నోటుకు ఓటు కేసులో నిందితుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు ఏసీబీ డీఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. సాధారణ విచారణలో భాగంగానే సోదాలు చేశామని ఆమె వివరించారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో, వారికి సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలలో ఎటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని ఆమె తెలిపారు.