ఓటుకు కోట్లు కేసుపై రెండురోజుల్లో స్పందిస్తానని సినీనటుడు, జనసేవ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్, సెక్షన్-8పై మరో రెండు రోజుల్లో ప్రెస్మీట్ పెడతానని ట్విట్ చేశారు. ఒకవేళ రెండు రోజుల్లో వీలు కాకుంటే ఈ వారం చివర్లో కానీ, లేదా వచ్చే వారం కానీ ప్రెస్మీట్ పెడతానన్నారు.