ashok gajapathi raju
-
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
ఆ కష్టాలు మాకొద్దు ‘రాజా’..!
విజయనగరం: విజయనగరం.. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం. ఏళ్ల తరబడి రాజుల పాలనలో ఉన్నా అభివృద్ధి శూన్యం. రాజులను నమ్మి జనం అధికారం కట్టబెట్టినా అది అలంకార ప్రాయంగానే చూశారు. ప్రజల కష్టాలు అరణ్యరోదనగానే మిగి లాయి. ఏ నాడూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ధ్యాస, మంచిచేయాలన్న తపన రాజరిక కుటుంబానికి లేకపోవడమే దీనికి కారణం. ఓ వైపు నగర జనాభా పెరుగుతున్నా... కాలనీలు విస్తరించినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కనీ సం కృషి చేయలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు కోటదాటి బయటకు వచ్చిన సందర్భాలు అరుదు. జనానికి రాజు మొహం కనిపించిందంటే అదే మహాభాగ్యంగా ఉండేది. ఎన్నికల వేళ జనంలోకి రావడం.. తర్వాత బంగ్లాకు లేదంటే ఢిల్లీకి పరిమితం కావ డమే ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో నగర వాసులు దాహార్తితో అల్లాడినా మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోలేదు. గుక్కెడు తాగునీటి కోసం బంగ్లా వద్ద ఆందోళనలు చేసినా కనికరించలేదు. రోడ్ల విస్తరణ పరిస్థితీ అంతే. తవ్వేసి వదిలేశారు. పాడైన రోడ్లపై రాకపోకలకు పట్టణ వాసుల అవస్థలు వర్ణనాతీతం. పదవీ కాలమంతా కోట, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకే పరిమితమయ్యారు. అన్ని రంగాల్లో నగర అభివృద్ధిని మసకబారించారన్న అపవాదను అశోక్ మూటగట్టుకున్నారు. కార్పొరేషన్ స్థాయిలో సదుపాయాల కల్పనకు అశోక్ కనీసం ఆలోచన చేయలేదని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని శివారు కాలనీల పరిస్థితి అయితే ఐదేళ్ల కిందట దుర్భరం. తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అశోక్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు కుమార్తె తరఫున ప్రచారానికి వస్తున్న అశోక్ను జనం బహిరంగంగానే నిలదీస్తున్నారు. మీరు పదవులు అనుభవించడమే తప్ప జనానికి ఏ రోజైనా మేలు చేశారా..? కనీసం మా సమస్యలు ఆలకించారా..? మాట్లాడేందుకు అవకాశం కల్పించారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.జనాభా పెరిగినా..విజయనగరంలో 2001 సంవత్సరంలో సుమారు లక్ష వరకు ఓటర్లు ఉండగా... 2005 నాటికి 1.05 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2.44 లక్షల జనాభా ఉండగా.. 2014 సంవత్సరం నాటికి జనాభా సంఖ్య సుమారు 3 లక్షలు ఉండేది. అప్పట్లో గాజులరేగ, జమ్ము, ధర్మపురి, అయ్యన్నపేట, వేణుగోపాలపురం, కెఎల్పురం ప్రాంతాలను విజయనగరం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. వీటి పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 80 వరకు ఉండేవి. వీరిలో అర్హులైన వారికి హౌస్ఫర్ ఆల్ పథకంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించగా.. లబ్ధిదారుల నుంచి టీడీపీకి చెందిన దిగవ స్థాయి నాయకులు లంచాలు వసూలు చేసి చివరికి ఇల్లు అప్పగించకుండా మోసం చేసినట్టు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2014–19 మధ్య రూ.279 కోట్లతో రెండువేల పనులు చేపట్టేందుకు అప్పటి టీడీపీ పాలకవర్గం ఆమోదించగా... అందులో రూ.93 కోట్లతో 700 పనులు మాత్రమే పూర్తిచేయగలింది.నాటికి నేటికీ తేడా చూడు..రాజులు కోట, బంగ్లాకే పరిమితమైతే.. నేటి పాలకులు జనం మధ్యనే ఉంటూ.. జనం అవసరాలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు చకచకా పూర్తిచేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ 59 నెలల పాలనలో ఇది మన విజయనగరం అని మురిసిపోయేలా.. గర్వంగా చెప్పుకునేలా అన్ని కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా చెరువు గట్లను పార్కులుగా మలిచారు. మహిళల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా పార్కును నిర్మించారు. తాగునీటి పథకాలు నిర్మించి నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి కష్టాలను దూరం చేశారు. శివారు కాలనీలకు రోడ్లు వేశారు. విద్య, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. సరస్వతీ నిలయాలకు సొబగులద్దారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేశారు. నగరానికి ఏ వైపు నుంచి వచ్చిన వారికై నా ఇది మన విజయనగర వైభవం అని చాటిచెప్పేలాహంగులు కల్పించారు.పాలకుడంటే జనం కష్టాలు తెలిసిన వాడు.. తెలుసుకునేవాడై ఉండాలి.. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చగలగాలి. ఆపద సమయంలో నేనున్నాంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలి. ఓ విజన్తో నగరాభివృద్ధికి కృషిచేస్తూ.. ప్రతీ ఒక్కరికీ మంచి చేయాలన్న తపనతో ముందుకు సాగాలన్నది జనం మాట. అధికారాన్ని అలంకారంగా భావించి.. కష్ట కాలంలో కోటదాటని పాలకులు.. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వస్తుంటే ఛీకొడుతున్నారు. దాహార్తితో అల్లాడుతున్నా పట్టించుకోని రాజులు.. రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేయనివారు.. విజయనగర వైభవాన్ని మసకబారించేలా వ్యవహరించే రాజరిక పాలన మాకొద్దంటూ మొహంమీదే చెబుతున్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ.. కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా విజయనగర అభివృద్ధికి అనునిత్యం పాటుపడే నాయకుడే పాలకుడుగా ఉండాలని సుస్పష్టం చేస్తున్నారు. -
టీడీపీ పని ఔటేనా? అశోక్ గజపతి రాజు మాటల్లో అంతరార్థం ఏంటీ?
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందా? పార్టీ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్న పరిస్థితులు ఎన్నడూ లేవా? చంద్రబాబు నాయకుడి అసమర్ధ సారధ్యమే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితిని తెచ్చిపెట్టిందా? ఇక పార్టీకి భవిష్యత్తు లేనట్లేనా? టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మనోభావాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ ఔను అన్న సమాధానాలే వస్తాయి. పార్టీ దుస్థితిని చూసి తట్టుకోలేకపోయిన అశోక్ గజపతి రాజు వంటి సీనియరే ఇక పార్టీలో యాక్టివ్గా ఉండలేనని చెప్పేసినట్లు సమాచారం. అంతగా అవసరం అనుకుంటే సలహాలు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారని పార్టీ వర్గాల్లోనే కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ నడక ఎలా సాగుతోంది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఇపుడు ఎంత బలహీనంగా అడుగులు పడుతున్నాయి? ఎన్టీయార్ టిడిపిని స్థాపించినప్పుడు ఆయనతో పాటు చాలా మంది నేతలు రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించారు. చాలా మంది రాజకీయ జీవితాలు అప్పుడే మొదలయ్యాయి. అప్పటి టిడిపి నేతలందరికీ అది ఒక స్వర్ణ యుగం. ఎన్నో విలువలతో ఏర్పడిన నాటి టిడిపి ఎన్టీయార్ తోనే కనుమరుగు అయిపోయింది. ఇపుడున్న టిడిపి చంద్రబాబు నాయకత్వంలో పాతాళం దిశగా శరవేగంగా దిగజారిపోతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి ఎన్టీయార్ టిడిపిని స్థాపించారు. ఆ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీతో నేరుగా చేతులు కలిపిన రోజునే టిడిపిలో ఎన్టీయార్ తాలూకు ఆనవాళ్లు ఏమన్నా ఉంటే అవి మాయం అయిపోయాయి గత సిద్ధాంతాలకు కాలం చెల్లింది. చంద్రబాబు నాయుడి అవకాశవాద రాజకీయాలు టిడిపిని దివాళా తీయించాయనే చెప్పాలి. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు అందులో ఉండి ఆ తర్వాత ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచినపుడు చంద్రబాబుతో అంటకాగిన సీనియర్ నేతలు సైతం టిడిపిని చంద్రబాబు నడిపిస్తోన్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పార్టీలో ఇక క్రియాశీలకంగా కొనసాగలేం అని నిర్ణయించేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో ఎన్టీయార్ హయాంలో మంత్రిగా పనిచేసి ఆయన వెన్నుపోటు సమయంలో చంద్రబాబు శిబిరంలో ఉన్న అశోక్ గజపతి రాజు ప్రస్తుతం టిడిపి తీరుపై కోపంగా ఉన్నారు. ఒకపక్క బిజెపితో ప్రత్యక్ష స్నేహం. మరోవైపు కాంగ్రెస్ తో చీకటి స్నేహం. ఇంత దగుల్బాజీ రాజకీయాలను తన కెరీర్ లోనే చూడలేదని అశోక్ గజపతి రాజు తన అనుయాయులతో అంటున్నట్లు సమాచారం. పార్టీ అధినేతగా చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరి..ఆయన మాటల తీరు కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిన్న కాక మొన్ననే చంద్రబాబు నాయుడు శింగనమల నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని హేళన చేస్తూ పేదలను అవమానిస్తూ డ్రైవర్ల పట్ల తనకున్న ఏవగింపును చాటుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కౌంటర్ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఔను చంద్రబాబూ.. మాది పేదల పార్టీ కాబట్టే పేదవాడైన టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాం..మరో చోట ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాం? మీలా మాది పెత్తందార్ల పార్టీ కాదు కదా అని చురకంటించారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి వెకిలి మాటలు.. దానికి జగన్ మోహన్ రెడ్డి దీటైన సమాధానం పైనే చర్చ నడుస్తోంది. దీంతోనే సెల్ఫ్ గోల్ వేసుకున్న చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపుతో ఎన్నికల వేళ వాలంటీర్ల చేత పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇప్పించకుండా ఆంక్షలు విధించాలంటూ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు అందుకున్న ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. దాంతో ఒకటో తారీఖున తెల్లవారు జామునే పింఛన్లను తమ ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్లు ఏప్రిల్ ఒకటో తేదీన రాకపోవడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు నరకయాతన పడ్డారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి టిడిపి పార్టీయే అని తెలుసుకుని వారు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లపై ఆంక్షలు విధించేలా చేసి ఏదో విజయం సాధించామని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఈ నేలబారు రాజకీయంతో ప్రజల్లో ఆయనపట్ల వ్యతిరేకత ఎన్నో రెట్లు పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. ఇక పొత్తుల కోసం బిజెపి అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వెంపర్లాడ్డం కూడా టిడిపి సీనియర్లకు నచ్చడం లేదు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపితో పొత్తుకోసం చంద్రబాబు నాయుడు అంతలా దేబిరించాల్సిన అవసరం ఏముందని? సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలోనే ఉత్తరాంధ్ర సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తన అనుచరులతో మాట్లాడుతూ టిడిపి ఇంత అధ్వాన్న స్థితికి పడిపోడానికి కారణం చంద్రబాబు అసమర్ధ నాయకత్వమే అని పెదవి విరిచారట. ఇక ఈ పార్టీలో యాక్టివ్ గా ఉండలేనని అస్త్ర సన్యాసం ప్రకటించారట. పార్టీ నాయకత్వానికి కావాలని అనుకుంటే సలహాలు సూచనలు ఇస్తాను తప్ప నేనైతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండలేని అని తేల్చి చెప్పేశారట. ఈ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం ఖాయమన్న సంకేతాలను చాలా సర్వేలు అందించాయి. జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లక్షలాదిగా జనం తరలి వస్తోంటే చంద్రబాబు నాయుడి ప్రజాగళానికి జనం మొహం చాటేస్తున్నారు. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో ఈ కార్యక్రమాలే చాటి చెబుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత పార్టీలోని సీనియర్లంతా ఒక్కసారిగా చంద్రబాబు పై తిరుగుబాటు చేయడం ఖాయమంటున్నారు వారు. -
చంద్రబాబు నాయకత్వ తీరుపై గుర్రుగా ఉన్న అశోక్ గజపతి రాజు
-
పార్టీ కోసం ఇంత కష్టపడి పని చేస్తే.. వేదికపైకి పిలవరా..?
బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో పొందూరు మండలం దళ్లవలసకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరైన దృశ్యమిది. పార్టీకి మంచి ఊపు వచ్చిందని.. జనాలంతా టీడీపీవైపే ఉన్నారంటూ చంద్రబాబు హడావుడి చేసిన సందర్భమిది. కానీ, అప్పట్లో ఆ సభకు జనాల్లేక కుర్చీలు వెలవెలబోయాయి. ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. సాక్షాత్తు చంద్రబాబు హాజరైన సభకొచ్చిన దుస్థితి ఇది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అటు చంద్రబాబు హాజరైన సభ, ఇటు టీడీపీ జిల్లా కేడర్ అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మినీ మహానాడు సభ చూస్తే టీడీపీకి అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. తమకు వాపు తప్ప బలం లేదనే విషయం టీడీపీ కేడర్కు, ఆ పార్టీ శ్రేణులకు బోధపడుతోంది. బయట ఎంత హంగామా, హడావుడి చేసినా.. జనాల్లోనే కాదు టీడీపీ సానుభూతి పరుల్లో కూడా ఆదరణ లేదని విషయం అర్థమయ్యేలా గత ఏడాది చంద్రబాబు సభ, ఈ ఏడాది మినీ మహానాడు సభ తేటతెల్లం చేసింది. నమ్మినోళ్లను మోసగించడమే తప్ప చేసేందేమీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందనే వాదన జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి..? ఓట్లేసిన ప్రజల్నే కాదు పార్టీని నమ్ముకుని పనిచేసే నాయకులకు కూడా విలువ లేకపోవడంతోనే టీడీపీకి ఈ దుస్థితి అని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. అధికారంలో ఉన్నంత సేపు ప్రజల్ని మోసగించాం, కష్టపడి పనిచేసే కేడర్ను నియంతృత్వ పోకడతో ఇబ్బంది పెడుతున్నాం, ఇక సభలకు, సమావేశాలకు జనాలు, పార్టీ శ్రేణులు ఎందుకొస్తారు, ఎవరు తీసుకొస్తారనే వాదన ఆ పార్టీలోనే మొదలైంది. వాస్తవంగా టీడీపీ మినీ మహానాడును భారీ జన సమీకరణతో నిర్వహించాలని జిల్లా నాయకత్వం భావించింది. అందుకు తగ్గ సన్నాహాక సమావేశాలు కూడా నిర్వహించుకుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎంతమందిని తీసుకురావాలి అనేదానిపై ప్లాన్ చేసుకున్నారు. కానీ, వారి వ్యూహాలు బెడిసికొట్టాయి. ప్రజలే కాదు టీడీపీ సానుభూతి పరులు కూడా ఆసక్తి చూపలేదు. మినీ మహానాడుకు ముఖం చాటేశారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత హడావుడి చేసినా స్పందన లేకపోవడం చూసి ఇంతవరకు తమకున్నది వాపే తప్ప బలుపు కాదనే విషయం స్పష్టమవుతోందని పలువురు చర్చించుకున్న పరిస్థితి కన్పించింది. గొండు, మామిడిలకు అవమానం శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి టికెట్ రేసులో ఉన్న గొండు శంకర్, మామిడి గోవిందరావు, కలిశెట్టి అప్పలనాయుడే ప్రస్తుతం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. తమకు టిక్కెట్ వస్తుందన్న ఆశతో భారీగా ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ అధిష్టానం గానీ, జిల్లా నాయకత్వం గానీ గుర్తించడం లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజున పార్టీ గుర్తించక మానదా అని లక్షలు ఖర్చు పెట్టి, పార్టీ ఫండ్ కింద లక్షలాది రూపాయలిచ్చి ప్రజల్లో ఉంటున్నారు. ఎంతో కొంతమందిని తమవైపు తిప్పుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరిని కూడా జిల్లా నాయకత్వంతో పాటు అధిష్టానం తరచూ అవమానాలకు గురి చేస్తోంది. కరివేపాకులా గొండు శంకర్ను శ్రీకాకుళం నియోజకవర్గంలో తీసిపారేస్తుండగా, పాతపట్నంలో యూజ్ అండ్ త్రో మాదిరిగా పార్టీ కోసం ఖర్చు పెట్టించుకుని మామిడి గోవిందరావును వదిలేస్తున్నారు. ఇక, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాకపోతే, కాశీకి వెళ్లడం వలన కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మినీ మహానాడుకు హాజరు కాలేదు. అదే ఆయనకు అదృష్టమని చెప్పాలి. లేదంటే తీవ్ర అవమానానికి గురయ్యేవారేమో!. వేదికపైకి పిలవరా..? టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మినీ మహానాడుకు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు తదితర కీలక నేతలు రావడంతో తమ బలం చూపించి, అధిష్టానం మెప్పు పొందుదామని భావించిన గొండు శంకర్కు, మామిడి గోవిందరావుకు తీవ్ర అవమానమే ఎదురైంది. కార్యక్రమం కోసం భారీగా ప్లెక్సీలను దారి పొడవునా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమ బలం చూపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి తమ వెంట వచ్చిన జనాన్ని తీసుకొచ్చారు. కానీ, జిల్లా నాయకత్వం వీరిని కనీసం గుర్తించలేదు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి, కార్లతో శ్రేణులను తీసుకొచ్చిన గొండు శంకర్ను, మామిడి గోవిందరావును వేదికపైకి పిలవలేదు. కిందనే కూర్చోమని హుకుం జారీ చేశారు. దీంతో గొండు శంకర్, మామిడి గోవింద వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు ఒక్కసారి షాక్కు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను వాడుకుని వదిలేస్తారా? అని ఒక్కసారిగా వారి అనుచరులు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వచ్చిన కొద్దిపాటి కార్యకర్తలు కూడా వెళ్లిపోవడంతో మినీ మహానాడు సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో బోసిపోయింది. గొండు శంకర్కు, మామిడి గోవిందరావుకే కాకుండా టీడీపీకి అవమానకరంగా సభ సాగింది. టీడీపీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి, జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సభ ఇది. టీడీపీ పెద్దలంతా హాజరైన సభకు భారీగా జన సమీకరణ చేశారు. జనం అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. అధికారంలో ఉండగా మేలు చేయని పార్టీ...మళ్లీ ఏదో చేస్తుందని ఎలా నమ్మగలమంటూ ప్రజలే కాదు ఆ పార్టీ శ్రేణులు కూడా మొఖం చాటేశాయి. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా వెలవెలబోయాయి. జనం లేక చాలాసేపు సభను ప్రారంభించలేని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది. -
సెల్ఫీలు తీసుకుని బాబు, అశోక్ గజపతిరాజు సెల్ఫిష్ లుగా మారారు : రోజా
-
‘అశోక విలాపం’ ఇప్పుడెందుకు.. ఇన్నాళ్లకు నిద్రలేచి నిందలు వేస్తారా?
సాక్షి,రాజమండ్రి(తూర్పు గోదావరి): 'మీరు అధికారంలో ఉన్నారు.. కేంద్ర మంత్రిగా పనిచేశారు.. అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు.. ఇన్నాళ్ళ తరువాత నిద్రలేచి నిందలు వేస్తారా అశోక్ గజపతి రాజు గారూ..' అంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీల పనితీరు బాగోలేదని అశోక గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను ఎంపీ భరత్ దృష్టికి పలువురు విలేకరులు తీసుకువచ్చారు. ఈ అంశంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక గజపతి రాజు కేంద్ర మంత్రి కదా.. కేబినెట్లో ప్రత్యేక హోదా ఇవ్వం.. స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం అన్నప్పుడు ఈ మంత్రి గారు నిద్రపోయారా’ అని ప్రశ్నించారు. ఆ ముంపు మండలాలు ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణం, సంతకం చేస్తానంటే అప్పుడే వచ్చేది కదా' అన్నారు. టీడీపీ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆనాడే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. రాష్ట్రానికి ఈ ఖర్మ ఉండేది కాదన్నారు. మేము అప్పటి టీడీపీ ఎంపీల్లా సన్నాయి నొక్కులు నొక్కడం లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని మొహమాటం లేకుండా నిలదీస్తూనే ఉన్నామన్నారు. ఉత్తర కుమారా..లోకేష్ నీకతేంది? ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తర కుమారా.. లోకేష్ అసలు నీ కతేందీ.. ధరలు పెరిగాయని ఈ గందర గోళం ఏమిటని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అసలు నీ భాష ఏంటో, నీ బాధ ఏంటో మాకు సరే.. నీ కూడా తిరిగే వారికే అర్థం కాదన్నారు. యువగళమా అది గందరగోళమో అర్థం కావడం లేదన్నారు. నీ కుటుంబ సభ్యులకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అయినా బూతులు రాకుండా చూసుకో.. మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ అవుతుంటే చూస్తే.. ఏందిరా బాబూ.. ఆ అక్షరాలు దిద్దించడం.. అసలు ఫస్ట్ నువ్వు అక్షరాలు నేర్చుకో అంటూ హితబోధ చేశారు. కాపురం చూస్తే తెలంగాణాలో.. రాజకీయ డ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోనా, మీలాంటి వారి చేతిలో ఎలా ఈ రాష్ట్రాన్ని పెడతారని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో ప్రజలు చాలా విజ్ఞులని, గతంలో చేసిన మీ పాలన చూశాక మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. నేనెప్పుడూ..సూపర్ స్టార్ నే ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందించారు. నేను ఏక చిత్ర నటుడినైనా.. హీరోనే.. చేయాలనుకుంటే ఎన్ని సినిమాలోనైనా హీరోగా నటిస్తా, ప్రజలను మెప్పిస్తా.. సూపర్ స్టార్ అనిపించుకుంటా అన్నారు. నీకూ ఒక కామెడీ క్యారెక్టర్ ఇప్పిస్తా..గోచీ పెట్టుకుంటావు కదా అంటూ ఎద్దేవా చేశారు. అరటి ఆకు స్టోరీ.. పార్లమెంటరీలో అందరూ నవ్వుకున్నారు.. నోరు అదుపులో పెట్టుకో రఘూ అంటూ ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధిని స్వాగతించండి.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చాయని, ఇవి చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. రాయలవారి కొలువులో అష్ట దిగ్గజాల మాదిరిగా దేశ విదేశాల నుండి ఎందరో పారిశ్రామిక దిగ్గజాలు వస్తే..అభినందించడం పోయి దీనికి కూడా వారి సహజసిద్ధమైన విమర్శలు చేయడం ప్రతిపక్షాల నైజాం బయటపడిందన్నారు. ఆరోగ్యకరమైన విమర్శలు ప్రగతికి దోహదపడతాయి కానీ..ఇలా ప్రతీ దానికీ విమర్శిస్తే ప్రజల్లో నవ్వులపాలవుతారని ఎంపీ భరత్ అన్నారు. చదవండి: నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం -
ఆస్పత్రికి అశోక్ గజపతిరాజు కుటుంబం గజం భూమి ఇవ్వలేదు : కోలగట్ల
-
పవర్ఫుల్ లీడర్ పవర్ను టీడీపీ జీరో చేసిందా.. రాజుగారి పరిస్థితేంటి?
ఆ రాజుగారి గతం ఎంతో ఘనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజుగారి ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన ప్రభ మసకబారింది. పదవుల్లో ఉన్నపుడు రూల్స్ గురించి చెప్పారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తనను పట్టించుకోవడంలేదని బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా తెలుగుదేశంలో ఒకప్పుడు పూసపాటి అశోకగజపతి రాజు చెప్పిందే వేదం. జిల్లా నాయకులు, కేడర్ అంతా రాజుగారిని కలసి వెళ్ళేందుకు పడిగాపులు కాసేవారు. అంతటి మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్గా ఆయన వెలిగారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో 40ఏళ్ల పాటు పదవులు నిర్వహించినా... ఒంటినిండా రాజరికపు దర్పం మాత్రం కొనసాగుతోంది. రాజావారి నియంత్రత్వ పోకడలు ఇన్నాళ్లూ ఎలాగో గడిచిపోయాయి. ఇంతకాలం హీరో అనిపించుకున్న ఈయన్ను ఇప్పుడు టిడిపి ఢమాల్న కింద పడేసి జీరోని చేసిందని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను జిల్లా నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని, సపోర్ట్ చేయడం లేదని చంద్రబాబు ఎదుట గగ్గోలు పెట్టారు. జిల్లాలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిలు, సీనియర్ నాయకులు సొంతూరు విజయనగరంకు చెందిన మీసాల గీతతో సహా జిల్లాలోని ఏ నియోజకవర్గానికి చెందిన నాయకులూ అశోక్గజపతి రాజుకు విలువ ఇవ్వడంలేదని అర్థమవుతోంది. అధికార పదవుల్లో ఉన్నపుడు తన అధికార దర్పాన్ని చూపించడం తప్ప ఏనాడూ అక్కడి నాయకులు, కార్యకర్తలను రాజుగారు పట్టించుకోలేదు. రాష్ట్ర పదవుల్లో ఉన్నపుడు గాని..కేంద్రమంత్రిగా ఉన్నపుడు గాని తెలుగుదేశం పార్టీ రాజకీయాలను తన తోట బంగ్లా లోపలే కట్టిపడేసారు. నాయకులు, కార్యకర్తలతో అశోక్ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబుకు చెప్పినా ఆయనా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు రాజుగారికి గౌరవం ఇవ్వండని...పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినా కేడర్ పట్టించుకునే పరిస్థితి లేదు. పలు వివాదాల్లో చిక్కుకుని, పోలీసు కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నా, జిల్లా నాయకుల్లో ఎవరూ అశోక్ పట్ల కనీస సానుభూతి చూపించడం లేదు. దీంతో ఒక నాయకుడికి కార్యకర్తల అవసరం ఎంతఉంటుందో... అశోక్ గజపతి రాజుకు తొలిసారి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. పదవుల్లో ఉన్నపుడు జిల్లా నాయకులు, కార్యకర్తలకు తాను ఇచ్చిందే.. వారు ఇప్పుడు తనకు తిరిగి ఇస్తున్నారని ఆయనకు అర్థమవుతోంది. అధికారం పోయి.. పరువు పోగొట్టుకుని బంగ్లా గేటు బయటకు వచ్చి నాపై సానుభూతి చూపించండయ్యా అని అందరినీ వేడుకోవాల్సి వస్తుంది. కానీ కేడర్ మాత్రం ఆయన పట్ల కనికరం చూపించే పరిస్థితి కనిపించడం లేదు. అశోక్ గజపతి రాజు అవుట్ డేటెడ్ పోలిటిక్స్ ఇప్పటి కాలంలో చెల్లుబాటు కావని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. -
విజయనగరం కోటలో అలజడి: ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది?
ఆ కోటలో రాజుగారికి తిరుగు లేదు. ఆ వూరిలో రాజుగారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కాని కొద్ది రోజులుగా రాజు మీద తిరుగుబాటు మొదలైంది. పార్టీలో పోరు ప్రారంభమైంది. అధినాయకత్వం రాజు వెంట... కార్యకర్తలు బీసీ నేత వెంటా నడుస్తున్నారు. ఇంతకీ ఆ రాజు ఎవరో..ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది? విజయనగరం కోటలో అలజడి రేగింది. గత ఎన్నికల వరకు విజయనగరం జిల్లాలో పూసపాటి వారి మాటకు ఎదురు లేదు. వారు చెప్పిందే చట్టం. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ రాజుగారి మాటే తెలుగుదేశం పార్టీలో వేదంగా కొనసాగుతోంది. 2014లో విజయనగరం అసెంబ్లీ సీటుకు టీడీపీ తరపున పోటీ చేసిన మీసాల గీత విజయం సాధించారు. ఆమె ఇటీవల రాజుగారికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. 2014లో అశోక్గజపతి రాజు లోక్సభకు పోటీ చేయగా... మీసాల గీత అసెంబ్లీకి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. గత ఎన్నికల్లో గీతకు సీటు ఇవ్వలేదు. లోక్సభకు అశోక్గజపతి, అసెంబ్లీకి ఆయన కుమార్తె పోటీ చేశారు. ఇద్దరు ఓడారు. వచ్చే ఎన్నికల్లో మీసాల గీత.. తనకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్ను, బీసీల జనాభా సంఖ్యను ఆధారాలతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమె అందించారు. అలాగే చూద్దాం అంటూ ఆమెకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తర్వాత అశోక్ చెప్పిన మాటే వింటున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అసలే జిల్లాలో పార్టీ వీక్గా ఉందంటే ఇదేం గొడవ అని తలలు పట్టుకుంటున్నారు. ఈ గొడవలన్నీ ఇలా ఉండగానే.. కోట బయట మీసాల గీత పార్టీ ఆఫీస్ పెట్టగా దాన్ని అశోక్ తొలగించారు. ఆపై తన దివాణంలోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో కూడా గీత మాట చెల్లలేదు. చంద్రబాబు గోడ మీద కూర్చుని వినోదం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఉన్న బీసీల జనాభాను కులాలవారీగా ఫ్లెక్సీల రూపంలో పట్టణంలో అనేక చోట్ల ఏర్పాటయ్యాయి. రాజుగారి కోట బయట కూడా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవై వేల మంది ఉన్నారని.. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వాలంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో వెలసిన ఫ్లెక్సీలు పట్టణంలో కలకలం రేపాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం ఎటాక్ ప్రారంభించింది. అయితే జిల్లాలో అశోక్గజపతి రాజు మాట కాదని చంద్రబాబు ఏమీ చేయలేరనే విషయం అందరికీ తెలుసు. 2014లో గెలిచినప్పటికీ తనకు 2019లో మెండి చేయి చూపిన టీడీపీ అధినాయకత్వం మీద మీసాల గీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. -
టీడీపీలో కలవరపెడుతున్న ఫ్లెక్సీలు
-
విజయనగరం టీడీపీలో ఫ్లెక్సీ వార్.. అశోక్ గజపతి రాజుపై ధిక్కార స్వరం
సాక్షి, విజయనగరం: విజయనగరం టీడీపీలో విభేదాలు మదిరిపాకాన పడ్డాయి. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై బీసీ మహిళా, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గత కొద్ది రోజుల క్రితం ధిక్కార స్వరం వినిపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. నేరుగా చంద్రబాబుతోనే అమె టచ్లో ఉంటున్నారు. చదవండి: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం మరోపక్క నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవైవేల మంది ఉన్నారంటూ, రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో కీలక ప్రాంతాల్లో వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. -
అశోక్ గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. -
అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
అశోక్గజపతిరాజుపై కేసు నమోదు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్గజపతిరాజుపై కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. కాగా, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. -
అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలి:మంత్రి వెల్లంపల్లి
-
దేవుడి ఆలయాన్ని సర్కస్ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్గజపతిరాజు వీరంగం) -
రామతీర్థం బోడికొండపై అశోక్గజపతిరాజు వీరంగం
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్ మోటారు సహకారంతో ట్రాక్ మీదుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. మండపంతోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరిస్తారు. శంకుస్థాపన అనంతరం ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు దేవదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం దిగువున ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొండపై నిర్మాణం పూర్తయిన వెంటనే విగ్రహాలను నూతన ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. అశోక్గజపతిరాజు వీరంగం రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారు. దుండగులు ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడాన్ని అశోక్ గజపతి రాజు తప్పుబట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్ అధికారులపై చిందులు తొక్కారు. ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్గజపతిరాజు పీకిపారేశారు. -
అశోక్గజపతిరాజు వీరంగం
-
మాన్సాస్ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
-
మాన్సాస్ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
విశాఖపట్నం: సింహాచలం దేవస్థాన ఆస్తులను కాపాడుతామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్టు చైర్మన్గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధించి రూ. 8 వేల కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. ఇంతటి అవినీతికి పాల్పడిని అశోక్ గజపతిరాజు ధర్మకర్త? అధర్మకర్తా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, సుమారు 846 ఎకరాల దేవస్థాన భూమిని అన్యాక్రాంతం చేశారని విమర్షించారు. త్వరలోనే భూ సమస్యను పరిష్కారిస్తామని ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ గౌతమ్ సవాంగ్ -
ఏపీ హైకోర్టులో ఊర్మిళ గజపతిరాజు పిటిషన్
-
‘అశోక గజపతిరాజును చైర్మన్గా తొలగించాలి’
సాక్షి, అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా తనను నియమించేలా ఆదేశాలివ్వాలంటూ ఊర్మిళ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఊర్మిళ తరఫున లాయర్ మాట్లాడుతూ.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచాయతిను.. రెండో భార్య కుమార్తె ఊర్మిలనును ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని కోర్టుకు తెలిపాడు. కనుక అశోక గజపతి రాజును చైర్మన్గా తొలగించి.. ఆ స్థానంలో ఊర్మిళ గజపతి రాజును చైర్మన్గా నియమించాలని న్యాయవాది కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
మాన్సాస్ జీతాల వివాదం: చోద్యం చూస్తున్న అశోక్ గజపతిరాజు
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధీనంలోనున్న 12 విద్యాసంస్థల సిబ్బంది, ఉద్యోగుల జీతాల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. ట్రస్టు చైర్మన్ హోదాలో దీన్ని పరిష్కరించాల్సిన టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు నిరాటకంగా చేస్తూనే ఉన్నారు. సంచయిత నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆయన సానుకూల తీర్పునే పొందారు. చైర్మన్గా పునర్నియామకమై దాదాపు రెండు నెలలైనా ట్రస్టు బోర్డును మాత్రం పట్టించుకోలేదు. కనీసం బోర్డు సమావేశాన్నీ ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం బోర్డు తీర్మానాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఇన్నాళ్లూ విద్యా సంస్థల కరస్పాండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్న కేవీఎల్ రాజు పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. కరస్పాండెంట్తో సంయుక్తంగా చెక్ పవర్ ఉన్న చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) హర్నీద్ర ప్రతాప్ సింగ్ను బోర్డు తీర్మానంతో సంబంధం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించేశారు. అశోక్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రెండురోజులకే ఆ నిర్ణయం జరిగిపోయింది. బ్యాంకింగ్ లావాదేవీల్లో జాయింట్ చెక్ పవర్ ఉన్న అధికారిని తొలగించేస్తే ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. అదీ బోర్డు తీర్మానంతో జరగాలి. బోర్డును సమావేశపరచకుండా ఈ రెండు నెలలూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన అశోక్ గజపతిరాజు... ఉద్యోగుల జీతాలు నిలిచిపోయినందుకు నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదీ పరిస్థితి... ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంఆర్ కళాశాల, ఎంఆర్ మహిళా కళాశాల, ఎంఆర్ ఫార్మసీ, ఎంఆర్ పీజీ, మాన్సాస్ ఇంగ్లిష్ మీడియం తదితర 12 విద్యాసంస్థలు మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 800 మంది ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల ప్రక్రియను మొదటి నుంచి విద్యా సంస్థల కరస్పాండెంట్ చూసుకుంటున్నారు. ఆ ఖర్చుల కోసం బోర్డు తీర్మానంతోనే నిధులు విడుదలవుతాయి. ట్రస్ట్ కార్యకలాపాలన్నీ సవ్యంగా జరిగేలా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కార్యనిర్వాహణాధికారి (ఈవో)ను నియమిస్తోంది. బోర్డు తీర్మానం మేరకు రూ. 3.50 కోట్ల ఫండ్ను మొదటి విడతలో, మరో రూ.2.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్ను రెండవ విడతలో ఈఓ ఏటా విడుదల చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఏవిధంగా వినియోగించారన్నదీ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఈఓకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీల)ను సమర్పిస్తున్నారు. ఇదీ ఏటా జరుగుతున్న ప్రక్రియే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఆడిటింగ్ జరగకపోవడంతో ట్రస్టులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్టులో ప్రక్షాళన ప్రారంభించింది. చట్టం ప్రకారం ట్రస్టులో నియామకాలు చేపట్టింది. విచ్చలవిడిగా నిధుల వ్యయానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బోర్డు తీర్మానం మేరకు సీఎఫ్ఓను నియమించింది. కరస్పాండెంట్, సీఎఫ్ఓల జాయింట్ అకౌంట్ ద్వారా జీతాలు, ఇతర ఖర్చుల వ్యవహారాలు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి నిర్ణయాలతో గత ఏడాదిగా మాన్సాస్ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ జరుగుతోంది. అశోక్ సహా 11 మందిపై కేసు నమోదు మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులు దాడి చేశారంటూ ఈఓ డి.వెంకటేశ్వరరావు విజయనగరం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి ప్రేరేపించిన అశోక్, కరస్పాండెంట్తో పాటు దాడి చేయడంతో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పది మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు సీఐ జె.మురళీ వెల్లడించారు. అశోక్ పునరాగమనంతో చిక్కుముడి.. మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం 2020 మార్చి 3వ తేదీన జీఓలు 73, 74 జారీ చేసింది. అదే సమయంలో మాన్సాస్ బోర్డు సభ్యులను నియమిస్తూ జీఓ 75ను విడుదల చేసింది. ఈ బోర్డులో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళా గజపతిరాజుతో పాటు ఆర్వీ సునీత ప్రసాద్, అరుణ్ కపూర్, విజయ్ కె.సోంథీ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. జీఓలు 73, 74లను సవాల్ చేశారు. అయితే, ఆయన పిటిషన్లో బోర్డుకు సంబంధించిన జీఓ 75ను ప్రస్తావించలేదు. హైకోర్టు జీఓలు 73, 74లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం అశోక్ చైర్మన్గా తిరిగి బాధ్యతలు చేపట్టారు. అయితే, బోర్డును మాత్రం ఇప్పటివరకూ సమావేశపరచిన దాఖలాల్లేవు. బోర్డు తీర్మానం లేకుండానే సీఎఫ్ఓను అశోక్ ఏకపక్షంగా తొలగించేశారు. పూర్వ పద్ధతిలోనే కరస్పాండెంట్ జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కానీ నిబంధనల ప్రకారం కరస్పాండెంట్తో పాటు సీఎఫ్ఓ కూడా సంతకం చేస్తేనే బ్యాంకు నుంచి విత్డ్రా కుదరని పరిస్థితి ఏర్పడింది. అది సవ్యంగా జరిగితేనే డబ్బులు ఇస్తామని బ్యాంకులు తేల్చి చెప్పేశాయి. బ్యాంకులతో ఏర్పడిన చిక్కుముడికి తానే కారణమన్న విషయాన్ని అశోక్, కరస్పాండెంట్ కేవీఎల్ రాజు రాజకోట రహస్యం చేసేశారు. జీతాలు నిలిచిపోవడానికి కారణం ఈఓనే అంటూ ఉద్యోగులను ఉసిగొల్పడం గమనార్హం. జీతాల చెల్లింపు మా పరిధి కాదు... నిబంధనల మేరకు ట్రస్ట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా బోర్డు ఆమోదం తప్పనిసరి. విద్యాసంస్థల జీతాల చెల్లింపు అంతా కరస్పాండెంట్ చూస్తున్నారు. ఈఓగా కేవలం నిధుల కేటాయింపు వరకే చూస్తాం. బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకూ జరగలేదు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బోర్డు సమావేశం గురించి మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కొత్త సీఎఫ్ఓ ఎవరో ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. కరస్పాండెంట్, సీఎఫ్ఓ సంతకాలు చేస్తేనే బ్యాంకుల నుంచి ఉద్యోగులకు జీతాల సొమ్ము విడుదల అవుతుంది. – డి.వెంకటేశ్వరరావు, ఈఓ, మాన్సాస్ ట్రస్టు -
కాలేజీ పేరుతో కాజేశారు
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీ ముసుగులో టీడీపీ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను అమ్మేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కనీసం దరఖాస్తు కూడా చేయకపోగా ఆ పేరుతో విశాఖ నగరానికి సమీపంలో మాన్సాస్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాలను, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమి కారుచౌకగా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేయడం గమనార్హం. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ముఖ్య’నేత ఈ భారీ మాయకు తెరతీస్తే మాన్సాస్ ట్రస్టు చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజు తన వంతు సహాయ సహకారాలను అందజేశారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాన్ ట్రస్టులలో చోటు చేసుకున్న అక్రమాలపై దేవదాయ శాఖ ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందచేయడం తెలిసిందే. విజయనగరంలో మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాల్లో జరిగిన అక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. మన భూమి అయితే ఇలాగే అమ్ముతామా..? భూమిని అమ్ముకుంటే ఎవరైనా సరే పూర్తి విస్తీర్ణం మేరకు లెక్కగట్టి డబ్బులు తీసుకుంటారు. ఆ స్థలంలో రోడ్లు వేసేందుకు కొంత భూమి కేటాయించాల్సి వస్తే అంతమేరకు తగ్గించుకుని డబ్బులు తీసుకుంటారా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇళ్ల ప్లాట్ల ధరకు తగట్టుగానే భూమి ధరను నిర్ణయించి విక్రయిస్తారు. కానీ మాన్సాన్ భూములు అమ్మిన తీరు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మకమానవు. మెడికల్ కాలేజీ పేరుతో గత సర్కారు మాన్సాన్ భూములను నాలుగు ప్రాంతాల్లో విక్రయించింది. అందులో ఒకటి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో భూముల అమ్మకం. అక్కడ ట్రస్టు పేరిట ఉన్న భూముల్లో 53.40 ఎకరాల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 43.40 ఎకరాల విక్రయానికి తెరతీశారు. రోడ్లు వేయాలంటూ.. కొత్త వలసలో 43.40 ఎకరాల అమ్మకమన్నారు. అయితే కొనుగోలుదారులు అంతర్గతంగా 80 అడుగుల రోడ్లు ఏర్పాటు చేసుకుంటే 2.98 ఎకరాల భూమి వృధా అవుతుందంటూ దాన్ని విక్రయించే భూమి నుంచి ముందే మినహాయించారు. ఇక ఇళ్ల ప్లాట్లకు అనువుగా లేదంటూ మరో 4.31 ఎకరాలను మినహాయించారు. ఇలా మొత్తం 7.29 ఎకరాలను మినహాయించి మిగిలిన 36.11 ఎకరాలకు మాత్రమే కొనుగోలుదారుడి నుంచి డబ్బులు తీసుకున్నారు. 10.98 ఎకరాలు ఉచితంగా... ఇదొక ఎత్తు కాగా ఈ భూములను అమ్మిన తర్వాత ట్రస్టుకు అక్కడ మరో పది ఎకరాల స్థలం ఉండాలి. అయితే ఇప్పుడు 6.31 ఎకరాలే మిగిలినట్లు అధికారుల కమిటీ నిర్ధారించింది. అంటే అక్కడ మరో 3.69 ఎకరాలు ఈ అమ్మకం లావాదేవీల తర్వాత కనిపించకుండా పోయింది. అంటే మొత్తంగా ట్రస్టుకు చెందిన 10.98 ఎకరాల భూమికి ఎటువంటి ప్రయోజనం పొందకుండా కొన్నవారికి ధారాధత్తం చేశారు. 36.11 ఎకరాల్లో రూ.74 కోట్లు దోపిడీ.. మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మిన కొత్తవలసలో రిజిస్ట్రేషన్ ధర ఎకరం రూ.89 లక్షలు ఉంది. అయితే ఆ భూమిని అమ్మే సమయంలో అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.2.51 కోట్లు ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ మార్కెట్ ధర కంటే సగం ధరకే ఎకరం రూ.1,20,70,000 చొప్పున విక్రయించారు. ఒకవైపు 10.98 ఎకరాల భూమిని కోల్పోతూ మరోవైపు మార్కెట్ కంటే సగం ధర తక్కువకు అమ్మేశారు. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి గత సర్కారు 150.09 ఎకరాల మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మగా అందులో 36.11 ఎకరాల భూముల విక్రయంతో ట్రస్టుకు వచ్చింది రూ.43.58 కోట్లు అయితే నష్టపోయింది రూ.74.22 కోట్లకుపైనే ఉంటుందని దేవదాయ శాఖ అధికారుల కమిటీ నిర్ధారించింది. మొత్తం 150.09 ఎకరాల అమ్మకాల తీరును విశ్లేషిస్తే ఈ దోపీడీ రూ.250 కోట్లకు పైబడి ఉండవచ్చని తాజాగా భావిస్తున్నారు. సింగిల్ బిడ్ టెండర్లతోనే అమ్మకం.. కొత్తవలస భూముల కొనుగోళ్లలో కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రమే పాల్గొంది. భూములు అమ్మే సమయంలో ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించలేదు. బహిరంగ వేలం పాటకు సంబంధించిన నోటీసులను మాన్సాన్ ట్రస్టు కార్యాలయం, విజయనగరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, భూములను అమ్ముతున్న ప్రాంతం, కనీసం నోటీసు బోర్డులో కూడా ఉంచలేదు. తగిన ప్రచారం కల్పించి ఉంటే ఎక్కువ మంది బహిరంగ వేలంలో పాల్గొని ఆ భూములకు మంచి ధర పలికి ఉండేదని అధికారులు నిర్ధారించారు. దేవదాయ శాఖ భూములను విక్రయించాలంటే నిబంధనల ప్రకారం అవన్నీ పాటించాలి. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం కల్పించేందుకు తూతూ మంత్రంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. -
బాబాయి గారూ! ఆ చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?
సాక్షి, విజయనగరం : టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజుపై మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై మండిపడ్డారు. ‘‘అశోక్ బాబాయి గారూ.. మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. రక్షణ కోసం మాన్సాస్ ఈవో పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడడం లేదా?. సిబ్బందిని తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు.. మాన్సాస్ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు’’అని అన్నారు. -
‘మాన్సాస్’ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా!
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు. -
మహిళ కమిషన్ చైర్పర్శన్ను కలిసిన సంచయిత గజపతిరాజు
-
మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన సంచయిత
సాక్షి విశాఖపట్నం: సంచయితపై అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల అశోక్ గజపతిరాజు వివక్ష అనాగరికమని అన్నారు. మాన్సాస్ బైలా అంటే సతీ సహగమనం చేయాలా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు బుధవారం మహిళా కమిషన్ను ఆశ్రయించారు. విశాఖలో కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తన నియామకంతో పాటు వారసత్వం అంశాన్ని కించపరిచే రీతిలో అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేశారని సంచయిత ఆరోపించారు. సంచయిత ఫిర్యాదుపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. అశోక్ గజపతిరాజు రాచరికపు వ్యవస్థలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాన్సాస్ ట్రస్ట్ బైలా పునః సమీక్షించాలని అన్నారు. సంచయిత విషయంలో అశోక్ చర్చకు సిద్దమా? అని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. చదవండి: ‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’ అనంతపురం జిల్లాలో ఉద్యాన విప్లవం -
ఆ భూములు ఏమయ్యాయి?: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
సాక్షి, విజయనగరం: గజపతుల భూములు కాపాడుకోవడానికే మాన్సాన్ ట్రస్ట్ అంటూ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్ట్కు 14 వేల ఎకరాలుంటే.. 8,200 ఎకరాలే చూపిస్తున్నారని.. మిగిలిన ఆ భూములు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మెడికల్ కాలేజ్కు వంద ఎకరాలు ఇస్తామని చెప్పారని.. ఆ భూములను రూ.100 కోట్లకు అమ్ముకున్నారని ఎంపీ బెల్లాన దుయ్యబట్టారు. ‘‘విజయనగరం రాజులు సంపాదించిన ఆస్తులు మొత్తం ఆ కాలంలో ప్రజలు కట్టిన కప్పం నుంచి సంపాదించినవే. రాజుల కష్టార్జితం కాదు. ఎన్నో దేవాలయాలకు ధర్మకర్తగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి ఒక్క దేవాలయాన్నయినా అభివృద్ధి చేసారా’’ అని బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు: ఆళ్ల నాని దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు -
అశోక్గజపతిరాజు జైలుకెళ్లడం తప్పదు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ‘మాన్సాస్ ట్రస్ట్లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్గజపతిరాజు’ అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని.. ఆయన జైలుకు వెళ్లడం తప్పదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘భూకబ్జా వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా స్టే తెచ్చుకోగలిగారు. చేసిన తప్పులకు శిక్ష నుంచి మాత్రం తప్పుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని వదిలిపెట్టేది లేదని’’ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆనందయ్య మందు పంపిణీ కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఫ్రంట్ లైన్ వర్కర్లకు ‘ఆనందయ్య మందు’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందయ్య మందు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందని చెప్పారు. తొలి దశలో 22వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందించామని పేర్కొన్నారు. దేశంలోనే లేని విధంగా ఏపీలో కోవిడ్ కట్టడికి సీఎం చర్యలు చేపట్టారని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: లోకేష్ వ్యవహార శైలిపై చంద్రబాబు సిగ్గుపడాలి ఏపీ: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్ -
‘భగవంతుని సన్నిధిలో అశోక్గజపతిరాజు అసత్యాలు మాట్లాడటం తగదు’
సాక్షి, విశాఖపట్నం: భగవంతుని సన్నిధిలో అశోక్గజపతిరాజు అసత్యాలు మాట్లాడటం తగదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రొటోకాల్పై అశోక్గజపతిరాజు అసత్యాలు మాట్లాడుతున్నారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో సేవలన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో తలపాగ చుట్టలేదని అశోక్గజపతిరాజు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. భగవంతుని సన్నిధిలో అబద్ధాలు మాట్లాడితే అశోక్గజపతిరాజుకు శిక్ష తప్పదని హెచ్చరించారు. మాన్సాస్ ట్రస్టులో గత పదేళ్ల నుంచి ఆడిటింగ్ జరగలేదని, అందులో అవినీతిని తేల్చేందుకే ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తున్నామని చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తామన్నారు. చదవండి: ఎమ్మెల్సీల్లో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం -
స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం
విజయనగరం రూరల్: పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయమే ఆఖరు కాదని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పోటీలో ఉండాలా, లేదా అనేది నిర్ణయించుకుంటామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు చెప్పారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. -
టీడీపీలో కల్లోలం: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొన్ని గంటలకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన నిర్ణయానికి వ్యతిరేకంగా జ్యోతుల నెహ్రూ గళం విప్పారు. చంద్రబాబు నిర్ణయం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేడర్ అభిప్రాయాలు చంద్రబాబుకు పట్టవా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరగడం లేదని అన్నారు. చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ -
మహిళను మెడవంచి కొట్టిన అశోక్గజపతిరాజు
విజయనగరం రూరల్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం విజయనగరంలో ఒక మహిళను మెడవంచి కొట్టారు. మహిళా దినోత్సవం నాడు విజయనగరంలో మహిళకు ఘోర అవమానం జరిగింది. విజయనగరంలోని 14వ వార్డులో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ మహిళా కార్యకర్తలు హారతి ఇచ్చారు. ఆయన వద్దని వారించారు. ఈ సమయంలో నేత మీద గౌరవంతో హేమలత అనే మహిళ పూలు చల్లడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక్కసారిగా వెనుదిరిగి వెళ్లిన ఆయన విచక్షణ లేకుండా ఆమె మెడవంచి కొట్టారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. హేమలత అవమానభారంతో వెళ్లిపోయారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీడీపీ నేత చర్యతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రానికి టీడీపీ నేతలు.. తనపై అశోక్గజపతిరాజు చేయి చేసుకోలేదని బాధితురాలితో విలేకరుల ఎదుట చెప్పించడం విశేషం. కాగా గతకొన్నిరోజులుగా టీడీపీ సీనియర్ నేతలు వీరంగం సృష్టిస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ ఫోటోగ్రాఫర్పై చేయిచేసుకున్న విషయం తెలిసిందే. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య .. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో సదరు ఫోటోగ్రాఫర్ చెంపమీద కొట్టాడు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం సహనం కోల్పోయి శ్రుతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నీ వారం రోజుల సమయంలోనే వెలుగులోకి రావడం గమనార్హం. చదవండి: మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య -
త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘‘వాటికన్ సిటీకి, అమరావతికి సంబంధం ఏంటి?. చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారు?. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. (చదవండి: పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్) -
అన్నింటా విఫలమైన అశోక్ గజపతిరాజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వేల కోట్లు దానం చేసిన రాజవంశంలో పుట్టినా... రామతీర్ధంలో రాముడి ఆలయానికి కనీసం కరెంటు ఇవ్వలేకపోయారు. తాత ముత్తాతల గొప్ప తనాలు చెప్పుకుంటూ... గుడిలో ఒక సీసీ కెమెరా పెట్టించలేకపోయారు. చరిత్రను దాచేసి నీతిమంతులమని చెప్పుకుంటూ... జనం చేత జేజేలు కొట్టించుకున్నారు. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి. దర్పం, ఆర్భాటాలను చూసి మోసపోయిన నగరవాసులు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ఆ రాజరిక వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడించి పరాజితునిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు కనీసం తాను అనువంశిక ధర్మకర్తగా ఉన్న గుడిలో రాముడిని కూడా కాపాడుకోలేకపోయారు. ఇదీ టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్గజపతిరాజు పరిస్థితి. అలంకారానికే పదవులు... కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు 1978 నుంచి జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పదవులను అనుభవించారు. ఎన్టీ రామారావు నుంచి, చంద్రబాబు నాయుడు వరకూ టీడీపీలో ప్రతి ఒక్కరూ అశోక్కు పెద్దమనిషి హోదా ఇచ్చి గౌరవించినా... తన పదవీ కాలంలో ప్రజ లకుగానీ, తాను నివశిస్తున్న విజయనగరానికి గానీ ఏమీ చేయలేకపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్మిల్లులు మూతపడినా పట్టించుకోలేదు. 12వేల కార్మి క కుంటుంబాలు రోడ్డున పడ్డా వదిలేశారు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలున్నా ఇక్కడ ఏర్పాటుకు కృషి చేయలేదు. జిల్లాకు కేటాయిస్తామన్న మెడికల్ కళాశాల కోసం స్థలం ఇస్తామని చెప్పి ఆ తర్వాత అదే స్థలాన్ని తమ పార్టీకే చెందిన వ్యక్తికి ధారాదత్తం చేశారు. విజయనగర వాసుల తాగు నీటి సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారు. అభివృద్ధికి అడ్డంపడుతున్నా మౌనమే... 2015 జూలై నెలలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, స్థానిక టీడీపీ పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులను అబియన్స్లో ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పట్టణాభివృద్ధిని అడ్డుకున్నారు. దానిపైనా అశోక్ స్పందించలేదు. పట్టణాభివృద్ధి గురించి ఆలోచించలేదు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) 426 కిలోమీటర్ల చిన్నా, పెద్ద కాలువలున్న నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయలేకపోవడంతో చిన్నపాటి వ ర్షం కురిసినా ప్రధాన జంక్షన్లన్నీ ముంపుబారిన పడు తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని పూర్తి చేయలేకపోయారు. పైగా తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ టెండర్ వేస్తే దానిని తన విచక్షణాధికారంతో క్యాన్సిల్ చేయించారు. చివరికి ఎన్నికల ముందు హడావుడిగా విమానాశ్ర యం నిర్మించేస్తున్నామంటూ బిల్డప్పులిచ్చి శంకు స్థాపన చేస్తున్నా దానిని ఆపలేదు. ధర్మకర్తగా విఫలమై... అశోక్ చైర్మన్గా ఉన్న రామతీర్థంలో కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకు ఆయన చేసిన తప్పిదాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. బోడికొండపై ఉన్న ఆలయాన్ని ఇన్నాళ్లూ ఆయన పట్టించుకోలేదు. హుద్హుద్ తుఫాన్కు కూలిన రాతిగోడను కూడా పునరుద్ధరించలేకపోయారు. కనీసం విద్యుత్ సౌకర్యాన్నయినా కల్పించలేదు. సీసీ కెమెరాలు పెట్టించలేదు. అవే ఉంటే రాముడి విగ్రహం శిరస్సు ఖండించిన దోషులు ఈపాటికే సులభంగా దొరికేసేవారు. ఆ అవకాశం లేకుండా చేసినందునే చైర్మన్ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. ఈ వైఫల్యాలన్నింటినీ తొక్కిపెట్టి, కేవలం రాష్ట్రమంత్రి మాట్లాడిన ఒక పదాన్ని తప్పుబట్టి అనవసర రాద్ధాంతం చేయిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల వల్ల పోయిన గౌరవం నిలబెట్టుకునేందుకు పార్టీ లోనూ, ప్రజల్లోనూ తన ఉనికి చాటుకునేందుకు కులం కార్డును ఆశ్రయించకతప్పలేదు. పార్టీలోనూ చిన్నచూపే... దశాబ్దాలుగా రాజకీయ ఆశ్రయమిచ్చిన తెలుగుదేశం పార్టీని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఇటీవల జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వేరుకుంపట్లు పెట్టుకోవడం ఓ ఉదాహరణ. కేవలం తానూ, తన కుమార్తె, కొందరు అనుచరులే అని గిరిగీసుకున్న ఆయనకు వ్యతిరేకంగా విజయనగరంలో టీడీపీకి రెండో కార్యాలయం ఏర్పాటయ్యింది. దానిని అధిష్టానం దృష్టికి అనుచరుల ద్వారా తీసుకెళ్లినా ఏమీ ఒరగలేదు. సరికదా బోర్డు తీసేసినట్టే తీసి మరలా పెట్టడం కొసమెరుపు. రెండు రోజుల క్రితం చంద్రబాబు జిల్లాకు వచ్చినపుడు తన బంగ్లాకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి, అక్కడా విఫలమయ్యారు. రాజకీయ వారసురాలిగా కుమార్తెను ఎమ్మెల్యేగా బరిలోకి దింపి గెలిపించుకోలేక తండ్రిగానూ ఓడిపోయారు. -
‘రామతీర్థం’ చైర్మన్ పదవి నుంచి గజపతిరాజు తొలగింపు
సాక్షి, విజయవాడ: రామతీర్థం దేవస్థానం ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్ మెమో జారీ చేశారు. రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ల పదవి నుంచి ఉద్వాసన పలికింది. పైడితల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దేవస్థానాల ఛైర్మన్ పదవుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. (చదవండి: పప్పునాయుడు సవాల్కు మేం రెడీ..) కాగా, రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి, సీతమ్మవారి కొలనులో పడేసిన సంగతి తెలిసిందే.. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
టీడీపీ రెండు ముక్కలైంది..
జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలైంది. ఎప్పటినుంచో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడుతూ మహిళా నేత తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. విజయనగరంలో కొత్తగా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లుగా రాజుగారి బంగ్లాలోనే పెద్దాయన కనుసన్నల్లో సాగుతున్న పార్టీ కార్యకలాపాలకు చెక్పెట్టారు. సాక్షి, విజయనగరం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు మొదలై చాలా కాలమైంది. 2019 ఎన్నికల ముందు ఆ పార్టీకి జిల్లాలో ఏడుగురు శాసన సభ్యులుండేవారు. వీరిలో బొబ్బిలి రాజు రాష్ట్ర మంత్రిగా ఉండగా, కేంద్ర మంత్రిగా అశోక్గజపతిరాజు కొనసాగారు. అప్పుడు మహంతి చిన్నంనాయుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే వారు. జిల్లాకే కాదు రాష్ట్ర టీడీపీకి కూడా అశోక్ గజపతే పెద్దదిక్కుగా భావించేవారు. జిల్లా పార్టీ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచేది. ఆయన మాత్రం జిల్లాలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించేవారు కాదు. పార్టీ కార్యక్రమాలకు కూడా వచ్చే వారు కాదు. పూర్తిగా ఢిల్లీ లేదా బంగ్లాకు పరిమితమైపోయేవారు. అదే సమయంలో ఆయన కుమార్తె అదితి గజపతి రంగంలోకి దిగారు. విజయనగరంలో ఏర్పాటైన కొత్త కార్యాలయం పార్టీ కేడర్కు అడపాదడపా దర్శనమిస్తూ, అప్పుడప్పుడు కార్యక్రమాల్లో మెరిసేవారు. అప్పుడు విజ యనగరం ఎమ్మెల్యేగా మీసాల గీత ఉన్నారు. పేరుకి ఆమె ఎమ్మెల్యేగానీ, నియోజకవర్గంలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా చేయాలని అశోక్, అదితి ప్రయత్నించారు. అదే సమయంలో విశాఖపట్నానికి చెందిన అప్పటి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు జిల్లాను చక్కబెట్టే బాధ్య తలు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పుడే అశోక్ పతనం అధికారికంగా మొదలైందని చెప్పవచ్చు. గంటా ప్రవేశంతో పార్టీలో ముసలం జిల్లాలో గంటా శ్రీనివాసరావు పెత్తనం మొదలైన తరువాత మీసాలగీత, గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కె.ఎ.నాయు డు వంటి వారు గంటా పంచన చేరారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఈ విషయాన్ని అధినేత వద్ద చూపించుకుని గత ఎన్నికల్లో మీసాల గీతకు పార్టీ టిక్కెట్టు రాకుండా చేశా రు అశోక్. ఆమె స్థానంలో తన కుమార్తె అదితి గజపతిని పార్టీ తరఫున ఎన్నికల బరిలో దింపారు. బీసీ మహిళకు వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్న టిక్కెట్టుతో వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు నిలవలేక, కుమార్తెను గెలిపించుకోలేక, ఎంపీగా తానూ విజయం సాధించలేక ఘోర పరాజ యం పాలయ్యారు. అంతే కాదు అశోక్ పెద్దదిక్కుగా ఉన్న జిల్లాలో టీడీపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా రాకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయినా దానికి ఆయన ఏమాత్రం బాధపడలేదు. నైతిక బాధ్యత వహించి పార్టీ నుంచి తప్పుకోలేదు. పైపెచ్చు ఇటీవల జరిగిన పార్టీ నియామకాల్లో తన కుమార్తె అదితి గజపతికి విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఇప్పించుకున్నారు. రాచరిక పెత్తనానికి చరమ‘గీతం’ జిల్లా టీడీపీ సమావేశాలు, పత్రికా సమావేశాలను అశోక్ గజపతి బంగ్లా ఆవరణలోని చెట్టుకిందే నిర్వహించడమేది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కానీ ఈ సమావేశాలకు గానీ, పార్టీ కార్యక్రమాలకు గానీ తనకు ఎలాంటి సమాచా రం లేకపోవడంతో, ఎన్నికల ముందు నుంచీ జరుగుతున్న పరిణామాలకు మనస్తాపంతో ఉన్న మీసాలగీత టీడీపీకి మరో కార్యాలయం అవసరమనే నిర్ణయానికి వచ్చారు. ఆమెకు మొదటి నుంచీ తోడుగా ఉన్న కె.ఎ.నాయుడు, మరికొంత మంది జిల్లా నేతలు మద్దతు పలికారు. అంతే విజయనగరంలో కె.ఎ.నాయుడుకు చెందిన భవనంలోనే కొత్త కార్యాలయాన్ని బుధవారం తెరిచారు. ఊహించని ఈ హఠా త్ పరిణామానికి అశోక్ గజపతి షాక్కు గురయ్యారు. టీడీపీ ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో అధికారపార్టీ నేతలే మీసాల గీతతో వేరు కుంపటి పెట్టించారని ఆయన ఆరోపించారు. కానీ గీత మాత్రం తరతరాల రాచరిక పెత్తనానికి చరమగీతం పాడేందుకే తాను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించానని చెబుతున్నారు. వ్యూహం పెద్దదే... అశోక్కుగానీ, విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న అదితి జగపతికి గానీ, విజయనగరం పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్గా ఇటీవలే నియమితులైన కిమిడి నాగార్జునకుగానీ చెప్పకుండా, వారిని ఆహ్వానించకుండా స్వతంత్రంగా నిర్ణ యం తీసుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారంటే దీనివెనుక భారీ వ్యూహాలే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నా యి. మరోవైపు ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఇంతవరకూ స్పందించలేదంటే పార్టీలో తన స్థానం, ప్రాధాన్యం ఏమిటో అర్ధం చేసుకుంటున్న అశోక్ భవిష్యత్పై ఆలోచనలో పడ్డారనేది బంగ్లా వేగుల మాట. ఏది ఏమైనా జిల్లాలో ఏమీ లేని టీడీపీ ఇప్పుడు ఇలా రెండు ముక్కలవ్వడం పార్టీ నేత లు తమ వర్గాలను బహిర్గతం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ఏర్పా టు చేయలేక స్థలపరిశీలనకే పరిమితమైన మీసాల గీత ఇ ప్పుడు కొత్త కుంపటి పెట్టుకుని మాత్రం సాధించేదేముంద ని అశోక్ వర్గం అంటుంటే, జిల్లా టీడీపీలో అశోక్గజపతి శ కం ముగింపునకు చేరినట్టేనని గీత వర్గం ప్రచారం చేస్తోంది. -
అశోక్ గజపతిరాజుపై సంచయిత ఫైర్
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై సింహాచలం ట్రస్టు బోర్డు, మన్సాస్ ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఫైర్ అయ్యారు. ఆయన అక్రమాలు బయట పడుతున్నాయి కాబట్టే ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 150 ఏళ్ల చారిత్రక మోతీమహల్ను కూల్చినపుడు ఉద్యమం ఎందుకు చేయలేదని అశోక్ గజపతిరాజును ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు.. ‘‘8 వేల ఎకరాల మన్సాస్ భూములను ఎకరా 5 వందల రూపాయలకు మీ అనునాయులకు లీజుకి కట్టబెట్టినపుడు నిజానికి సేవ్ మన్సాస్ ఉద్యమాన్ని చేయాల్సింది. మార్కెట్ ధరకు మీరిచ్చిన లీజులకు ఏమైనా సంబంధం ఉందా? కనీసం లాయర్ను పెట్టుకోవడం కూడా చేతకాక రూ. 13 కోట్ల నష్టాన్ని కలిగించే విధంగా, మన్సాస్ భూములు ఎక్స్పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనపుడు మీ ఉద్యమం ప్రారంభించాల్సింది. 2016-2020 మధ్య కాలంలో మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మన్సాస్ విద్యాసంస్థలకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అప్పుడు మొదలు పెట్టాల్సింది ఈ క్యాంపెయిన్. మీరు చైర్మన్గా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడంతో 170 మందికి ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయి. అప్పుడు ‘‘సేవ్ మన్సాస్’’ ఉద్యమం చేయాల్సింది. సరైన ఆడిటింగ్ నిర్వహించక, మాన్యువల్గా తప్పుడుతడకలుగా ఆడిటింగ్ చేయించినపుడు ఉద్యమం ప్రారంభిస్తే అసలు రంగు బయటపడేది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మన్సాస్కు రావాల్సిన 30 కోట్ల రూపాయల నిధులు రాబట్టుకోలేదు. అప్పుడు సేవ్ మన్సాస్ అంటే కొంతైనా ప్రయోజనం ఉండేది. అశోక్ గారూ.. మీరు ఎంఆర్ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. మీరు చైర్మన్గా ఉన్నపుడే ఇది ఒక ప్రైవేట్ కాలేజీ, ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని(గవర్నమెంటు ఎయిడ్) మీరే తీసేశారు. ఆ విధానమే ఇప్పుడు కొనసాగుతోంది’’ అంటూ అశోక్ గజపతిరాజు తీరును ఎండగట్టారు. వాస్తవానికి తానే సేవ్ మన్సాస్ ఉద్యమం నడుపుతున్నానని, ట్రస్టు పూర్వవైభవాన్ని పునురుద్ధరిస్తానన్న సంచయిత.. మీరు మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి అంటూ అశోక్ గజపతిరాజుకు హితవు పలికారు. సేవ్ మన్సాస్ పేరుతో చేస్తున్నది ‘‘సేవ్ అశోక్’’ క్యాంపెయిన్ మాత్రమేనంటూ చురకలు అంటించారు.(చదవండి: మహరాణిలా చూడాలని కోరుకుంటున్నారు: మన్సాస్) -
టీడీపీలో గర్జించిన అసమ్మతి
సాక్షి, విజయనగరం: తెలుగుదేశం పార్టీలో వెన్నుపోటు కొత్తేం కాదు.. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి వరకు ఆ పార్టీ ముఖ్య నేతలు, సీనియర్లు వెన్నుపోట్లుకు గురవుతూనే ఉన్నారు. తాజాగా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామకంపై టీడీపీలో అసమ్మతిసెగలు భగ్గుమంటున్నాయి. తనను అధ్యక్షుడిగా నియమించకపోవడంపై గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన కార్యాలయానికి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంగా బోర్డుపెట్టి మరీ ఆయన నిరసన తెలిపారు. కార్యకర్తలతో తన కార్యాలయంలో ఆదివారం హుటాహుటిన సమావేశయ్యారు. పార్టీని నమ్ముకున్న తమకు అధిష్టానం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జూనియర్కి అధ్యక్ష పదవి ఇచ్చి సీనియర్లను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం పెట్టి మరీ టీడీపీ అగ్రనాయకత్వాన్ని ఏకిపారేశారు. అప్పటిలో శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బి.ఫారాలు ఎన్టీఆర్ తన చేతికే ఇచ్చేవారని, అప్పటి పార్టీకి, ఇప్పటి పార్టీకి చాలా తేడాలు ఉన్నాయన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గద్దె ఉన్నడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మనేసిందని, ఆత్మ గౌరవం, ఆత్మ సంతృప్తి కోల్పోయి పారీ్టకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. (అలా మొక్కారు.. ఇలా తొక్కారు!) అసమ్మతికి చిహ్నంగా మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు తన కార్యాలయానికి ఏర్పాటుచేసిన పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయం బోర్డు అశోక్కూ తప్పని భంగపాటు... తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో తన కుమార్తెను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేక, తను ఎంపీగా గెలవలేక ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే ఆయన కుమార్తెకు పదవి రాకుండా చేసింది. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా తన కుమార్తె అధితి గజపతిరాజుని చూడాలని ప్రయత్నించిన అశోక్ మళ్లీ భంగపడ్డారు. పార్టీలో నంబర్–2గా ఒక వెలుగు వెలిగిన అశోక్ గజపతి ప్రాభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనడానికి ఇదొక ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, అశోక్కు మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది. తాజాగా తన కుమార్తెకు సైతం పదవి రాకపోవడంపై అశోక్ మరింత అసంతృప్తికి గురైనట్టు సమాచారం. పార్టీ నేతలెవరితోనూ మాట్లాడేందుకు సైతం ఇష్టపడడం లేదని ఆ పార్టీ జిల్లా నేతలే చెబుతున్నారు. (అచ్చెన్నపై యూటర్న్) సంధ్యారాణికి ప్రాధాన్యం... ఎన్ని విమర్శలు ఎదురైనా గుమ్మడి సంధ్యారాణికి చంద్రబాబు మరోసారి పదవిని కట్టబెట్టారు. సాలూరులో సీనియర్ నేతగా ఉన్న భంజ్దేవ్కు, సంధ్యారాణికి మధ్య విభేదాలు గత ఎన్నికలలో తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన భంజ్దేవ్ను కాదని సంధ్యారాణికి అరకు పార్లమెంట్ అధ్యక్ష పదవిని ఇవ్వడంతో భంజ్దేవ్వర్గం ఆగ్రహంగా ఉంది. ఓ వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంగా ముద్రపడిన కె.ఎ.నాయుడు, మీసాల గీత వంటి వారిని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే, వారసత్వ రాజకీయాలకు నేను ప్రాధాన్యం ఇవ్వను అంటూనే మాజీ మంత్రి కుమారుడికి పదవిని ఇవ్వడంపై నేతల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు నిలువలేక చతికిలపడ్డ టీడీపీ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం, అరకు, విశాఖ పార్లమెంట్ స్థానాలు సైతం కోల్పో యింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురైపోయారు. కొత్త నాయకత్వంతో నైనా పారీ్టపైకి లేస్తుందేమోనని భావిస్తున్న వారికి తాజా పరిణామాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మొత్తం మీద టీడీపీ కార్యవర్గ పదవుల కేటాయింపు జిల్లాలో ఆ పార్టీకి మరోసారి తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉంది. -
ఆ ఇద్దరూ ద్రోహులే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం వెనుకబడిన జిల్లాగా మిగిలిపోవడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజే కారణమని ఎంపీ విజయసాయిరెడ్డి ఏకిపడేశారు. వీరిద్దరూ జిల్లాను విస్మరించారని, వెనుకబడిన వర్గాలను అణచివేశారని సోషల్ మీడియా వేదికగా దుమ్ముదులిపేశారు. ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఆయన పోస్టుల్లో అంశాలివి... ♦విజయనగరం అనగానే విద్యలనగ రం, సాంస్కృతిక కూడలి, సంగీత సెంటర్ ఇలా గత వైభవం కళ్లముందు మెదులుతుంది. సువర్ణముఖి, చంపావతి, గోస్తనీ, నాగావళి, వేగావతి, గోముఖి లాంటి నదీనదాలు ప్రవహిస్తున్న ప్రశాంతమైన జిల్లాను – గజపతి రాజుల్లో ఒక వర్గాన్ని, మాన్సాస్ ట్రస్ట్ను ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో భ్రష్టుపట్టించారు. మెజార్టీ వర్గాలైన కాపు, వైశ్య, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా... వీలైనంతగా అణగదొక్కారు. ♦జిల్లా ప్రజలు చైతన్యవంతులవ్వడంతో ఇక్కడ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది. విశాఖతో సమానంగా విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. ♦విశాఖలో పరిపాలనా రాజధాని వస్తే అక్కడికి కూతవేటు దూరంలోనున్న విజయనగరం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. కానీ వైజాగ్ పాలనా రాజధాని వద్దంటూ చంద్రబాబు సంతకాల సేకరణ చేయిస్తున్నారంటే జిల్లాపై ఆయన ఎంతగా పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రాజధాని ఏర్పాటైతే విశాఖ – విజయనగరం మధ్య అభివృద్ధి పరుగులు పెడుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖ మెట్రోరైలు వరకు అన్నీ విజయగరానికి వచ్చి... జిల్లా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. ♦విజయనగరంలోని మహారాజా విద్యాసంస్థలు బ్రిటిష్ వారి కాలంలోనే ఒక వెలుగువెలిగాయి. కానీ మాన్సాస్ ట్రస్ట్ అశోక్ గజపతి రాజు చేతిలోకి వెళ్లగానే దాన్ని భ్రష్టుపట్టించారు. అశోక్ను అడ్డం పెట్టుకుని మాన్సాస్ ట్రస్ట్ను చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏటీఎంలా వాడుకున్నారు. ♦విజయనగరం జనాభాలో దాదాపు 20 శాతం తూర్పుకాపులుంటే వారిని రాజకీయంగా అణగదొక్కడానికి శతవిధాలా కష్టపడ్డారు. చివరకు తన కుమార్తె అతిది పోటీచేస్తాననగానే సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను ఇంటికి పంపించేశారు. ♦పంచనదులున్నా చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క సాగునీటి, ప్రాజెక్టు కట్టిన పాపానపోలేదు. వైఎస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారు. మాట్లాడితే పోలవరం నేనే కడుతున్నా... హైదరాబాద్ను తానే నిర్మించానంటూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు విజయనగరంలోని నదులపై ఒక చిన్న ఆనకట్టనైనా కట్టలేకపోయాడు. తోటపల్లి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించి 90 శాతం పూర్తిచేస్తే ఉన్న పదిశాతాన్ని సైతం పూర్తిచేయలేక చేతులెత్తేశారు. ♦జిల్లావాసులకు ఉపాధికల్పిస్తున్న జూట్, ఫెర్రోఅల్లాయీస్ ఇండస్ట్రీలు మూతపడేలా చేశారు. అశోక్ గజపతి ఇంటిపక్కనే ఉన్న ఈస్ట్ కోస్ట్, అరుణ జ్యూట్ మిల్లులు మూతపడ్డా – వందలమంది ఉద్యోగాలు పోయినా అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వాటిని తెరిపించేందుకు ప్రయత్నిస్తోంది. ♦ఒక జిల్లా నుంచి జాతీయ నేతగా ఎవరైనా ఎదిగారంటే ఆ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి. కానీ విజయనగరానికి అన్నీ తానేనని చెప్పుకునే అశోక్ విజయనగర సామ్రాజ్య ఆస్తులను ఏటీఎంలా వినియోగించుకోవడంలో చంద్రబాబుకు సహకరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చే రాజధానిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ♦ఆనంద గజపతిరాజు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంతవరకూ విజయనగరం ఒక వెలుగువెలిగింది. ఆ తర్వాత అశోక్ విజయనగర వైభవాన్ని మసకబార్చారు. విద్య– వైద్యం నుంచి ఉపాధి కల్పనవరకు అన్ని రంగాల్లోనూ భ్రష్టుపట్టించారు. ♦సొంత అన్న కుమార్తె సంచయిత మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు చేపడితే... ఆమెను, ఆమె చెల్లెలు ఊర్మిళ ను అశోక్ కించపరుస్తూ మాట్లాడారు. మహిళలవిషయంలో వివక్షచూపేలా చంద్రబాబు ప్రకటనలిచ్చారు. ♦వైఎస్సార్ హయాంలోనూ, జగన్ అధికారం చేపట్టాక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విజయనగరంలో రాజ్యాధికారం వచ్చినట్లయ్యింది. విజయనగరంలో అశోక్ గజపతిరాజు కుటుంబం, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, కురుపాం కిశోర్ చంద్రదేవ్, చినమేరంగి రాజు శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రాజయినా, పేదయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ – అభివృద్ధికి పాటుపడితేనే భవిష్యత్తు. లేకుంటే అడ్రస్ గల్లంతే, -
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
-
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం : అశోక్ గజపతిరాజుపై సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండికూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) స్కీమ్కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా.. గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేనది నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రిచంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సంచయిత.. మన్సాస్ అభివృద్ధిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. (సంచయిత గజపతి రాజుకు కేంద్రం ప్రశంసలు) ప్రధాని, సీఎంకు కృతజ్ఞతలు.. నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ‘దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయిలిచ్చే స్కీమ్ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు అప్పట్లో నిర్లక్ష్యం చేశారు. ప్రసాద్ స్కీమ్లో సింహాచలం దేవస్ధానాన్ని చేర్చాలని ఎందుకు ప్రతిపాదించలేదు. సింహాచలం దేవస్ధానంలో వృధాగా ఉన్న వేలాది ఎకరాలలో ఈ పధకం క్రింద అభివృద్ది చేసే అవకాశాన్ని అశోక్ గజపతిరాజు ఎందుకు పట్డించుకోలేదు. ఉత్తరాంద్రతో పాటు సింహాచలంపై చంద్రబాబు, అశోక్ గజపతిల కపటప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి. అతి పురాతనమైన మోతీ మహల్ని రాత్రికి రాత్రే కూల్చేశారు. (అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ) అన్ని విమర్శలకి సమాధానం చెబుతా మోతీ మహల్ లాంటి పురాతన కట్టడాల అభివృద్దికి కేంద్రం నిదులిచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు కూల్చేశారు. కేంద్ర, రాష్డ్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాను. ప్రసాద స్కీమ్ లో సింహాచలం దేవస్ధానం ఎంపికకావడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపటం వల్లే కేంద్రం ఈ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానానికి అవకాశం కల్పించింది. మార్చ్ నెలలో కేంద్ర పర్యాటక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలని ఫాలో అప్ చేశా. ఈ పధకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. గత చైర్మన్ అశోక్ గజపతిరాజు సింహాచలంపై భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతాను. (మళ్లీ తెరపైకి విజయనగర సామ్రాజ్యం) -
అవకాశం వస్తే రాజకీయాల్లోకి
-
అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ
సాక్షి, విజయనగరం: తన తండ్రి మరణం అనంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఆనంద గజపతిరాజు, సుధా కూతురు ఊర్మిళా గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మా బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి తమను ఉద్దేశపూర్వకంగా దూరం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. తన తండ్రి మరణం అనంతరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నా అని, భవిష్యత్లో అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లో దిగుతానని ఊర్మిళ తెలిపారు. అనంద గజపతి రాజు 70వ జన్మదినం సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. (సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర) ‘నాన్న ఆనంద గజపతిరాజు గారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే వారు. ఆనంద గజపతిరాజు చాలా సాధారణ జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ పీవీజీ రాజు (తాత) ఆశయాలను కొనసాగించడం కోసమే పనిచేశారు. అందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీలు స్ధాపించడం, మాన్సాస్ ట్రస్ట్ బాగా నడిపించడం చేశారు. మెడికల్ కాలేజీ పెట్టాలి అనేది నాన్నగారి కల. ఆయన బ్రతికి ఉండి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించేవారు. కుటుంబ సభ్యులను కాకుండా ఆయన దగ్గర పనిచేసే వారిని కూడా చాలా బాగా చూసుకునే వారు. మా నాన్న మరణించేటప్పటికి నా వయసు 16 సంవత్సరాలు. మా బాబాయ్ మా నాన్న మరణం తర్వాత ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి మాకు అర్హత లేదన్నారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) తాతగారు ఏ ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టారో మా నాన్న ఆనంద గజపతిరాజు దాన్ని అలాగే కొనసాగించారు. దురదృష్టవశాత్తు నాన్న మరణం తర్వాత బాబాయి ఆ ఉద్దేశంతో ట్రస్ట్ కొనసాగించలేదు. అశోక్ను చైర్మన్గా టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఆ జీవోని ఉపయోగించుకుని మమ్మల్ని ట్రస్ట్కు దూరం చేశారు. నాన్న మరణం తర్వాత సింహాచలం దేవస్థానం వేడుకలకు ఆహ్వానించడం జరగలేదు. భవిష్యత్తులో మా నాన్న, మా తాత గారు లా ప్రజలకు సేవ చేస్తా. అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తా’ అంటూ తన మనసులోని మాటను చెప్పారు. -
చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!
సాక్షి, అమరావతి: గజపతి వంశస్థుల హక్కులు కాపాడాలంటూ కొత్త రాగం ఎత్తుకున్న టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన చిన్నాన్న అశోక్ గజపతిరాజు వలె చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నానని పేర్కొన్నారు. గజపతి వంశానికి చట్టబద్ధ వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలిని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి.. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వంపై బురదజల్లాలని చూసిన ఆయనకు ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు.. ‘‘నేను సంచయిత గజపతి. మా తాత మహరాజా పీవీజీ రాజు పెద్ద కుమారుడు, చట్టబద్ధమైన వారుసుడైన నా తండ్రి ఆనంద గజపతికి చట్టబద్దమైన వారసురాలిని. అశోక్ గజపతిలాగా చంద్రబాబు గారు కూడా లింగ వివక్ష చూపించరని ఆకాంక్షిస్తున్నా. గజపతి వంశానికి తానొక్కడినే వారసుడినని, నేను అనే వ్యక్తిని లేను అన్నట్లుగా అశోక్ గజపతి మిమ్మల్ని తప్పుదోవ పట్టించారనుకుంటున్నా. గజపతి కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంటే బాగుంటుంది. రాజకీయం చేయాలని చూడవద్దు’’ అని సంచయిత ట్వీట్ చేశారు. సింహాచలం, మన్సాస్ బోర్డు చైర్ పర్సన్గా తన నియామకం జరిగినందున గజపతి కుటుంబ హక్కులకు ఎటువంటి భంగం కలుగలేదని స్పష్టం చేశారు. (చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత) కాగా 2016 ఏప్రిల్లో మన్సాస్ వ్యవహారం ఆనాటి టీడీపీ ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్ 7న జీవో 139 జారీ చేసింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్ 155 ద్వారా అశోక్గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం... ఈ ఏడాది మార్చిలో ట్రస్టు చైర్పర్సన్గా సంచయితను నియమించింది. అదే విధంగా... అశోక్ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి.. ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్మన్గా ఉండే హక్కు మహిళలకు లేదన్నట్లుగా మాట్లాడటంతో పాటు సంచయిత నియామకంపై విమర్శలు గుప్పించడం గమనార్హం. ప్రస్తుతం చంద్రబాబు సైతం ఇదే రాగాన్ని ఆలపిస్తున్నారు. సింహాచలం ట్రస్టు బోర్డు చైర్పర్సన్గా గజపతి వారసురాలు ఉన్నప్పటికీ.. వారి కుటుంబ హక్కులకు భంగం వాటిల్లిందంటూ బాబు ట్వీట్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బాబాయ్ భ్రష్టు పట్టించారు
సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్ ట్రస్టు చైర్మన్గా అశోక్గజపతిరాజు ఉన్నప్పుడు ట్రస్టు, సింహాచలం దేవస్థానం అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు బహిరంగంగా చెప్పగలరా.. అని ట్రస్టు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ప్రశ్నించారు. విశాఖలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..(అవన్నీ బాబు, బాబాయ్ కలిసే చేశారట!) ►ట్రస్టు ఆశయాన్ని బాబాయ్ పూర్తిగా భ్రష్టు పట్టించారు. ►మోతీమహల్ని కూల్చివేసినప్పుడు గత చరిత్ర గుర్తుకు రాలేదా? మూడు లాంతర్ల కూడలిని ధ్వంసం చేశారంటూ ఇప్పుడు మొసలి కన్నీరుకార్చడం హాస్యాస్పదం. ►తమ కుట్రలు ఎక్కడ బయటపడిపోతా యేమోనన్న భయంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. -
అవన్నీ బాబు, బాబాయ్ కలిసే చేశారట!
సాక్షి, అమరావతి: సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా తన నియామకంపై వస్తున్న విమర్శలను సంచయిత గజపతిరాజు తిప్పికొట్టారు. ‘ఆనంద గజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబుగారు తెలుసుకోవాలి. మా తండ్రి చితి ఆరకముందే మీరు, మా బాబాయ్ అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీ చేశారు’అని మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘అశోక్ గజపతిరాజుగారి పదవీకాలంలో తప్పుడు చర్యలు కారణంగా మాన్సాస్ ఆర్థికంగా నష్టపోయింది. విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయింది. ట్రస్టు భూములు పరులపాలవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్ను నియమించలేదు. విశాఖ అడిషనల్ జిల్లా జడ్జి తీర్పే ఉదాహరణ’అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత) మీ ఇద్దరూ కలిసి చేసినవే..! ‘మాన్సాస్ లా కాలేజీ క్యాంపస్ను ఐఎల్ఎఫ్ఎస్కు ఉచితంగా ఇచ్చేశారు. విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారు. చివరకు ఐఎల్ఎఫ్ఎస్ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. చంద్రబాబుగారు తన సహచరుడ్ని పొగిడేముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసంచేశారో తెలుసుకోవాలి. వాస్తవం ఏంటంటే.. ఇవన్నీ మీకు తెలిసి, మీ ఇద్దరూ కలిసి చేసినవే అని ప్రజలు చెప్తున్నారు’అని సంచయిత విమర్శించారు. -
నిరూపిస్తే రాజీనామా చేస్తా: కోలగట్ల
సాక్షి, విజయనగరం: మూడు లాంతర్లు చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ కట్టడం నమోదైందని నిరూపిస్తారా? అని సవాలు విసిరారు. కాగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను గురువారం అధికారుల తొలగించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త కట్టడాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వీరభద్ర స్వామి ఆదివారం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. (‘జూమ్’లో చర్చకు సిద్ధం.. మంత్రి బొత్స సవాల్) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు లాంతర్ల ఆధునీకరణను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడితే పట్టించుకోకుండా బంగ్లాకే పరిమితమయ్యారని, ఇప్పుడేమో ఉనికి కోసం రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. మోతి మహాల్, పూల్ బాగ్ ప్యాలెస్లను నేలమట్టం చేసినప్పుడు అవి పురాతన కట్టడాలు అని గుర్తు రాలేదా? అని ఎద్దేవా చేశారు. మూడు లాంతర్లు చారిత్రాక కట్టడమంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాత్రిపూట ప్రజలకు దారి చూపేందుకు మాత్రమే మూడు లాంతర్లు ఏర్పాటు చేశారని వీరభద్ర స్వామి స్పష్టం చేశారు. (చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత) కాగా చారిత్రక నేపధ్యం కలిగిన విజయనగరంలోని మూడు లాంతర్ల స్థూపాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ వెల్లడించారు. నగర సుందరీకరణలో భాగంగానే మూడు లాంతర్ల జంక్షన్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చారిత్రక నేపథ్యమున్న కట్టడాలను కూల్చుతారన్న ఆరోపణలు అర్థరహితమని పేర్కొన్నారు. నగరంలోని ఆరు ప్రాంతాలను అత్యాధునికీకరించేందుకు చర్య లు చేపట్టామన్నారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, మ యూరి జంక్షన్, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడ జంక్షన్, మూడు లాంతర్ల జంక్షన్, కొత్తపేట నీళ్ళ ట్యాంక్ జంక్షన్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. మూడు లాంతర్లను ముగ్గురు మహిళలు చేతబూనేలా స్థూపాన్ని రూపొందించనున్నట్టు వివరించారు. జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిమను కూడా అమర్చుతున్నట్లు చెప్పారు. మూడు లాంతర్ల పై ఉన్న మూడు సింహాల ప్రతిమను ఎంతో పవిత్రంగా తమ కార్యాలయంలో భద్రపరిచినట్టు చెప్పారు. మొత్తం రూ.5 లక్షల నిధులతో ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘జూమ్’లో చర్చకు సిద్ధం.. మంత్రి బొత్స సవాల్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రాల్లో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడాది లోపే మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. 2019 మే 23 సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు. (నిబద్ధతతో సేవలందించండి: సీఎం జగన్) అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు సాధ్యం కాదని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారని.. మనసు ఉంటే మార్గం ఉంటుందనే విధంగా ఆయన హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడానికి నవరత్నాలు మేనిఫెస్టోలో పెట్టారని.. రైతే రాజు అనే విధంగా వ్యవసాయానికి పెద్దపీట వేశారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారన్నారు. పట్టుదలతో సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారన్నారు. ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. (టీడీపీ ఉనికి కోల్పోయింది: ధర్మాన కృష్ణదాస్) టీడీపీ వైఖరిని ప్రజలు గమనించాలి.. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో 500కి మించి కరోనా టెస్ట్ లు జరగలేదు. విద్య వైద్యాన్ని రెండు కళ్లుగా సీఎం జగన్ చూస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అసభ్య పదజాలంతో సీఎంపై విమర్శలు చేస్తున్నారు. న్యాయ స్థానాలకు వెళ్లి టీడీపీ ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటుందని’’ ధ్వజమెత్తారు. టీడీపీ వైఖరిని ప్రజలంతా గమనించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. కుట్రలు కుతంత్రాలతో టీడీపీ కోర్టులకు వెళ్తుందని మండిపడ్డారు. (చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత) పేదలకు న్యాయం.. అదే ప్రభుత్వ లక్ష్యం.. పేదలకు న్యాయం జరగాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని బొత్స ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని.. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చుతున్నారని తెలిపారు. విపత్తు కాలంలో చిన్న,సూక్ష్మ,మధ్య తరహా పారిశ్రామికవేత్తలను సీఎం ఆదుకున్నారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి అండగా నిలిచారన్నారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి.. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతారని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న లేకపోయినా ఒకే విధంగా ఉంటారన్నారు. టీడీపీ హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎత్తేశారని..పారిశుధ్య కార్మికుల, ఆశ వర్కర్లకు సీఎం జగన్ జీతాలు పెంచారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎక్కడ వైపల్యం చెందిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను చర్చించే సమయంలో తమను కూడా జూమ్లోకి తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో జూమ్ యాప్లో చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి బొత్స సవాల్ విసిరారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. చారిత్రాత్మక స్తూపం కాదు.. సిమెంటు కట్టడం.. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు విమర్శలపై మంత్రి బొత్స మండిపడ్డారు. మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక స్తూపం కాదని.. మూడు లాంతర్ల అనేది సిమెంట్ కట్టడమని.. మూడు లాంతర్ల సెంటర్ లో పనులు జరుగుతున్నాయన్నారు. మూడు లాంతర్ల సూప్తం స్థానంలో కొత్తది నిర్మాణం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. మూడు లాంతర్లు అనేది చరిత్రాత్మక ప్రాంతమని.. స్తూపం మాత్రం కాదని స్పష్టం చేశారు. మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక కట్టడం అంటున్న అశోక్ గజపతిరాజు.. ఆ స్తూపం ఆయన పుట్టక ముందు కట్టిందా ఆయన పుట్టిన తరువాత కట్టిందా సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ విమర్శలు మానుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. -
మహిళా సాధికారత మా తాతగారి ఆశయం
-
బాబాయ్ ఇలా మాట్లాడతారా?
విశాఖపట్నం: తాను ఎవరికీ భయపడబోనని, తానేంటో నిరూపించుకుంటానని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతిరాజు తెలిపారు. తన పనితీరు చూడకుండానే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్ను సమర్థవంతంగా నడిపిస్తానన్న నమ్మకాన్నివ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. చీకటి జీవోతో తాను పదవి దక్కించుకున్నానని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. చట్టబద్ధంగా తాను ట్రస్ట్ చైర్పర్సన్ అయ్యానని స్పష్టం చేశారు. గతంలో అశోక్గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని ట్రస్ట్ సభ్యురాలిగా నియమించి తనను విస్మరించారని వాపోయారు. ఆ రోజు తనను ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించారు. తన పట్ల టీడీపీ నాయకుల వ్యాఖ్యలు వివక్షాపూరితంగా ఉన్నాయని, మహిళలకు వారసత్వ హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా పనిచేయగల సామర్థ్యం తనకు ఉందన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో 60 శాతానికిపైగా బాలికలు ఉన్నారని వెల్లడించారు. మహిళలను తక్కువగా అంచనా వేయడం సరికాదని హితవు పలికారు. (చదవండి: మాన్సాస్లో పెనుమార్పు..!) బాబాయ్ ఇలా మాట్లాడతారని అనుకోలేదు.. తాను హిందువుని కాదన్నట్టుగా తన బాబాయ్ అశోక్ గజపతిరాజు మాట్లాడటం పట్ల సంచయిత ఆవేదన చెందారు. బాబాయ్ ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదని కంటతడి పెట్టారు. ‘వాటికిన్ వెళ్లి ఫొటో దిగినంత మాత్రాన క్రిస్టియన్ అవుతానా? మీరెప్పుడూ మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు వెళ్లలేదా? ఎన్నోసార్లు వెళ్లి మీరు ఫొటోలు కూడా తీయించుకున్నారు. అంతమాత్రన మీరు హిందువు కాకుండా పోయారా? మీలాగే నేను ఇతర మతాల ప్రార్థనాలయాలకు వెళ్లాను. మహిళగా నాకు ఈ అవకాశం రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను హిందువును కాదంటూ నాపై కొందరు తప్పుడు ప్రచారం చేయడం దారుణం. సింహాచలం దేవస్థానాన్ని, మాన్సాస్ ట్రస్ట్ను రాజకీయంగా చూడొద్దు. నేను సేవ చేయడానికే వచ్చా. నాపై తప్పుడు ఆరోపణలు చేసే వారికి ఒకటే విజ్ఞప్తి. నా పనితీరును చూసి తీర్పు ఇవ్వండి. నాపై విమర్శలు చేసేవారికి పనితీరుతోనే సమాధానం ఇస్తా. మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఎన్టీఆర్ కల నెరవేరినందుకు టీడీపీ నేతలు సంతోషపడాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ మహిళలను కించపరిచేలా చూడటం తగదు. అవకాశాలిస్తే మహిళలు అన్నింటా రాణిస్తున్నారు. నా కుటుంబంలో వివాదాలపై న్యాయంపోరాటం కొనసాగిస్తున్నా. నా తల్లిదండ్రులు ఆనంద గజపతిరాజు, ఉమా గజపతిరాజు హిందువులు. వారి కుమార్తెగా నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను. కుటుంబంలో ఎన్ని వివాదాలు ఉన్నా నేనెప్పుడూ చెడుగా చెప్పలేదు. పెద్దల పట్ల గౌరవంతో మౌనంగా ఉన్నాను. ఈ దేశ న్యాయవ్యవస్ధపై, ప్రజలపైనా నాకు అచంచల విశ్వాసముంది. సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిస్ధాయిలో అభివృద్ది చేయడమే నా లక్ష్యం. ఇంటి కుటుంబ సభ్యులే నాపై ఆరోపణలు చేయడం బాధాకరం. అశోక్ గజపతిరాజు లాంటి పెద్దవాళ్లను నేను విమర్శించను. పెద్దవారిని గౌరవించాలని మా అమ్మ నాకు సంస్కారం నేర్పారు. మహిళా సాధికారికత మా తాతగారి ఆశయం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మాన్సాస్ ట్రస్ట్ని నడిపిస్తా. ఈ రోజు మాన్సాస్ ద్వారా మహిళలకి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను దేశంలో వివిధ ప్రాంతాలలో పెరిగా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నా. మహిళగా నన్ను తక్కువ అంచనా వేసి చూడద్దు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. నేను రాసిన లేఖకి స్పందించి ప్రభుత్వం నాకు చైర్పర్సన్గా అవకాశం కల్పించడం నా అదృష్టం. ఏపీ ప్రభుత్వం మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం అభినందనీయం. ప్రధాని మోదీ కార్యక్రమాలకు ఆకర్షితులై నేను బీజేపీలో చేరాను. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే పనిచేస్తున్నా. బీజేపీలో నన్ను అభిమానించి, ప్రోత్సహించేవాళ్లూ ఉన్నారు. మహిళలపై చిన్నచూపుతోనే పార్టీలో కొందరు వ్యతిరేకించి ఉండవచ్చు.’అని సంచయిత వివరించారు. -
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : సంచిత
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీమంత్రి అశోక గజపతిరాజు సోదరుడి కుమార్తె, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సంచిత హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆమె అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంచిత గజపతిరాజు.. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెనుకబడిన కర్నూల్లో హైకోర్టు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రాజధాని పేరుతో రైతుల వద్ద చంద్రబాబు నాయుడు బలవంతంగా లాకున్న భూమిని తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ముందే ఎందుకు పారిపోయి వచ్చారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ రాజధానిపై పూర్తి నివేదిక ఇవ్వకుండానే అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధపడిందని సంచిత ఆరోపించారు. అమరావతి అనేది చట్టవిరుద్ధం నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీని ప్రజలు ఎప్పడో తిరస్కరించారని, రాజధానిపై మాట్లాడే కనీస హక్కు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. అలాగే అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సంచిత ప్రశంసించారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పడూ సహకారంగా ఉంటారని, దీనిలో రాజకీయం చేసే దురాలోచన ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. కాగా రెండేళ్ల క్రితమే ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
విజయనగరం జిల్లాకు రాజావారి రాజద్రోహం
ఎవరికైనా అవకాశం వస్తే సొంత ఊరిని.. తమ ప్రాంతాన్ని... జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. కానీ జిల్లా తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న అశోక్గజపతిరాజు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పదవుల్లో ఉన్నపుడు జిల్లాను పట్టించుకోకపోగా... ఇప్పుడు అభివృద్ధికి అవకాశం వస్తే దానిని వ్యతిరేకిస్తున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే విజయనగరాభివృద్ధి సాధ్యమని ఎవరినడిగినా చెబుతారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా... జిల్లా ప్రజలవల్ల పలుమార్లు పదవులు అధిష్టించిన నాయకునిగా ఆయన మాత్రం... ప్రజలకు, జిల్లాకు ఇప్పుడు తీరని ద్రోహం చేస్తున్నారు. సాక్షి, విజయనగరం : దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిన విజయనగరానికి పాలనావికేంద్రీకరణ ద్వారా విశాఖలో రాజధాని ఏర్పాటు కావడం పెద్ద వరం. దీనివల్ల విజయనగరం జిల్లా రూపురేఖలు మారతాయని, తమ బతుకులు బాగుపడతాయని ఇక్కడి ప్రజలు సంతోషపడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ, రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంతకాల సేకరణ చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజుల పాలనలో ఇప్పటికే విజయనగరం పట్టణంతో సహా జిల్లా అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోవడంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అశోక్ను, ఆయన కుమార్తెను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా ఆయన తీరులో మార్పు రాకపోవడంపై జిల్లా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు విశాఖలో రాజధానికి అక్కడి టీడీపీ నాయకులు మద్దతు తెలుపుతుంటే ఉత్తరాంధ్రలో రాజధాని వద్దంటూ అశోక్ వంటి నేతలు సంతకాలు చేయమని ప్రజలను బలవంతం చేయడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. చదవండి: ఆగని టీడీపీ ఆగడాలు ఆవిర్బావం నుంచీ వెనుకబాటే... 1979 జూన్ 1న విజయనగరం జిల్లా ఆవిర్భవించింది. అంతకు ముందు ఎందరో రాజుల ఏలుబడిలో శతాబ్దాలపాటు వర్థిల్లింది. చివరి రాజవంశమైన పూసపాటి వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు పాతికేళ్ళపాటు శాసనసభ్యుడిగా, 13 ఏళ్ళ పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (మాన్సాన్) ట్రస్ట్ ద్వారా ఆస్తులను సంరక్షిస్తూ విద్యాసంస్థలు నడుపుతున్నారు. సింహాచలం దేవస్థానంతో పాటు అనేక ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన తండ్రి పూసపాటి విజయరామగజపతిరాజు, సోదరుడు పూసపాటి ఆనందగజపతిరాజు కూడా ఎంపీలుగా, మంత్రులుగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అశోక్ కుమార్తె అధితి గజపతి రాజకీయ రంగ ప్రవేశం చేసి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అంటే జిల్లా చరిత్రలో అత్యధిక కాలం ఈ కుటుంబమే రాజకీయ పదవులను అనుభవించింది. రెండున్నర దశాబ్దాలు ఎమ్మెల్యేగా, దశాబ్దానికి పైగా మంత్రిగా ఉన్నపుడు జిల్లాకు ఎంతో మేలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి ఆనవాళ్ళు మచ్చుకైనా ఎక్కడా కనిపించలేదు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను తన సొంత ఆస్తులుగా భావిస్తూ... యథేచ్ఛగా క్రయ విక్రయాలు సాగిస్తూ నేటికీ తన ఆస్తులను పెంచుకోవడానికి, రక్షించుకోవడానికి మాత్రమే ఆయన తన పదవులను వినియోగించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. నగరానికి ఆయన చేసిందేమిటి? అశోక్ గజపతి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో కనీస పురోగతి కూడా సాధించలేకపోయారు. జిల్లా కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సైతం తీసుకు రాలేకపోయారు. జిల్లాలో వైద్య విద్యను ప్రోత్సహించేందుకు మెడికల్ కళాశాల ఏర్పాటుచేస్తామన్నా... ఆయన పదవిలో ఉన్నంతకాలం సాధించలేకపోయారు. చివరికి విజయనగరాన్ని సైతం మురికి కూపంగా మిగిల్చారు. ఆయన ఓటమి తరువాతనే నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎన్నో ఏళ్ళగా నగరవాసుల తాగునీటి కష్టాలనూ ఆయన తీర్చలేకపోయారు. ఛిద్రమైన రహదారులు, కలుషితమైన చెరువులు ఆయన దృష్టిలోనే లేవు. ఫలితంగా అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో విజయనగరం మగ్గిపోయింది. ఇదీ ఇన్నేళ్లలో ఈ జిల్లాకు రాజుగారు చేరిన మేలు. ఇప్పుడు ఆయనే మరోసారి జిల్లా అభివృద్ధి నిరోధకానికి తోడ్పడుతున్నారు. వికేంద్రీకరణతోనే విజయనగరాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అభివృద్ధి ఒకేచోట కేంద్రీకరింపజేశారు. అమరావతినే కీలకంగా మార్చేస్తున్నారు. దీనివల్ల మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అమరావతి గౌరవానికి భంగం కలగకుండా ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని, రాయలసీమకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని తీసుకురావాలని యోచిస్తున్న తరుణంలో ఈ ప్రాంతీయుల్లో ఆశలు చిగురించాయి. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంతో సంబరపడుతోంది. విశాఖలో పరిపాలనా రాజధానిని స్వాగతిస్తున్నామంటూ ఊరూ... వాడా... నినదిస్తోంది. కానీ అశోక్ గజపతి మాత్రం ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని, అమరావతే కావాలని నినదించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అశోక్ గజపతి, ఆయన అనుచరులు జిల్లా ప్రజలకు చేస్తున్న ఈ ద్రోహాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. -
‘విజయనగరంలో కర్ఫ్యూ రావడానికి ఎవరు బాధ్యులు’
సాక్షి, విజయనగరం: వైఎస్సార్పీసీ ప్రభుత్వ లక్ష్యం.. అభివృద్ధి, సంక్షేమమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో నిర్వహించిన ద్విశత శంకుస్థాపనల మహోత్సవంలో మంత్రి బోత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత అక్టోబర్లో వంద పనులకు రూ. 11 కోట్లతో శంఖుస్థాపనలు చేశామని ఆయన తెలిపారు. ఇప్పుడు రూ. 22 కోట్లతో రెండు వందల పనులకు శంఖుస్థాపనలు చేయడం ఆనందించదగ్గ విషయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలో రూ. 25 కోట్లతో అభివృద్ధి పనులు జరగుతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు. గతప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని బొత్స మండిపడ్డారు. గత పాలకులకు దోచుకోడమే తప్ప మరో లక్ష్యం లేదని ఆయన ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. ఉగాదికి పట్టణంలో ఇళ్ళు లేని వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సలహాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు, అశోక్ గజపతి రాజు లాంటివారు ఓర్వలేకపోతున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజు వంటివారు అభివృద్ధి చేయలేక పోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. లక్ష తొమ్మిది వేల కోట్లతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజలు ఎందుకు టీడీపీని పక్కన పెట్టారో ఆలోచించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం సమసమాన అభివృద్ధి అని.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది తమ బాధ్యతని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు అభివృద్ధికి వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. 2014కి ముందు విజయనగరంలో కర్ఫ్యూ రావడానికి ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. రోశయ్య సీఎంగా అఖిలపక్షం సమావేశంలో టీడీపీ విభజనకి మద్దతు తెలిపిందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ నేతల సిబ్బందే ఎన్నికల అధికారులు!
సాక్షి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నాయకులను ఓటమి భయం వెంటాడుతోంది. అందుకే పోల్ మేనేజ్మెంట్కు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లను నియమించుకుంటున్నారు. వారికి ఎన్నికల విధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు నడుపుతున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారినే ఎన్నికల విధులకు నియమిస్తున్నట్లు తెలుస్తోంది. పోల్ మేనేజ్మెంట్లో భాగంగానే టీడీపీ నేతలు ఇదంతా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేనా?..: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మాలపాటి శ్రీధర్కు చెందిన అభినందన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ విద్యా విహార్ పాఠశాల నుంచి ఏడుగురు ఉపాధ్యాయులను, అదే మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి పాఠశాల నుంచి 12 మందిని, తాళ్లూరులో టీడీపీ నేత కొల్లి చంద్రశేఖర్రెడ్డికి చెందిన శ్రీవివేకానంద విద్యానికేతన్ నుంచి 20 మంది ఉపాధ్యాయులు, క్రోసూరు టీడీపీ నేత రవి గోవర్దన్రెడ్డికి చెందిన పద్మావతి పబ్లిక్ స్కూల్ నుంచి 11 మందిని ఎన్నికల విధుల కోసం నియమించుకోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. నరసరావుపేట పట్టణంలోని నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్యకు చెందిన కృష్ణచైతన్య పాఠశాల నుంచి, టీడీపీ నాయకుడు మైనేడి శ్రీనివాసరావుకు చెందిన హిందూ స్కూల్, భావన, వాసవి కళాశాలల నుంచి సైతం ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు తీసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో గొట్టిముక్కల వెంకటేశ్వర్లుకు చెందిన ఇండియన్ జెమ్స్ స్కూల్ నుంచి 20 మంది ఉపాధ్యాయులను, పెదనందిపాడు టీడీపీ జెడ్పీటీసీ నగరాజకుమారి కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఎల్ఎంహెచ్ స్కూల్ నుంచి 20 మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధుల కోసం నియమించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఎన్నికల విధుల కోసం తీసుకున్న టీచర్లలో 70 శాతం మంది టీడీపీ నేతలు నడుపుతున్న పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు మొండిచేయి విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు, మంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలు, టీడీపీ ఎంపీ అభ్యర్థి పూసపాటి ఆశోక్గజపతిరాజు ఛైర్మన్గా ఉన్న మాన్సాస్ సంస్థకు చెందిన ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ), ఏపీఓ విధులు కేటాయించారు. వాస్తవానికి ముందుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పీఓ, ఏపీఓ ట్రైనింగ్ ఇచ్చారు. కానీ, రెండోసారి ట్రైనింగ్కు పిలవలేదు. వారికి పీఓ, ఏపీఓ డ్యూటీలు వేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం పక్కనపెట్టి, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఎన్నికల విధులు కేటాయించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నాయకుడి కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలు నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు మిద్దె శాంతిరాముడుకు చెందిన ఆర్జీఎం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లె, నందికొట్కూరు, డోన్, శ్రీశైలం అసెంబ్లీతోపాటు నంద్యాల పార్లమెంట్కు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ మంగళవారం తెలిపారు. టీడీపీ నాయకుడు శాంతిరాముడు, ఆయన కుమారుడు మిద్దెశివరాంలు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులకు చెందిన ప్రైవేటు కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఏడు సార్లు గెలిచినా టికెట్ ఇవ్వరా..!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ ఆ పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర అసహనానికి కారణమైంది. విజయనగరం జిల్లా టీడీపీలో టికెట్ల రగడ కొనసాగుతోంది. ప్రధానంగా బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించే అంశాన్ని చంద్రబాబు కావాలనే పెండింగ్లో పెడుతున్నారని టీడీపీ సీనియర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల వయస్సులో 5 రోజులుగా సీఎం ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానని వాపోయారు. కనీసం తన వయస్సుని గౌరవించకుండా తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటును నారాయణస్వామికి ఇచ్చే అవకాశం ఉన్నా.. భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఆనంద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కడగల ఆనంద్కుమార్ అడ్డుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. పతివాడ తన కుమారుడు అప్పలనాయుడికి టికెట్టు ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇక మరో బీసీ మహిళ ఎమ్మెల్యే మీసాల గీత టికెట్ కూడా పెండింగ్లోనే ఉన్నట్టు తెలిసింది. తొలి జాబితాలో అవినీతి ఆరోపణలు ఉన్న నేతలకు, రాజులకే అగ్రస్థానం ఇచ్చారని ఆమె ఆరోపించారు. కాగా, తన కుమార్తె అదితికి టికెట్ ఇప్పించుకునేందుకు గీతను ఎంపీ అశోక్ గజపతి రాజు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గీత ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం శాసనసభా స్థానాన్నితన కుమార్తెకు ఇవ్వాలని అశోక్ పట్టుబడుతున్నట్టు సమాచారం. బీసీ మహిళకు ఒక్క సీటు కూడా ఇవ్వరా అని టీడీపీ తీరుపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘సింహాచలం’ భూములు పంచిపెట్టడం కుదరదు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూసమస్య పరిష్కారం చేస్తామంటూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఫెయిర్నెస్ (నిజాయితీ) లేదని స్వయానా ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ పూసపాటి అశోక్గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలలో జరుగుతున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో పాల్గొనేందుకు మంగళవారం వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. క్రమబద్ధీకరణకు ఎప్పుడో 20 ఏళ్ల కిందటి భూమి విలువలో 7.5శాతం కట్టాలని జీవోలో పేర్కొనడం మరీ హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో 70శాతం మార్కెట్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని జీవో రాగా.. ఆ ప్రకారం కొంతమంది దేవస్థానానికి నగదు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారని, ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అంటే అప్పుడు వాళ్లు కట్టిన నగదు వడ్డీతో సహా ఇవ్వాలా.. వద్దా మీడియానే చెప్పాలన్నారు. జీవోలు చట్టాల ప్రకారం జరగాలని, చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్టేట్ ఆఫ్ ఆల్ ఇష్యూ అనే యాక్ట్ ఉందని, అన్నీ ఎస్టేట్స్ అయ్యాయని తెలిపారు. మన దేశంలో చాలా హిందూ ఆలయాలు, హిందూ యేతర ఆలయాలున్నాయన్నారు. తాము వివిధ ప్రాంతాల్లోని 104 ఆలయాలకు అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నామని, వాటిల్లోనూ ఇదే రీతిలో సమస్యలున్నాయని తెలిపారు. ఇలాంటి జీవోలు తీసుకొస్తే వాటిని కూడా పూర్తిగా మూసివేయాల్సి ఉంటుందని చెప్పారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూసమస్య జీవో నిర్ణయంపై అధికారులు ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. తానైతే పేపర్లలో చూసి ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కె.ఇ. కృష్ణమూర్తికి లేఖ రాశానన్నారు. సీఎంని కలిసి జీవోలో నిజాయితీ ఉండాలని కోరగా ఆయన రామకృష్ణుడు మీతో మాట్లాడతారని సమాధానం ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు రామకృష్ణుడు తనతో మాట్లాడలేదన్నారు. ఇలాంటి పరిస్థితే కొనసాగితే దేశంలో ఏ మతం, ఏ చారిటబుల్ ట్రస్టు కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోలో మీ రిప్రజెంటేషన్ కూడా కోడ్ చేశారన్న విషయంపై విలేకర్లు ప్రస్తావించగా.. ‘నేనిచ్చిన రిప్రజెంటేషన్ ఎక్కడా కోడ్ చేయలేదు. కావాలంటే ఆ కాపీలు మీకిస్తాను చదవండని’ పూసపాటి అన్నారు. వరాహ లక్ష్మీనృసింహస్వామి ఇక్కడ ఉండకూడదనే ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం క్రమబద్ధీకరణ జరిపితే ఆ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారినిæ భక్తులే రక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. 20 ఏళ్ల కిందట విలువలో 7.5శాతం ఎందుకని..ఉచితంగా ఇస్తే అయిపోయేది కదా అని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రజలంతా జీవోలో పేర్కొన్న విధంగా కాకుండా మరింత ఎక్కువ కట్టడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ప్రస్తావించగా.. తామేమీ చిల్లర కొట్టు పెట్టలేదని, బేరాలు ఆడుకోవడం లేదని అశోక్గజపతిరాజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. -
డబ్బు మూటలు ఇస్తేనే టిక్కెట్లా?
సాక్షి, అమరావతి: నేతల పనితీరు, సర్వేల ప్రకారమే టిక్కెట్లు ఇస్తామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. కానీ, అదంతా ఉత్తదే, చినబాబుకు డబ్బు మూటలు సమర్పిస్తేనే టిక్కెట్లు కేటాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు ధృతరాష్ట్రుడి పాత్రకే పరిమితం అవుతున్నారని, చినబాబు చెలరేగిపోతున్నాడని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే పార్టీ పుట్టి మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, సీనియర్లు, సమర్థులను పక్కన పెట్టేస్తూ ఏకపక్షంగా టిక్కెట్లు ఖరారు చేస్తుండడం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఆశీస్సులు ఉంటే చాలు సమర్థత, పార్టీ కోసం చేసిన సేవతో నిమిత్తం లేకుండా టిక్కెట్లు దక్కుతున్నాయని అంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుండటంతో అకస్మాత్తుగా కొత్త ముఖాలకు పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో సహా సీనియర్లు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటుండటం చర్చనీయాంశంగా మారింది. టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో ముసలం పుట్టిస్తోంది. సీనియర్లకు భంగపాటు టిక్కెట్ల కేటాయింపులో మంత్రి లోకేశ్ ఒంటెత్తు పోకడలతో టీడీపీ సీనియర్లు తీవ్ర భంగపాటుకు గురవుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజుకు కనీస సమాచారం లేకుండానే కాంగ్రెస్ నేత కిశోర్చంద్రదేవ్ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయనకు అరకు ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. తనకు తెలియకుండానే కిశోర్ చంద్రదేవ్కు మాట ఇవ్వడం అశోక్గజపతిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట ఆయన స్వస్థలం ఉన్న రాజాం(ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంలోనే చెల్లుబాటు కాలేదు. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని కోండ్రు మురళీని టీడీపీలో చేర్చుకునేందుకు, రాజాం అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు లోకేశ్ అనుమతి ఇచ్చారు. అనంతరమే కళా వెంకట్రావుకు సమాచారం ఇచ్చారు. దీనిపై కళా కుటుంబసభ్యులు, ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెరపైకి కొత్త ముఖాలు టీడీపీలో టిక్కెట్ల కేటాయింపులో డబ్బు మూటలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్కు కూడా మంత్రి లోకేశ్ దెబ్బ తగిలింది. ఓ బడా కాంట్రాక్టర్ రాజమండ్రి ఎంపీ టిక్కెట్ కోసం మంత్రి లోకేశ్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా రాజకీయాల్లో లేని ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. దాంతో మురళీమోహన్కు ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతాలు పంపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న సీనియర్లు లింగారెడ్డి, వరదరాజులరెడ్డికి మంత్రి లోకేశ్ గట్టి షాక్ ఇచ్చారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనూహ్యంగా ప్రొద్దుటూరు రేసులోకి రావడం గమనార్హం. ప్రొద్దుటూరు టిక్కెట్ను వీరశివారెడ్డికి ఖాయం చేయాలని టీడీపీ నిర్ణయించడంపై లింగారెడ్డి, వరదరాజులరెడ్డి భగ్గుమంటున్నారు. ఇక మైదుకూరు టిక్కెట్ను డీఎల్ రవీంద్రారెడ్డికి కేటాస్తామని సీఎం చంద్రబాబు కొన్ని నెలల క్రితం హామీ ఇచ్చారు. కానీ, తాజాగా టీడీడీ చైర్మన్ పుట్ట సుధాకర్యాదవ్ను మంత్రి నారా లోకేశ్ తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దీనికి అంగీకరించాల్సి వచ్చింది. పార్టీలో సీనియారిటీ, చిత్తశుద్ధి, సమర్థతలను పట్టించుకోకుండా డబ్బు మూటలు ముట్టజెబుతున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. -
అశోక్ గజపతిరాజు మళ్లీ డుమ్మా!
-
అశోక్ గజపతిరాజు మళ్లీ డుమ్మా!
అమరావతి: వారం రోజుల క్రితం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంతో పాటు భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమాలకు దూరమైన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతి రాజు మరోసారి పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇటీవల కాంగ్రెస్ను వీడిన కిశోర్ చంద్రదేవ్ ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సైతం అశోక్ గజపతిరాజు హాజరు కాలేదు. దాంతో వరుసగా టీడీపీ కార్యక్రమాలకు అశోక్ గజపతిరాజు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపట్ల గజపతిరాజు అసంతృప్తిగా ఉన్నారు. దానిలో భాగంగానే టీడీపీ కార్యక్రమాలకు అశోక్ గజపతిరాజు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్గజపతి రాజు రాకపోవడానికి కారణం ఇదేనని సమాచారం. కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణమన్న వాదన కూడా ఉంది. ఇందుకు అశోక్ గజపతిరాజు గైర్హాజరీ కావడం మరింత బలాన్ని చేకూర్చింది. కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరిక గురించి తనతో చంద్రబాబు చర్చించకపోవడం అశోక్గజపతికి కోపం తెప్పించిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కిశోర్ పార్టీలో చేరిక కార్యక్రమానికి ఆయన గైర్హాజరైనట్లు తెలుస్తోంది. -
నేనంటే... నేనే..
విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీలో కొత్త చికాకులు సృష్టిస్తోంది. సిటింగ్ను కాదంటే... మేమంటే మేమంటూ ఎవరికి వారే పలువురు నాయకులు యత్నాలు ముమ్మరం చేస్తుంటే... వీరి వ్యవహారం కుమార్తెను రంగంలోకి దించాలని యోచిస్తున్న అశోక్కు శిరోభారంగా మారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలు తెరపైకి వస్తూ గందరగోళానికి దారి తీస్తున్నారు. మొత్తమ్మీద మునిసిపల్ చైర్పర్సన్... కౌన్సిలర్... వంటివారు సైతం అభ్యర్థిత్వం కోసం పోటీపడటం చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: అధికార తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిత్వాల గోల గందరగోళంగా మారుతోంది. పార్టీ పరిస్థితి అందులోని నేతలకే అర్థం కాకుండా పోతోంది. విజయనగరం నియోజకవర్గంలో పార్టీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్టు వస్తుందన్నది ఇంకా స్పష్టత లేకపోవడంతో రోజుకో కొత్త ముఖం వెలుగులోకి వస్తూ కొత్త వర్గాలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ పరిస్థితి పార్టీకి ఉన్న ఆ కాస్త కేడర్ను అయోమయంలో పడేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్పై సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతతో పాటు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఇప్పటికే ఆశలు పెట్టుకోగా తాజాగా ఈ రేసులోకి కౌన్సిలర్ కంది మురళీనాయుడు వచ్చి చేరారు. అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ కూడా ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తెను రంగంలోకి దించాలనుకుంటున్నారు. సిట్టింగ్ను మార్చాలన్న యోచనతోనే... గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిపోయిన మీసాల గీతపై సహజంగానే నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చింది. అది కేవలం ప్రజలకే పరిమితం కాలేదు. పార్టీ నేతల్లోనూ అది గట్టిగా బలపడింది. తమ సమస్యలు వినేందుకుడానీ, కనీసం తమను కలిసేందుకుగానీ ఎమ్మెల్యే అవకాశం ఇవ్వరని, ఫోన్లలోనూ స్పందించరని ఆమెపై నెపం వేస్తూ దూరమవుతున్నారు. మరోవైపు విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజును కాదని మీసాల గీత జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గంలో చేరారు. ఈ వ్యవహారం ఆమెను అశోక్కు దూరం చేసింది. గంటా ద్వారా మళ్లీ విజయనగరం టిక్కెట్టు పదిలం చేసుకోవాలన్నది ఆమె ఆలోచన. అతిథికి ఆతిధ్యం లభించేనా... ఇక కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీగా ఉన్న అశోక్గజపతిరాజు వ్యూహాలు ఆ పార్టీ పెద్దలకే అంతుబట్టకుండా ఉన్నాయి. తన కుమార్తె అతిథిని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబెట్టాలని తన మనసులో ఉన్నా ఆ విషయాన్ని ఇంత వరకూ ఎప్పుడూ, ఎక్కడా బయటపెట్టలేదు. కానీ పట్టణంలో గీతకు వ్యతిరేకంగా తన కుమార్తెకు ప్రాధాన్యమిచ్చి సీఎం చంద్రబాబుకే అనుమానాలు రేకెత్తించారు. ఇటీవల సీఎం సభలకు, సమావేశాలకు కూడా డుమ్మాకొట్టి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తీకరించారు. తన కుమార్తెకు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకుని, తాను కేంద్ర నామినేటెడ్ పదవులకు లేదా, ఏదైనా రాష్ట్ర గవర్నర్ పదవికి వెళ్లిపోవాలనే ఆలోచనలో అశోక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్టు ఎవరికి వస్తుందనేదానిపై టీడీపీలో వారిలో వారే మల్లగుల్లాలుపడుతూ ఎవరికివారు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. నేనే సీనియర్ అంటున్న ప్రసాదుల మరోనేత మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్టుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన భార్య కనకమహాలక్ష్మి రెండుసార్లు మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. ప్రస్తుతం రామకృష్ణ ఆ పదవిలో ఉన్నారు. ఈ లెక్కన గీత కంటే తానే సీనియర్నని ఆయన బాహాటంగా చెబుతున్నారు. అందుకే ఆమెను అడుగడుగునా వ్యతిరేకిస్తూ... ఆమెకు అన్నివేళలా దూరంగా ఉంటున్నారు. వీరి మధ్య వివాదం మరింత జటిలంగా మారుతోంది. ఇప్పుడు వీరి మధ్య 37వ వార్డు కౌన్సిలర్ కంది వెంకట మురళినాయుడు కొత్తగా చేరారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్టు కోసం నేరుగా చంద్రబాబుకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. విజయనగరం పట్టణంలో గత ఎన్నికల్లో తూర్పుకాపు సామాజిక వర్గం నుంచి మీసాల గీత గెలవగా ఈ సారి ఆమెకు టిక్కెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతున్నందున అదే సామాజిక వర్గానికి చెందిన తన పేరును పరిశీలించాలని మురళి కోరుతున్నారు. అయితే సీనియర్లను కాదని మురళికి టిక్కెట్టు రావడం అంత సులభమేమీ కాదు. -
టీడీపీలో ‘రాజ’ముద్ర
వారంతా రాజులే. అలాగని ప్రజాసంక్షేమమేధ్యేయంగా పాటుపడే పాలకులు కాదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసే జవాబుదారీలు కాదు. తమను నిత్యం అంటిపెట్టుకునేవారి సంక్షేమమే వారి లక్ష్యం. స్వార్థ ప్రయోజనం... ఆశ్రిత పక్షపాతం... బంధుప్రీతి... వారి నైజం. అధికారం వారి చేతుల్లోనే ఉండాలి. పదవులు వారే అనుభవించాలి. మిగతా జనమంతా వారి కనుసన్నల్లోనే బతకాలి. అందుకే అత్యధిక బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ హయాంలో వారి ఎదుగుదల నామమాత్రమే. పథకాలన్నీ పెద్దలకే అందుతున్నాయి. బీసీలకు కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. తెలుగుదేశం పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి రాజుకుంటోంది. సాక్షిప్రతినిధి విజయనగరం: రాజంటే... తన రాజ్యంలో సుస్థిర పాలనను అందించడం... తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడటం... ఎలాంటి పక్షపాతాలకు, రాగద్వేషాలకు తావివ్వకుండా నిరంతరం ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచించడం చేయాలి. కానీ అలాంటి రాజవంశ ముద్ర వేసుకున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీనిని ఆ పార్టీవారే బాహాటంగా అంగీకరిస్తారు. జిల్లాలో అత్యధికంగాఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అధికారపార్టీ నేతలు పూర్తిగా విస్మరించారు. కేవలం రాజ సామాజిక వర్గానికి, వారి అనుచర గణానికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాలిలో కలసిన బీసీలకిచ్చిన హామీలు గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, బీసీలపై సవతితల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్గజపతిరాజు అనుచరులకు విజయనగరం ఏఎంసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇచ్చారు. బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని సుతరామూ అంగీకరించని అక్కడి పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడికి ఆర్టీసీ సంస్థ రీజనల్ చైర్మన్ పదవినిచ్చి కేవలం బుజ్జగించారు. ఈ మూడింటితోనే బీసీలకు ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ నియోజకవర్గ, జిల్లా, రీజనల్ స్థాయి పదవులే కావడం విశేషం. రాష్ట్రస్థాయి పదవులకు నోచనీ బీసీలు ఇక రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం బీసీలకు దక్కనివ్వడం లేదు. సుజయ్కు ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన తూముల భాస్కరరావును రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడిగా నియమించుకున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్గా భోగపురపు వాయునందన శర్మను వేసుకున్నారు. తాజాగా అశోక్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఐ.వి.పి.రాజును రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్గా నియమించుకున్నారు. విజయనగరంలో అశోక్గజపతిరాజు, సాలూరులో ఆర్పి భంజ్దేవ్, కురుపాంలో శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలిలో ఆర్వి సుజయకృష్ణ రంగారావు రాజుల సామాజిక వర్గం నుంచి టీడీపీలో పెత్తనం చెలాయిస్తుండగా త్వరలోనే వీరికి మరోరాజు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తోడవ్వనున్నారు. ఇలా విజయనగరం జిల్లా టీడీపీ మొత్తం రాజుల మయంగా మారుతోంది. పోనీ వీరు జనానిమైనా చేస్తున్నారా అంటే..అదీ లేదు. శత్రుచర్ల విజయరామరాజు, ఆర్పి భంజ్దేవ్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికే కులనిర్థారణ వివాదాల్లో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. పదవి కోసం శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్దేవ్లు తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్చంద్రదేవ్ ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరుతున్నారు. వీరివల్ల జిల్లా ప్రజలు ఏ విధమైన ప్రయోజనం పొందలేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
అమిత్షా సమావేశానికి అశోక్ పరోక్ష సహకారం!
తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్. జిల్లాకు ఇప్పటికీ పెద్దదిక్కుగానిలుస్తున్న నేత పూసపాటి అశోక్గజపతిరాజు. ఇప్పుడు ఆయన్ను పార్టీ అధినేతఉద్దేశ పూర్వకంగానే పక్కనపెడుతున్నారా? ఈయన కూడా సీఎం చంద్రబాబుతీరుపై అలకపూనారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి. దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టికుని నెంబర్–2 స్థానానికి ఎదిగిన అశోక్ విషయంలోఏం జరుగుతోంది. ప్రభుత్వ, పార్టీ ముఖ్య కార్యక్రమాలకు సైతం ఆయనెందుకుదూరంగా ఉంటున్నారు? ఇప్పుడు ఇవే జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం: అమరావతిలో తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం శనివారం జరిగింది. రానున్న ఎన్నికల్లో వ్యూహాలపై పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే అత్యం త ప్రాధాన్యం కలిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీ అశోక్ గజపతి హాజరుకాలేదు. విజయనగరం జిల్లాలో పార్టీకి అశోక్ పెద్ద దిక్కుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనగానీ లేదా ఆయన కుమార్తెగానీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పైగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎంపీగా ప్రాతిని ధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడై ఉండి పార్టీ ఎన్నికల వ్యూహాలపై చర్చించే సమావేశానికి ఎందుకు వెళ్లలేదనేది అనుమానాలకు దారితీసింది. ఎయిర్పోర్టు శంకుస్థాపనకూ గైర్హాజరు రెండు రోజుల క్రితం జిల్లాలో జరిగిన భోగా పురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్ర యం శంకుస్థాపనకు కూడా అశోక్ గజపతి రాలేదు. మొన్నటి వరకూ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ కనీసం ఎంపీ హోదాలోనైనా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. అయినా అలా జరగలేదు. అంతేగాదు... ఆ రోజు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు జిల్లాలోని నియోజకవర్గస్థాయి నేతల గురిం చి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. కానీ కేంద్రం ఆధీనంలోని విమానాశ్రయం శంకుస్థాపనకు వచ్చి ఆ శాఖ మాజీ మంత్రి గురించిఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే భోగాపురం టెండర్ల విషయంలో చంద్రబాబుతో అశోక్కు మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం. అమిత్షా సమావేశానికి పరోక్ష సహకారం ఇటీవల బీజేజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయనగరంలో బహిరంగ సభ నిర్వహించడానికి వచ్చినపుడు టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అశోక్ వద్దనడంతో మౌనం వహించారు. శ్రీకాకుళం జిల్లాలో అదే టీడీపీ శ్రేణులు అమిత్ షా గోబ్యాక్ అంటూ ఆందోళన చేపట్టారు. ఈ విషయంలోనూ అశోక్ తీరుపై పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లోనూ, అధికారిక కార్యక్రమాల్లోనూ అశోక్ తన కుమార్తె అతిథి గజపతిని గతంలో తీసుకువచ్చినపుడు సీఎం చంద్రబాబు వరకూ విషయం వెళ్లడంతో అశోక్ను పిలిచి మందలించారు. ఆ తర్వాత ఆమె తెరమరుగయ్యారు. మళ్లీ ఇటీవల జరిగిన సంగీత, నృత్య కళాశాల శతవసంత వేడుకల్లో ఆమె మరలా ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ప్రారంభించారు. ఇది కూడా సీఎంకు, అశోక్కు మధ్య అంతరం పెరగడానికి ఓ కారణంగా తెలుస్తోంది. జిల్లా నేతల తీరుపైనా అసంతృప్తి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్చంద్రదేవ్ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో టీడీపీ శ్రేణులు టచ్లో ఉన్నాయి. కానీ ఆ విషయంలోనూ అశోక్ అభిప్రాయాన్ని తీసుకోకపోవడంపై చిన్నబుచ్చుకున్న అశోక్ అలక వహించినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో అశోక్కు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలతో ఒక వర్గం పనిచేస్తోంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీని వాసరావు వర్గంగా మారిన మీసాల గీత, కె.ఎ. నాయుడు తదితరులు అశోక్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పట్టణంలో తాగునీటి సమస్యను సృష్టించడం కూడా దీనిలో భాగమేనని వార్తలు వచ్చాయి. దీనిపై మీడియాతో అశోక్ మాట్లాడుతూ పార్టీపై తనకు అసంతృప్తి లేదనీ, అలా అని పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పలేనన్నారు. తాను గైర్హాజరుకు కేవలం రవాణా సదుపాయం లేకపోవడమే కారణంగా చెప్పుకొచ్చారు. -
చంద్రబాబుపై అలిగిన అశోక్గజపతిరాజు
-
చంద్రబాబుపై అలిగిన సీనియర్ నేత
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఈ జాబితాలోకి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతి రాజు కూడా చేరినట్టు కనబడుతోంది. చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశానికి అశోక్గజపతి రాజు హాజరుకాకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. చంద్రబాబుపై ఆయన అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్గజపతి రాజు రాకపోవడానికి కారణం ఇదేనని సమాచారం. కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణమన్న వాదన కూడా ఉంది. కిశోర్ చంద్రదేవ్ను టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం గురించి తనతో చంద్రబాబు చర్చించకపోవడం అశోక్గజపతికి కోపం తెప్పించిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పొలిట్బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరైనట్టు తెలుస్తోంది. -
జిల్లాకు అశోక్ ఏం చేశారు!
విజయనగరం, నెల్లిమర్ల: కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు జిల్లాకు ఏం చేశారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నెల్లిమర్ల–విజయనగరం రహదారిలో సారిపల్లి జంక్షన్లో ఉన్న జగన్నాధ ఫంక్షన్ హాలులో గురువారం నిర్వహించిన నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా కొనసాగిన ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. ప్యాకేజీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మొదట్నుంచీ వత్తాసు పలికిన అశోక్ నాలుగేళ్లలో జిల్లాకు కేవలం రూ.50కోట్లు మాత్రమే తెప్పించగలిగారని ఆరోపించారు. ఆ విధంగా వచ్చిన నిధుల్లో రూ.22కోట్లు తన కోట చుట్టూ కందకం తవ్వించడానికే వినియోగించారని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడం వెనుక అశోక్తో పాటు టీడీపీ నేతల స్వార్ధం ఉందన్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టును అప్పగించేందుకే టెండర్లను రద్దు చేసిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు అశోక్ దోపిడీని బయటపెడతానని బొత్స స్పష్టం చేశారు. రామతీర్ధ సాగర్ సంగతేంటి! నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన రామతీర్ధ సాగర్ ప్రాజెక్టును టీడీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి నాయుడు ఎందుకు గత నాలుగున్నరేళ్లలో పూర్తి చేయలేకపోయారని బొత్స ప్రశ్నించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత కలిగిన పతివాడ ప్రాజెక్టు నిర్మాణంపై ఎందుకు శ్రద్ధ చూపించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంచే కనీసం పిడికెడు మట్టి కూడా వేయించలేదన్నారు. కాంట్రాక్టర్లను మార్చినప్పుడల్లా కమీషన్లు వస్తాయనే కక్కుర్తితోనే ఈ విధంగా ఎమ్మెల్యే పతివాడ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలోని పరిశ్రమలన్నీ మూతబడ్డాయని, తాజాగా నెల్లిమర్ల జ్యూట్మిల్లు కూడా మూతబడిందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనే భయంతోనే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని బొత్స ఆరోపించారు. సర్వేల పేరుతో ఇంటింటికీ పంపించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పేవారి ఓట్లను ఆధార్ సాయంతో తొలగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని బొత్స సూచించారు. వారి పరిధిలోని ఓట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు, కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, పతివాడ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు. -
‘ఉత్తరాంధ్రకు మీరేం చేశారు?’
సాక్షి, విజయనగరం : టీడీపీ ఉత్తరాంధ్ర బీసీ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర బీసీ సమావేశంలో అశోక్ గజపతి రాజు మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న అశోక్ గజపతి రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభియోగాలు రుజువు కాకుండా ప్రతిపక్ష నాయకున్ని దొంగగాడు అనడం సరికాదన్నారు. ఇన్నాళ్లు కేంద్ర మంత్రిగా పని చేసిన అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పగలరా అంటూ శ్రీనివాస రావు ప్రశ్నించారు. బొబ్బిలిలో అధికంగా ఉన్న బీసీలకు కనీసం నామినేట్ పోస్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాలు సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు.. నేడు వాటిల్లోని కొన్ని పథకాలను దొంగిలించారని ఆరోపించారు. -
దీనిని ఏమనాలి?
జ్వరం... ఇది సాదాసీదా అనారోగ్యం. చిన్నపాటి మందులతో పూర్తిగా నయం చేయొచ్చు. టైఫాయిడ్... మలేరియా... ఇలా ఎన్నో వైరస్ జ్వరాలను సైతం సునాయాసంగా అదుపు చేసిన ఘనత మన వైద్యరంగానిది. పూర్వం ఎప్పుడో జ్వరాలతో మరణాలు సంభవించినట్టు చరిత్రలో విన్నాం... మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు జిల్లాలో సంభవిస్తుంటే విస్తుపోతున్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ఒక గ్రామంలో తొమ్మిది మంది... జిల్లా వ్యాప్తంగా మరో డెభ్భై మంది మృత్యువాత పడితే... సర్కారు ప్రతినిధులైన జిల్లా మంత్రి, మాజీ కేంద్రమంత్రి ఎందుకో తేలిగ్గా తీసుకున్నట్టున్నారు. మనిషి ప్రాణాలు కోల్పోతే అదేమంత తీవ్రమైన అంశం కాదేమోనని భావిస్తున్నట్టున్నారు. మరి వారి వైఖరిని ఏమనాలి...? సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా రెండు నెలలుగా జ్వరాలతో సహవాసం చేస్తోంది. వరుస మరణాలతో తల్లడిల్లిపోతోంది. ఏ పల్లె చూసినా మంచం పట్టిన పిల్లలు, వృద్ధులు, అనే తేడా లేకుం డా అన్ని వయస్సులవారూ ముసుగేసుకుని కనిపిస్తున్నారు. రోజూ ఒకటో, రెండో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలా నెలరోజుల్లో దాదాపు 80మంది ప్రాణాలు వదిలారు. దీనినిమానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల కమిషన్లు తీవ్రంగానే స్పందించాయి. వెంటనే జిల్లా అధికారులకు నోటీసులు ఇచ్చాయి. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెం దిన రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి సుజయ్కృష్ణ రంగారావులో మాత్రం కొంచెమైనా చలనం లేదు. ఇంతవరకూ ఈ చావులను తీవ్రంగా తీసుకోలేదు. వ్యాధుల నియంత్రణ కోసం అధికారులతో సమీక్ష జరపలేదు. జనం కోసమే పార్టీ మారానని చెప్పుకునే ఆయన ఆ ప్రజలకు కష్టమొస్తే మాత్రం ముఖం చాటేశారు. ఇక మరో రాజు అశోక్దీ అదేతీరు. ‘ముందస్తు’ వైఫల్యం సాధారణంగా సీజనల్ వ్యాధులపై అధికార యంత్రాం గం ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తుంటుంది. అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చేసరికే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జిల్లాలో ఆ ప్రయత్నంలో జిల్లా అధికారులు విషలమయ్యా రు. డ్రెయిన్లు, రహదారులు, పారిశుద్ధ్య నిర్వహణపై జాతీయ స్థాయిలో వచ్చే అవార్డులపైనే దృష్టి సారించా రు తప్ప వాస్తవ పరిస్థితులను పట్టించుకోలేదు. మరో వైపు పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం పూర్తయిం ది. ప్రత్యేకాధికారులను నియమించినా వారు ఇంత వర కూ గ్రామాలపై పూర్తిగా దృష్టిసారించలేదు. కొందరైతే ఇంకా గ్రామాల ముఖం కూడా చూడలేదు. అక్కడి పారి శుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టలేదు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరే స్వయంగా అంగీకరిస్తున్నారు. పోనీ జ్వరాలు వ్యాపిస్తున్నప్పుడైనా తీవ్రతనుఅంచనా వేశారా అంటే అదీలేదు. వ్యాధుల తీవ్రతను అంచనా వేసి తగిన మందులు సమకూర్చడం, వైద్య సిబ్బందిని పెంచడం, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్లేట్లెట్స్ కొరత, వైద్యం సకా లంలో అందకపోవడం,పైపెచ్చు డెంగీ వ్యాధిని నిర్ధారిం చకపోవడం జిల్లాలో ఇన్ని చావులకు కారణమయ్యాయి. ‘హెచ్ఆర్సీ’నోటీసులు: జ్వరం వస్తే మరణమనే పరిస్థితి ఇప్పుడు జిల్లాలో ఏర్పడటానికి కారణం ఏమిటనే చర్చ ఒకవైపు జరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 80 మందికిపైగా జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం మొత్తం మీద ఇన్ని చావులు ఎక్కడా లేవు. ఒక్క సాలూ రు మండలం కరాసవలస గ్రామంలోనే రెండు వారాల్లో 9 మంది చనిపోయారు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. టీవీ, పత్రికలు, సోషల్ మీడియా జిల్లా పరిస్థితిపై దు మ్మెత్తి పోస్తున్నాయి. సాలూరు ప్రభుత్వాస్పత్రిలో గిరిజ న బాలికలను వరుసగా కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాలల హక్కుల కమిషన్ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రిని, హాస్టల్ను సందర్శించారు. అసౌకర్యాలు వాస్తవమేనని తేల్చారు. అంతేకాకుండా మానవ హక్కు ల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సుమోటోగా తీసుకుని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్యాధికారులకు నోటీసులు జారీ చేసింది. నేతలెవ్వరూ నోరు మెదపరే... జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మోన్నామధ్య రాష్ట్ర మంత్రి కళావెంకట్రావు వచ్చినపుడు మాత్రమే ఆయనతో కలిసి బయటకు వచ్చారు. ఆ రోజు కూడా కళావెంకట్రావు కొద్దిగా జ్వరాలపై పెదవి విప్పారు గానీ అశోక్ పెద్దగా మాట్లాడింది లేదు. ఆయన నివాసం ఉంటున్న విజయనగరం పట్టణంలో వరుస చావులు సంభవిస్తున్నా, నవ వరుడు జ్వరం బారినపడి మరణించినా ఆయనలో చలనం లేదు. ఇక రాష్ట్ర మంత్రి సుజయ్కృష్ణ రంగారావు ఏదో చేసేస్తానంటూ పార్టీ మారి ఆయన జిల్లాకు చేసిందేమీ కనిపించలేదు. కనీసం జిల్లా ఇలా సీజనల్ వ్యా ధులు, మరణాలతో అల్లాడుతున్నప్పుడైనా ప్రజలకు ఆయన అండగా నిలబడి ధైర్యం చెబుతున్నారా అంటే అదీ లేదు. ఇంత వరకూ అధికారులతో సమీక్ష జరిపిందీ లేదు. అసలు వారి తీరును ఏమనుకోవాలన్నదే అంతుచిక్కడం లేదు. జిల్లాను పట్టించుకోని ఇలాంటి ప్రజాప్రతినిధులు అవసరమా.. అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
‘భీమవరం అభివృద్దిలో క్షత్రియుల పాత్ర కీలకం’
సాక్షి, భీమవరం : క్షత్రియులు సమాజం కోసం, ధర్మం కోసం పోరాడుతారని, భీమవరం అభివృద్దిలో వారి పాత్ర కీలకం అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్షత్రియులను ఉద్దేశించి మాట్లాడారు. భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన వల్ల భీమవరం ప్రజానీకానికి ట్రాఫిక్ ఇబ్బంధి వచ్చి ఉంటే మన్నించాలంటూ ప్రజలను కోరారు. అన్ని కులాల్లో పేదరికం ఉందని, పేరుకే అగ్రకులాలు.. వాటిలో కూడా పేదరికం చాలా ఉందని అన్నారు. అశోక్ గజపతిరాజుపై చేసిన విమర్శలు వ్యక్తిగతం కావని, విధివిధినాలపై చేసినవేనని, కుల పరంగా చేసినవి కాదంటూ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడిని అంటే కమ్మవారినందరిని అన్నట్లు కాదని తెలిపారు. అంబేడ్కర్, అల్లూరి లాంటి మహనీయులను ఒక కులానికి ప్రతినిధులుగా చూడలేమని చెప్పారు. తనని తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడతాడని బైబిల్లో ఉందని పేర్కొన్నారు. భీమవరం ఒక హైదరాబాద్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. -
టైం దగ్గర పడింది.. త్వరలోనే చరమగీతం
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కడప ఉక్కు కోసం సంతకాల సేకరణ చేపట్టిన గజపతి రాజు, విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తామని చెప్పి మోసగించారని, యూనివర్సిటీ గిరజనుల హక్కు అని, వాటిపై పోరాడాలని అనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విభజన సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ అమలు కాలేదని ఈ విషయంపై అశోక్ గజపతి రాజు ఎందుకు పోరాటం చేయడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉందని, కేంద్రంలో భాగస్వామిగా ఉండి పదవులు అనుభవించిన ఎంపీ సంతకాల సేకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జిల్లాకు లబ్ధి చేకూర్చే అంశాలను విస్మరించిన ఎంపీకి కడప ఉక్కు పరిశ్రమకై పోరాడే అర్హత లేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానని చెప్పినట్లు, ఓటు వేసి గెలిపించిన జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని అశోక్ గజపతి రాజు.. కడప ఉక్కు పరిశ్రమ కోస పోరాడటం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసరావు తెలిన్నారు. టీడీపీ పాలనకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో గజపతి రాజుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
టీడీపీలో ఫోన్ ట్యాపింగ్ రగడ
-
ఆడియో టేపుల్లో పేర్లు ఎఫ్ఐఆర్లోకి!
సాక్షి, అమరావతి: ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి బహిర్గతమైన ఆడియో టేపుల్లో ప్రస్తావనకు వచ్చిన పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఎయిర్ ఏషియా ఉన్నతాధికారుల సంభాషణ ఆడియో టేపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుల పేర్లు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. జీవీఎల్ బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. తప్పు చేయకుంటే భయమెందుకు? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎయిర్ ఏషియా కుంభకోణంలో కొన్ని ఆడియో టేపులు బయటకు రాగానే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొదలైన సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని, విచారణలో వెల్లడైన అన్ని అంశాలపై చర్యలు ఉంటాయన్నారు. ఆడియో టేపుల్లో తమ పేర్లు ప్రస్తావనకు రావటంపై ఆ నాయకులు స్పందించాన్నారు. ముహూర్తాలు ఎందుకు? ఎయిర్ ఏషియాకు సంబంధించి టీడీపీ పెద్దల పేర్లు బయటకు రాగానే రెండు నెలల్లో రెండు భారీ కుంభకోణాలు బయట పెడతామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొనటంపై జీవీఎల్ స్పందించారు. కుంభకోణాలు బయట పెట్టడానికి ముహూర్తాలు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా షేర్ మార్కెట్ వ్యాపారం చేసుకునే కుటుంబరావు లాంటి వ్యక్తులను ఆ పదవిలో నియమించడం ఏపీలోనే జరిగిందన్నారు. ఆ నిధులు ఏమయ్యాయి? రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తే కేంద్ర నిధులు వస్తాయి కానీ అబద్ధాలు ప్రచారం చేస్తేనో, రాజకీయాలు చేస్తోనో నిధులు రావని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీల్లో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా రాజధాని పనులు జరగలేదని కేంద్ర అధికారుల పరిశీలనలో తేలిందని చెప్పారు. వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం ఇచ్చిన రూ.1,050 కోట్లతో ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలువురి ఫోన్ల ట్యాపింగ్... రాష్ట్రంలో పలువురు రాజకీయ నేతల టెలిఫోన్లను చంద్రబాబు ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని జీవీఎల్ సంచలన ఆరోపణ చేశారు. పూర్తి అభద్రతా భావంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వందలాది ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తన ఫోనును ట్యాప్ చేస్తున్నారని చెప్పారని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. -
టీడీపీలో ఎయిర్ ఏషియా కలవరం
సాక్షి, అమరావతి : ఎయిర్ ఏషియా స్కాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఆ పార్టీ నాయకుడు ఆశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ ఏషియా ప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ టేపులో చంద్రబాబు మనిషే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు.. ఆయన్ని పట్టుకుంటే మనకు కావాల్సిన పని అవుతుందని వారి మధ్య సంబాషణ నడిచింది. దీంతో సమస్యను పక్కదోవ పట్టించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసింది. టీడీపీ గతంలో ఓటుకు కోట్లులో విషయంపై వివరణ ఇవ్వకుండా సమస్యను దాటవేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ స్కాంలో టీడీపీ నాయకుల పేర్లు రావడంపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎదురుదాడికి దిగారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతల గురించి వచ్చిన ఆరోపణలపై స్పందించకుండా ఎయిర్ ఏషియాలో స్కాం నిజమైతే కేంద్రమంత్రులంతా డబ్బులు తిన్నట్టే అంటూ వింత రాగం అందుకున్నారు. చంద్రబాబు ప్రస్తావన ఎలా బయటకి వచ్చిందంటూ ప్రశ్నించారు. భారత్లో ఫోన్ ట్యాపింగ్ అనుమతిస్తున్నారా అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నవి బయటకెలా వచ్చాయన్నారు. ఈ అంశాన్ని కేంద్రానికి ముడిపెడుతూ.. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి కేంద్రం నియంత పాలన చేస్తుందని కుటుంబరావు ఆరోపించారు. -
ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు
-
చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఆడియో టేపుల్లో దొరికిపోయారు. చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోకగజపతిరాజుల వ్యవహారం ఈ టేపుల్లో బయటపడింది. గతంలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఈసారి ఎయిర్ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోన్న ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రకటించింది. దీనికి సంబంధించి ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణను ఆ పత్రిక ప్రచురించింది. ‘‘మనం ఎలాగోలా కొత్త రూట్లకు సంబంధించిన లైసెన్సులను సంపాదించాలి. ఎంత ఖర్చయినా పరవాలేదు. ఎవరిని పట్టుకుంటే పనవుతుంది? ఎలాగోలా ఈ పని చేయాల్సిందే.’’అని టోనీ ఫెర్నాండెజ్ చెబుతుండగా.. ‘‘ఈ పని చేయాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు. ఆయనను ఒప్పించగలిగితే మొత్తం పని అయిపోతుంది. ఈ పనిని చంద్రబాబు ద్వారా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనిషే ఇపుడు పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉన్నాడు.’’అని మిట్టూ శాండిల్య వ్యాఖ్యానించినట్లు ఆడియో టేపుల్లో ఉండడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎయిర్ ఏషియా కుంభకోణంపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెల్సిందే. విదేశీ రూట్ల లైసెన్సులను దొడ్డిదారిన పొందడానికి గాను భారతీయ అధికారులకు లంచాలిచ్చినట్లు బయటపడడంతో వారిని అరెస్టు చేసి సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి గతంలో జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులు బయటపడడం, అందులో చంద్రబాబు, అశోక గజపతి రాజు పేర్లు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్తో అశోక గజపతిరాజు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలలో టీడీపీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహనరావు కూడా ఉండడం గమనార్హం. టోనీ ఫెర్నాండేజ్, శాండిల్య మధ్య జరిగిన సంభాషణలివీ.. ప్రముఖ లాబీయిస్టు రాజేందర్ దూబే సమక్షంలో శాండిల్యకు, టోనీ ఫెర్నాండెజ్కు మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులను బిజినెస్ టుడే బయటపెట్టింది. వాటిలో ఏమున్నదంటే.. టోనీ ఫెర్నాండెజ్: నాకు ఎయిర్ ఏషియా ఇండియా ఇంటర్నేషనల్ రూట్ పర్మిట్లు కావాలి. ఏ మార్గం ఎంచుకున్నా ఒకే. ఇందుకోసం కొంత నష్టపోవడానికి కూడా సిద్ధమే. నిజాయితీగా సరైన మార్గంలో వెళితే పర్మిట్లు రావడానికి చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లైనా సరే త్వరగా ఇంటర్నేషనల్ పర్మిట్లు తీసుకురండి. శాండిల్య : సరే సర్.. అంటే అడ్డదారిలో వెళ్లమంటారా? టోనీ ఫెర్నాండెజ్: యెస్. నేను చెప్పింది చేయి. లైసెన్స్కోసం ఏదైనా చేయి. ఇక్కడ మన పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. పని పూర్తయ్యేటట్లు చూడు. శాండిల్య : ప్రస్తుత నియంత్రణ నిబంధనల ప్రకారం చూస్తే మనం మరో మార్గంలో వెళ్లాలి. ప్రభుత్వంలో ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో నాకు తెలుసు. కీలక స్థానంలో ఉన్న పై స్థాయి వ్యక్తి నుంచి కింద స్థాయి వరకు వెళ్లాలి. టోనీ ఫెర్నాండెజ్: స్థానికంగా ఉన్న దూబే, మీరు కలిసి చూసుకోండి. వారితో బేరసారాలు చేయండి. ఎలా చేస్తారన్నది నీ ఇష్టం. నువ్వు అంతర్జాతీయ లైసెన్స్ తీసుకువస్తే మీకు అదనపు విమానాలను సమకూరుస్తాను. శాండిల్య : ‘సమర్థత’ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో మనం జాగ్రత్తగా డీల్ చేస్తే మొత్తం పనయిపోతుంది. పైగా గతంలో చంద్రబాబు వద్ద ఆర్థికమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజే ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మనతో ప్రత్యక్షంగా కనిపించడానికి ఇష్ట పడటం లేదు కానీ అడిగిన పని చేసి పెడతా అన్నారు. ఇలాంటివాడు మనతో ఉండటం మన అదృష్టం. హైదరాబాద్ కేంద్రంగానే సాగిన వ్యవహారం.. ఈ మొత్తం వ్యవహారమంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగినట్లు మరికొన్ని సాక్షాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ రాయబేరం కోసం సింగపూర్కు చెందిన కంపెనీని రంగంలోకి దింపడానికి ఎయిర్ ఏషియా హైదరాబాద్ నోవాటెల్లో సమావేశమైనట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 21, 2015లో హైదరాబాద్లో జరిగిన 11వ ఎయిర్ ఏషియా ఇండియా బోర్డు మీటింగ్లో సింగపూర్కు చెందిన హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ పీటీఈని లాబీ కోసం నియమిస్తూ తీసుకున్న కాపీని మనీ కంట్రోల్ వెబ్సైట్ వెలుగులోకి తీసుకొచ్చింది. టేపుల్లో ఫెర్నాండెజ్ స్థానికంగా ఉన్న వ్యక్తిని రాయబేరాలకు తీసుకోమనడం.. హైదరాబాద్ కేంద్రంగా బోర్డు సమావేశంలో హెచ్ఎన్ఆర్ ట్రేడెండ్కు చెందిన రాజేంద్ర దూబేకు బాధ్యతలు అప్పచెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అప్పటికి ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి రాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఓటుకు కోట్లు కుంభకోణం బయటపడిన తర్వాతనే చంద్రబాబు తన కార్యక్షేత్రాన్ని అమరావతికి మార్చారు. కాగా మలేషియా ఎయిర్లైన్స్ కంపెనీ ఈ రాయబేరాల కోసం ఒక సింగపూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదీ ఎయిర్ ఏషియా కుంభకోణం.. మలేషియాకు చెందిన బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా 2014లో టాటా గ్రూపుతో కలిసి దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. కానీ అప్పటి నిబంధనల ప్రకారం స్థానికంగా 5 ఏళ్లు సర్వీసులు నడిపి, 20 విమానాలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అనుమతిచ్చేవారు. దీన్నే 5/20 నిబంధన అని పేర్కొంటారు. కానీ ఎయిర్ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా, విస్తారా సింగపూర్ ఎయిర్లైన్స్కు భారీ ప్రయోజనం జరిగింది. ఆ విధంగా ఎయిర్ ఏషియా దేశీయ విమానయానంలోకి అడుగు పెట్టిన రెండేళ్లలోనే ఈ లైసెన్స్ను దక్కించుకుంది. ఇలా బయటకు వచ్చింది... రతన్ టాటా, సైరస్ మిస్త్రీ మధ్య జరిగిన వివాదంతో ఈ కేసు బయటకు వచ్చింది. అప్పటి టాటా గ్రూపు చైర్మన్గా ఉన్న సైరస్ మిస్త్రీ ఎయిర్ ఏషియా లైసెన్స్లు దక్కించుకోవడంలో రూ.22 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ 2017మార్చిలో శాండిల్యాను ప్రశ్నించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ.. ఫెర్నాండెజ్తో సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఏషియా ఇండియా ఆ సంస్థకు రూ.12.28 కోట్లు చెల్లించి, ఈ మొత్తాన్ని రాయబేరాలకు వినియోగించినట్లు సీబీఐ పేర్కొంటోంది. విచారణలో భాగంగా 6వ తేదీ ఫెర్నాండేజ్ను హజరు కావాల్సిందిగా సీబీఐ సమన్లు పంపింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. -
ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు
-
ఎయిర్ ఏషియా స్కాం : చంద్రబాబు పేరు
న్యూఢిల్లీ : ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్ ఏషియా లంచాలు ఎర వేసింది. దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను అరెస్టు చేసింది. అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలు జరిగాయి. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్(ఎడమ), ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యా(కుడి) ‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారు.’ అని ఆడియో టేపులో ఛాండిల్యా మాట్లాడారు. అయితే, ఈ ఆడియో టేపు ఎప్పటిదో తెలియాల్సివుంది. బీజేపీతో తెగదెంపుల సందర్భంగా అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. -
ఏపీ ఇండియాలో భాగమా.. కాదా ?
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో భాగమేనని, కానీ మోదీ మాత్రం అందుకు విరుద్ధంగా అనుకుంటున్నారని దుయ్యబట్టారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసాన్ని ఎదుర్కొలేకే సభలో నాటకాలు ఆడారంటూ విమర్శించారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చినప్పడు అన్నాడీఎంకే ఎంపీలను నిలువరించి ఉంటే దీనిపై చర్చ జరిగేదంటూ వ్యాఖ్యానించారు.కేవలం సభ జరగకూడదనే నాటకాలు ఆడారని, కానీ ఇప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దొంగ దీక్షలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలకే విలువ లేకపోతే, ఇక సభ కొనసాగించడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. మన రాజ్యాంగాన్ని మనమే కించపరచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు నాలుగేళ్లు పదవిలో ఉన్నారని ఏ ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించలేదని దయ్యబట్టారు. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వేజోన్, విభజన హామీల గురించి ఏమాత్రం పట్టించుకోని గజపతిరాజు ఇప్పుడు కేంద్రంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.