స్వదేశీ విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఉడాన్ పథకం ప్రారంభమైంది. గంటలోపు ప్రయాణాలలో విమానంలోని సగం సీట్లకు రూ. 2,500 మాత్రమే వసూలు చేయాలన్న నిబంధన అమలులోకి వచ్చింది. వినియోగదారుల ధరల సూచికి అనుగుణంగా విమాన టికెట్ల ధరలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ప్రధాన రూట్లలో ప్రతి డిపార్చర్ మీద చిన్నమొత్తంలో లెవీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం విమానయాన సంస్థలు అంత తేలిగ్గా జీర్ణించుకునే పరిస్థితి లేదు. దానివల్ల విమానచార్జీలు పెంచాల్సి ఉంటుందని అంటున్నాయి. అయితే లెవీ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. రాబోయే రోజుల్లో దీన్ని నిర్ణయిస్తారు.