించగా, జైపాల్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వందేళ్లుగా ఓయూలో చదివిన లక్షలాది మంది విద్యార్థులు చదువుతో పాటు నాయక త్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారని వివరించారు. ఓయూ దేశానికి ఒక ప్రధానిని, ఏడుగురు ముఖ్యమంత్రులను, అనేక మంది నేతలను అందించిందన్నారు. ఓయూ విద్యార్థులు వందేమాతర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు. తాను 1958లో నిజాం కాలేజీలో, 1962లో ఆర్ట్స్ కళాశాలలో చదివి, 1965 నాటికి చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చినట్లు వివరించారు. భావజాలాలు వేరైనా ఆనాటి విద్యార్థులమంతా కలసిమెల సి ఐక్యంగా ఉండేవారమన్నారు. ఈ సందర్భంగా ఓయూలో తాను చదివిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొ.రాంచంద్రం స్వాగత ఉపన్యాసం చేయ గా మాజీ వీసీలు ప్రొ.సులేమాన్ సిద్దిఖీ, ప్రొ.తిరుపతిరావు, ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, పద్మశ్రీ సయ్యద్ మహ్మద్ ఆరిఫ్, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, హన్స్ ఇండియా సంపాదకులు ప్రొ.నాగేశ్వర్, రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్రెడ్డి, సదస్సు కన్వీనర్ ప్రొ.జీబీ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం: రోశయ్య
► పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ‘మై లైఫ్’ ఆవిష్కరణ ► భావోద్వేగానికి గురైన జైపాల్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో నిజాయితీ, సేవాదృక్పథం, అధ్యయనం, అవగాహన చాలా ముఖ్యమని తమిళనాడు మాజీ గవ ర్నర్ కె.రోశయ్య అన్నారు. పీసీసీ మాజీ అధ్య క్షుడు పి.నర్సారెడ్డి ఆత్మకథ ‘మై లైఫ్’ను శనివారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు. మాజీ గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి. టీపీసీసీ మాజీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్రెడ్డి, మాజీ ఎంపీ పండిట్ నారా యణరెడ్డి, టీపీసీసీ ముఖ్యనేతలు, పలువురు రిటైర్డు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లా డుతూ విషయాన్ని అవగాహన చేసుకుని, రాతపూర్వకంగా కూడా అద్భుతంగా ఆవిష్క రించడంలో నర్సారెడ్డి నిష్ణాతుడని అన్నారు. అధ్యయనం చేయడం, విషయాలపై అవగా హన కలిగి ఉండటంతోపాటు రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న నర్సారెడ్డి అనుభవాలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జైపాల్రెడ్డి మాట్లాడుతూ ఆత్మకథల్లోనూ, కథనంలోనూ నిజాయితీ ఉండాలన్నారు. రాజకీయాల్లో నిజాయితీతోనే ఉన్న నర్సారెడ్డి జీవిత చరిత్ర చదివితే కొత్త అంశాలు తెలుస్తాయన్నారు. నర్సారెడ్డితో అనుబంధా న్ని గుర్తు చేసుకుంటూ జైపాల్రెడ్డి భావో ద్వేగానికి గురి కావడంతో ఆయన కళ్లు చెమ ర్చాయి. నర్సారెడ్డి కూడా నిలబడి ఉద్వేగానికి లోనయ్యారు. నర్సారెడ్డి మాట్లాడుతూ డబ్బు ప్రమేయం రాజకీయాల్లో అపరిమితంగా పెర గడం వల్ల రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చిందన్నారు. ప్రజల సమస్యల పరి ష్కారంపై కాకుండా ఇలాంటి అంశాలు తెర పైకి రావడంతో రాజకీయాల్లో ఇమడలేక పోయానని విచారం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ పార్టీలో అంకిత భావంతో, ఉన్నతస్థాయిలో పనిచేసిన నర్సా రెడ్డి వంటివారి జీవిత చరిత్రలు అందరికీ ఉత్తేజకరంగా ఉంటాయన్నారు. టీపీసీసీ నేత పాల్వాయి స్రవంతి సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆ బిల్లులో అన్నీ చిల్లులే..
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ముస్లిం రిజర్వేషన్ బిల్లులో అన్నీ చిల్లులే ఉన్నాయి. ఇది చిత్ర విచిత్రమైన బిల్లు అని కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు గర్భంలోనే చనిపోయిన శిశువుకు ప్రసవం లాంటిదని వ్యాఖ్యానించారు. లోపభూయిష్టమైన, మోసపూరితమైన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతున్నారని తెలిపారు. రాష్ట్రపతి దీనిని కేంద్రం వద్దకు పంపుతారని చివరికి ప్రదానమంత్రి మోదీ చేతిలో ఈ బిల్లు ఏమవుతుందో అందరికీ తెలుసునని అన్నారు. రాష్ట్రపతికి పంపకుండా ఇక్కడే నోటిఫై చేసే వీలున్నా అది కోర్టులో నిలవదని చెప్పారు. అయితే మోదీ చేతిలో లేదా కోర్టు పరిధిలో బిల్లు సమాధి కావాల్సిందేనని అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిసో్తందని చెప్పారు. రెండు రకాల రిజర్వేషన్లు కలపడం వల్ల దానికి రాజ్యాంగ ఆమోదం లేకుండా చేసే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. దీనికారణంగా హిందు-ముస్లిం ద్వేషభావం కల్పించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ముస్లింలకు ఇప్పటికే ఉన్న నాలుగు శాతం పోయే ప్రమాదం ఉందని చెప్పారు. మోసం చేస్తోన్న టీఆర్ఎస్ విధానాన్ని జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వాల్మీకి, వడ్డెరలను ఎస్టీలలో కలపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ జాతుల్లో ఒక్క కులాన్ని కలపాలన్నా పార్లమెంట్ ఆమోదం కావాలని వివరించారు. తమిళనాడు రిజర్వేషన్లు శాశ్వతం కాదని చెప్పారు. కేసీఆర్ రాజ్యాంగ నిపుణుడు... తాను కాదని విమర్శించారు. రాజ్యాంగం దేశానికి ఉంటుంది కానీ. రాష్ట్రాలకు కాదని అన్నారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లకు తాము సానుకూలమేనంటూ ఆయన.. సర్కారు చేస్తోన్న మోసాన్ని మాత్రమే చెబుతున్నానన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిధి ఉండాలని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. -
ఆ బిల్లులో అన్నీ చిల్లులే..
-
కేసీఆర్ది దొంగ దీక్ష కాదని నిరూపిస్తారా?
హైదరాబాద్: ‘కేసీఆర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాలేదు. ఆయన ఎలా దీక్ష చేశారో .. ఎలా విరమించారో .. ఉస్మానియా విద్యార్థుల నుంచి ఎలా నిరసన ఎదుర్కొన్నారో జనానికి తెలుసని’ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష కాదని తెరాస నేతలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర లేదని తెరాస నేతలు మాట్లాడటం, ఆయన పై విమర్శలు చేయడం రాజకీయ అజ్ఞానమేనన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక కేసీఆర్ మొదట జైపాల్ రెడ్డిని కలిసిన విషయం తెరాస నేతలు మర్చిపోయారా అని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ నేతలు చేసిన కృషి ప్రజలకు తెలుసు, తెరాస మాటలను జనం నమ్మరని తెలిపారు. కేసీఆర్ వేయి రోజుల పాలనలో వేయి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రుణమాఫీ పథకాన్ని వడ్డీ మాఫీ పథకంగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పాటలు పాడిన ధూంధాం కళాకారులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచితహామీని అటకెక్కించారని అన్నారు. 2013 చట్టం ప్రకారమే ప్రాజెక్టుల భూసేకరణ జరగాలని డిమాండ్ చేశారు. -
మోదీ.. నల్లధనం ఏదీ?
► కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ధ్వజం నారాయణపేట : బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న రూ.80 లక్షల కోట్ల నల్లధానాన్ని భారతదేశానికి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ హామీ ఏమైందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ప్రశ్నించారు. డీసీసీ ఆధ్వర్యంలో నారాయణపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సరాఫ్కృష్ణ అధ్యక్షతన మంగళవారం స్థానిక మెట్రో ఫంక్షన్హాలులో జన ఆవేదన సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నల్లధనం బయటికి తీసేందుకు ద మ్ములేక నోట్ల రద్దు నాటకంతో కేంద్రసర్కార్ ప్ర జలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. సీఏం కేసీఆర్ అబద్దాల కోరు అని ఎద్దేవాచేశారు. పూటకోమాటతో ప్రజల ను తప్పుదోవపట్టిస్తున్నరన్నారు. సోనియా ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ తెచ్చానంటున్నారని దు య్యబట్టారు. అధికారంలోకి వ చ్చాక నారాయణపేటను జిల్లా చేస్తామన్నారు. ప్ర జాసంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు, గద్వాల ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆరోపించారు. హామీ ల ఊసేలేదన్నారు. నారాయణపేట డివిజ న్కు సా గునీరు అందించేందుకు జీఓ 69ను ఉమ్మడి ప్రభుత్వంలో జారీ చేస్తే దాన్ని పక్కన బెట్టి పాలమూరు–రంగారెడ్డి పథకం ద్వారా నీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనంతరం పార్టీ నేతలను ఇన్చార్జి సరాఫ్ కృష్ణ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మె ల్యే సంపత్కుమార్, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాషా, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, శశికళ, రాంచందర్రావు, శ్రీనివాస్గుప్తా, అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, రెడ్డి గారి రవీందర్రెడ్డి, రాజేందర్గౌడ్, బసిరెడ్డి పాల్గొన్నారు. -
ఉత్తమ్ సారథ్యంలోనే ఎన్నికలకు..
⇒ కేసీఆర్ ఉపవాస దీక్ష ఒట్టి బూటకం: జైపాల్రెడ్డి ⇒ రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోంది: ఉత్తమ్ ⇒ ముస్లింలకు వెంటనే రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ షాద్నగర్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలోనే కాంగ్రెస్ ముందుకు వెళ్తుం దని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి పేర్కొన్నారు. ఆయన సమర్థ నాయకుడని కితాబిచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ఆయన నాయకత్వంలోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఆదివారం జరిగిన జన ఆవేదన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. బా«ధ్యతారహితంగా ఉన్నవారే ప్రగల్భాలు పలుకుతారని, ఇది ప్రధాని మోదీకి సరిగా సరిపోలుతుందని ఎద్దేవా చేశారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న రూ. 80 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. మోదీ పాలనలో పండిం చిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన ఉపవాస దీక్ష ఒట్టి బూటకం అని ఆరోపించారు. ఎన్నికల వాగ్దానాల సంగతేంటి? రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని ఉత్తమ్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల్లో కేసీఆర్ వాగ్దానం చేసారని, నేటి వరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు. ఆయన కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానన్న కేసీఆర్ ఇప్పటివరకూ ఆ మాట నిలుపుకోలేదన్నారు. రాష్ట్ర కేబినెట్లో కుక్కలు: డీకే అరుణ కేసీఆర్ అభివృద్ధి ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తుందని, చేతల్లో లేదని డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘రాష్ట్ర కేబినెట్లో కొన్ని కుక్కలున్నాయి.. అవి ఇష్టానుసారంగా మొరుగుతున్నాయి’అని ఆమె మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దామోదరరెడ్డి, కార్తీక్రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, క్యామ మల్లేశ్, పవన్కుమార్రెడ్డి, అనిల్కుమార్యాదవ్ పాల్గొన్నారు. -
జైపాల్ రెడ్డితో మనసులో మాట
-
యాంటీ క్లైమాక్స్.. విలోమ పరాకాష్ట
బడ్జెట్పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా, నిస్పృహ పెంచేలా ఉందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి విమర్శించారు. బడ్జెట్లో రైతులను ఎలాంటి ఊరట, దన్ను లేదని, కొత్త రైలు మార్గాలు లేవని, అసలు బడ్జెట్కు దశదిశ లేకుండాపోయిందని దుయ్యబట్టారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ యాంటీ క్లైమాక్స్లా, విలోమ పరాకాష్టలా ఉందని విమర్శించారు. నోట్ల రద్దుతో 50 రోజులు తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు తాజా బడ్జెట్తో తీవ్రంగా నిరాశ చెందారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గడంతో రూ. లక్ష కోట్ల సబ్సిడీ భారం ప్రభుత్వానికి తగ్గిందని.. అయినా ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. పార్టీల విరాళాల సంస్కరణ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. -
'ఆయన ఇప్పుడు పంక్చరైన టైరు'
హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు గాలితో నిండిన టైర్లా ఉన్న ప్రధాన మంత్రి మోదీ, బడ్జెట్ తర్వాత పంక్చర్ అయిన టైర్ మాదిరిగా ఉన్నారని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ నిరర్ధకమైనది , ఏ దిశా లేనటువంటిదిగా ఉందన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో బడ్జెట్ పై ఉన్న ఆశలను కేంద్రం నీరు గార్చిందని, ప్రజలకు నిరాశ, నిస్పృహలనే మిగిల్చిందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల వల్ల కేంద్రానికి ఏటా రూ. లక్షకోట్లు ఆదా అయ్యాయి, అయినప్పటికీ బడ్జెట్ లో సామాన్యులకు ఊరట లభించలేదన్నారు. ఆర్ధిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉందన్నారు. 70 సంవత్సరాలలో ఏనాడు ఇలాంటి నిరాశాపూరిత బడ్జెట్ చూడలేదన్నారు. కొత్త రైల్వే లైన్ లు లేవు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలే వాటి సామర్ధ్యం మేరకు పనిచేయడం లేదన్నారు. నోట్లరద్దు వల్ల 6 నెలలు కష్టాలు, 3 నెలలు నష్టాలు వచ్చాయన్నారు. ఆలోచన లేని తొందరపాటుతో అహంభావి అయిన ప్రధాని తీసుకున్న వినాశక చర్యే నోట్లరద్దు అని అన్నారు. దానికి మద్దతిచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఎం లాభం జరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలిటికల్ ఫండింగ్లో సంస్కరణలు నామమాత్రమేనని, నల్లధనం పార్టీల ద్వారా ప్రవహించడం లేదని, రూ. 20 వేలకు బినామీలను వెతుక్కున్న పార్టీలు ఇప్పుడు రూ. 2 వేలకి కూడా వెతుక్కుంటాయని జోస్యం చెప్పారు. -
ఆర్బీఐ హక్కులు హరిస్తే సంక్షోభం
వైవీ రెడ్డి ‘నా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణలో జైపాల్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యమంటే అర్థం.. స్వతంత్ర సంస్థల హక్కులను హరించడం కాదని, వాటిని కాపాడటమేనని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. ఆర్బీఐ స్వేచ్ఛని రాజకీయ నాయకులు హరిస్తే సంక్షోభం సంభవిస్తుందన్నారు. శుక్రవారం విద్యారణ్య పాఠశాలలో ఆర్బీఐ మాజీ గవర్నర్ యాగా వేణుగోపాల్రెడ్డి ఆత్మకథ ‘నా జ్ఞాపకాలు’ పుస్తకాన్ని జైపాల్ ఆవిష్కరించారు. ఆర్థిక సంస్కరణ లెప్పుడూ పేదవాడి పక్షమే వహించాలని భావించి, ఆచరించిన ఆర్థికరంగ నిపుణుడు వైవీ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఆర్బీఐలో కొత్త ఒరవడి, నూతన ప్రమాణాలకు అంకురార్పణ చేసిన వైవీ రెడ్డి కృషిని దేశం యావత్తు కొనియాడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని సాధించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం రెండు భిన్నమైన విషయాలను ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహించిన ఘనుడన్నారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కీలకమైన నిర్ణయాలు చేసి, వాటిని అమలు చేశారన్నారు. ఈ పుస్తకం భవిష్యత్ ఆర్థిక రంగ నిపుణులకు ఉపకరిస్తుందన్నారు. వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ... ఈ పుస్తకాన్ని కళ్లతో చదువుతూ, హృదయంతో అనుభవించాలన్నారు. చట్టబద్ధంగా ప్రజలకు మంచి చేసే ఏ పనైనా ఆలస్యం చేయకూడదన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, శాస్త్రవేత్త రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మోదీ.. సాగిలపడి క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి డిమాండ్ సాక్షి, మహబూబ్నగర్ : నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా.. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డి అన్నారు. నోట్ల రద్దు వల్ల 50 రోజుల తర్వాత స్వర్గతుల్యంగా ఉంటుందని యావత్ దేశాన్ని మోసగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సాగిలపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి.చిన్నారెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని కనీస ఆర్థిక పరిజ్ఞానం లేకుండా 125 కోట్ల మంది ప్రజానీకాన్ని కష్టాల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. నల్లధనం క్యాష్రూపంలో కేవలం 6 శాతం మాత్రమే ఉం దని.. మిగతా 94 శాతం భూలావా దేవీలు, బంగారం రూపంలో ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కేవలం 6 శాతం కోసం కోట్లాది మందిని రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిప్పారన్నారు. నోట్లరద్దును వ్యతిరేకిస్తున్నట్లు పత్రికలకు లీకులిచ్చి కథనాలు రాయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలసి వచ్చిన తర్వాత భజన చేయడం ప్రారంభిం చారని జైపాల్రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఇద్దరి మధ్య జరిగిన రహస్య మంతనాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
మనసు మార్చుకోవడం వెనుక ఆంతర్యమేమిటీ
-
మాటల్లో మావో.. చేతల్లో నియంత
-
మాటల్లో మావో.. చేతల్లో నియంత
ప్రధాని మోదీపై జైపాల్రెడ్డి ఫైర్ ► ‘నోట్ల రద్దు’ పెద్ద తప్పుడు నిర్ణయం ► దేశ ప్రజలకు కొత్త కష్టాలు తీసుకువచ్చారు ► కొందరికి వందల కోట్ల కొత్త కరెన్సీ ఎలా అందుతోంది? ► బ్యాంకులనే నియంత్రించలేని మోదీ నల్లధనాన్ని ఆపుతారా? ► మోదీకి కేసీఆర్ మద్దతుపై అనుమానాలున్నాయి ► కేసీఆర్లా దిగజారి ఆరోపణలు చేయలేనని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మావోయిస్టులా ధర్మాలు మాట్లా డుతూ.. పచ్చి నిరంకుశవాదిగా ప్రజలను కష్టపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త కష్టాలు తెచ్చిపెట్టారని విమర్శించారు. కొత్త నోట్లు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లనే నియం త్రించలేని మోదీ.. నల్లధనాన్ని ఎలా నియం త్రిస్తారని నిలదీశారు. మంగళవారం గాంధీ భవన్ లో పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డిలతో కలసి జైపాల్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిన ప్రధాన మంత్రి మోదీ తప్ప మరెవరూ లేరని పేర్కొన్నారు. పేదలు, రైతులు, సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతుంటే... కొంత మందికి వందల కోట్లలో కొత్త కరెన్సీ ఎలా వస్తోందని ప్రశ్నించారు. కరెన్సీని పంపిణీ చేయడంలో బ్యాంకులను నియంత్రించలేని మోదీ... నల్లధనాన్ని, 125 కోట్ల మంది దేశ ప్రజలను ఎలా నియంత్రిస్తారని నిలదీశారు. మొత్తంగా రూ.14 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణీలో ఉండగా.. రద్దు తర్వాత ఇప్పటికే రూ.13 లక్షల కోట్లు బ్యాంకులకు చేరిపోయాయని... అంటే దేశంలో నల్లధనమే లేదని ప్రధాని మోదీ తేల్చడానికి రంగం సిద్ధమైందని విమర్శించారు. పూటకో మాట.. మోదీ పూటకో మాటతో సంపన్నులను కాపాడుకుంటూ, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని జైపాల్రెడ్డి మండిపడ్డారు. సామాన్యులు ఒక్క నోటు కోసమే తిప్పలు పడుతుంటే.. ధనవంతుల దగ్గరకు వందల కోట్ల కొత్త కరెన్సీ ఎలా చేరిందన్నారు. మోదీ మావోయిస్టులాగా ధర్మాలు మాట్లాడుతూ.. చేతల్లో ఆర్థిక నిరంకు శత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శిం చారు. నోట్ల రద్దుతో సామాన్యులు నిత్యావసరాల కోసమే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. మరి ఈ ఇబ్బందులు మోదీ కేబినెట్లో ఉన్న నితిన్ గడ్కరీకి లేవేమిటని ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత నితిన్ గడ్కరీ, గాలి జనార్దనరెడ్డి వంటి వారు ఆడంబరంగా వివాహాలు జరిపించారని గుర్తుచేశారు. ఇది పెద్ద తప్పుడు నిర్ణయం నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు రిజర్వుబ్యాంకుతో ప్రధాని మోదీ చర్చిం చారా..? మాట్లాడితే వారు ఏం చెప్పారనే విషయాలను వెల్లడించాలని జైపాల్రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘వ్యవసాయ పనుల కాలం తర్వాత నిర్ణయం తీసుకుందామని, అప్పటిలోగా కరెన్సీని అందుబాటులోకి తేవడానికి వీలుంటుం దని ఆర్బీఐ అధికారులు సూచనలు చేశారని తెలిసింది. అయినా మోదీ పట్టించుకోలేదు. విదేశాల్లో 80 లక్షల కోట్ల నల్లధనం ఉందని, అదంతా తెప్పించి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తప్పు, సందర్భం తప్పు, ఏర్పాట్లు చేయకపోవం తప్పు. ఇంత పెద్ద నిర్ణయాన్ని అవగాహన, అనుభవం లేకుండా తీసుకున్నారు. అందుకే మొత్తం ఫలితాలే చాలా ప్రమాదకరంగా ఉండబోతున్నాయి..’’ అని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ప్రసన్నుడెలా అయ్యాడో? తొలుత నోట్ల రద్దును వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ తర్వాత ఎందుకు మద్దతిచ్చారని.. దీనిపై అనుమానాలు ఉన్నాయని జైపాల్రెడ్డి పేర్కొన్నారు. ఖిన్నుడిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రసన్నుడిగా తిరిగి వచ్చారని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలో, వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసమో మద్దతిచ్చి ఉండవచ్చన్నారు. అయితే అనుమానాల గురించి ఆరోపణలు చేయలేనని, నిర్దిష్టమైన సమాచారం వస్తే మాట్లాడుతానని చెప్పారు. కాంగ్రెస్ నేతల దగ్గర నల్లధనం ఉందంటూ మాట్లాడిన కేసీఆర్ స్థాయికి తాను దిగజారి మాట్లాడలేనని జైపాల్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయంగా ఎప్పుడు, ఎవరితో దోస్తీ చేస్తారో, ఎవరితో వైరం పెంచుకుంటారో దేవుడికి కూడా తెలియదని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ ఎటు తిరిగినా, ఎవరితో ఉన్నా అంతిమంగా బీజేపీ గూటికే చేరుతాడన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
యువమోర్చాకు లక్ష్మణ్ పిలుపు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని బీజేవైఎం కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాల ఆశచూపి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, వారికి మొండిచేరుు చూపిందని మండిపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బీజేవైఎం అధ్యక్షుడిగా గుండగోని భరత్గౌడ్ బాధ్యతల స్వీకార కార్యక్రమం లో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్ శక్తుల బకాయిలను రాబట్టేందుకు నాటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్రెడ్డి ప్రయత్నించగా కార్పొరేట్ శక్తులు ఆయన శాఖనే మార్పించాయని, బకాయిలు మాత్రం కట్టలేదని ఆరోపించారు. -
జైపాల్రెడ్డే గల్లీ లీడర్..
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బీజేపీని ప్రపంచంలోనే నంబర్ వన్ రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కృషి చేస్తున్నారని, ఆయనను గల్లీ లీడర్ అంటూ కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి వ్యాఖ్యానించడం అర్థరహితమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అమిత్షాను గల్లీ లీడర్ అంటూ జైపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. వాస్తవానికి జైపాల్ ఢిల్లీ నుంచి గల్లీకి చేరితే.. అమిత్షా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ తమ పార్టీకి రెండు కళ్లుగా చెప్పుకునే కాంగ్రెస్ పెద్దలు సర్దార్కు ఏనాడూ తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడంలో పటేల్ పాత్ర ఎంతో గొప్పదని, తెలంగాణ విమోచన కోసం సర్దార్ చేపట్టిన పోలీసుచర్యను నెహ్రూనే పలుమార్లు అడ్డుకున్నారన్న చరిత్రను జైపాల్రెడ్డి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఏనాడైనా తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. కనీసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవితమంతా వ్యక్తులతోనే ముడిపడి ఉందని, సత్యాగ్రహం నాటి కాంగ్రెస్ ఇప్పుడు లేదని, సోనియా, రాహుల్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారబోతోందని అన్నారు. నేడు కశ్మీర్లో అశాంతికి నాడు కాంగ్రెస్ అనుసరించిన విధానమే మూలకారణమని, కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ ముందుకెళుతున్నా కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షాపై జైపాల్ వ్యాఖ్యలు అనుచితం
సాక్షి,హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. అమిత్షా గురించి కానీ, బీజేపీ గురించి కానీ మాట్లాడే అర్హత జైపాల్రెడ్డికి లేదని పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. గల్లీ నాయకులెవరో ప్రజలకు తెలుసు కాబట్టే కాంగ్రెస్ నేతలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారని ఎద్దేవా చేశారు. గల్లీకి ఢిల్లీకి తేడా తెలియని జైపాల్ రెడ్డి అమిత్షాపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. నెహ్రూ కుటుంబ చరిత్రను మినహా.. ఏనాడైన జాతీయ నాయకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, బీఆర్ అంబేద్కర్, పీవీ నరసింహారావు వంటి మాహానుభావుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారా.. అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. -
'జైపాల్ కు అవగాహన లేదు'
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గల్లీ నుంచి ఢిల్లీకి వస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చాడని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విమర్శించారు. జైపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండి కూడా.. హైదరాబాద్ లిబరేషన్ గురించి అవగాహన లేకుండా మాట్లాడారని తప్పుబట్టారు. వల్లభాయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే హైదరాబాద్కు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లు తీసుకున్న నిర్ణయం వల్లే హైదరాబాద్ పై పోలీసు చర్య తీసుకున్నారని చెప్పడం తప్పని అన్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఎన్ కేకే నాయర్ రాసిన పుస్తకం చదివితే ఆ విషయం జైపాల్ కు అర్ధమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. -
ఆరెస్సెస్.. బ్రిటిషోళ్ల ఏజెంట్
-
ఆరెస్సెస్.. బ్రిటిషోళ్ల ఏజెంట్
అది దేశం కోసం ఏనాడూ పోరాడలేదు: జైపాల్రెడ్డి సాక్షి, హైదరాబాద్: బ్రిటిషోళ్లకు ఏజెంట్ గా పనిచేసిన ఆరెస్సెస్ దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూపై విమర్శలు చేస్తూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ను పొగుడుతున్నారని, ఇది కుత్సిత రాజకీయ బుద్ధికి నిదర్శనమన్నారు. ఆరెస్సెస్, బీజేపీకి పటేల్పై ప్రేమాభిమానాలేమీ లేవన్నారు. నెహ్రూను నిందించడానికే పటేల్ను వాడుకుంటున్నారన్నారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గాంధీభవన్లో జైపాల్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నగరంలో నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని, చరిత్ర తెలియకుండా మా ట్లాడారని అన్నారు. స్వాతంత్య్ర సమరంలోనూ, దేశాన్ని నడపడంలోనూ నెహ్రూ, పటేల్ ఇద్దరూ సమ ఉజ్జీలుగా పనిచేశారన్నారు. ఏ నిర్ణయమైనా కేబినెట్లో చర్చించి తీసుకున్నారని, అప్పటి కేంద్ర కేబినెట్లో డాక్టర్ రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, జయప్రకాశ్ నారాయణ, శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని గుర్తు చేశారు. ‘‘నెహ్రూ, పటేల్ ఇద్దరూ మహాత్మాగాంధీకి ప్రియ శిష్యులు. క్విట్ ఇండియా సమయంలో ‘డూ ఆర్ డై’ పేరుతో ఉద్యమం చేపడితే కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఉద్యమించాయి. ఆరెస్సెస్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించింది’’ అని అన్నారు. నెహ్రూను విమర్శించే అర్హత లేదు... హైదరాబాద్లో పటేల్ పోలీసు యాక్షన్ చేపట్టారని, ఆయన ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య కూడా ఉండేది కాదంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడం చరిత్ర తెలియకపోవడమేనని జైపాల్ అన్నారు. అప్పట్లో వీటో అధికారం ఉన్న దేశాలేవీ కశ్మీర్ విషయంలో భారత్కు మద్దతివ్వలేదని, అందుకే అక్కడ సైనిక చర్యకు దిగలేదని వివరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గుజరాత్లో గల్లీ లీడర్ అని, అలాంటి వ్యక్తికి దేశ చరిత్ర ఏంతెలుస్తుందని ప్రశ్నించారు. ‘‘ఆరెస్సెస్ ఎన్నడూ దేశం కోసం పోరాడలేదు. ఆ సంస్థ నాయకులు సావర్కర్, దేవరస్లాంటివారు స్వాతంత్య్రం కోసం జైలుకు పోలేదు. కాంగ్రెస్ నాయకులు దేశం కోసం పోరాడి, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గారు. నెహ్రూను విమర్శించే నైతిక అర్హత ఆరెస్సెస్కు, బీజేపీ నేతలకు లేదు. ఆర్ఎస్ఎస్ అంటేనే అబద్ధాలను ప్రచారం చేసే సంస్థ’’ అని విమర్శించారు. -
ఆ వ్యాఖ్యలు కుట్రపూరితం: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితమైనవని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. జాతి గర్వించదగ్గ దిగ్గజం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని, ఆయన్ను పొగుడుతూ నెహ్రూను నిందించటం అన్యాయమని తెలిపారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రేనని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే రూమర్స్ప్రెడింగ్ సొసైటీ అని ఎద్దేవా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కలసి దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా ఇద్దరి మధ్యా ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదని తెలిపారు. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు. కాశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని జైపాల్రెడ్డి వివరించారు. -
రాజ్యాంగ సవరణ అక్కర్లేదు
♦ నియోజకవర్గాల పునర్విభజనపై మంత్రి కేటీఆర్ ♦ పాలనా వ్యవస్థలు సక్రమంగా పని చేసేందుకే జిల్లాల విభజన ♦ తెలంగాణ తెచ్చానంటున్న జైపాల్రెడ్డి.. ♦ కల్వకుర్తిని డివిజన్ చేయలేదెందుకో? ♦ త్వరలో జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటులో సాధారణ మెజారిటీతో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సాధ్యమేనని తెలిపారు. కేటీఆర్ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అన్ని పాలనావ్యవస్థలు సమర్థంగా పని చేసేందుకే చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ జరుగుతుందని, పెత్తందారీ వ్యవస్థ పోతుందన్నారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యంతోపాటు రెండో స్థాయి నాయకత్వ ఎదుగుదల జరుగుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. తెలంగాణ తెచ్చానంటున్న కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి ఇన్నాళ్లు మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘సిరిసిల్లను జిల్లా చేస్తామంటే కొడుకుకు ఓ జిల్లా, బిడ్డకో జిల్లా అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. అధికారంలోకి వస్తే సిరిసిల్లను జిల్లా చేస్తామని మళ్లీ అదే ప్రతి పక్ష నేతలు హామీలిస్తారు’ అని అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి జిల్లాలను ప్రకటించామని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రక్షాళన త్వరలో జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో వైట్ టాప్ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.25 వేల కోట్ల ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు. అన్ని మున్సిపాలిటీలను ఒకే చట్టం కిందకు తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో మేజర్ రోడ్స డివిజన్ వ్యవస్థను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక సర్కిళ్ల వారీగా అధికార వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. జీహెచ్ఎంసీలో సర్కిళ్లను 24 నుంచి 30కి పెంచుతామన్నారు. రోడ్ల పునర్వ్యవస్థీకరణకు జేపీ గ్రూప్ సంస్థ ముం దుకొచ్చిందని, కేసీపీ జంక్షన్, నాగార్జున సర్కిల్ వద్ద ఆ సంస్థ పనులు మొదలు పెట్టబోతోందన్నారు. ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’కు కేటీఆర్ కేటీఆర్ బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గురు, శుక్ర వారాల్లో ఢిల్లీలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. 8న వడోదరలో కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో జరిగే అన్ని రాష్ట్రాల గనుల మంత్రుల సదస్సులో పాల్గొంటారు. జిల్లాల విభజన తర్వాత ‘డబుల్’ జిల్లాల విభజన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై దృష్టి పెట్టనున్నట్లు కేటీఆర్ చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యయాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. టీఏఎస్ ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోందని వెల్లడించారు. నయీమ్ వ్యవహారంలో ఎవరికి హెచ్చరికలు వెళ్లాలో వారికి వెళ్లాయని తెలిపారు. ఈ వ్యవహారాన్ని చట్టం చూసుకుంటుందని, అక్రమాలకు పాల్పడిన వారెవరినీ ఉపేక్షించేది లేదన్నారు. లక్ష అనుమానాల మధ్య పుట్టిన తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఎంఐఎం పార్టీ మత ప్రాతిపదికనే గెలుస్తుందనుకోవడం తప్పని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నిత్యం దారుస్సలాంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఎంఐఎంను బూచిగా చూపి బీజేపీ గెలుస్తోందన్నారు. -
30 జిల్లాలు అనవసరం: జైపాల్రెడ్డి
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి హైదరాబాద్: కొత్త జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని... అరుుతే ప్రస్తుతం 30 జిల్లాలు అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే వంశీచంద్రెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు సోమవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేశారు. దీక్షలకు మద్దతు ప్రకటించిన జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జిల్లాలను చేయాల్సి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని, టీఆర్ఎస్కు జిల్లాల ఏర్పాటు అంటే విలువ లేకుండా పోరుుందని విమర్శించారు. కల్వకుర్తి నిజాం హయాంలోనే తాలూకాగా ఉందని, అది తెలియని కేసీఆర్కు తెలంగాణ గురించి ఏం తెలుసని అన్నారు. కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్విభజన చేయాల్సి ఉండగా కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు 40 రోజులుగా పార్టీలకతీతంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని వైఎస్సార్సీపీ నాయకులు శివకుమార్ పేర్కొన్నారు. కల్వకుర్తి డివిజన్ చేయాలనే డిమాండ్కు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయని, ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు నిత్యకృత్యంలా మారాయని టీటీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయడం లేదన్నారు. నియోజకవర్గాల విభజన తర్వాతే జిల్లాల విభజన చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. ఇప్పుడు హడావిడిగా జిల్లాల విభజన ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి పశ్నించారు. మాట తప్పినందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం ఇక నుంచి జరిగేది ఉద్యమం కాదని.. ప్రజా యుద్ధమేనని అన్నారు. ఎంపీ నంది ఎల్లయ్య, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాస్తవాలను బయట పెట్టాలి:ఊండవల్లి
-
అవన్నీ కట్టుకథలు: జైపాల్ రెడ్డి
హైదరాబాద్ : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో ఊహా జనితాలు రాశారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్ చాంబర్లో జరిగిన చర్చపై ఉండవల్లి కట్టుకథ రాశారని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని సుష్మాస్వరాజ్ చెప్పారని, నిబంధనల ప్రకారమే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్నారు. సభలో ప్రత్యక్ష ప్రసారాలు ఆపాలని తాను సలహా ఇవ్వలేదని, పెప్పర్ స్ర్పే కొట్టినందునే ప్రసారాలు నిలిపివేసి ఉంటారన్నారు. ‘తెలంగాణా కాంగ్రెస్ ఎంపిలుగా .. ఉండవల్లి అరుణ్ కుమార్ తన విభజన కథనంలో.. చెప్పిన అంశాలపై క్లారిటీ ఇవ్వదలిచాం. ఉండవల్లి తన పుస్తకంలో నా గురించి గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు. అయితే స్పీకర్ ఛాంబర్ లో జరిగిన చర్చపై ఉండవల్లి ఉహాజనిత కట్టుకథ రాశారు. అర్ధం,ఆధారం లేకుండా ఊహించి ఎలా రాస్తారు?. తెలంగాణా వచ్చిందనే నైరాశ్యం,నిస్పృహలో ఇలా కొంత కట్టుకథ రాసారు. రాష్ట్ర విభజనలో తెలంగాణా ఎంపీలు, జైపాల్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందని ఉండవల్లి రాశారు. అవును అప్పుడు మేము నిర్ణయాత్మక పాత్ర పోషించాం. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్లో పొన్నం ప్రభాకర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సుస్మా స్వరాజ్ ను ప్రాధేయ పడ్డారు. దాంతో ఆమె స్పీకర్ ఛాంబర్ కు వచ్చి నాతో చర్చించారు. స్పీకర్ ఛాంబర్ లో ఆనాడు ఏం జరిగిందో మాకు తెలుసు. సాక్షులము మేమే. బిల్లు పెడితే ఫ్లోర్ లీడర్గా తాను మద్దతు ఇస్తా అని సుష్మ చెప్పారు. స్పీకర్ ఛాంబర్ లో సుష్మా స్వరాజ్కు, మాకు ఒక ఒప్పందం జరిగింది. హౌస్ ఆర్డర్ లో లేనందున బిల్లు ఎలా పెట్టాలని స్పీకర్ అడిగితే.. స్పీకర్ కు నచ్చజెప్పింది నేనే. హౌస్లో సభ్యుల మెజారిటీ ఉన్నందున బిల్లు పెట్టమని స్పీకర్ ను కోరాం. ఓటింగ్ జరిపే పరిస్థితి లేనప్పుడు.. సభ్యులు కూర్చున్న చోటు నుంచే నిలబడి అభిప్రాయాలు చెప్పే రూల్ ఉంది. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు సుష్మా ఇతర బీజేపీ సభ్యులు, ఎల్కే అద్వానీ కూడా స్వయంగా లేచారు. బిల్లు ప్రవేశపెట్టిన రోజున స్పీకర్ ఛాంబర్ లో ఏం జరిగిందో ఉండవల్లి కి తెలియవు. ఉహించి రాయటానికి ఆయనకేమన్నా దివ్యదృష్టి ఉందా. కథలు చెప్తే సుష్మ ఎందుకు వింటారు. కథ సాక్షిగా ఉండాలి తప్ప ఊహకు అందకుండా కట్టు కథ రాస్తే ఎలా. బిల్లు రాజ్యాంగ సమ్మతంగా లోకసభ లో ఆమోదం పొందింది, నిబంధనల మేరకే బిల్లు ఆమోదం పొందింది. దీనిపై సుప్రీంకోర్టు లో ఉన్న కేసును గెలుస్తాం. బిల్లు సంబంధించి సుప్రీంకోర్టు లో కేసు ఇంకా పెండింగ్ ఉంది. కేసీఆర్ కు కూడా స్పీకర్ చాంబర్ లో ఏం జరిగిందో తెలియదు. హౌస్ లో స్పీకర్ ప్రకటన చేసే వరకు అందరిలో బిల్లు పై ప్రతిష్టంభన ఉంది. కుట్ర, కుతంత్రం అని రాశారు. తెలంగాణాకు సీఎం ఎవరు అవుతారనేది ప్రధానం కాదు. తెలంగాణా రావటం ముఖ్యం అని భావించాం. పొన్నం ప్రభాకర్.. సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్నారు. దీన్ని కూడా ఉండవల్లి వ్యంగ్యగా రాసారు. హౌస్ ప్రసారాల్ని ఆపమని నేను సలహా చెప్పలేదు. స్పీకర్ వివేచన పై ఆధారపడి ఉంది. ప్రసారాలు నిలిపి వేయటానికి బిల్లు ఆమోదింపజేయటానికి ఎలాంటి సంబంధం లేదు. పెప్పర్ స్ప్రే కొట్టినందున.. ప్రసారాలు నిలిపివేసి ఉంటారని భావిస్తున్నాను.’ అని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ 'విభజన కథ నా డైరీలో కొన్ని పేజీలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులు
విపక్ష నేతలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నేతలే ప్రజా కంటకులని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. అధికారమే పరమావధిగా భావించి ఢిల్లీకే పరిమితమైన జైపాల్రెడ్డికి, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి జైపాల్రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఎలా ప్రజా కంటకుడు అవుతారో జైపాల్రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన వందిమాగధులు సాగిస్తున్న కుట్రల్లో భాగంగానే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సాధన పేరుతో పాదయాత్రలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ నేతలు తమ సిద్ధాంతాలను గాలికొదిలి దుష్టచతుష్టయంలా మారారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టులపై త్వరలోనే ప్రతిపక్ష పార్టీలకు బహిరంగ లేఖ రాస్తానని, వారికి దమ్ముంటే తాను అడిగే ప్రశ్నలకు సమధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్, బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య పాల్గొన్నారు. -
'వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారని తెలంగాణ గ్రామాణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో జూపల్లి విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని నేతలందరూ ఇప్పుడు పనిగట్టుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలపై తాను బహిరంగ లేఖ రాస్తామన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని జూపల్లి తెలిపారు. -
స్పీకర్లు పావులుగా మారుతున్నారు
హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. స్పీకర్లు అధికార పార్టీ చేతిలో పావులుగా మారుతున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయాలపై కోర్టులు పరిశీలించే అవకాశం ఇవ్వాలని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అనే అంశంపై బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో జైపాల్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి, జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పీ లక్ష్మణరెడ్డి, జస్టిస్ బి, శేషశయనారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి, లోక్సత్తా జేపీ, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో నిబంధనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్పీకర్ నిర్ణయమే అంతిమం కాకుండా, దానిపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్కు ఉండాలని జస్టిస్ జీవన్ రెడ్డి అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా గెలిచినవారే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఫిరాయింపుదారులపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. షెడ్యూల్ 10లో సవరణలు తేవాలని సూచించారు. స్పీకర్ వ్యవస్థపై కూడా చర్చ జరగాలని అన్నారు. -
ప్రభుత్వం పట్టింపులకు పోతోంది: జైపాల్
-
ప్రభుత్వం పట్టింపులకు పోతోంది: జైపాల్
హైదరాబాద్ : ఛలో మల్లన్నసాగర్ వెళుతున్న కాంగ్రెస్ నేతల అరెస్ట్ను ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం... కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్ మల్లన్నసాగర్కు అవసరమా అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని జైపాల్ రెడ్డి హితవు పలికారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకుని, గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
రుణ భారంతో రైతు బలవన్మరణం
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట మండలం చెన్నారంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఈ గ్రామానికి చెందిన పూరుమాల జైపాల్రెడ్డి (28) ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఏడెకరాల్లో మొక్కజొన్న వేశాడు. మరో రెండెకరాల్లో వరిసాగు చేసేందుకు నారు పోశాడు. ఉన్న ఒక్క బోరులో నీళ్లు తగ్గిపోవడంతో అప్పు చేసి ఇటీవల మరో మూడు బోర్లు వేయించినా ప్రయోజనం దక్కకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. -
అనుమానంతో భార్య హత్య
భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు యాకుత్పురా: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తను మొఘల్పురా పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డబీర్పురాలోని మీర్చౌక్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో శనివారం ఏసీపీ ఎం. శ్రీనివాస్ రావు మొఘల్పురా ఇన్స్పెక్టర్ ఆర్. దేవేందర్తో కలిసి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెగ్లూర్ బిజ్లివాడి ప్రాంతానికి చెందిన వి. జైపాల్రెడ్డి (30), సుహాసిని (26) దంపతులు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. గతేడాది ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో జైపాల్రెడ్డి కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి మురాద్మహల్లో నివాసముంటూ అట్టల ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇరువురి పెద్దలు కలుగజేసుకొని సర్దిచెప్పారు. ఇదిలా ఉండగా ఇదే విషయమై ఈ నెల 14న తెల్లవారుజామున జైపాల్ రెడ్డి భార్యతో గొడవకు దిగి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన భార్యకు చాతిలో నొప్పి వచ్చిందంటూ 108కు ఫోన్ చేశాడు. వాహన సిబ్బంది వచ్చి సుహాసినీని పరిశీలించి మృతి చెందిందని తిరిగి వెళ్లిపోయారు. జైపాల్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళుతున్నానని స్థానికులకు చెప్పి శవాన్ని కూకట్పల్లి వరకు ఆటోలో తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మరో వాహనంలో మహారాష్ట్రలోని సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. సుహాసినికి తీవ్ర నొప్పి రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించాడు. కాగా సుహాసిని సోదరుడు నరేశ్ రెడ్డికి అనుమానం రావడంతో వెంటనే మొఘల్పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహారాష్ట్రలోని మర్కల్ పోలీసులకు సమాచారం అందించి శవాన్ని దహనం చేయకుండా చూడాలని సూచించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు చాకచక్యంగా ఛేదించిన ఎస్సై రాజేష్, హెడ్ కానిస్టేబుల్ ఖాజావలీ, కానిస్టేబుల్ సురేష్లను ఏసీపీ అభినందించి రివార్డుకు సిఫారసు చేశారు. -
ఉన్మాదం పెరిగితే దేశ ఉనికికే ముప్పు
- మతాన్ని, కులాన్ని ఆరాధించేవాళ్లు హిట్లర్ వంశీకులు - చండ్ర రాజేశ్వరరావు జయంతి సభలో జైపాల్రెడ్డి - రాజకీయాలను వ్యాపారమయం చేసిందే చంద్రబాబు: నారాయణ సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉన్మాదం పెరిగితే ఉనికికే ముప్పు ఏర్పడుతుందని మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డి హెచ్చరించారు. మత సామరస్యతకు, సమగ్రతకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత బీజేపీ పాలనలో ఆపద ముంచుకొచ్చిందని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ అధ్యక్షతన సోమవారమిక్కడ జరిగిన సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 102 జయంతి సభకు జైపాల్రెడ్డి ప్రధాన వక్తగా హాజరై ‘ప్రస్తుత రాజకీయాలు- ప్రధాన సవాళ్లు’ అంశంపై మాట్లాడారు. దేశం, జాతి, జాతీయ సమైక్యత అనేవి వాస్తవానికి రెండు మూడొందల ఏళ్ల కిందటి వరకు లేవని చెప్పారు. మతాన్ని, జాతిని కీర్తించేవాళ్లందరూ హిట్లర్ వంశీకులేనన్నారు. దేశ సమగ్రత, భావ సమైక్యతకు మతతత్వ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి మనం ఇప్పుడు ఇరాన్గా పిలుస్తున్న దేశం ఆర్యులదని, ఆ మాటంటే బీజేపీకి కోపం రావొచ్చన్నారు. వాజ్పేయి హయాంలో ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్య అంశం, 371 ఆర్టికల్ ఊసే లేవన్నారు. కానీ 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ వీటిని పెట్టి, రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేని ప్రాంతీయ పార్టీలతో కలసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందన్నారు. గతంలో మత సామరస్యతకు ముప్పు ఏర్పడిన ప్రతిసారి కమ్యూనిస్టులు, ప్రత్యేకించి చండ్ర రాజేశ్వరరావు లాంటి వారు ముందుండి పోరాడారని గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే గిట్టని కమ్యూనిస్టులే మంచి పార్లమెంటేరియన్లుగా ఎదిగారని, ప్రజాస్వామ్య పునాదుల్ని, స్ఫూర్తిని దెబ్బతీసే ఏ చర్యనూ సహించవద్దన్నారు. తెలుగువారి చరిత్రపుటల్లో ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ల సరసన నిలవగలిగిన గొప్ప వ్యక్తి చండ్ర అని కొనియాడారు. అంతకుముందు చండ్ర రాజేశ్వరరావు చిత్ర పటానికి జైపాల్రెడ్డితోపాటు, సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, చెన్నకేశవ్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, సీనియర్ జర్నలిస్టు సి.రాఘవాచారి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఆర్ ఆంధ్రుడని ఫౌండేషన్కు కేసీఆర్ స్థలం ఇవ్వనన్నారు: నారాయణ చండ్ర రాజేశ్వరరావు లాంటి అంతర్జాతీయ దిగ్గజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తన దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వబోనని చెప్పడమే కాకుండా బాబ్రీ మసీదు ధ్వంసాన్ని అడ్డుకున్న చండ్ర త్యాగజీవని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన యోధుడని చెప్పారు. ప్రజల కోసం వందలాది ఎకరాలను తృణప్రాయంగా త్యజించిన చండ్ర పేరిట నిర్వహిస్తున్న సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఏర్పాటుకు రెండెకరాల స్థలం ఇమ్మని తమ పార్టీ అడిగితే కేసీఆర్ తిప్పికొట్టిన తీరు క్షోభకు గురిచేసిందన్నారు. సీఆర్ ఆంధ్రుడైనందున స్థలం ఇవ్వడానికి నిరాకరించారని తెలిసి ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు చెప్పారు. రాజకీయ వ్యవస్థ వ్యాపారమయమైందని, అమ్ముడు పోయే బడుద్ధాయిలు, సంతలో గొర్రెల మాదిరి కొనే నాయకులు తయారయ్యారన్నారు. రాజకీయాలను వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని, పారిశ్రామిక వేత్తల్ని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసింది ఆయనేనన్నారు. సుజానా చౌదరిని ఎంపీగా చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్,బాబు ఇద్దరూ ఒకే తాను ముక్కలని, గొడవలు మాని కృష్ణా, గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. -
జైపాల్ రెడ్డి సంగతి దేశమంతా తెలుసు: బాల్క
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన దీక్షపై తప్పుడు వ్యాఖ్య లు చేయడం కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అవివేకానికి నిదర్శనమని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ దీక్షకు హడలిపోయి నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసిన విషయాన్ని అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న జైపాల్రెడ్డి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే గాదరి కిషోర్తో కలసి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, దొంగ దీక్షలు, నాటకాలు, రాజీనామాలు కాంగ్రెస్ నేతలకే సాధ్యమన్నారు. అధికారమే పరమావధిగా పనిచేసిన జైపాల్రెడ్డికి తెలంగాణను మోసం చేసిన చరిత్ర ఉంద న్నారు. పదవుల కోసం ఎన్ని పార్టీలు మార్చా రో దేశమంతా తెలుసన్నారు. తెలంగాణ టీడీపీ నేత రేవంత్రెడ్డి ఆంధ్రాబాబు పెంపు డు కుక్కన్నారు. నోట్ల కట్టలతో ఆయన ఎలా దొరికిపోయాడో జనానికి తెలుసన్నారు. -
'కేసీఆర్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు'
హైదరాబాద్ : బంగారు తెలంగాణ పేరుతో భారీ గా దోపిడీకి కేసిఆర్ ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంటుందని నోట్ల కోసం కాంట్రాక్ట్ పనులు, ఓట్ల కోసం పథకాలను రూపకల్పన చేసి ప్రజలను మోసం చేస్తున్నాడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యధ్యక్షులు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్బంగా గాంధీభవన్లో సోనియగాంధీ కృతజ్ఞతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ముందుగా గాంధీభవన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ 99 శాతం హామీలు పూర్తి చేశామని కేసిఆర్ నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన సాగునీటి పనులను ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. రీ డిజైన్ పేరుతోను, మిషన్ భగీరథ, కాకతీయలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల టెండర్లు వేస్తున్నారని, దాదాపు లక్ష కోట్ల రూపాయల దోపిడీకి సిద్దమవుతున్నారని భట్టి ఆరోపించారు. ఇచ్చిన హామీలు పూర్తి చేశామని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇకపోతే ప్రసార మాధ్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, లేకపోతే ప్రజాసామ్యంలో చీకటి రోజుల వస్తాయని ఆయన అన్నారు. పత్రికా యాజమాన్యాలు భయపడవద్దని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ముంపు బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని భట్టి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన ఘనత కేసిఆర్ది కాదని, కేసిఆర్ దొంగ దీక్ష చేశారని, ఆయన చేసిన దీక్షకు సంబంధించిన సమాచారమంతా నిమ్స్లో ఉందని అన్నారు. కేసిఆర్ నరేంద్రమోడీతో రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. కేసిఆర్ మంచి వ్యాపారి అని, ఆయనకు ఏదైనా పని ఉంటే తప్ప ఎవరిని పొగడరని జైపాల్ రెడ్డిఅన్నారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ రెండేళ్ళలో కేసిఆర్ చేసిందేమీ లేదని, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. కేసిఆర్ తెలంగాణకు శనిలా దాపురించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై అందరిలో అసంతృప్తి నెలకొని ఉందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి తమ పార్టీ నేతల వ్యాఖ్యలే కారణమన్నారు. మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసిఆర్ నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. క్యాబినెట్లో తెలంగాణ ద్రోహులే అధికంగా ఉన్నారని ఆయన విమర్శించారు. ఇంకా సమావేశంలో సిఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నర్సారెడ్డి, మాజీ మంత్రి శశిధర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ లతోపాటు పలువురు ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, పాల్గొన్నారు. కాగా తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించారు. అనంతరం ప్రకాశం హాల్లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి అఫ్జలుద్దీన్ నేతృత్వంలో సమావేశం జరిగింది. -
దళిత సీఎం హామీ ఏమైంది?: జైపాల్ రెడ్డి
సికింద్రాబాద్ : నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదు, దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత దిగ్విజయ్సింగ్, జైపాల్రెడ్డితోపాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నేతలు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డి మాట్లాడుతూ... సామాజిక సిద్ధాంతాన్ని స్వీకరించనివారికి అంబేద్కర్ పేరు పలిక అర్హత లేదన్నారు. దేశంలో విశ్వవిద్యాలయాలను ఏబీవీపీ అడ్డాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కాగా, అంబేద్కర్పై ముఖ్యమంత్రిది బూటకపు ప్రేమగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి మోసం చేశారని ఆరోపించారు. -
చెరువులో మునిగి బాలుని మృతి
వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి శివారులోని ఊరచెరువులో ప్రమాదవశాత్తూ మునిగి సాయిరెడ్డి(14) అనే బాలుడు ఆదివారం ఉదయం మృతిచెందాడు. సెలవుదినం కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన సాయిరెడ్డి ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. జైపాల్రెడ్డి కుమారుడైన సాయిరెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. గ్రామస్తులు గంటపాటు గాలించి మృత దేహాన్ని వెలికితీశారు. -
కల్తీలేని ‘పాలమూరు’ను నిర్మిస్తాం
వినియోగదారులను చైతన్య పరుస్తాం వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్నగర్ కల్చరల్ : వస్తువుల విక్రయాలు, బిల్లింగ్లలో జరుగుతున్న అవినీతిని అరికట్టి కల్తీలేని పాలమూరు జిల్లాగా తీర్చిదిద్దుతామని వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గూడూర్ జైపాల్రెడ్డి ఉద్ఘాటించారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గం ఎన్నిక జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వినియోగదారులను చైతన్య పరుస్తూ, అన్ని రంగాల్లో కల్తీలేకుండా వారికి సేవలు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఎంఆర్పీ రేట్లకే వస్తువులను విక్రయించాలని, వినియోగదారుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గానికి ఆయన నియామకపత్రాలు అందజేశారు. సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.శ్రీధర్, ఉపాధ్యక్షులుగా అశోక్ చక్రవర్తిగౌడ్, ఓం ప్రకాశ్, కోశాధికారిగా చంద్రశేఖర్, జిల్లా గౌరవ సలహాదారుడిగా రఘురాంరెడ్డి, లీగల్ అడ్వయిజర్గా చెన్నయ్యగౌడ్, మహబూబ్నగర్ పట్టణ అధ్యక్షుడిగా విజయ్కుమార్, జిల్లా కార్యదర్శులుగా లక్ష్మినారాయణ, నరసింహయ్య, రామకృష్ణ, ఇబ్రహీం, శ్రీకాంత్రెడ్డి, మాధవరెడ్డి, ఫెర్రిరాయ్, సంయుక్త కార్యదర్శులుగా పదిమందిని ఎన్నుకున్నారు. సమావేశంలో సంస్థ జాతీయ కార్పొరేట్ ఇన్చార్జి సందీప్ బన్సల్, రాష్ట్ర కార్పొరేట్ ఇన్చార్జి మహేందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్ చెప్పేవి అందమైన అబద్ధాలే'
జడ్చర్ల: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు అందమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మంగళవారం ఎమ్మెల్సీ దామోదర్రెడ్డికి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వీహెచ్తో కలిసి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్కు నిజాయితీ, నిష్ఠల పట్ల నమ్మకం లేదన్నారు. ఆయన తెలంగాణ కోసం చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజే భగ్నమైందన్నారు. ఆయన ఏనాడూ పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడింది లేదని విమర్శించారు. 'ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలను కలిసిన అనంతరం కేసీఆర్ మా ఇంటికి వచ్చి తనను సీఎం చేయాలని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరి సీఎం అవ్వమని ఆయనకు చెప్పాను. సంబరంగా తిరిగి వెళ్లిన ఆయన హైదరాబాద్ రాగానే మాట మార్చి కాంగ్రెస్పై ఆరోపణలు చేశారు' అని జైపాల్ రెడ్డి విమర్శించారు. -
రోహిత్ మరణం తీరని లోటు: జైపాల్ రెడ్డి
హైదరాబాద్ : పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ మరణం తీరని లోటు అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం హెచ్సీయూ సందర్శించి, ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ హెచ్సీయూ యూనివర్సిటీలో దళతుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన వైస్ ఛాన్సరలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను సంఘ విద్రోహుల్లా చిత్రీకరిస్తున్న తీరు బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ దళితులకు యూనివర్సిటీలో చట్ట రక్షణ కల్పించాలన్నారు. టీఆర్ఎస్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ యూనివర్సిటీ ఘటనపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో దళితులకు రక్షణ కల్పించాలని, కేంద్రం ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. -
'హెచ్సీయూ వీసీపై చర్యలు తీసుకోవాలి'
హైదరాబాద్ : హెచ్సీయూలో విద్యార్థి రోహిత్ మరణం తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి వెల్లడించారు. శనివారం యూనివర్శిటీలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరాన్ని ఎస్ జైపాల్రెడ్డి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్రెడ్డి జస్టిస్ సుదర్శన్రెడ్డి సందర్శించారు. యూనిర్శిటీలో దళితుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని జైపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ విద్యార్థులను సంఘ విద్రోహుల్లా చిత్రీకరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో దళితులకు చట్ట రక్షణ కల్పించాలని టి. జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. టీఆర్ఎస్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ యూనివర్శిటీ ఘటనపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ... యూనివర్శిటీలో దళితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోహిత్ మరణం పై కేంద్రం వ్యవహారించిన తీరు బాధాకరమని జస్టిస్ సుదర్శన్రెడ్డి అన్నారు. -
అసలు తలలే లెక్కపెట్టలేదు!
(పార్లమెంటులో ఏం జరిగింది-40) ధర్మ సంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం. జైపాల్రెడ్డి: రైటయినా, తప్పయినా, ఈ క్షణానికి ఇది తప్ప మనం ఇంకేమీ చెయ్యలేం! కేసీఆర్ నిరాహార దీక్ష విరమించేసినా... లేదు లేదు చచ్చిపోతున్నాడంటూ డిసెంబర్ 2009 మొదటి వారాంతంలో, మనం ఢిల్లీలో చేసిన ప్రచారం, ఆ ప్రచారం నిజం కాదని అందరికీ తెల్సినా... నిజమేనన్నట్లు చిదంబరం తెలంగాణ ప్రకటన చేయటం... ఆ రోజుతో ప్రారంభమయ్యింది, కేసీఆర్ నాయకత్వం బలపడటం...! అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి అనే చిదంబరం ప్రకటనలో ‘మెలిక’ అర్థం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాల ప్రహసనంతో మరింత బలపడింది కేసీఆర్ నాయకత్వం!! తెలంగాణ ఇవ్వవలసింది పార్లమెంట్ అని తెలిసీ.. 2009 తర్వాత కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్కు వచ్చాడు!? మీరిన్ని రోజులు లోక్సభను స్తంభింపచేశారు. ఒక్కరోజైనా మీతో కేసీఆర్ వచ్చాడా..! కేసీఆర్ కాంగ్రెస్లో చేరిపోతే మంచిదే. అతనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతాడు... ఈ రోజు నన్నెలా స్పీకర్ దగ్గరకి తోడ్కొని పోయారో, అలాగే కేసీఆర్ని కాంగ్రెస్లోకి తోడ్కొనిరండి! ఈ రోజు స్పీకర్ బిల్లు పాసయ్యిందని ప్రకటించి తీరాలి. కమల్నాథ్, సుష్మాస్వరాజ్ అవునవునంటూ బల్లలు చరుస్తారు. గత్యంతరం లేదు వాళ్లలాగ చేయక తప్పదు...!! ధర్మసంస్థాపన కోసం కొంచెం అధర్మంగా నడుచుకున్నా తప్పులేదు. ఇదే నేను చేసింది. శ్రీరాముడు వాలిని చంపినప్పుడు, రావణాసురుణ్ణి చంపినప్పుడు ఏ ధర్మం పాటించాడో మనమూ అదే చేశాం. మహా భారతయుద్ధంలో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణీ ఆఖరికి దుర్యోధనుణ్ణి ఎవర్నీ రూల్ ప్రకారం పోరాడి చంపలేదు. మనమూ అంతే చేశాం! ఆఖరి నిమిషంలో మనం చేసిన ప్రయత్నం వల్లనే ఈ బిల్లు పాసయ్యిందంటూ మనం ప్రజల ముందు చెప్పుకుంటానికి మాత్రం అవకాశం లేదు. అలా చెప్పుకున్న మరుక్షణం, మనం అధర్మపరులం అయిపోతాం. దయచేసి ఎవ్వరూ ఆ ఆలోచన చెయ్యకండి! రాజ్యాంగ మర్యాదల్ని కొంతవరకూ పాటించకతప్పదు. తెలంగాణా ఏర్పడటం తక్షణ అవసరంగా భావించే నేనీవిధంగా ప్రవర్తించాను. నౌ ఆర్ నెవ్వర్!! ఇప్పుడైతే అయినటు..్ల లేకపోతే ఎప్పటికీ తెలంగాణా ఏర్పడదు. ఏర్పడినా, ఇంతే అనుకూలమైన బిల్లు ఎప్పటికీ రాదు. నా బాధ్యత నేను నిర్వర్తించాను. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయించటమే మీ బాధ్యత. మాటిచ్చాడు గదా అని మాత్రం ధీమాగా ఉండకండి. తెలంగాణ కోసం నేనేమైనా మాట్లాడతాను, సమయానికి ఎవరి కాళ్లైనా పట్టుకుంటాను అని చెప్పాడు. కేసీఆర్! మెంటల్గా ప్రజల్ని ప్రిపేర్ చేసి వుంచాడు. రేపు కాంగ్రెస్ను నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసినా, ప్రజలు అతనినే నమ్ముతారు కానీ మనల్ని నమ్మరు. రెండ్రోజుల్లో రాజ్యసభలో పాసయి పోతుంది... మరో పది రోజుల్లో ప్రెసిడెంట్ సంతకం కూడా అయిపోతుంది. ఈ లోగా కాంగ్రెస్లో టీఆర్ఎస్ కల్సిపోవాలి! మీరు ఆ పనిలో ఉండండి.'' గత నాలుగు ఆర్టికల్స్, నేను రాసినవి. ఊహించి రాసినవి. ఆ విషయం ముందే చెప్పాను. ఇది నా విశ్లేషణ మాత్రమే! ‘‘18 ఫిబ్రవరి 2014న స్పీకర్ ఛాంబర్లో నేనూ, కమల్నాథ్, సుష్మాస్వరాజ్ల మధ్య రాజీ కుదిర్చాను’’ అని చేసిన జైపాల్రెడ్డిగారి ప్రకటన ఆధారంగా, జైపాల్రెడ్డిగారి ఉపన్యాస శైలితో పరిచయం వున్న వ్యక్తిగా ఆ కీలకమైన గంటలో, ఏం జరిగి వుండవచ్చునో, ఊహించి రాశాను. జైపాల్రెడ్డి గారు రూల్ ప్రకారం తలలు లెక్కపెట్టినట్లు నటించమని చెప్పారు. కానీ స్పీకర్ గారు ఒకటి రెండు సవరణలకి లెక్క పెట్టినట్లు ‘‘అనుకూలం 169 వ్యతిరేకం 6 అంటూ ప్రకటించారు గానీ ఆ తర్వాత అసలు లెక్కించలేదు. కనీసం తలలైనా లెక్క పెట్టి ఎంత మంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో చెప్పండంటూ అసదుద్దీన్ ఒవైసీ పదే పదే స్పీకర్ని అడగటం జరిగింది గానీ, స్పీకర్ మాత్రం లెక్కించనే లేదు! సవరణ చదవటం, వీగిపోయిందంటూ ప్రకటించటం.. జరిగిపోయింది!! ఈ ప్రక్రియ రూల్ వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం కూడా!! జైపాల్రెడ్డి గారు నేను అభిమానించే రాజనీతిజ్ఞుడు. తెలంగాణా విషయంలో మాత్రం ఆయన సగటు రాజకీయ నాయకుడి గానే ప్రవర్తించారని నేననుకుంటు న్నాను. అలా ఎందుకనుకుంటున్నానో కూడా వివరిస్తాను. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: - ఉండవల్లి అరుణ్కుమార్ a_vundavalli@yahoo.com -
ఈ రాజకీయమే ఒప్పుకోం
(పార్లమెంటులో ఏం జరిగింది-35) జైపాల్జీ... మమ్మల్ని ‘కార్నర్’ చెయ్యాలనుకోవటమే తప్పు... బిల్లు పాసవ్వటానికి అవసరమైనంత మంది సభ్యులు లేకపోతే మాదా తప్పు... బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టే బిల్లు పాసవ్వలేదని అప్పుడే మొదలు పెట్టేశారు... చిరాగ్గా చూశారు జైపాల్రెడ్డి. ‘‘కాళ్లు పట్టుకుని వదలకండి... వచ్చేదాకా వదలకండి. తెలంగాణ కోసం ఏమి చేసినా... ఇంకొక గంట టైముందంతే! వెళ్లండి’’ అంటూ స్పీకర్ చాంబర్స్ వైపు కదిలారు. ***** స్పీకర్ చాంబర్స్లో స్పీకర్ ఎదురుగా కూర్చున్నారు జైపాల్, కమల్నాథ్, సుష్మాస్వరాజ్. ఎంపీలంతా నిలబడి ఉన్నారు. చర్చ మొదలైంది. కమల్నాథ్: ప్రభుత్వం స్పష్టంగా ఉంది. మూడు గంట లకి సభ మొదలవగానే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెడ్తాం. పాస్ చేయించే బాధ్యత మాదే అన్నారు గదా బీజేపీ వారు! పాస్ చేయించండి. సుష్మాస్వరాజ్: మీ మంత్రులే ‘వెల్’లోకి వచ్చి గొడవ చేస్తుంటే, మీకు మద్దతిచ్చిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు అరుస్తుంటే - మీకే బాధ్యత లేదా! జైపాల్రెడ్డి: నా మాట వినండి. ప్లీజ్ స్పీకర్: ఇంత ప్రధానమైన బిల్లు. ఇంతటి వివాదాస్పద మైన బిల్లు. ‘డివిజన్’ చేయాలంటే... ఎలా చెయ్యమంటారు. ‘వెల్’లో వాళ్లు వాళ్ల స్థానాలకి వెళ్లాలి గదా... కమల్నాథ్: మీరు ‘డివిజన్’ అంటూ ఆటోమేటిక్ ఓటు రికార్డర్ ‘ఆన్’ చెయ్యగానే అందరూ ఎవరి స్థానాల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. వాళ్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు రికార్డు అవ్వాలి గదా. వాళ్ల నియోజకవర్గంలో తెలియాలి గదా... వాళ్లెలా ఓటు వేశారో... స్పీకర్: మరింక ఇబ్బందేముంది. 3 గంటలకి మొదలు పెట్టేద్దాం! కమల్నాథ్: అదే, నేనూ అంటున్నాను. బిల్లుపెడ్తాం, డివి జన్ జరుగుతుంది. బిల్లు పాసవ్వకపోతే ఆ బాధ్యత ఎవరిది? మీరు పెట్టండి, మేము పాస్ చేస్తాం అనేవాళ్లదే గదా?! సుష్మాస్వరాజ్: బిల్లు పాసయితే కాంగ్రెస్ గొప్పతనం. అవ్వకపోతే బీజేపీ అసమర్థత...! ఈ రాజకీయాన్నే మేము ఒప్పుకోవటం లేదు. జైపాల్రెడ్డి: అనవసరంగా టెన్షన్ పెంచుకుంటున్నారు నా మాట వినండి. కమల్నాథ్: అంతే సుష్మాజీ... 21 మంది పార్లమెంట్ సభ్యులున్న సీమాంధ్ర కాంగ్రెస్ కంచుకోటని పణంగా పెట్టి ఇంతటి రిస్కు తీసుకుంటే, బిల్లు ఓటింగ్కి వస్తుందని తెలిసీ, ఇవ్వాళ మీ సభ్యులు 30 మంది గైర్హాజరైతే ఏమనుకోవాలి? మీకొక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు... సీమాంధ్రలో మీకే నష్టమూ జరగదు. మీ ఎన్డీయే సభ్యులెవ్వర్నీ ఒప్పించలేక పోయారు మీ పార్టీ సభ్యులంతా హాజరు అయ్యేలా చూడొద్దా?! సుష్మాస్వరాజ్: మీ మంత్రుల్ని మీరు ఒప్పించుకోలేకపో యారు. 15 మంది సీమాంధ్ర ఎంపీల్ని సస్పెండ్ చేశారు. మిగిలిన పది మందీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారా... చెప్పండి. మీ పార్టీకి 21, టీడీపీకి 4 స్థానాలున్న సీమాంధ్రలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, నలుగురు స్టేట్ మంత్రులూ ఉన్నారు. ఒక్కరైనా బిల్లుకు మద్దతిస్తారా? మీ ముఖ్యమంత్రినే మీరు ఒప్పించలేకపోయారు. మీ మంత్రులకూ, ఎంపీలకూ నచ్చచెప్పలేకపోయారు... మమ్మల్ని అంటారా? జైపాల్రెడ్డి: కమల్! సుష్మాజీ! ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి... నేను పిలిస్తేనేగా వచ్చారిక్కడికి... నాకు అవకాశం ఇవ్వకుండా మీరిలా కీచులాడుకోవటం ఏం బాగాలేదు. సుష్మాస్వరాజ్: నిజమే జైపాల్జీ... మమ్మల్ని ‘కార్నర్’ చెయ్యాలనుకోవటమే తప్పు... బిల్లు పాసవ్వటానికి అవసర మైనంత మంది సభ్యులు లేకపోతే మాదా తప్పు... రెండ్రో జుల్లో పార్లమెంట్ గడువే పూర్తయిపోతోంది. కొంతమంది వెళ్లి పోయారు... బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టే బిల్లు పాసవ్వ లేదని అప్పుడే మొదలు పెట్టేశారు... జైపాల్ రెడ్డి: ఎందుకమ్మా- మీ వాళ్లు 30 మంది ఆబ్సెంట్ అయినంత మాత్రాన బిల్లు పాసవ్వదని అనుకుంటున్నారు? మా వాళ్లు 200 మందికిపైగా ఉన్నారు, యూపీఏలో మొత్తం 17 మంది సస్పెండయిపోయినా లెక్క సరిపోతుంది. మొత్తం 544 మంది సభ్యులూ హాజరైపోరుగదా- బిల్లు పాసే అవ్వ దని ఎలా నిర్ణయానికొచ్చేశారు? కమల్: జైపాల్గారూ... ఇదిగో అటెండెన్స్ రిజిస్టర్. కొంత మంది సంతకం పెట్టిన వాళ్లు వెళ్లిపోయి ఉండవచ్చు గాని సంతకం పెట్టకుండా ఉన్నవాళ్లెవ్వరూ సభలో ఉంటారని నేననుకోను. దీని ప్రకారం 30 మంది బీజేపీ సభ్యులైనా, కనీసం, గైర్హాజరయ్యారు. సుష్మాస్వరాజ్: కాంగ్రెస్ వాళ్లెంత మంది గైర్హాజరయ్యారో కూడా చెప్పండి. కమల్నాథ్: కాదంటంలేదు. కాంగ్రెస్ వాళ్లు కూడా కొం దరు రాలేదు. మీ పార్టీని నమ్ముకునే కదా మేము బిల్లు పెడ్తున్నాం... సుష్మాస్వరాజ్: జైపాల్జీ! మీ పార్టీకి చెందిన 106 మంది సంతకాలున్నాయి అటెండెన్స్ రిజిస్టర్లో...! మీకే గాదు మాకూ లెక్కలు తెలుసు!! మా వాళ్లొక 80 మంది. మొత్తం 186 మంది సభ్యులు... వీరుగాక మీ మంత్రులు. వాళ్లు హాజరుపట్టీలో సంతకాలు పెట్టరు గాని ఓటు వేస్తారు. 354లో మీరూ మేమూ కలిపి 186 మందిమి ఉన్నాం! అయినా బిల్లు పాసవ్వదనే అనుమానానికి కారణం... కాంగ్రెస్వారు అందరూ ఓటు వెయ్యరని... తప్పు బీజేపీ మీదకు నెట్టడానికి చూస్తున్నారు. కమల్నాథ్: బిల్లు పాసవ్వకపోతే మా బాధ్యత కన్నా మీ బాధ్యతే ఎక్కువ సుష్మాజీ... మేము ఏకాభిప్రాయం సాధించు కోలేకపోయాం, అందరికీ తెలుసు! ప్రెసిడెంట్ పంపిన ‘బిల్లు’ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించింది. అది కూడా అందరికీ తెలుసు. బిల్లు ఓటింగ్కి పెట్టినప్పుడు ఎవరెలా ఓటేస్తారో మాకైతే తెలీదు. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్కుమార్ -
బిల్లు ఈ రోజే పాసై తీరాలి
పార్లమెంటులో ఏం జరిగింది-34 18-2-2014 సమయం 12.47 మధ్యాహ్నం. (లోక్సభ మళ్లీ వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమ యం జరగకుండా అడ్డుపడిన సీమాంధ్ర సభ్యులు, మరికొందరు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల సభ్యులూ మళ్లీ నినాదాలు చేస్తూ సభ జరగనివ్వలేదు. పదిహేను మంది సీమాంధ్ర సభ్యుల్ని ‘సస్పెండ్’ చేసినా, ఇంకా ‘వెల్’లో గొడవ మాత్రం అలాగే జరుగుతోంది! చిదంబరం, ఫైనాన్స్ బిల్లు కాగి తాలతో సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణ బిల్లు 15వ లోక్సభలో పాసయ్యే అవకాశాలు లేనట్టే కనబడుతు న్నాయి.) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ హడావుడిగా స్పీకర్ చాంబర్స్లోకి వెళ్లారు. వెనకాలే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా వెళ్లారు. కమల్నాథ్ స్పీకర్తో రెండు నిమిషాలు మాట్లాడి బైటికొచ్చారు. చుట్టూ చేరిన తెలంగాణ ఎంపీలతో క్లుప్తంగా ‘‘కష్టం... ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాసవ టం కష్టం! బీజేపీ సహకరించటం లేదు!!’’ అని చెప్పి వెళ్లిపోయారు. హతాశులైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, అక్కడే లోక్సభ మొదటి వరసలో కూర్చుని, ఎవరితోనో ముచ్చటిస్తున్న జైపాల్రెడ్డిగారి దగ్గరకు వెళ్లారు. ‘‘సార్ తెలంగాణ బిల్లు పక్కన పెట్టేశారట’’ అని చెప్పారు. ‘ఎందుకని’ అని ప్రశ్నించారు జైపాల్! ‘‘ఏమో, కమల్నాథ్, బీజేపీ కలిసిరావటం లేదంటూ’’ చెప్పి వెళ్లిపోయాడు ‘‘కమల్నాథ్ చాంబర్స్కి వెళ్లి ఉన్నా రేమో చూడండి... ‘నేనొస్తాను’ అన్నారు జైపాల్. కమల్నాథ్ ఉన్నారో లేదో చూద్దామని వెళ్లిన ఎంపీలు, లోక్సభ పక్కనే ఉండే ఆయన ఆఫీసు రూం నుంచి ఆయనను వెంటబెట్టుకుని వచ్చేశారు. ఎప్పుడైతే జైపాల్రెడ్డి మీ దగ్గరకు వస్తారట’ అన్నారో... కమల్నాథే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, లోక్సభలోకి వచ్చే శారు. జైపాల్రెడ్డి, కమల్నాథ్ని తన పక్కనే కూర్చో బెట్టుకుని, మిగతా ఎంపీలందర్నీ కొంచెం దూరంగా కూర్చోమన్నారు. ‘‘ఇలాగైతే కష్టం జైపాల్రెడ్డిగారూ, ఎన్డీఏలో బీజేపీ తప్ప మరే పార్టీ ఈ తరహా విభజనకి ఒప్పుకోవటం లేదు. యూపీఏకు మద్దతునిచ్చే పార్టీలూ వ్యతిరేకిస్తు న్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ మద్దతిస్తూనే ఉత్తర ప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలు చెయ్యటానికి అంగీకరించా లంటూ మెలిక పెడుతోంది. అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మేమెలా సహకరిస్తామంటు న్నాయి ప్రాంతీయ పార్టీలు. బిల్లు పాసవ్వటానికి కావా ల్సిన బలం, అనుమానమే! బిల్లు పాసవటమే అను మానంగా ఉంటే, గవర్నర్కి ‘లా అండ్ ఆర్డర్’ అప్ప చెప్పాలంటే, రాజ్యాంగ సవరణ చేయాల్సిందే అంటోంది బీజేపీ... కష్టం జైపాల్జీ... ‘పెప్పర్స్ప్రే’ను అడ్డం పెట్టుకుని పదిహేనుమంది ఆంధ్రావాళ్లని సస్పెండ్ చేసి బైట పెట్టేసినా లెక్క సరిపోవడం లేదు...’’ అన్నారు కమల్ నాథ్. ‘‘లెక్క సరిపోకపోవటమేమిటి కమల్... కాంగ్రెస్ వాళ్లమే రెండొందలు దాటి ఉన్నాం. బీజేపీ నూట పది హేను అనుకుంటా...! ఇదిగాక ఎన్సీపీ, మాయావతి పార్టీ ఇంకా చిన్న చిన్న పార్టీలూ... ముందునుంచి లెక్క పెట్టుకుంటూనే ఉన్నాంగా...!! రాజ్యాంగ సవరణ చెయ్యాలంటే మూడింట రెండొంతులు మెజార్టీ ఉండాలి గానీ సింపుల్ మెజారిటీకి సరిపోకపోవటమేమిటి. రా... నేను సుష్మాస్వరాజ్తో మాట్లాడతా! అన్నారు జైపాల్. ‘‘స్పీకర్తో మరో గొడవ. ‘వెల్’లో సభ్యుల్ని సస్పెం డ్ చేసి, రేపు పెట్టండి బిల్లు అంటోంది ఆవిడ. సభ సజా వుగా జరక్కపోతే ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసుకోవటం ఎలా సాధ్యం... అంటోంది. సభ సజావుగా నడపటం, రూల్స్ ప్రకారం స్పీకర్ బాధ్యత. ఈ రోజు ‘వెల్’లో ఉన్నవాళ్లని సస్పెండ్ చేసి రేపు ఈ బిల్లు పెడ్దామంటే, రేపింకో పది మంది ‘వెల్’లోకి వస్తారు. ఈలోగా సస్పెన్షన్ గడువు ముగిసి ఆ పదిహేను మంది కూడా మళ్లీ వచ్చేస్తారు’’ కమల్నాథ్. ‘‘ఏం కంగారు పడకయ్యా... నేను చెప్తా. ఏం చెయ్యాలో’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను పిలిచి ‘‘సుష్మాస్వరాజ్ని నేను పిలుస్తున్నానని చెప్పి స్పీకర్ చాంబర్స్కి తీసుకురండి’’ అన్నారు జైపాల్. ‘‘కమల్... నేను నాలుగు దశాబ్దాలుగా రాజకీ యాల్లో ఉన్నాను. ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు చేసె య్యటమే... చెయ్యకూడదనుకున్నప్పుడు, రూల్స్ చట్టాలు, రాజ్యాంగం మాట్లాడి చెయ్యకుండా ఎగ్గొట్ట వచ్చు! మనకి మంచిదనే గదా ఒక పని చేద్దామను కుంటాం... దానికి కూడా రూల్స్ అడ్డం వస్తే, ఇక ఆ రూల్స్కి ఎందుకు విలువివ్వాలి? నడు... స్పీకర్తో, సుష్మతో నేను మాట్లాడతా! బిల్లు ఈ రోజే పాసయి తీరాలి... లేకపోతే, ఇక ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాదు. నడు... స్పీకర్ చాంబర్స్కి వెడదాం’’ అంటూ లేవటానికి ఉపక్రమించారు జైపాల్. ఇంతలో సుష్మా స్వరాజ్ దగ్గరకు వెళ్లిన ఎంపీలు పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘సార్, మీతో మాట్లాడటానికి అభ్యంతరం లేదు గానీ స్పీకర్ చాంబర్స్కి మాత్రం రానంటోంది సుష్మా స్వరాజ్. కాంగ్రెస్ పార్టీ కావాలనే డ్రామా ఆడుతోందని, ఇప్పుడు బిల్లు పాసయితే ఆ పేరు కాంగ్రెస్కి, అవ్వకపోతే ఆ చెడ్డ పేరు బీజేపీకి వచ్చేలా వ్యూహరచన చేశారని ఏదేదో మాట్లాడుతోంది ఆమె’’ అంటూ వాపోయారు. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్కుమార్ -
కాళ్లు పట్టుకున్నారా.. ఎందుకు?
పార్లమెంటులో ఏం జరిగింది-33 ‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వాల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఇప్పటి వరకూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ‘పాస్’ అవ్వటం, అనే ‘ప్రహసనం’ పరిశీలించాం! ఉభయ సభల్లో జరిగిన సంఘటనలు యథాతథంగా అనువదించి మీ ముందుంచటమే జరిగింది తప్ప, ఎందుకలా జరిగింది అనే వివరాలలోకి వెళ్లలేదు. ఇప్పటిదాకా నా ‘ఆర్టికల్స్’ చదివిన వారు, ‘ఏం జరిగిందో రాశారు గాని, ఎందుకలా జరిగిందో కూడా రాయాలిగదా!’ అని అడిగారు. నిజమే... ‘ఎందుకిలా జరిగింది?!’ ‘డివిజన్’ చేసి, లోక్సభలో ఎంతమంది ఈ బిల్లుకు అనుకూలం, ఎంతమంది వ్యతిరేకం ‘ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ రికార్డింగ్ ద్వారా నిర్ణయించటానికి అభ్యంతరం ఏమిటి? అనవసరంగా డివిజన్ అడుగుతున్నారని భావించినప్పుడు ‘‘రూల్ 367(3) ప్రొవిజో’’ స్పీకర్ గారు ఉపయోగించి బిల్లు పాసయిపోయిందనిపించివచ్చు, అనే సలహా జైపాల్రెడ్డి గారు చెప్పినట్లు, వారిచ్చిందేనా! కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కలిపితే, బిల్లు ‘పాస్’ చేయించగలిగినంత మంది సభ్యుల సంఖ్యా బలమున్నప్పుడు, బిల్లును పక్కన పెట్టేసే పరిస్థితి ఎందుకొచ్చింది? లోక్సభలో సాక్షాత్తూ కేంద్రమంత్రులే ‘స్పీకర్ వెల్’లో నినాదాలు ఇస్తున్నా, తలలు లెక్కపెట్టినట్లు, బిల్లు పాసయినట్లు ‘కథ’ నడిపిన నేపథ్యంలో, సభలో ఆర్డర్ లేదు కాబట్టి ‘డివిజన్’ చేయటానికి ‘రూల్స్’ ఒప్పుకోవంటూ రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ రూలింగ్ ఇచ్చి తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు స్పీకర్ ‘డివిజన్’ చెయ్యను అన్నప్పుడు, సభలో ఏ పార్టీ వారూ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవటానికి కారణం ఏమిటి? తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు ‘సౌగత్రాయ్’ ఒక్కరే తప్ప, మిగతా పార్టీలన్నీ ‘వెల్’లోనే ఉన్నాయా!? లోక్సభలోని కాంగ్రెస్ సభ్యులలో పదకొండు మంది, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, పార్ల మెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్, స్పీకర్ మీరాకుమార్... గంటసేపు స్పీకర్ చాంబర్లో ‘చర్చ’ జరిపిన ఫలితమే తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం...అన్న జైపాల్ రెడ్డిగారి మాటల్లో అర్థమేంటి? పెపైచ్చు, సుష్మాస్వరాజ్ గారి ‘కాళ్లుపట్టుకుని’ తీసుకొచ్చాం- అన్నారు. ‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వా ల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఆర్టికల్ 3 ప్రకారం, అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలే తప్ప, ఆ అభిప్రాయం ప్రకారం నడవాలి అని ఎక్కడా లేదు, కాబట్టి, అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంట్ ‘పాస్’ చేసేయవచ్చు... అనే వాదననే వ్యతిరేకిస్తూ వచ్చాం! సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలోని వాదన కూడా ప్రధానంగా ఇదే!! ‘‘పార్లమెంట్లో మెజార్టీ లేకపోయినా బిల్లు ‘పాస్’ చేసేయవచ్చు’’ అనే విధానం మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా వినలేదు. అసలు నిజంగా, లోక్సభలో మెజార్టీ లేక బిల్లు పక్కన పెట్టేద్దాం అనుకున్నారా?! ఎవరైనా నాలాంటి మామూలు మనిషి ఈ మాటలని ఉంటే, అదేం పట్టించుకోనవసరం లేదు! కానీ ఈ మాటలన్నది సాక్షాత్తూ జైపాల్ రెడ్డి!! ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా దృష్టిలో జైపాల్రెడ్డిగారొక మేధావి. ఎన్సైక్లోపీడియా లాంటి వారు. భారత రాజకీయాలలో ‘అజాతశత్రువు’ అని పిలవొచ్చు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కూడా! ఆచితూచి మాట్లాడటం ఆయన నైజం. ఎన్నికల్లో గెలవటం కోసమో, ప్రయోజనాలను ఆశించో, ఏది పడితే అది మాట్లాడే సగటు పొలిటీషియన్ మాత్రం కారు!! అటువంటి జైపాల్రెడ్డి గారు అన్నమాటల్ని బట్టి విశ్లేషిస్తే... ఫిబ్రవరి 18, 2014 నాడు లోక్సభలో జరిగింది సీమాంధ్రకు ద్రోహం కాదు, దేశ రాజకీయ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలకే ద్రోహం... ఇక్కడ నుంచి నేను రాయబోయేది విశ్లేషణ మాత్రమే. అంటే ఒక ‘సంఘటన’ విషయమై నాకేర్పడిన అభిప్రాయం! ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’’ అనే ఒక చరిత్రాత్మక సంఘటన, పూర్వాపరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హైద్రాబాద్ అనే ఒక రాజ్యం ఇండియాలో విలీనమైనప్పటి నుంచి, 1953 లో కర్నూలు రాజధానిగా, ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి... హైద్రాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతాన్నీ ఆంధ్ర రాష్ట్రాన్నీ కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏర్పరచినప్పటి నుంచి.. 1969 ప్రత్యేక తెలంగాణ, 72 నాటి ప్రత్యేకాంధ్ర ఉద్యమాలు, 2000లో మూడు రాష్ట్రాల ఏర్పాటు, 2001లో మళ్లీ, తెలంగాణ విభజన డిమాండ్, టీఆర్ఎస్ ఏర్పాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, 2009 చిదంబరం ప్రకటన, శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు... వగైరా. వగైరా సంఘటనలన్నీ అతి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తా! ఇప్పటి వరకూ ‘‘పార్లమెంట్లో ఏం జరిగింది’’ అనే ఆర్టికల్స్ శ్రద్ధగా చదివి నాకు ఈ-మెయిల్స్ పంపిన వారందరికీ నా అభినందనలు. ముందే చెప్పాను... ఇదంతా ఆసక్తిగా చదవగలిగే ‘నవల’ కాదు. ‘బోరు’ కొట్టే అవకాశం కూడా ఉంటుందని... అయినా ఇంత మంది చదువుతున్నారనేది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామం. - ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
కాళ్లు పట్టుకున్నారా.. ఎందుకు?
‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వాల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఇప్పటి వరకూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ‘పాస్’ అవ్వటం, అనే ‘ప్రహసనం’ పరిశీలించాం! ఉభయ సభల్లో జరిగిన సంఘటనలు యథాతథంగా అనువదించి మీ ముందుంచటమే జరిగింది తప్ప, ఎందుకలా జరిగింది అనే వివరాలలోకి వెళ్లలేదు. ఇప్పటిదాకా నా ‘ఆర్టికల్స్’ చదివిన వారు, ‘ఏం జరిగిందో రాశారు గాని, ఎందుకలా జరిగిందో కూడా రాయాలిగదా!’ అని అడిగారు. నిజమే... ‘ఎందుకిలా జరిగింది?!’ ‘డివిజన్’ చేసి, లోక్సభలో ఎంతమంది ఈ బిల్లుకు అనుకూలం, ఎంతమంది వ్యతిరేకం ‘ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ రికార్డింగ్ ద్వారా నిర్ణయించటానికి అభ్యంతరం ఏమిటి? అనవసరంగా డివిజన్ అడుగుతున్నారని భావిం చినప్పుడు ‘‘రూల్ 367(3) ప్రొవిజో’’ స్పీకర్గారు ఉపయోగించి బిల్లు పాసయిపోయిందనిపించి వచ్చు, అనే సలహా, జైపాల్రెడ్డి గారు చెప్పినట్లు, వారిచ్చిందేనా! కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కలిపితే, బిల్లు ‘పాస్’ చేయించగలిగినంత మంది సభ్యుల సంఖ్యా బలమున్నప్పుడు, బిల్లును పక్కన పెట్టేసే పరిస్థితి ఎందుకొచ్చింది? లోక్సభలో సాక్షాత్తూ కేంద్రమంత్రులే ‘స్పీకర్ వెల్’లో నినాదాలు ఇస్తున్నా, తలలు లెక్కపెట్టినట్లు, బిల్లు పాసయినట్లు ‘కథ’ నడిపిన నేపథ్యంలో, సభలో ఆర్డర్ లేదు కాబట్టి ‘డివిజన్’ చేయటానికి ‘రూల్స్’ ఒప్పుకోవంటూ రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ రూలింగ్ ఇచ్చి తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు స్పీకర్ ‘డివిజన్’ చెయ్యను అన్నప్పుడు, సభలో ఏ పార్టీ వారూ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవటానికి కారణం ఏమిటి? తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు ‘సౌగత్రాయ్’ ఒక్కరేతప్ప, మిగతా పార్టీలన్నీ ‘వెల్’లోనే ఉన్నాయా!? లోక్సభలోని కాంగ్రెస్ సభ్యులలో పదకొండు మంది, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, పార్ల మెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్, స్పీకర్ మీరాకుమార్... గంటసేపు స్పీకర్ చాంబర్లో ‘చర్చ’ జరిపిన ఫలితమే తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం...అన్న జైపాల్ రెడ్డిగారి మాటల్లో అర్థమేంటి? పెపైచ్చు, సుష్మాస్వరాజ్గారి ‘కాళ్లుపట్టుకుని’ తీసుకొచ్చాం- అన్నారు. ‘మీరు బిల్లు పెట్టండి, మేము పాస్ చేయిస్తాం’ అంటూ ప్రతిరోజూ ప్రకటనలిస్తున్న బీజేపీ నాయకు రాలు సుష్మాస్వరాజ్ గారిని, నిజంగా బిల్లు పాస్ అవ్వా ల్సిన సమయానికి, కాళ్లు పట్టుకోవల్సినంత అవసరం ఏమి వచ్చింది? ఆర్టికల్ 3 ప్రకారం, అసెంబ్లీ అభిప్రాయం తీసు కోవాలే తప్ప, ఆ అభిప్రాయం ప్రకారం నడవాలి అని ఎక్కడా లేదు, కాబట్టి, అసెంబ్లీ తిరస్కరించినా పార్ల మెంట్ ‘పాస్’ చేసేయవచ్చు... అనే వాదననే వ్యతి రేకిస్తూ వచ్చాం! సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలోని వాదన కూడా ప్రధానంగా ఇదే!! ‘‘పార్లమెంట్లో మెజార్టీ లేకపోయినా బిల్లు ‘పాస్’ చేసేయవచ్చు’’ అనే విధానం మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా వినలేదు. అసలు నిజంగా, లోక్సభలో మెజార్టీ లేక బిల్లు పక్కన పెట్టేద్దాం అనుకున్నారా?! ఎవరైనా నాలాంటి మామూలు మనిషి ఈ మాట లని ఉంటే, అదేం పట్టించుకోనవసరం లేదు! కానీ ఈ మాటలన్నది సాక్షాత్తూ జైపాల్ రెడ్డి!! ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా దృష్టిలో జైపాల్రెడ్డిగారొక మేధావి. ఎన్సైక్లోపీడియా లాంటి వారు. భారత రాజకీయాలలో ‘అజాతశత్రువు’ అని పిలవొచ్చు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కూడా! ఆచి తూచి మాట్లాడటం ఆయన నైజం. ఎన్నికల్లో గెలవటం కోసమో, ప్రయోజనాలను ఆశించో, ఏది పడితే అది మాట్లాడే సగటు పొలిటీషియన్ మాత్రం కారు!! అటువంటి జైపాల్రెడ్డి గారు అన్నమాటల్ని బట్టి విశ్లేషిస్తే... ఫిబ్రవరి 18, 2014 నాడు లోక్సభలో జరి గింది సీమాంధ్రకు ద్రోహం కాదు, దేశ రాజకీయ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలకే ద్రోహం... ఇక్కడ నుంచి నేను రాయబోయేది విశ్లేషణ మాత్రమే. అంటే ఒక ‘సంఘటన’ విషయమై నాకేర్పడిన అభిప్రాయం! ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’’ అనే ఒక చరిత్రాత్మక సంఘటన, పూర్వాపరాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హైద్రాబాద్ అనే ఒక రాజ్యం ఇండియాలో విలీనమైనప్పటి నుంచి, 1953లో కర్నూలు రాజధానిగా, ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి... హైద్రాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతాన్నీ ఆంధ్ర రాష్ట్రాన్నీ కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏర్పరచినప్పటి నుంచి.. 1969 ప్రత్యేక తెలంగాణ, 72 నాటి ప్రత్యేకాంధ్ర ఉద్యమాలు, 2000లో మూడు రాష్ట్రాల ఏర్పాటు, 2001లో మళ్లీ, తెలంగాణ విభజన డిమాండ్, టీఆర్ఎస్ ఏర్పాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, 2009 చిదంబరం ప్రకటన, శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు... వగైరా. వగైరా సంఘటనలన్నీ అతి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తా! ఇప్పటి వరకూ ‘‘పార్లమెంట్లో ఏం జరిగింది’’ అనే ఆర్టికల్స్ శ్రద్ధగా చదివి నాకు ఈ-మెయిల్స్ పంపిన వారందరికీ నా అభినందనలు. ముందే చెప్పాను... ఇదంతా ఆసక్తిగా చదవగలిగే ‘నవల’ కాదు. ‘బోరు’ కొట్టే అవకాశం కూడా ఉంటుందని... అయినా ఇంత మంది చదువుతున్నారనేది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామం. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com - ఉండవల్లి అరుణ్కుమార్ -
చివరికిలా ముగిసింది!
పార్లమెంట్లో ఏం జరిగింది-32 రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో 20.02.2014 న జరిగిన చర్చకు సంబంధించిన చివరి భాగమిది. బిల్లు ఆమోదంతో చర్చ ముగిసింది. ఏచూరి: మాకు బిల్లు మీద ఓటింగ్ కావాలి. డిప్యూటీ చైర్మన్: ఏచూరిగారూ మీరు సభని... తపన్ కుమార్: ఓటింగ్ చెయ్యటం కష్టం కాదు. ఏచూరి: సార్, ఓటింగ్ జరపటం కష్టమేమీ కాదు. డిప్యూటీ చైర్మన్: నేను రూల్ ప్రకారం నడవాలి. తపన్: సభ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఓటింగ్ జరిపించండి. డిప్యూటీ చైర్మన్: వెల్లో సభ్యులుండగా ఓటింగ్కు రూల్స్ అనుమతించవు. వాళ్లని వెనక్కి పిలవండి. తపన్: సర్, సభ ఆర్డర్లోనే ఉంది. ఓటింగ్ జరిపించండి. డిప్యూటీ చైర్మన్: నేను చెప్పేది వినండి. నా ఆర్డర్ వినండి. తపన్: సభ బాగానే ఉందిగా... డివిజన్ పెట్టండి. డిప్యూటీ చైర్మన్: డివిజన్కి అభ్యంతరం లేదు. కానీ ‘వెల్’లో సభ్యులుండగా ఓటింగ్ జరపకూడదనేది రూల్. ఏచూరి: అది మీ బాధ్యత సార్! డిప్యూటీ చైర్మన్: నేను ‘డివిజన్’ చెయ్యలేను. తపన్: సభ ఆర్డర్లోనే ఉంది సార్. డిప్యూటీ చైర్మన్: నేను రూల్ ప్రకారం నడవాలి. బాధ్యత నాకే కాదు, సభ్యులకీ ఉంది. మీమీ సీట్లకి వెళ్లండి. మీ మిత్రులకి చెప్పి వెనక్కి పిలవండి. నేను నిస్సహాయుణ్ణి. (సమయం 8.05) వెంకయ్య నాయుడు: మీరు బిల్ పాస్ చెయ్యాలనుకుంటున్నారు. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీతో చేయి చేయీ కలిపిన వారు, కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నవారు, నినాదాలిస్తే నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏమిటంటే మేము పూర్తిగా సంతృప్తి చెందక పోయినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలూ దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తున్న ఆఖరి ఘడియల్లో, ప్రజల సెంటిమెంట్ గౌరవించే విధంగా... సీమాంధ్రకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము నమ్ముతూ బిల్లుకు మద్దతిస్తున్నాం. ఏచూరి: సభలో ఆర్డర్ తీసుకు రండి. సభ్యుల ప్రజాస్వామ్య హక్కు నిలబెట్టండి. అధ్యక్ష స్థానంలో ఉన్న వారి బాధ్యత అది. డిప్యూటీ చైర్మన్: చాలా ప్రయత్నించాను. తప్పు నాది అనకండి. ఏచూరి: మీరు గనక డివిజన్ చెయ్యకపోతే, నిరసనగా మేము వాకౌట్ చెయ్యదల్చాం. ఈ వాకౌట్ ‘అప్రజాస్వామ్య పద్ధతికి నిరసనగా’ అని రిజిస్టర్ అవ్వాలి. డిప్యూటీ చైర్మన్: ‘వెల్’లో సభ్యులుండగా డివిజన్ ఎలా చెయ్యను. ఏచూరి: ఇది చాలా అప్రజాస్వామికం. రాంగోపాల్ యాదవ్: డివిజన్ లేనందున నిరసనగా మేం వాకౌట్ చేస్తున్నాం. డిప్యూటీ చైర్మన్: గౌ॥మంత్రిగారు ప్రతిపాదించారు. బిల్లు పాసయ్యింది. సభ రేపు ఉదయం 11 గంటల వరకూ వాయిదా పడింది. (20-2-2014 గురువారం రాత్రి 8.07 నిమిషాలకు సభ ముగిసింది) రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన తతంగం అంతా ‘పుస్తకరూపంలో’ అందించాను. ఎలాంటి ఓటింగూ లేకుండానే లోక్సభలో బిల్లు పాసయినట్లు ప్రకటించడం... రాజ్యసభలో సభ్యులు తమ తమ స్థానాల్లో లేకుండానే ‘మెజారిటీ’ సభ్యుల అభిప్రాయం ఓటు ద్వారా తెలుసు కోకుండానే బిల్లు పాసయినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రణబ్ ముఖర్జీగారి ముందు రాజ్యాంగ సంబంధమైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను. నేను లేవనెత్తిన ప్రశ్నలకు, ఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికలో, జైపాల్రెడ్డి, దిగ్విజయ్సింగ్ మాట్లాడిన మాటల్లో సమాధానం దొరికింది. వారి మాటల్ని కూడా రాజ్యాంగాధినేత ప్రణబ్ ముఖర్జీ గారికి పంపాను. ఆ లేఖ అనువాదం ఇదీ... అత్యంత గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి, పార్లమెంటులో 18.2.2014 న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాజ్యాంగ బద్ధంగా ఆమోదించబడిందా.. మన రాజ్యాంగ నిర్మాతలు పాటించిన విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగానే విభజన బిల్లును ఆమోదించారా అనే అంశంపై వాస్తవాలను మీరు నిర్ధారించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ 7-10-2015 న మీకు రాసిన లేఖలోని అంశాలను బలపర్చేలా మళ్లీ ఈ లేఖను రాసి మీకు పంపుతున్నాను. ఈ సందర్భంగా 18.11.2015 న మాజీ కేంద్రమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ జైపాల్రెడ్డి గారు ఒక ‘ప్రెస్-మీట్’లో మాట్లాడిన మాటల ఇంగ్లీష్ అనువాదం మీకు పంపుతున్నాను (తెలుగులో వారన్న మాటలు యథాతథంగా జతపరుస్తున్నాను) ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పాసయ్యిన తీరును వారు మీడియా వారికి వివరిస్తూ 18.2. 2014 నాడు లోక్సభ స్పీకర్ ఛాంబర్లో తాను, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మాస్వరాజ్, స్పీకర్ శ్రీమతి మీరాకుమార్ భేటీ అయినప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటిగంట వరకూ, ఏం జరిగిందో చెప్పారు. పై ముగ్గురూ, తన (జైపాల్రెడ్డిగారి) ప్రోద్బలంతో, కుట్రపన్ని, రాజ్యాంగాన్ని, నిబంధనలనూ పక్కకు నెట్టి ‘బిల్లు’ ఆమోదింపచేశారంటూ అన్ని సందేహాలకూ సమాధానంగా ఆయన వివరించారు. ఆ సమయంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరూ అక్కడే ఉన్నారని ధృవీకరించారు. జైపాల్ రెడ్డి వివరణను, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్సింగ్, వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా బలపర్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, మాజీ స్పీకర్ మీరాకుమార్ల వల్లనే తెలంగాణ రాష్ట్రమొచ్చిందని, ఆయన బహిరంగసభలో అన్న మాటలు కూడా మీకు పంపిస్తున్నాను. అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో రాజ్యాంగాధి నేత అయిన మీరు తగుచర్యలు తీసుకోవాలని, జరిగిన చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలను క్రమబద్ధీకరించి పార్లమెంట్ గౌరవాన్ని మర్యాదను కాపాడ తారని నమ్ముతూ... మీ ఉండవల్లి అరుణ్కుమార్ 26.11.2015 బహిరంగ సభలో దిగ్విజయ్ సింగ్ ప్రసంగం: సోదర సోదరీమణులైన వరంగల్ ఓటర్లను నేను ప్రశ్నించద ల్చుకున్నదేమిటంటే, 544 మంది సభ్యులున్న పార్లమెంటులో తెలంగాణను సాధించడం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సాధ్యమేనా? అలాంటప్పుడు మీకు తెలంగాణను సాధించి పెట్టింది ఎవరు? సోనియా గాంధీ మీకు తెలంగాణను ప్రసాదించారు. డాక్టర్ మన్మోహన్సింగ్ మీకు తెలంగాణను ఇచ్చారు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్న మీరా కుమార్ గారు.. ఈమే మీకు తెలంగాణను సాధించిపెట్టారు. జైపాల్రెడ్డి ప్రెస్మీట్: జాతీయ పార్టీలు సపోర్టు చేసినందునే ఈ బిల్లు పాసయ్యింది. సీమాంధ్ర ఎంపీలందరూ కూడా, కారాలు మిరియాలతో సహా లోక్సభలో యుద్ధం చేసినా, జాతీయ పార్టీ ఎంపీలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిలబడ్డారు. సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు దాదాపు నూరుమంది కాంగ్రెస్ ఎంపీలు నిలబడ్డారు... యుద్ధం చేశారు. మరొక్క విషయం... ఈ తెలంగాణ బిల్లు పాస్ చేసే క్రమంలో అన్నిటికంటే ముఖ్యమైన, కీలకమైన దినం ఏమిటయ్యా... 18 ఫిబ్రవరి 2014... 18 ఫిబ్రవరి 2014 నాడు బిల్లు పాసయ్యింది. 12 గంటలకు లోక్సభ ఎడ్జర్న్ అయిపోయింది. నడవలేదు... ఇక బిల్లు రాదనుకున్నారు. నిజానికి 12 ‘0’ క్లాక్ తర్వాత లోక్సభలో వచ్చేది... దీని తర్వాత బడ్జెట్. మా చిదంబరం గారు బడ్జెట్ పేపర్స్తో సహా వచ్చేశాడు. అప్పుడు పొన్నం ప్రభాకర్గారు నన్ను తీసుకెళ్లాడు స్పీకర్ దగ్గరికి. స్పీకర్ రూంలో జరిగిన విషయాలు సున్నితమైనవి కాబట్టి, నా ఎన్నికలో నేను ఓడిపోయాను తప్ప, విషయాలు బైట పెట్టలేదు. ఎందుకంటే నేను దాదాపు అర్ధశతాబ్దం, రాజ్యాంగ మర్యాదలు కొంత వరకూ పాటించిన వాడిని. అప్పటికే మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ అక్కడున్నారు. సుష్మాస్వరాజ్ గారిని పొన్నం ప్రభాకరే కాళ్లు పట్టుకుని తోడుకొచ్చాడు. సుష్మా స్వరాజ్ మధ్య మరియూ మా మంత్రి కమల్నాథ్ల మధ్య సయోధ్య కుదరలేదు. నే వెళ్లిన తర్వాత స్పీకర్ సమక్షంలో స్పీకర్ ఛాంబర్లో సయోధ్య ఏర్పాటు చేశాను. ఏ రూల్ కింద ఈ బిల్లు పాస్ చేయవచ్చునో చూపెట్టాను. ఆ 12 నుంచి 1 ‘0’ క్లాక్, స్పీకర్ ఛాంబర్లో జరిగినటువంటి చర్చ, తద్వారా వచ్చిన నిర్ణయం ద్వారానే బిల్లు పాసయ్యింది. 18 ఫిబ్రవరి నాడు బిల్లు పాస్ కాకపోతే, తెలంగాణ రాష్ట్రం అంటూ ఉండేది కాదు... అయ్యేది కాదు. - ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
ఆమిర్ ఖాన్ భార్యకు అభినందనలు
హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమిర్ ఖాన్కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి బాసటగా నిలిచారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ ఖాన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశభక్తిని పెంపొందించే ఎన్నో చిత్రాలలో నటించిన ఆమిర్.. సముచిత స్థానంలో ఉన్నాడని ఆయన తెలిపారు. గత కొన్ని మాసాలుగా తానూ అభద్రతాభావంతో ఉన్నానని జైపాల్ రెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న అసహనంపై తన అభిప్రాయాన్ని నిజాయితీగా భర్తకు తెలిపిన కిరణ్ రావును ఆయన అభినందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అలా అభిప్రాపయడటం సహజమేనని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. -
ఓటమి భయంతోనే కేసీఆర్ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అవాస్తవాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ నిగ్రహం కోల్పోతే సీఎం కేసీఆర్కే నష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్రెడ్డి హెచ్చరించా రు. గాంధీభవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతో వణికిపోతూనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని అందరికీ అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అబద్ధాలతో, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి సీఎం స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. ‘‘కేంద్ర మంత్రి పదవిని పట్టుకుని నేను వేలాడినట్టుగా, తాను మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నట్టుగా కేసీఆర్ చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. నేను మంత్రి పదవిలో లేకుంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చేది కాదు. హైదరాబాద్ నుంచి రూ. 25 వేల కోట్ల రెవెన్యూ తెలంగాణకు అందేది కాదు. ఫిబ్రవరి 18న బిల్లును ఎలా ప్రవేశపెట్టాలో, బిల్లును ఎలా నెగ్గించుకోవాలో స్పీకర్తో కలసి నేను చేసిన వ్యూహం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. సీమాంధ్ర మంత్రులు, అప్పటి సీఎం, సీమాంధ్ర నేతలు ఆ బిల్లు నెగ్గకుండా ఎన్నో కుట్రలు చేసినా.. నేను కేంద్రమంత్రిగా ఉంటూ వాటిని తిప్పికొట్టడం వల్లే బిల్లు ఆమోదం పొందింది. ఈ విషయం కేసీఆర్కు కూడా తెలుసు’’ అని జైపాల్రెడ్డి పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్ కుటుంబంతో సహా సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్లను కలసిన తర్వాత నన్ను కూడా కలిశారని గుర్తుచేశారు. కాంగ్రెస్లో చేరాలని తాను కేసీఆర్ను కోరానని, కేసీఆర్ కూడా అందుకు వ్యతిరేకత చూపలేదని చెప్పారు. 2009లో దీక్షకు దిగిన కేసీఆర్ రెండోరోజే ఎందుకు విరమించారని జైపాల్రెడ్డి ప్రశ్నించారు. దీక్షను విరమిస్తూ పళ్ల రసం తాగడంతో కేసీఆర్పై మండిపడుతూ విద్యార్థులు, యువకులు ఉద్యమంలోకి దిగారని, దిష్టిబొమ్మలను దహనం చేశారని గుర్తుచేశారు. దానికి భయపడే కేసీఆర్ దీక్షను కొనసాగించారన్నారు. కేసీఆర్ దీక్షలోని మర్మమేమిటో తమకు తెలిసినా... ఉద్యమాన్ని, తెలంగాణను పలుచన చేయకూడదనే దానిపై ఇప్పటిదాకా మాట్లాడలేదని జైపాల్రెడ్డి చెప్పారు. కేసీఆర్ బండారం బయటపెట్టకపోవడం తమ అసమర్థతో, చేతకానితనమో కాదన్నారు. కేసీఆర్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడాల్సి ఉంటుందని, కానీ కేసీఆర్ స్థాయికి తాము దిగజారబోమని వ్యాఖ్యానించారు. నిగ్రహం కోల్పోయి మాట్లాడితే కేసీఆర్కే నష్టమని హెచ్చరించారు. సీఎం పదవి తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా పనిచేయాలని అధిష్టానం నుంచి తనకు సూచనలు అందాయని జైపాల్రెడ్డి తెలిపారు. కానీ తెలంగాణకు చెందిన తనకు సీఎంగా అవకాశమిచ్చి తెలంగాణ ఏర్పాటును ఆపుతారేమోననే ఆందోళనతో ముఖ్యమంత్రి పదవిని తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ రాకుంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు కూడా నష్టం కలుగుతుందనే ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలను బయటపెట్టి తన స్థాయిని దిగజార్చుకోలేనని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిగ్రహం కోల్పోయి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను అప్పుడూ, ఇప్పుడూ జాతీయవాదినేనని... జాతీయవాదం వేరు, తెలంగాణ వాదం వేరని జైపాల్రెడ్డి చెప్పారు. -
'రాష్ట్రంకోసం సీఎం పదవినే వద్దనుకున్నా'
-
'రాష్ట్రంకోసం సీఎం పదవినే వద్దనుకున్నా'
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పదవిని తీసుకోలేదని కాంగ్రేస్ జాతీయ నాయకులు జైపాల్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్ విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే అవగాహన ఉందన్నారు. ఉధ్యమంలో భాగంగా తనను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయలేదని విమర్శిస్తున్నారనీ.. ఒకవేళ తాను అలా చేసి ఉంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పడి ఉండేది కాదని జైపాల్ రెడ్డి వివరించారు. -
ఆయన చరిత్ర అందరికీ తెలుసు...
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రులుగా ఉంటూ గతంలో తెలంగాణ పేరు చెప్పడానికి ఇష్టపడని జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణనలు తమను విమర్శించే హక్కు లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్లో తమకు పోటీ ఎవరూ లేరని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేసిన అవినీతిని అందరూ చేస్తారని అనుకుంటున్నారని కర్నె మండిపడ్డారు. ఆయన చరిత్ర అందరికీ తెలుసంటూ ధ్వజమెత్తారు. కాగా డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి.. దళితులను కేసీఆర్ అవమానించారంటూ జైపాల్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం అయినట్లే... తెలంగాణ సీఎం కేసీఆర్కి కూడా వరంగల్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమతమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి గురువారం వరంగల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు -
'ప్రధాని స్థాయిని మున్సిపల్ స్థాయికి దిగజార్చారు'
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని స్థాయిని మున్సిపల్ స్థాయికి దిగజార్చారని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. మోదీ అనుసరించిన మతతత్వ విధానాలతో పాటు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ చేసిన ప్రకటనలు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణంగా ఆయన విశ్లేషించారు. ఈ ఫలితాలతో అయినా మోదీ కళ్లు తెరవాలని ఆయన సూచించారు. బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం వరంగల్ ఉప ఎన్నికపై ఉంటుందని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్ను తప్పుపట్టవద్దన్న జైపాల్
పార్లమెంట్లో ఏం జరిగింది -5 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్సభలో జరిగిన సన్నివేశాల కొనసాగింపును ఇప్పుడు చూద్దాం. సీమాంధ్రకు చెందిన భారతీయ జనతా పార్టీ కార్య కర్తలూ, నాయకులూ హైదరాబాద్తో సహా తెలంగాణ వేర్పాటు కోరుకుంటున్నారని, మరే పార్టీ కోరుకోవటం లేదని సుష్మాస్వరాజ్ గారు చెప్పారు.‘‘హోంమంత్రిగారు మాట చెప్తే కాదు. లోటు భర్తీకి కేటాయింపు జరపాలి’’ అని కూడా అన్నారు. అంతకు ముందు రోజే ‘ఓట్ ఆన్ అకౌంట్’ చేసేసి దుకాణం మూసేశాక, కొత్త కేటాయింపులు జరపలేరని ఆవిడకు తెలియక చెప్పింది కాదు ‘ఇన్టర్మ్ బడ్జెట్’ అంటూ మరోమాట కూడా అన్నారు. 21వ తారీఖున 15వ లోక్సభే కాలం చెల్లిపోతుంటే... ఎందుకీ మాట అన్నట్లు...? పోలవరం ప్రాజెక్టు గురించి, మండలాల గురించి జైరాం రమేష్ గారికి వెంకయ్య నాయుడు గారికి ఒప్పందం కుదిరిందని సంబంధిత ఉత్తరం కూడా ఉందని సుష్మా స్వరాజ్ గారు అన్నారు! తప్పుడు బిల్లు ఎందుకు పాస్ చేయిస్తున్నారంటూ ప్రశ్నించారు కూడా... రండి రాజ్యాంగ సవరణ చేసి సరైన బిల్లు పాస్ చేద్దాం అని కూడా అన్నారు. నిజంగా రాజ్యాంగ సవరణ బిల్లు తెస్తే, మూడింట రెండొంతులు మెజారిటీతో అది ‘పాస్’ అవు తుందా? సాధారణ మెజారిటీతోనే పాసయ్యే పరిస్థితి లేకే టెలికాస్ట్ ఆపుచేసి తలుపులు మూసేసి, ‘డివిజన్’ చేయకుండా ‘మాయ’ చేస్తున్నారని ఆవిడకి తెలియదా!? పాపం షానవాజ్ హుస్సేన్ గారికి ఈ ‘కుట్ర’ తెలిసుండదు. - టీవీ ప్రసారాలు ఎందుకాపేశారు... ఎందుకాపేశారు అంటూ విరుచుకుపడ్డారు! ‘ఇదీ కథ’ అని బీజేపీ అగ్రనాయకులు చెప్పి ఉంటారు... మళ్లీ నోరిప్పలేదాయన!! - ప్రతిపక్షంలోని మిగిలిన అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయని, అయినా బీజేపీ ఒక్కటే ఈ బిల్లును సపోర్టు చేస్తున్నదని సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ గారే ప్రకటించటం గమనార్హం! - 15.10: జైపాల్రెడ్డి: ఈ డిమాండ్ గత 60 సంవత్సరాలుగా లేవనెత్తబడుతోందని గుర్తు చేస్తున్నాను. దేశచరిత్రలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంతటి దీర్ఘకాలిక అలజడితో కూడిన డిమాండ్ మరొకటి లేదనుకుంటా. ఈరోజు, ఇంతటి పవిత్రమైన, ఆనంద దాయకమైన సందర్భంలో మనమంతా ఇలాంటి క్రమశిక్షణ లేని దృశ్యంలో ఉండటం, ఆశ్చర్యం-బాధాకరం. - మిత్రులారా! 2004 యూపీఏ మేనిఫెస్టోలో ఈ డిమాండ్ ఉల్లేఖించబడింది. 2004 అధ్యక్షోపన్యాసంలో ఒప్పుకోబడింది. నేను నా ఆంధ్ర మిత్రులని అడుగుతున్నా. ఇన్నాళ్లూ ఏం చేశారు? కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారా... సుష్మాస్వరాజ్ గారికి, మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూనే కాంగ్రెస్ను తప్పు పట్టవద్దని కోరుతున్నా. ఈ గొప్ప సందర్భం కోసం కాంగ్రెస్ పునాదులు తయారు చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో లబ్ధి కోసం వారు చేస్తున్నారని మీరంటున్నారు. - మేడమ్, 2009 డిసెంబర్ 9న నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నికలున్నాయా? అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్న సీమాంధ్ర మంత్రులు ఏం చేస్తున్నారు.... నిరసన వ్యక్తం చేశారా? ఇప్పుడెందుకు తొందరపాటు నిరసనలు? - గత 45 సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణ డిమాండ్ను సమర్థించింది. నేను మొట్టమొదటిసారి 1969లో ‘కాడెద్దులు’ గుర్తుతో ఎన్నికలో గెలిచాను. నేనా ఒరిజినల్ కాంగ్రెస్లో ఒకడిని. 1969లోనే తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభమయ్యింది. బీజేపీ, పూర్వజన్మలో భారతీయ జనసంఘ్, అప్పుడూ తెలంగాణను సపోర్టు చేసింది. అప్పట్నుంచీ సపోర్టు చేస్తూనే వచ్చింది. బీజేపీలోనే కాక, దేశంలోనే అతి పెద్ద రాజ నీతిజ్ఞుడు అయిన అద్వానీ గారి వ్యతిరేక స్వరం విని నేను నిశ్చేష్టుడనయ్యాను. ఏది ఏమైనప్పటికీ సుష్మాస్వరాజ్గారు వ్యక్తిగత హోదాలోనైనా మద్దతుగా మాట్లాడినం దుకు ధన్యవాదాలు. - ‘విశాలాంధ్ర’ అనే పత్రిక ఉన్నప్పటికీ, మునుపటి రోజుల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించినప్పటికీ,ఇప్పుడు తెలంగాణకు మద్దతు తెలుపుతున్న కమ్యూనిస్టు పార్టీ వారికి అభినందనలు. - ఈ అద్భుతమైన ప్రయోజనం సిద్ధించడానికి ప్రధాన కారకులు ఒకే వ్యక్తి, ఒకే మహిళ, సోనియా గాంధీ. నేను సోనియాజీతో సన్నిహితంగా 15 ఏళ్లు పనిచేశాను. స్పీకర్: ఆల్రైట్ జైపాల్రెడ్డిగారూ... దయచేసి ముగించండి! జైపాల్: ఆమెకు అంతర్జాతీయ అవగాహన ఉంది. ఆమె ఏనాడు సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు? ఈ సందర్భంలో నేను తెలంగాణ ప్రజల తరఫున ఒకమాట చెప్తున్నా. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టంలో మేము ఏనాడూ సీమాంధ్ర ప్రజలను వివక్షతో చూడం. మనందరికీ తెలిసిందే... చివరాఖరికి మనమంతా తెలుగువాళ్లం. మనమంతా భారతీయులం. భారత రాజ్యాంగం చేత పాలించబడుతున్న వాళ్లం. స్పీకర్: ఆల్రైట్...ఓకే... దయచేసి ముగించండి! జైపాల్: ఈ సందర్భంగా సోనియాగాంధీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియ చేస్తూ సీమాంధ్ర ప్రజలకు నమ్మకంగా చెప్తున్నా... హైదరాబాద్లో సీమాంధ్ర వారిని ఎవరైనా వేరుగా చూస్తే తలదించుకునేవాళ్లలో నేను మొదటివాడినవుతా. స్పీకర్: జైపాల్రెడ్డిగారూ! దయచేసి ముగించండి! స్పీకర్: ఆల్రైట్ థ్యాంక్యూ. జైపాల్: నేనింకెంతో కాలం ఉండను. ఉన్నకాలంలో నాకి వ్వబడిన సమయంలో సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం నన్ను నేను అంకితం చేసుకుంటున్నా. థ్యాంక్యూ. స్పీకర్: థ్యాంక్యూ సో మచ్. ఎవరైనా మాట్లాడాలనుకున్నవాళ్లు రాసుకొచ్చిన ఉపన్యాసాలను ‘టేబుల్’ చెయ్యండి. ఇక ప్రొసీడ్ అవుతాను. పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులూ సమానంగా గౌరవించే మేధావి జైపాల్ రెడ్డి గారు. ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ గారు ‘ఇక ముగించండి, ఇక ముగించండి’ అంటూ అడ్డుతగలడం - బహుశా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇదే మొదటి సారి అయి ఉంటుంది. ఇన్నాళ్లూ ‘కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారా’ అని ఆంధ్రా మిత్రుల్ని ప్రశ్నించారు జైపాల్రెడ్డిగారు. నిజానికి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో రెండవ ఎస్సార్సీ (స్టేట్స్ రి-ఆర్గనైజేషన్ కమిషన్) వేస్తామని చెప్పింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి చేత తెలంగాణ విషయమై ఈ కింది మాటలు చెప్పించింది యూపీఏ ప్రభుత్వం. ‘‘సరైన సమయంలో, తగు సంప్రతింపుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’. ఇక 2009లో చిదంబరం తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీకృష్ణ కమిషన్ను నియమించింది. ‘అద్వానీగారు వ్యతిరేక స్వరం విని నిశ్చేష్టుడనయ్యాను’ అన్నారు జైపాల్రెడ్డి. ‘‘రాష్ట్ర విభజన రాబోయే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. ఎందుకీ అల్లకల్లోలంలో హడావిడి నిర్ణయం. ఓట్ ఆన్ ఎకౌంట్ పూర్తి చేసి 15వ లోక్సభను ముగించండి’’ అని అద్వానీ గారు కోరిన విషయం సర్వ విదితమే. దీనినే జైపాల్రెడ్డి ప్రస్తావిస్తూ ‘వ్యతిరేక స్వరం’ అన్నారు. అరవై ఏళ్లుగా నలుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మీద చర్చ ముగిసి పోయింది. ఇద్దరే ఇద్దరు పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్, జైపాల్రెడ్డి. ఇంకెవ్వరైనా మాట్లాడాలనుకుంటే, వారి ఉపన్యాసాల వ్రాతప్రతులు ‘టేబుల్’ చెయ్యండి... (అంటే స్పీకర్ ముందు కూర్చునే సెక్రటరీకి అందచెయ్యమని) అన్నారు. బోడో ఫ్రంట్కు చెందిన సంసుమకునగ్గర్ బిశ్వమూర్రియర్ , శైలేంద్రకుమార్, దారాసింగ్, సౌగత్రాయ్ పునియా, సుదీప్ బందోపాధ్యాయ, మహేంద్రసింగ్ చౌహాన్, కిరీటి ప్రేమ్జీ భాయ్ సోలంకి, అర్జునరామ్ మేఘవాల్, గురుదాస్ దాస్ గుప్తాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన పనబాక లక్ష్మి, బొత్స ఝాన్సీ, మధు యాష్కీ, సురేశ్ షట్కర్, పొన్నం ప్రభాకర్, జి. వివేకానందలు కూడా తమ స్పీచ్లు ‘టేబుల్’ చేశారు. ఇవన్నీ పార్లమెంట్ రికార్డుల్లో నమోదు చేయబడ్డాయి. 12-11-1962న డాక్టర్ జీఎస్ మేల్కోటే అనే లోక్సభ సభ్యుడు తను వ్రాసు కొచ్చిన ‘స్పీచ్’ని టేబుల్ చేస్తానంటే అప్పటి స్పీకర్ ‘అలా చేయటానికి వీలులేదని రూలింగ్ ఇచ్చారు! ఆ రూలింగ్ కూడా ‘బ్రేక్’ చేయబడింది. - వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు - ఉండవల్లి అరుణ్కుమార్ a_vundavalli@yahoo.com -
రావణాసురుడికి 10 తలలుంటే..
హైదరాబాద్ : సంఘ్పరివార్, ఆర్ఎస్ఎస్పై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావణాసురుడికి 10 తలలు ఉంటే... సంఘ్పరివార్, ఆర్ఎస్ఎస్కు 100 తలలు ఉన్నాయని ఆయన సోమవారమిక్కడ ధ్వజమెత్తారు. ఆ రెండూ...రావణాసురిడిని మించిన దుష్టశక్తులంటూ వ్యాఖ్యానించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహంగా ఉన్నారన్న మాటలు బూటకమని జైపాల్ రెడ్డి కొట్టిపారేశారు. కాగా సంఘ్ పరివార్ను అడ్డుకునేందుకు అందరూ ఏకం కావాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. -
'వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది'
-
'వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది'
హైదరాబాద్: తాను జీవితాంతం కాంగ్రెస్లోనే కొనసాగాలనుకున్నా.. పార్టీలోని పరిణామాలతో కొనసాగలేకపోతున్నానని పేర్కొంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి డి.శ్రీనివాస్ ఒక లేఖ రాశారు. పార్టీని వీడుతున్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుధవారం రాత్రే ఈ లేఖను ఫ్యాక్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్దే కీలకపాత్ర. రాష్ట్రం ఇచ్చిన ఘనతను గత ఎన్నికల్లో ఉపయోగించుకోలేకపోయాం. దానికి కారణం మీ చుట్టూ చేరిన నాయకుల తప్పుడు సలహాలు. కొందరు స్వార్థపరులు అసూయతో చేసిన ఫిర్యాదులతో తన వంటి సిన్సియర్, నిజాయతీ పరులైన నాయకులను అవమానించారు..’’ అని ఆ లేఖలో డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్కు ఈ ప్రాంతంలో ఎదురే ఉండదని విశ్వసించామని, పొన్నాల లక్ష్మయ్య వంటి బలహీనమైన నాయకుడికి టీపీసీసీ పదవి ఇవ్వడంతో చాలా నష్టపోయామన్నారు. ‘జానారెడ్డి, జీవన్రెడ్డి వంటి నాయకులు టీడీపీ నుంచి వచ్చారు. జైపాల్రెడ్డి జనతాదళ్లో ఉన్నప్పుడు తిట్టిన తిట్లు తక్కువేమీ కాదు. అలాంటి నాయకులకు ఉన్నత పదవులు కట్టబెడుతూ.. నాలాంటి సిన్సియర్ నాయకులను అవమానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. పదవిని ఆశించిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా వేరొకరిని ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా నాతో ఎవరూ మాట్లాడలేదు. అంతకుముందు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వడంలోనూ చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత షబ్బీర్ అలీని ఎంపిక చేయడంలోనూ దిగ్విజయ్సింగ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దిగ్విజయ్ నాపై కక్షగట్టారు. పార్టీలో రాహుల్గాంధీ శకం నడుస్తున్నది. రాహుల్ శకంలో రాజు, రావులదే హవా నడుస్తోంది. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక, బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్నా..’’ అని డీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు. నేడు రాజీనామా ప్రకటన.. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు. -
మోదీకి జ్ఞానం పూజ్యం: జైపాల్
మాటలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ దొందూదొందే హైదరాబాద్: ‘ప్రధాని నరేంద్రమోదీకి జ్ఞానం పూజ్యం (శూన్యం). అహంకారం పరిపూర్ణం. చరిత్ర తెలియని అజ్ఞాని మోదీ. ఆయన అధికార మదాందంతో వ్యవహరిస్తున్నారు’ అని కాంగ్రెస్ జాతీయ నాయకులు ఎస్.జైపాల్రెడ్డి విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ, నేతలు జి.వివేక్, శ్రవణ్, ఉద్దెమర్రి నర్సింహ్మారెడ్డితో కలసి గాంధీభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తక్షశిల అనే నగరం పాకిస్తాన్లో ఉందనే విషయం తెలియకుండా బిహార్లో ఉందని చెప్పడం మోదీ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అలెగ్జాండర్కు గంగానది విషయ మే తెలియకున్నా, గంగానది ఒడ్డున ఓడించారని మోదీ చెప్పారన్నారు. మోదీకి చరిత్ర, భూగోళశాస్త్రం తెలియదని, ఇలాంటి అజ్ఞానిని ఎక్కడా చూడలేదన్నారు. మంచివక్తగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్ను మోదీ డమ్మీని చేశారని, మోదీకి రాజకీయ గురువుగా ఉన్న అద్వానీని మమ్మీగా మార్చేశారని జైపాల్ విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కి తెప్పించి, ప్రతీ పౌరునికి 15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామన్న మోదీ.. ఈ ఏడాదిలో ఎంత జమచేశారని ప్రశ్నించారు. రైతులకు భూములపై హక్కుల్లేకుండా తెచ్చిన భూసేకరణ చట్టానికి టీఆర్ఎస్ ఎలా మద్దతిచ్చిందని ప్రశ్నించారు. దీంతో రెండు పార్టీలూ రైతు వ్యతిరేక పార్టీలేనని తేలిపోయిందన్నారు. హామీలను అమలుచేయకుండా మోసం చేయడంలో అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం కేసీఆర్ దొందూదొందేనని వ్యాఖ్యానించారు.