revanthreddy
-
ప్రధానిని అలా అనలేదు: సీఎం రేవంత్ క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ:తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడలేదని, పీఎం కుర్చీని అగౌరపర్చలేదని సీఎం రేవంత్రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్రెడ్డి ఢిల్లీలో శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. ‘పుట్టుకతోనే మోదీ బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన తేదీల్లో తేడా ఉంటే ఉండొచ్చు.మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి.రాహుల్తో నాకు ఎలాంటి గ్యాప్ లేదు.గ్యాప్ అంతా ఊహాగానాలే. రాహుల్ గైడెన్స్తోనే పనిచేస్తున్నా. రాహుల్ ఎజెండాను సీఎంగా నెరవేర్చడమే నా పని. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశా. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన అవకాశమిస్తున్నాం’అని రేవంత్ తెలిపారు.కాగా,శుక్రవారం హైదరాబాద్లో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్లో రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కన్వర్టెడ్ బీసీ అని, పుట్టుకతో బీసీ కాదని అన్నారు.మోదీ మొదటిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. -
సీఎం రేవంత్ రెడ్డిని మరిచిపోయిన మరో తెలుగు హీరో
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పేరు చెప్పడంలో మరో తెలుగు హీరో మరిచిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే పుష్ప2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun ) మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరోసారి అదే తప్పు జరగడంతో నెటిజన్లతో పాటు సీఎం రేవంత్రెడ్డి అభిమానులు భగ్గుమంటున్నారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాలు జనవరి 5న ముగింపు కార్యక్రమం జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హోస్ట్గా సినీ నటుడు బాలాదిత్య (Baladitya) వ్యవహరిస్తున్నారు. సభ జరుగుతుండగా సీఎం రేవంత్ అక్కడకు చేరుకున్నారు. హోస్ట్గా ఉన్న బాలాదిత్య ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో ఇలా తప్పుగా సంబోధించారు. 'మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు, శ్రీ కిరణ్ కుమార్ గారు' అని ఉచ్చరించారు. ఇంతలో అక్కడ ఉన్న వారందరూ కేకలు వేయడంతో తన తప్పును ఆయన వెంటనే గ్రహించారు. ఒక క్షణంలో తన తప్పును సరిచేసుకుని మళ్లీ మైక్లో ఇలా చెప్పారు. 'క్షమించాలి.. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు' అని సరిచేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో ఎదురుగానే ఒక సీఎం ఉంటే ఆయన పేరును తప్పుగా పిలువడం ఏంటి అంటూ సామాన్యులు కూడా విరుచుకుపడుతున్నారు. హౌస్ట్గా వ్యవహిరిస్తున్నప్పుడు ఇంతటి పెద్ద తప్పులు ఎలా చేస్తారని కామెంట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్)ఇదే సమయంలో బాలాదిత్య పరిస్థితిని అర్థం చేసుకుంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ ఒక వేదికపై మాట్లాడుతూ సీఎం రేవంత్కు ధన్యవాదాలు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగింది. ఆ ఘటన తర్వాత సంధ్య థియేటర్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు బాలాదిత్య కూడా బహుశా.. ఆ ఘటన తాలూకు భయంతో అతి జాగ్రత్తపడి ఉంటాడని కొందరు చెప్పుకొస్తున్నారు. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలకు హోస్ట్గా బాలాదిత్య చాలా చక్కగా నిర్వహించారు. గతంలో ఒక టీవీ ఛానల్ కోసం జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రోగ్రామ్కు హోస్ట్గా కూడా ఆయన వ్యవహరించారు. కానీ, ఇప్పుడు ఆయన పెద్ద తప్పే చేశారని ఎక్కువ శాతం అభిప్రాయ పడుతున్నారు.మళ్ళీ ఘోర అవమానానికి గురైన తెలంగాణ ముఖ్యమంత్రితెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనంత్వరలో జైలుకి వెళ్లనున్న మరో యాంకర్ అంటూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లు https://t.co/vY2w4RJZ2O pic.twitter.com/GEaoPEjYZi— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025 -
అందులో నిజం లేదు.. సీఎంతో భేటీ తర్వాత 'దిల్ రాజు' వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసిన అనంతరం ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన అన్నారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఇండస్ట్రీతో ప్రభుత్వం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు దిల్ రాజు అన్నారు.గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం హీరోలు, హీరోయిన్లు తమ వంతుగా పాటు పడుతారని దిల్ రాజు అన్నారు. ఐటీ, ఫార్మాతో సమానంగా సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. హైదరాబాద్లో హాలీవుడ్ సినిమాలు నిర్మించేలా పాటుపడాలని సీఎం సూచించినట్లు దిల్ రాజు అన్నారు. తెలంగాణలో సామాజిక అంశాలలో నటీనటులు ఇక నుంచి పాల్గొంటారని ఆయన అన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్షోలు వంటి అంశాలు చాలా చిన్నవని ఆయన అన్నారు. సీఎం రేవంత్రెడ్డితో తమ సమావేశం సానుకూలంగానే జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రీ పనిచేస్తుందని ఆయన అన్నారు. కొన్ని సంఘటనల వల్ల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి దూరం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. త్వరలో తామందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుని సినిమా పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. రూమర్స్పై స్పందించిన దిల్ రాజు..సీఎంతో భేటీ తరువాత పలు మాధ్యమాల్లో వస్తున్న ఫేక్ వార్తలపై దిల్ రాజు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. అరశాతం కూడా నెగిటివ్ లేదని.. సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదని.. పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు చూపించలేదని అన్నారు. బౌన్సర్స్ విషయంలో ప్రతిదీ అకౌంటబిలిటీగా ఉండాలని డీజీపీ సూచించినట్లు దిల్ రాజు వెల్లడించారు. -
బెనిఫిట్షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని తేల్చి చెప్పిన సీఎం
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సమావేశం రెండు గంటలకు పైగా జరిగింది. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్కు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతోనే ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో సీరియస్గా ఉంటామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలుతెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్.ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్గా ఉంటామన్న సీఎం.అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంటుందనే భరోసా ఇచ్చిన సీఎం.తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్బిలిటీతో ఉండాలని కోరిన సీఎం.డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపాలి.టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి.ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి.ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్.టికెట్ల రేట్లు పెంపు ఉండదని అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని సీఎం ప్రకటన.ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే.. తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్గా తీసుకుందన్న సీఎం రేవంత్.సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.నాగార్జున వ్యాఖ్యలుయూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ హైదరబాద్లో కూడా ఉండాలి.ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే అందుకు సాధ్యం అవుతుంది.తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. ఇందులో ప్రభుత్వాల సాయం కూడా అవసరం ఉంది.హైదరాబాద్ వరల్డ్ సినిమాకు రాజధానిగా ఎదగాలనేది మా కోరిక. రాఘవేంద్రరావు వ్యాఖ్యలుఇప్పటి వరకు అందరు ముఖ్యమంత్రులు తెలుగు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు.ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది.దిల్ రాజును FDC చైర్మన్గా నియమించడాన్ని మేము స్వాగతిస్తున్నాం.తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి.గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లోనే చేశారు.ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లోనే నిర్వహించాలని కోరుతున్నాం.మురళీమోహన్ఎలక్షన్స్ ఫలితాల మాదిరే సినిమా రిలీజ్ నాడు వాతావరణం ఉంటుంది.సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని కూడా బాధించింది.సినిమా రిలీజ్ సమయంలో ఉండే కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది.ప్రస్తుతం తెలుగు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నడం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు అన్నారు. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది తమ కోరిక అంటూ ఆయన సీఎంతో పంచుకున్నారు. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిందని సురేష్ బాబు గుర్తుచేశారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉండాలని అన్నారు. ఇదే సమయంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని పేర్కొన్నారు. -
బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు. ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహకాలను ప్రచారం చేయాలి.ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు యాడ్ ప్లే చేయాలి.సినిమా విడుదల సమయంలో హీరోల ర్యాలీలకు అనుమతి ఉండదు. సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి. అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టబడి ఉంటామని తేల్చేసిన సీఎం రేవంత్రెడ్డి.కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో నటీనటులు అందరూ సహకరించాలి.చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ అండగా ఉంటామని సీఎం భరోసా.ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని క్లారిటీ ఇచ్చిన సీఎం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించిన పోలీసులు👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సినీ పెద్దలకు సీఎం రేవంత్రెడ్డి సూచనలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 50 మంది ప్రముఖులు గురువారం సీఎంను కలిసి ఇండస్ట్రీలోని సమస్యలు పంచుకున్నారు. అయితే, ఈ క్రమంలో సీఎం పలు విషయాలను వారితో చర్చించారు. ప్రభుత్వం ఎప్పటికీ ఇండస్ట్రీతోనే ఉందని సీఎం గుర్తుచేశారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. సినిమా విడుదల సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సీఎం కోరారు.ఈ అంశాలపై ప్రధాన చర్చడ్రగ్స్కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి.తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహకాలను ప్రచారం చేయాలి.ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు యాడ్ ప్లే చేయాలి.సినిమా విడుదల సమయంలో హీరోల ర్యాలీలకు అనుమతి ఉండదు.సినిమా టికెట్లపై విధించే సెస్సు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి.బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి.అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టబడి ఉంటామని తేల్చేసిన సీఎం రేవంత్రెడ్డి.కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో నటీనటులు అందరూ సహకరించాలి.చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ అండగా ఉంటామని సీఎం భరోసా.ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని క్లారిటీ ఇచ్చిన సీఎం.సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించిన పోలీసులు -
సీఎం రేవంత్ను కలవనున్న సినీ ప్రముఖల లిస్ట్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేడు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం కానున్నారు.నిర్మాతల నుంచి ఎవరు వెళ్తున్నారంటే.. దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్,శ్యాంప్రసాద్రెడ్డి, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ తదితరులుతెలుగు హీరోలనుంచి వెంకటేష్,నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివ బాలాజీ, హాజరు కానున్నారు.దర్శకుల సంఘం నుంచి అధ్యక్షుడు వీర శంకర్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ,కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ సీఎంతో భేటీ కానున్నారు.తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వెళ్తుండగా మా అసోసియేషన్తో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారుచర్చకు వచ్చే అంశాలుసినిమా పరిశ్రమ సమస్యలపై చర్చతెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులునంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలనచిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపుతెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలుఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనపై చర్చటికెట్ ధరల పెంపు, పెంపుబెనిఫిట్ షోల అంశాల గురించి చర్చ -
సీఎం రేవంత్తో సినీ పెద్దల భేటీ.. దూరంగా చిరంజీవి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సినీ ప్రముఖులు నేడు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణం ఆపై అల్లు అర్జున్ అరెస్ట్ వంటి అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీంతో ముఖ్యమంత్రిని పులువురు సినీ ప్రముఖులు నేడు కలవనున్నడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం కలిగింది. అయితే, సీఎంతో భేటీ అయ్యే సినీ పెద్దలు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్రాజు కీలకంగా వ్యవహరించనున్నారు. సీఎంతో భేటే అయేందుకు సినీ ప్రముఖులతో కూడా ఆయన ఇప్పటికే మాట్లాడారని తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్రూమ్లో ఈ సమావేశం జరగనుంది. సుమారు 36 మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్,త్రివిక్రమ్, సురేష్బాబు,నితిన్,వరుణ్ తేజ్, శివ బాలాజీ, పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సమావేశంలో చిరంజీవి పాల్గొనకపోవచ్చు అని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. పలు కారణాల వల్ల ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండబోతున్నారని నెట్టింట వైరల్ అవుతుంది. మెగాఫ్యాన్స్ కూడా నేడు జరిగే సమావేశంలో తమ బాస్ దూరంగానే ఉండబోతున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే 10 గంటల వరకు వేచి ఉండాల్సిందే.చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. -
సీఎం రేవంత్రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై దిల్ రాజు ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిసెంబర్ 26న చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో పాటు కలవబోతున్నట్లు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజన పరామర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిత్రపరిశ్రమలో తీవ్ర అలజడి నెలకొంది. అయితే, సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో సీఎంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలవనున్నారు.సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఇదే అంశం గురించి ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు తాను కూడా కలవనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఎఫ్డీసీ ఛైర్మన్గా.. ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని దిల్ రాజు అన్నారు. సంక్రాంతి రేసులో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలు ఉన్నాయి. -
'పుష్ప2' ఘటన.. వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్: విజయశాంతి
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య దూరం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇదే అంశంపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆమె ఇలా చెప్పుకొచ్చారు.'ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలలో ఇదే కనిపిస్తుంది. ఈ ఘటన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనలు ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.. అలా కాకుండా మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి.. పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి.’ అని పేర్కొన్నారు.పుష్ప2 సినిమా విడుదల సమయంలో డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ నాయకుల కామెంట్లు వల్ల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా రేవతి మరణం గురించి వ్యాఖ్యలు చేయండంతో పాటు ఆ సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు బాగాలేదని ఆయన అన్నారు. దీంతో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఆపై పలు రాజకీయ పార్టీ నేతలు బన్నీకి సపోర్ట్గా మాట్లాడటంతో వివాదం మరింత ఎక్కువ అయింది అని చెప్పవచ్చు. -
బన్నీ 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు.. ఎక్కడైనా తప్పు చేశాడా..?: అల్లు అరవింద్
సంధ్య థియేటర్ ఘటన గురించి తన కుమారుడు అల్లు అర్జున్పై వస్తున్న విమర్శల పట్ల అల్లు అరవింద్ కూడా రెస్పాండ్ అయ్యారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం తట్టుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన మేరకే బన్నీ మాట్లాడుతున్నాడని ఆయన గుర్తు చేశారు.'దయచేసి అందరూ ఈ విషయం అర్థం చేసుకోండి. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో మీరు అడిగే ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. సుమారు మూడేళ్లు కష్టపడి పాన్ ఇండియా రేంజ్లో తీసిని సినిమాను అభిమానులతో చూద్దామని థియేటర్కు వెళ్లాడు. అయితే, థియేటర్ వద్ద జరిగిన ఆ సంఘటనతో బన్నీ మా ఇంట్లో పార్కులో ఓ మూలన కూర్చొని ఉంటున్నాడు. సినిమా సెలబ్రేషన్స్ వద్దని చెప్పాడు.సినిమా ఇంతటి విజయం సాధించినప్పటికీ ఎలాంటి సంతోషం లేకుండానే తన అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. బన్నీ ఇంతటి స్థాయిలోకి రావడానికి 22 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. అతనికి వచ్చిన పేరు అంతా కూడా ఒక రాత్రి, ఒక సినిమాతో రాలేదు. మూడు తరాలుగా ఇండస్ట్రీలోనే ఉంటున్నాం. ఎక్కడా కూడా చెడుగా వ్యవహరించలేదు. ఇప్పడు మాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తేంటే బాధగా ఉండటం వల్లే మీడియా ముందుకు వచ్చాం.' అని అల్లు అరవింద్ అన్నారు. -
రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రి
తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలుగు నటీనటుల గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప2' సినిమా విడుదలరోజు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఇప్పటికే రేవతి మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రేతేజ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వారి కుటుంబానికి తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించారు. శ్రీ తేజ్ తండ్రికి తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి చెక్ అందించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు అనేది ఉండదని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఇస్తామని చెప్పిన రూ. 25 లక్షలు ఇప్పటికీ అప్పగించలేదని మంత్రి అన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. రేవతి కుమారుడు శ్రీతేజ వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఆయన అన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ గారిని కలిసి 25 లక్షల రూపాయల చెక్కును కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున అందించడం జరిగింది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకోవడం జరిగింది. తన చికిత్సకు కోసం… pic.twitter.com/3EC5Agiowh— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 21, 2024 -
సీఎం రేవంత్రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్
పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. సినీ హీరో అల్లు అర్జున్పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బన్నీ మీడియాతో మాట్లాడారు. అయితే, సీఎం రేవంత్రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా బన్నీ కౌంటర్ ఇచ్చారు. 'సంధ్య థియేటర్ ఘటన ప్రమాదవశాత్తుగా మాత్రమే జరిగింది. కానీ, నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. థియేటర్ లోపలికి నేను వెళ్లిన తర్వాత ఏ పోలీస్ లోపలికి వచ్చిన జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పడంతో బయటకు వచ్చేశాను. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం ఆ క్షణంలో నాకు తెలియదు. మరుసటి రోజు రేవతి విషయం తెలిసింది. నా సినిమా కోసం వచ్చిన ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను..? నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు నా టీమ్ వారికి ఫోన్ చేసి వెంటనే ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. సినిమాకు వచ్చేవారిని ఆనందపరచాలనేది మా ఉద్దేశం.నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఇంతవరకు నేను ఎవరినీ ఒకమాట అనలేదు. అనుమతి లేకుండా థియేటర్కు వెళ్లాను అనడంలో ఎలాంటి నిజం లేదు. రేవతి కుటుంబం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించానని చెప్పడం చాలా దారుణం. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు చాలా బాధను కలిగిస్తున్నాయి. నేను రోడ్ షో, ఊరేగింపు చేయలేదు. మూడేళ్లుగా సినిమా కోసం చాలా కష్టపడ్డాను. అభిమానులతో సినిమా చూడాలని ఆశతో వెళ్లాను. గతంలో ఇతర హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది నా అభిమానులు చనిపోతే.. ఆ కుటుంబాన్ని వెళ్లి కలవకుండా ఎలా ఉంటాను. లాయర్ల సూచనలతో నేను శ్రీతేజను చూసేందుకు వెళ్లలేదు. అయితే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. కానీ, అదీ కుదరదన్నారు. అయితే, సుకుమార్ను అయినా వెళ్లమని చెప్పాను. అదీ కాదన్నారు. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని చెప్పడం చాలా దారుణం. నా క్యారెక్టర్ను చాలామంది తక్కువ చేసి మాట్లాడుతుంటే మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నా. అంతటి ఘోరం జరిగిందని నాకు తెలిస్తే.. నా బిడ్డలను థియేటర్ వద్దే వదిలి ఎలా వెళ్తాను. పూర్తి విషయాలు తెలుసుకోకుండా నాపైన నిందలు వేస్తున్నారు. నేను కూడా ఒక తండ్రినే.. నాకు శ్రీతేజ వయసు ఉన్న అబ్బాయి ఉన్నాడు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని.. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా కూడా సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్టు తెలిసిందని రేవంత్రెడ్డి అన్నారు. పోలీసులు ఎదోరకంగా అల్లు అర్జున్ను అక్కడి నుంచి పంపిస్తే.. అయినప్పటికీ, మరోసారి రూఫ్టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారని కామెంట్ చేశారు. ఒక మహిళ చనిపోయిందని తెలిసి ఆపై ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా కూడా అల్లు అర్జున్ అదే పద్ధతి కొనసాగించారనే సంచలన ఆరోపణ రేవంత్రెడ్డి చేశారు. ఒక మహిళ చనిపోయాన కూడా ఆయన సినిమా చూసే వెళ్తానని అనడం ఏంటి అంటూ బన్నీ తీరుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. -
అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు... వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ వర్మ ప్రశ్నించారు. బన్నీ అరెస్ట్ గురించి ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చూడగలరు. -
రేవంత్కు మాటలెక్కువ..పని తక్కువ: హరీశ్రావు
సాక్షి,మహబూబ్నగర్:రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుడు ప్రజలను మోసం చేయకుండా చేయాలని కురుమూర్తి స్వామిని కోరుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం(నవంబర్ 20) హరీశ్రావు మహబూబ్నగర్లోని కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు.‘కురుమూర్తి స్వామి సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసగించారు.రేవంత్రెడ్డికి పని తక్కువ మాటలెక్కువ. ఆయనకు సీఎం కేసీఆర్ భయం పట్టుకుంది. పాలకుడే మాటతప్పితే రాజ్యానికి అరిష్టం. రాష్ట్రంలో సగానికి పైగా మంది రైతులకు రుణమాఫీ చేయలేదు.వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క గ్యారెంటీపైన ప్రకటన చేయని సీఎం వరంగల్లో కేసీఆర్ మీద తిట్ల పురాణం పెట్టాడు. రేవంత్కు తెలిసింది ఒట్లు లేకుంటే తిట్లు. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారు. అబద్దాలు,మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. ప్రతిపక్షాల మీద పగ..రైతులు,ప్రజలకు దగా..తప్ప రేవంత్ చేసిందేమీ లేదు. రేవంత్రెడ్డి వచ్చాకా బీ ట్యాక్స్ వచ్చింది.బిల్లుల చెల్లింపులకు కమిషన్లు వసూలు చేస్తున్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ మెడలు వంచుతాం. ఏడాది పాలనలో ఒక్క ఇల్లు నిర్మించలేదు.మూడునాలుగు నెలలు పనులు చేయిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.66 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు జిల్లాను దగా చేశాయి. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడు.గత పాలనలో ఇచ్చిన పథకాలను రేవంత్ ఎగ్గొడుతున్నాడు.కేసీఆర్ కలుపు మొక్కకాదు..కల్ప వృక్షం.రేవంత్రెడ్డి గురించి ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి.రియల్ఎస్టేటను కుప్పకూల్చాడు’అని హరీశ్రావు ఫైరయ్యారు. -
పీసీసీ చీఫ్ మహేష్గౌడ్కు ప్రశాంత్రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
సాక్షి,నిజామాబాద్జిల్లా:రేవంత్రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నాడని మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం(నవంబర్19) నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘త్వరలో కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించటం ఖాయం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.రుణమాఫీ,రైతు బంధు,వడ్ల బోనస్ మీరు ఇచ్చారని ప్రజలు చెప్తే నేను రాజీనామా చేస్తాను. ఇవ్వలేదు అని ప్రజలు చెప్తే నువ్వు నీ పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? పీసీసీ పదవి రాగానే మహేష్గౌడ్ నిషాలో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని అవాకులు చవాకులు పేలుతున్నారు.11నెలల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ సంగతి వదిలేసి మీ పార్టీ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టండి.బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతలు రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తారు.సామాన్య ప్రజలతో తిట్లు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సైతం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.మహారాష్ట్రలో తెలంగాణ పరువు తీస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.ఇపుడు అదే వరంగల్ లో విజయోత్సవాలా’అని ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. -
ఒక్కరు కాదు.. తెలంగాణకు ఇద్దరు సీఎంలు: బండి సంజయ్
సాక్షి,సంగారెడ్డి:లగచర్ల ఫార్మాసిటీకి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. సంగారెడ్డిలో ఆదివారం(నవంబర్17) బండి సంజయ్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.‘రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేయడానికి ఇది రాచరిక పాలనా? గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసింది. కలెక్టర్పై దాడి అనేది దారుణం. రైతులు కలెక్టర్పై దాడి చేయలేదు. ఈ దాడి వెనుక కేటీఆర్,బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం.కేటీఆర్ నక్క వినయం ప్రదర్శించి అన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ కొడుకు నటసార్వభౌముడు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ను కలిశారు. గతంలో కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్ కేసును ఇలానే నీరు గార్చారు. ఫోన్ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. కేటీఆర్కు తెలియకుండా ఇది జరుగుతుందా. అప్పుడు,ఇప్పుడు సీఎం కేటీఆరే.దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి. ఫార్ములా-ఈ కేసు,ధరణి కేసు,జన్వాడ ఫామ్ హౌస్ కేసు,డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి.జనాలని,మీడియాని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లను పిచోళ్ళు చేస్తున్నారు. తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కేటీఆర్, ఇంకొకరు రేవంత్రెడ్డి’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. -
నరేందర్రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్ర: సబితా
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ లగచర్లలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారులపై జరిగిన ఘటన కూడా బాధాకరం. అహంకారంగా భూమి లాక్కోవడం ఎంతవరకు సమంజసం. అహంకారంతో భూమి లాక్కుంటే ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం వాకింగ్కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?. మాజీ శాసనసభ్యుడు కాబట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిసారి ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి ఘటనలో బీఆర్ఎస్ నేతలే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మూసి దగ్గర సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఇల్లు కూలగొడతామన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రతిపక్షాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగోట్టాడు కాబట్టే రాజకీయ ప్రత్యర్థిని తొక్కేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారు’’ అని అన్నారు. -
కేసీఆర్కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇటీవల ఎర్రవెల్లి ఫాంహౌజ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం(నవంబర్ 11) ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడాారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నాడని, ఆయన ఇంట్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోవడం తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని పరోక్షంగా కేసీఆర్కు రేవంత్ చురకంటించారు.‘ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. ఒక కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు.నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు.రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుతోంది.21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు.35వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది.కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం,ప్రగతి భవన్ కట్టుకుండు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం.ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం.త్వరలో వారికి నియామకపత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇవన్నీ చేసాం.మీరు లేకపోయినా ఏం బాధలేదు.మీతో ప్రజలకేం పని లేదు.తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి.బడి దొంగలను చూసాం కానీ..ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం’ అని రేవంత్రెడ్డి కేసీఆర్ను ఎద్దేవా చేశారు. -
ప్రధాని ఆ ట్వీట్ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్
సాక్షి,ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 9)రేవంత్రెడ్డి ముంబైలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ‘ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా.దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత ప్రధాని తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు.వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి మా ప్రభుత్వం అందించింది.సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం.ఎంతో ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్కు తరలించుకొని పోయారు.మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’అని రేవంత్రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం -
సీఎం రేవంత్రెడ్డిపై డీకే అరుణ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ సీనియర్నేత, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్రెడ్డి చేసిన ట్వీట్పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్ 3)డీకే అరుణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘సోనియా గాంధీ పుట్టిన రోజునాడే అన్నీ గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు నిర్మాణం మొదల పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫ్రీబస్ స్కీమ్ ఎత్తేస్తాం అంటున్నారు.గ్రామాలకు బస్సులు బంద్ చేసి తెలంగాణలో ఫ్రీ బస్ అంటున్నారు. మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడడానికి రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. 500 రూపాయలకే సిలిండర్లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లన్నీ కేంద్రానీవే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్దం చేసుకుంటున్నారు.రైతు భరోసా లేదు. కౌలు రైతులకు,కూలీలకు సాయం దిక్కు లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే.50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి చేయించారో బయట పెట్టండి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండ దబాయించాలని చూస్తున్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు.కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’అని డీకే అరుణ మండిపడ్డారు. ఇదీ చదవండి: పీఎం నరేంద్రమోదీ వర్సెస్ సీఎం రేవంత్రెడ్డి -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా శనివారం(నవంబర్ 2) రేవంత్రెడ్డి ఒక పోస్టు చేశారు.‘ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా వంటి హామీలను నెరవేర్చాం.22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం.25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం.పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే,కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది.ఈ పథకం కింద 42,90,246 మంది లబ్ధిపొందారు. యువతకు వేల ఉద్యోగాలిచ్చాం’అని రేవంత్రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: నోటికందే కూడు నీటిపాలు -
రేవంత్,బండి సంజయ్ రహస్య మిత్రులు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.‘రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రూప్ వన్పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..‘గ్రూప్ వన్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు -
న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఓ వైపు గ్రూప్ వన్ విద్యార్థులు,మరోవైపు ముత్యాలమ్మ గుడి భక్తుల ఆందోళనలతో వారం రోజులుగా హైదరాబాద్ అట్టుడుకుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు.‘సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేస్తే సీఎం ఎందుకు స్పందించలేదు. హిందువులను కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువులుగానే భావిస్తోంది. పోలీసులు చాలా మంది భక్తుల తలలు పగులగొట్టారు. హిందువుల విషయంలో అనేక నిర్బంధాలకు గురిచేస్తున్నారు. న్యాయం కోసం ఆందోళనలు చేస్తే తలలు పగులగొడతారా.గ్రూప్ వన్ విద్యార్థులపై లాఠీఛార్జ్ సరికాదు. తెలంగాణలో మళ్లీ యువత రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ప్రాతిపదికన విద్యార్థులు చదువుకోవాలి. వికీపీడియా ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తారా’అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైర్లు -
సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైర్లు
సాక్షి,కరీంనగర్జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.‘కాంగ్రెస్ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్. ఫించన్లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇదీ చదవండి: రేవంత్ నువ్వు రాహుల్ కాంగ్రెస్లో లేవా -
ఇకపై బీఆర్ఎస్ అధికారంలోకి రాదు: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో బుధవారం ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మిమ్మల్ని చూస్తే దసర పండగ మూడు రోజులు ముందే వచ్చిందా అనిపిస్తోంది. సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని గతంలో ఆశించారు. కానీ, గత సీఎం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. మా ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం.వివాదం లేకుండా 21వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. నిరుద్యోగుల సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పా. తండ్రీ కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు కొలువులు వస్తున్నాయి. ఏదో రకంగా నోటిఫికేషన్లు అడ్డుకోవాలని కుట్రలు చేశారు. ఉద్యోగాలు ఇస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తెలంగాణ సమాజం మీద మీకెందుకంత కోపం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.నేను ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకున్నా. ఇకపై బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.ప్రభుత్వ స్కూళ్లకు పంపడానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. పేదోళ్లు తాళిబొట్టు తాకట్టుపెట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. బడ్జెట్లో విద్యారంగానికి రూ. 21 వేల కోట్లు కేటాయించాం. ఏనాడైనా నిరుద్యోగులకు ఇవ్వాలని ఆలోచనా చేశావా?. అసెంబ్లీకి రావు (కేసీఆర్).. సలహాలు, సూచనలు ఇవ్వవు. మంచి పనులు చేస్తే.. కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదనం చేసిన పేద ప్రజలను పట్టించుకోలేదు. కేవలం 60 రోజుల్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తి చేశాం. నిరుద్యోగుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ.ఇవాళ్టి కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేసిండ్రు. పదేళ్లు ఏలిన వారు పది నెలల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరు. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమే. తెలంగాణలో 30వేల పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. తెలంగాణలోని 10వేల పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం.ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 11న పనులు ప్రారంభించుకోబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టాం.తెలంగాణలో ప్రతీ ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నాం.త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. తెలంగాణ పునర్మిర్మాణానికి మీవంతు కృషి చేయండి’ అని అన్నారు. -
మేం వచ్చాక రాజీవ్గాంధీ విగ్రహం అక్కడికే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించటంపై సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ పప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్రెడ్డి తెలంగాణతల్లి ఆత్మను తాకట్టుపెట్టాడని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధేనని హెచ్చరించారు. ఇదీ చదవండి.. రాజీవ్ విగ్రహాన్ని టచ్చేస్తే బీఆర్ఎస్కే నష్టం: వీహెచ్ -
కాంగ్రెస్ వల్లే ఖమ్మం వరదలు: పువ్వాడ అజయ్
సాక్షి,హైదరాబాద్: మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే తమపైన దాడి చేశారని మాజీ మంతత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని విమర్శించారు. తెలంగాణభవన్లో పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలుసా. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప,జలగం నగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణలు ఉన్నా కూల్చివెయ్యి. నా హాస్పిటల్ కట్టి 25 సంవత్సరాలు అయింది. నా హాస్పిటల్కు చుక్క నీరు రాలేదు. నా హాస్పిటల్కు మున్నేరుకు సంబంధం లేదు. కేసీఆర్ వరద సాయం చేస్తే నువ్వు సీఎం పదవిలో ఉండి ఎందుకు..? ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిన్న మాపై దాడులు చేశారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని రూ.650 కోట్లు మంజూరు చేయించాను. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలి. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా..? మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారు. రెవిన్యూ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలు మంత్రుల ఫంక్షన్ హాళ్లు,విల్లాలతో మొదలు పెట్టండి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారు’అని అజయ్కుమార్ మండిపడ్డారు. -
సీఎం రేవంత్పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం(సెప్టెంబర్2) ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా రేవంత్రెడ్డి వైఖరిని సుప్రీంకోర్టు మరోసారి తప్పుపట్టింది. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ లాయర్స్ మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పీసీసీ ట్విటర్ హ్యాండిల్లోనే కవిత బెయిల్పై పోస్టులు పెట్టిన విషయాన్నికోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ‘బెయిల్ గ్రాంటెడ్.. బెయిల్ గివెన్..? అని పోస్టులు పెట్టినట్లు తెలిపారు. సీఎం రేవంతే పీసీసీ చీఫ్గా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం స్పందింంది. ఈ పోస్టులను కోర్టు దృష్టికి తేవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు‘ఉన్నత స్థానాలలో ఇలా వ్యవహరించడం మంచిది కాదు. లాయర్లను, జడ్జిలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నాం’అని రేవంత్ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రేవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్ రిప్లై ఫైల్ చేయాలని రేవంత్ న్యాయవాదిని ఆదేశించింది. కాగా, ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్రెడ్డి వేసిన పిటిషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం: సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఢిల్లీలో శుక్రవారం(ఆగస్టు16) మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా పదవులు తీసుకుంటారు. బీఆర్ఎస్కు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వీళ్లంతా బీజేపీలో విలీనం తర్వాత కవితకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారు’అని రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
‘అమరరాజా’ వెళ్లిపోతే విపత్తే: కేటీఆర్ హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రూ. 9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమర్రాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలని సూచించారు.గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోతామని అమర్రాజా కంపెనీ చైర్మన్ గల్లాజయదేవ్ అన్నట్లు వచ్చిన వార్తలపై ఆదివారం(ఆగస్టు11) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనీ పెట్టుబడిదారులందరికీ గౌరవిస్తుందని నేను ఆశిస్తున్నాను.నిజానికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం సీఎం రేవంత్ మానేయాలి. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్ను చెన్నైకి పోగొట్టుకోవడం చూశాం. ఇప్పుడు గనుక అమరరాజా వెళ్లిపోతే అది విపత్తుతో సమానం’అని కేటీఆర్ హెచ్చరించారు. -
సీఎం రేవంత్ షాడో కేబినెట్లో ఆ నలుగురు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో షాడో కేబినెట్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో శనివారం(జులై 27) మీడియాతో కేటీఆర్ చిట్చాట్లో మాట్లాడారు. సీఎం రేవంత్ సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఉదయ సింహ, అజిత్ రెడ్డితో షాడో కేబినెట్ నడుస్తోందన్నారు. మిగతా వాళ్ళంతా డమ్మీలే అని ఎద్దేవా చేశారు.సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తమ వద్దకు అన్ని వివరాలు వస్తున్నాయని చెప్పారు. అన్నీ బయటపెట్టడానికి టైమ్ ఉందన్నారు. -
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం(జులై 26) సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించడంపై అధికారులతో చర్చించారు. ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటరు లిస్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ను సీఎం కోరారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వి.కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
అయినా బీఆర్ఎస్ మారలేదు: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. .. ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు. ప్రజలు ఆగ్రహించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదు. తప్పులు చేశారు. ప్రజలు శిక్షించారు. అయినా మారలేదు. బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు. కార్మికులు పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి?. ఎమ్మెల్యే సాంబశివరావుకు మైక్ ఇవ్వటం తప్పా?. స్పీకర్పై ఆరోపణలు చేయటం తగదని సీఎం రేవంత్ అన్నారు. -
కేటీఆర్కు సీఎం రేవంత్ బర్త్డే విషెస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేటీఆర్కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారాయన.సిరిసిల్లా శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/YtJYFVTgvc— Telangana CMO (@TelanganaCMO) July 24, 2024 -
మూసీ ప్రక్షాళన: కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి,ఢిల్లీ: కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో సోమవారం(జులై 22) భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి రేవంత్రెడ్డి తీసుకెళ్లారు. -
త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంతో మంది గెలిచినా సీఎం అయ్యే అవకాశం రాలేదని, ఆ అవకాశం తనకు మాత్రమే వచ్చిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మహబూబ్ నగర్లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.‘‘సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య, ఆరోగ్యలపై సమీక్ష చేశాం. కార్యకర్తల కష్టంతో కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2009లో కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే జిల్లా అభివృద్ధిని విస్మరించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల ఆపకుండా చేయాలని అధికారులను ఆదేశించాను. నేను మీలో ఓ కార్యకర్తను. కేసీఆర్ను ఓడించడమే కాదు మోదీని ఢీకొట్టే వరకు పోరాడాలి. త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం. మిమ్మల్ని గెలిపించే భాద్యత మాది, మీ ఎమ్మెల్యేలది. దేవాలయ, మార్కెట్ కమిటీ, గ్రంధాలయం కమిటీలను కష్టపడిన వారికే ఇవ్వాలి. మూడేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఆదరించిన వారిని గుర్తుపెట్టుకుంటా. కార్యకర్తల కష్టం వల్ల నేను ఈ స్ధాయికి వచ్చాను. వారిని విస్మరించను. గతంలో మా పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రాష్ట్రంలో కేసీఆర్ కనుమరుగవుతారు. 4 రోజులుగా ఢిల్లీలో కాలుకాలిన పిల్లిలాగా కేటీఆర్, హరీష్ రావు ప్రధానిని కలిసేందుకు తిరుగుతున్నారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వెయ్యి మంది గ్రూపు- 1 అధికారులను నియమించాలని మేం ప్రయత్నిస్తుంటే కొందరు దుర్మార్గులు కోచింగ్ సెంటర్ల కోసం పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పరీక్షలు వాయిదావేయాలని ఆర్ట్స్ కాలేజీ వద్ద దీక్ష చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫి చేసి తీరుతా’’ అని సీఎం రేవంత్ అన్నారు. -
TG: వైఎస్సార్ జయంతి కానుక.. కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ పదవులు
సాక్షి,హైదరాబాద్: మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కానుక అందించారు. తెలంగాణలో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ పదవుల పంపిణీ చేపట్టారు. చురుగ్గా పనిచేసిన మొత్తం 35 మంది నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ పదవులను కట్టబెట్టారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం(జులై 8) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా జంగారాఘవరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్పర్సన్గా నిర్మలజగ్గారెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా అలేఖ్యపూజారి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అవినాష్రెడ్డి అగ్రి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కాసుల బాలరాజు, స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్కు మనాల మోహన్ రెడ్డి, వేర్హౌజ్ కార్పొరేషన్ లిమిటెడ్కు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఫిషరీస్ కోపరేటివ్ కార్పొరేషన్కు మెట్టు సాయికుమార్ తదితరులను చైర్పర్సన్లుగా నియమించారు.ఏ పదవి ఎవరికి.. ఇక్కడ క్లిక్ చేయండి.. -
weekly roundup: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. బీఆర్ఎస్లో గుబులు!
బీఆర్ఎస్ పార్టీకి గ్రహణం పట్టుకున్నట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని చేజార్చుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సింగిల్ సీటు గెలవకుండా పట్టుకోల్పోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగుతూ హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం తలనొప్పిగా మారింది. మరోవైపు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫిరయింపులను ముమ్మరం చేసుకుంటూ వెళ్తోంది. ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీనే.. ప్రోత్సహించడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే. కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెసులో చేరగా, రాజ్య సభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రస్ లోకి చేర్చుకున్నారు.కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, దండే విఠల్ , బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు.తెలంగాణ శాసన మండలిలో సంఖ్యాపరంగా మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టుబింగించేదుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది.ఈ క్రమంలో గురువారం ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మండలిలో ఆ పార్టీ బలం 12 స్థానాలకు చేరింది. అయినా కీలకమైన బిల్లులు , తీర్మానాలను అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్ కు లేదు.కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీలులేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీ ఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తోంది. రానున్న కాలంలో మరికొంత మంది ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానాల బలం 29 నుంచి 21 కి పడిపోయింది.దీనికంటే ముందు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి(రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే. దీంతో మొత్తం 40 స్థానాలు ఉన్న మండలిలో బీఆర్ఎస్ కు 21, కాంగ్రెస్ కు చేరినవారితో కలుపుకొని 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి గతంలో బీఆర్ఎస్ సన్నిహితంగా కొనసాగినా.. ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు.కాగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సమావేశానికి కార్పొరేటర్లు మినహా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాధవరం కృష్ణా రావు, అరికేపూడి గాంధీ. కాలేరు వెంకటేష్,కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వీరు పార్టీ మరుతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.మరోవైపు కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారని ప్రచారం జరిగిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 19 మంది కాంగ్రెస్ లో చేరితే.. బీఆర్ఎస్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయంతంగా కొనసాగుతోంది. మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 38 సీట్లలో బండ్ల కృష్ణ మోహన్తో సహా ఏడుగురు కాంగ్రెస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది. పార్టీ మారటం లేదు..తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు అయోమయానికి గురి కావొద్దని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.మరోవైపు గతంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కుమారుడు, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కాంగ్రెసులో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ గెలించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ విసిరారు.బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఫిరాయింపుదారులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. '' పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ మారాతున్నవారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు'' అని కేసీర్ అన్నారు. -
రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్తో సీఎం రేవంత్ భేటీ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అటు పార్టీ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పనులపై వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సోమవారం(జూన్24) సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు కంటోన్మెంట్ భూముల అప్పగింత, సైనిక్ స్కూల్ తదితర అంశాలపై చర్చ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో రేవంత్ చర్చించారు. ఈ సమావేశంలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి,రఘురామరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ ఎంపీ అనిల్ కమార్ యాదవ్ మాజీమంత్రి కడియం శ్రీహరి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త చీఫ్.. భారీ పోటీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు అవుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సైతం 8 సీట్లను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన ఇచ్చిది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు కొత్త చీఫ్ను నియమించాల్సిన సమయం వచ్చింది. కొత్త చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ల మార్పుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్పై ఏఐసీసీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికపై కాంగెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీసీసీ చీఫ్తో పాటు, వర్కింగ్ ప్రెసిండెంట్స్కు సీనియర్, కీలక నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్ పోటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్కుమార్ గౌడ్, మధుయాష్కిలు ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు పీసీసీ చీఫ్ ఆశావహుల్లో ఉన్నారు. మరోవైపు.. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పదవులను కోసం సైతం పలువురి మధ్య పోటీ నెలకొంది. వాటిని కాంగ్రెస్ నేతలు రవళి రెడ్డి, కమల్ ఆశిస్తున్నట్లు సమాచారం. -
బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతల ఆత్మబలిదానం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిచినవారికి సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లోక్సభ ఫలితాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ లోక్ ఎన్నికల ఫలితాలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం. దేశవ్యాప్తంగా రాహుల్ జోడోయాత్ర పరిస్థితి మారిపోయింది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుంది. 2019లో 3 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు 8 సీట్లు గెలిచాం. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు గుండుసున్నా ఇచ్చారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ కూడా ఓట్లు, సీట్లు పెరిగాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల తీరు మార్చుకోవాలి. మోదీ గ్యారంటీకి ఉన్న వారంటీ ముగిసింది. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణ లోక్సభ ఫలితాలు ఉగాది పచ్చడిలాగా సగం తియ్యగా, సగం పులుపుగా ఉన్నాయి. మల్కాజిగిరిలో ఓడినా.. కంటోన్మెంట్లో విజయం సాధించాం. కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఎప్పటికప్పుడుతెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని రేవంత్రెడ్డి అన్నారు. -
‘సీఎం రేవంత్కు ఆగస్టు సంక్షోభం తప్పదు’
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కావటం ఖయమని అన్నారు. -
కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. అంతే స్థాయిలో కాంగ్రెస్, బీఅర్ఎస్.. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. శనివారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘సీఎం రేవంత్, కేసిఆర్.. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారని ఊహాలోకంలో ఉన్నారు. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. మీ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రజాకార్లతో విరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అంత పచ్చగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ దేశంలో అవినీతిని పెంచి పోషించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి చేసిందేమీ లేదు కాబట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు రేవంత్ నిజస్వరూపం తెలిసిపోయింది. కేసిఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి. అధికారం కోసం ఎంతకైనా తెగించి... అబద్ధాలు అవలీలగా చెప్తారు. రేవంత్, కేసీఆర్ దొందూ దొందే. ఇద్దరు అబద్దాల ఆడటంలో ఆరిదేరారు.కాంగ్రెస్ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకొని 75 ఏళ్లుగా రాజకీయం చేస్తుంది. ఏనాడు కాంగ్రెస్కి భద్రత దళాల మీద నమ్మకం లేదు. వారిని అవమాన పరిచే విధంగా అనేక సార్లు మాట్లాడారు.పాకిస్తాన్ దగ్గర ఆటంబాంబులు ఉన్నాయి.. వారికి మనం అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నేత ఒకాయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. బీజేపి ప్రభుత్వం. పాకిస్థానీ ఎత్తుగడలను తిప్పికొట్టి.. వాళ్ల తొక కట్ చేసి నడ్డి విరిచాం. కాంగ్రెస్ అసమర్థతతో పాకిస్తాన్ ఆడింది ఆటగా సాగింది. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే భారత్ భయపడదు. అసమర్థతతో కాంగ్రెస్ పాకిస్తాన్ను పెంచి పోషించింది. ఇటువంటి కాంగ్రెస్ పుల్వామ మీద మాట్లడటామా?. కాంగ్రెస్ కూటమి వ్యక్తీ ఫరూఖ్ అబ్దుల్లా దేశంలో ఉంటూ.. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ.. పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారా?’’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు. -
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: చీరకట్టుకొని జూబ్లీహిల్స్లో బస్ ఎక్కి టికెట్ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్రెడ్డి మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఆదివారం(మే5) ట్వీట్ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్ రేవంత్కు చురకలంటించారు. -
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)ను బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు రేవంత్రెడ్డిపై సీఈవోకు బీఆర్ఎస్ నేతలు బుధవారం(మే1) ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత బీఆర్ఎస్పై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా పవర్ కట్ ఘటనను ఉదాహరిస్తూ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్పై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. కాగా, కాం గ్రెస్ ఫిర్యాదుతో ఈసీ కేసీఆర్పై ఇప్పటికే చర్య తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపాలని ఆదేశించింది. -
ఎన్నికల తర్వాత రేవంత్ అక్కడికే: కేటీఆర్
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమైన మార్పులు జరుగుతాయని, ఇందులో ప్రధానమైన మార్పు సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం(ఏప్రిల్16) ఆదిలాబాద్లో జరగిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్లో గెలిచిన ఎంపీలను తీసుకుని రేవంత్ బీజేపీలోకి పోవడం ఖాయమన్నారు. ‘రాహుల్ గాంధీ మోదీ ని చౌకీదార్ చోర్ హై అంటే..రేవంత్రెడ్డి మాత్రం మా పెద్దన్న అంటున్నాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటే.. రేవంత్రెడ్డి తెలంగాణను గుజరాత్ చేస్తానంటున్నాడు. రాహుల్ అదానీ చొర్ అంటే రేవంత్ అదానీ ఫ్రెండ్ను అంటాడు. రాహుల్గాంధీ లిక్కర్ స్కామ్ జరగలేదు,కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటే రేవంత్ లిక్కర్ స్కాం జరిగింది కవితను,కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం సబబే అంటాడు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ కొసం పనిచేస్తున్నాడా లేక బీజేపీ కోసం పనిచేస్తున్నాడా?తెలంగాణలో జరగనున్న అన్ని ఎన్నికల్లో ఎగిరేది గులాబి జెండానే. జేబుల్లో కత్తెర పెట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నాడు. పేగులు మెడలో వేసుకుంటా అంటున్నావ్.. అసలు నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోడివా? మేం మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ప్రచారం చేస్తున్నావ్.. నువ్వు అయిదేళ్ళు ఉండాలి. ప్రజలు నిన్ను తరిమికొట్టాలి. బీజేపీ మేకిన్ ఇండియా అని మాటలు చెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది. శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. కవితకు బ్యాడ్టైమ్.. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా -
బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
సాక్షి, హైదరాబాద్: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్హౌస్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు.. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నిజాయితీకి కట్టుబడి ఉన్నా. ఓ వైపు మంచివాడు అంటూ నన్ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. స్వార్దం కోసం ఎన్ని కోట్లు తీసుకొని వెళ్తున్నావు అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.డబ్బు కోసం ఆశపడిన వాడిని అయితే కాంగ్రెస్లో చేరుతా. బీఆర్ఎస్ కాదు. టీఎస్పీఎస్సీ చైర్మర్ ఆఫర్ ఇస్తే.. తిరస్కరించా. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు అభిమానులు ఉన్నారు. -
చేవెళ్ల సభలో సీఏం రేవంత్ హాట్ కామెంట్స్
చేవెళ్ల: నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్డ్డి అన్నారు. కేసీఆర్ మనిషివా.. మానవ రూపంలో ఉన్న మృగానివా? అని సూటిగా ప్రశ్నించారు. చేవెళ్ల కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ‘నీళ్ళ ముసుగులో భారీ దోపిడీ జరిగింది. మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏ ఆడబిడ్డ కళ్లలో కట్టెల పొయ్యితో నీళ్ళు రావొద్దని.. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందిస్తున్నాం. పథకాలు రాలేదని బాధపడోద్దు. ఎమ్మార్వో, ఎంపీడీవో దగ్గరకు వెళ్ళి ఉచిత విద్యుత్ పథకం, రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందించే పథకం అందివ్వాలని కోరుతున్నా. కార్యకర్తలు కష్టపడితేనే మేము నాయకులం అయ్యాం. 14 ఎంపీలను గెలిపించే బాధ్యత మనది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది. 5 మంది సభ్యులతో ఇందిరమ్మ కమిటీతో పథకాలు అమలు చేస్తాం. ... అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మరిచిపోతారనీ అంటారు. నేను మాత్రం కార్యకర్తల కోసం పనిచేస్తా. జిల్లాలు,నియోజకవర్గాల్లో తిరుగుతా. బీజేపీ చెబుతున్న గుజరాత్ మోడల్ అంటే ఎంటి?. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు ఏమైంది?. మా ఊర్లో వడ్లు కొనేవారు లేదు. తాండూరులో కందులు కొనేవాళ్లు లేరు. గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలు పడగొట్టడమా!. ఎన్నికలు వస్తె బీజేపీ నేతలు ఈడి, సీబీఐలను పంపుతారు. బీజేపీ వాళ్లకు ఓటు వేయడం దండగ. కార్యకర్తలు గెలిచినప్పుడే కాంగ్రెస్ది నిజమైన గెలుపు’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మరో ఔరంగజేబులా హరీశ్: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, హరీశ్రావుపై సీఎం రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్కు కాళ్ల నొప్పులొస్తాయని ఎద్దేవా చేశారు. నల్గొండకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి నొప్పులు ఉండవని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి.. ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేసే కార్యక్రమంతో పాల్గొని మాట్లాడారు. హరీశ్కు అధికారం రావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాల్సిందేనని అన్నారు. పదేళ్లు చేసిందేమీ లేదు.. మేము రాగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ‘ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించింది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి. 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించాం.త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నాం. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీశ్ అంటుండు. హరీశ్రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుది. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్ ఏం చేశారు?. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు. దశ బాగుంటే దిశతో పని లేదు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి. ...3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?. మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా?. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా.. ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు. బీఆరెస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ మోడల్ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నా’ అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు: సీఎం రేవంత్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గత ప్రభుత్వంలో మెడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సీఎం రేవంత్రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల ముందు దొషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే కేసీఆర్ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.మెడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మెడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నం అయింది. మెడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమాణించారు. ...కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. భయపడితే భయపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్కు ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టును చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్పై రేపు శ్వేతపత్రం పెడతాం.. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మెడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ...కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మెడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్ అండ్ టీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు. ప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు.. అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ...భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటనకు వెళ్ళాలి. వస్తానన్న బీజేపీ ఎమ్మెలను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పీవీకి భారత రత్న: రాజకీయ ప్రముఖుల హర్షం
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావును దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి శుక్రవారం భారత రత్న ప్రకటించింది. పీవీకి భారత రత్న దక్కటంపై పలువురు రాజకీయ ప్రముఖలు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారత రత్న దక్కటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం.’అని ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ,… pic.twitter.com/yNme5aBsjg — Revanth Reddy (@revanth_anumula) February 9, 2024 తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మోదీకి ధన్యవాదాలు: ఎమ్మెల్యే కేటీఆర్ ‘దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించడం సంతోషకరం. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పీవీఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల నుంచి ఈ గౌరవం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’అని ట్విటర్లో పేర్కొన్నారు. Glad that the Union Government has honoured Former Prime Minister Sri PV Narasimha Rao with Bharat Ratna 🙏 I thank PM Sri @narendramodi Ji for this decision We have been demanding the Union Government for this honour since the centenary celebrations of Sri PVNR held by… https://t.co/RPmwHtWo06 — KTR (@KTRBRS) February 9, 2024 భారత రత్న ఇవ్వటం సంతోషంగా ఉంది: పీవీ కుమార్తె.. ఎమ్మెల్సీ సురభీ వాణి దేవి ‘తెలంగాణ గడ్డ మీద పుట్టిన తొలి తెలుగు ప్రధాని మన పీవీ నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పీవీ గారికి భారత రత్న ఇవ్వడంతో భారత రత్న విలువ మరింత పెరిగింది. 1991 నుంచి 1992 భారత దేశ పరిస్థితి ఏ రకంగా ఉండేదో అందరూ ఆలోచించాలి. ప్రజల క్షేమంమే తన జీవితం అని పీవీ గారు అనుకున్నారు. కొంచం లేట్ అయిన పీవీ గారికి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషం. ... అయిన కుటుంబ సభ్యులుగా అందరం ఆనంద పడుతున్నాం. పీవీ గారి శత జయంతి ఉత్సవాలు కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా బీజేపీ పీవీ గారిని గుర్తించి భారత రత్న ఇవ్వడం ప్రధానీ మోదీ సంస్కారంకు నిదర్శనం. రాజకీయాలు పక్కన పెట్టీ ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ఠీవీ పీవీకి భారతరత్న భేష్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ‘తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా నేను నగర్వపడుతున్నా. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదములు. .. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నా. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచిత నిర్ణయం’అని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న దక్కటం దేశప్రజలందరికీ గర్వకారణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు ఏనాడూ పీవీ గారిని గౌరవించలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు పీవీ పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. పీవీ తుదిశ్వాస విడిచాక కూడా పార్టీ కార్యాలయంలోకి పార్థివదేహాన్ని రానివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ పీవీ గారిని దారుణంగా అవమానించింది. ఢిల్లీలో పీవీ స్మృతి కేంద్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటుచేయలేదు. ... చివరకు పీవీ అంతిమ సంస్కారంలోనూ ఆటంకాలు కల్పించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఏనాడూ.. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేయలేదు. దేశానికి పీవీ చేసిన సేవలను బీజేపీ పార్టీ నేతృత్వంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి.. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో వారిని గౌరవించడం గొప్ప విషయం’అని కిషన్రెడ్డి తెలిపారు. పీవీకి భారత రత్న ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ‘తెలంగాణ బిడ్డ పివి కి భారత రత్న అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వ కారణం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీవీకి భారత రత్న ఇవ్వాలని పలు మార్లు కేంద్రాన్ని కోరారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తెలంగాణ ఠీవి మన పీవీ అని కేసిఆర్ సగర్వంగా అన్ని వేదికల మీద చెప్పారు. పీవీ కూతురు వాణి దేవికి ఎమ్మెల్సిగా అవకాశం కల్పించి వారి కుటుంబానికి సమున్నత గౌరవాన్ని ఇచ్చారు. ట్యాంక్ బండ్ మీద పీవీ విగ్రహం, నెక్లెస్ రోడ్కు పీవీ మార్గ్గా నామకరణం, అసెంబ్లీలో చిత్ర పటం పెట్టిన ఘనత కేసీఆర్దే’అని ప్రశాంత్రెడ్డి తెలిపారు. -
TS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Updates... పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను - సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో కలిసి కష్టపడి పనిచేశాము నేను బీఆర్ఎస్లో అప్పుడే చేరిన. 2011లో రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎమ్మెల్సీ రేసులో కిరణ్ కుమార్ రెడ్డి లేరు మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ , మహమూద్ అలీ బీఆర్ఎస్ నుంచి రేసులో ఉన్నారు రేవంత్ చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు లాలూచీ పడి కాంగ్రెస్కు ఆనాడు ఓటు వేశారు ఆనాడు బీజేపీ లేదు.. మాకు బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవు సీఎం కుర్చీ మార్చాలంటే మేమే వంద మందికి పైగా ఉన్నాము మోడీతో మాకు చర్చలు అవసరం లేదు నిజాలు మాట్లాడితే బాగుంటుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్రెడ్డి కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది 2014-24 వరకు పార్లమెంట్లో ఎవరి పక్షాన నిలిచారు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకే ఆలోచనతో నడుస్తున్నాయి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రజా పాలన అంటారు అసెంబ్లీ చుట్టూ ఇనుప కంచెలు వేశారు. ప్రజా ప్రభుత్వంలో దిగ్బంధం ఎందుకు చేస్తున్నారు. పోలీసుల సంఖ్య ఎందుకు పెంచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ స్పీకర్ సభ ఆర్డర్ లో ఉండటం లేదు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చిన్న వయసులో రేవంత్ సిఎం అయ్యారు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. చిల్లర మల్లర రాజకీయాలు, కామెంట్స్ వద్దు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి. ► సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఈ రాత్రికి శాసన మండలిలోనే ఉండే ఆలోచన లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► కచ్చితంగా శాసన మండలి కి రావాలి, క్షమాపణ చెప్పాలి ఐటి అంశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు గతంలో దావోస్ వెళ్తే విమర్శలు చేసింది కాంగ్రెస్ - పల్లా ఇప్పుడు సిఎం దావోస్ పర్యటనలో అదానీ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నారు అధానిపై ఆరోపణలు చేస్తూనే ...మరోవైపు ఒప్పందాలు చేసుకుంటుంది కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తాము. నిబంధనల ప్రకారమే పరిశ్రమల ఒప్పందాలు జరిగాయి. ఐటి అభివృద్ధి పై సలహాలు సూచనలు తీసుకుంటాము. ► తెలంగాణ శాసమండలికి భోజన విరామం శాసన మండలిలో గందరగోళం బీఆర్ఎస్ నేతల చిట్టా మా దగ్గర ఉంది: జూపల్లి కృష్ణా రావు ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపకుండ అడ్డుకోవడం మంచిది కాదు: మంత్రి తుమ్మల సభ గౌరవం పాటించక పోవడం సబబు కాదు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఆర్టీసి బస్సులను పెంచాలి. ఆర్టీసి అంశంపై మాట్లాడుతుండగా అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసి, ఆటోలను పట్టించుకోలేదు. ఆటో, ఆర్టీసి కార్మికులు 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. ఆటో కార్మికులకు కనీసం 1000 రూపాయలు ఇవ్వని వాళ్ళు బీఆర్ఎస్ ఫ్యూడల్స్ ఆటోలలో వస్తున్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కావాలా వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి. ఆర్టీసి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఆర్టీసి అభివృద్ధి పై ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి సీతక్క మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే BRS ఓర్వలేక పోతున్నారు. ఆర్టీసి ఉచిత ప్రయాణం కావాలా వద్దా అనేది సూటిగా చెప్పాలి. BRS మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టింది. గతంలో అగ్గిపెట్టె దొరక్క యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసి ఆస్తులను అమ్ముకున్నది BRS ప్రభుత్వం ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సమావేశం సమావేశం వివరాలను మంత్రులకు చైర్మన్కు వివరిస్తున్న ఎమ్మెల్సీ భాను ప్రసాద్ సీఎం మండలికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న ఎమ్మెల్సీలు సీఎం రేవంత్రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పే వరకు మండలి నిర్వహించొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు సీఎం డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలు మరోసారి 10 నిమిషాలు మండలిని వాయిదా వేసిన కౌన్సిల్ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కౌన్సిల్ ను బీఆర్ఎస్ సభ్యులు అగౌరపరుస్తున్నారు భారాస ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు పెద్దల సభలో ఓపిక ఉండాలి జూపల్లి కృష్ణారావు మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఈ విషయంలో ప్రొటెక్ట్ చేసే హక్కులేదు అనవసరంగా సభను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు దోవ పట్టిస్తున్నారు ► కౌన్సిల్ హాల్ ముందు నల్ల కండువాలతో బైటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన ► బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది ► సీఎం రేవంత్రెడ్డి మండలి సభ్యులను అవమానించారని.. మండలి సభ్యులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ► బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే హక్కు లేదు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఎసీ అజెండాను టేబుల్ చేయనున్నారు. -
సీఎం రేవంత్రెడ్డి పసలేని ఆరోపణలు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక కూడా కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. విభజన చట్టాన్ని తయారుచేసింది.. ఆనాటి కాంగ్రెస్ నాయకులు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంతో తమకేం సంబంధం లేదని తెలిపారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమపై సీఎం రేవంత్రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు. రుణమాఫీ, రైతు బంధు, ఉద్యోగాల నోటీఫికేషన్లపై మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకావటంలేదని ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్పై నెట్టే కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ నేతల కేటీఆర్, హరీశ్రావు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఆయన సచివాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్పై నెట్టే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే విభజన చట్టంలో ఈ అంశాలు పొందుపర్చారని గుర్తుచేశారు. కేసీఆర్ సూచన మేరకే అప్పట్లో ఈ చట్టాన్ని రూపొందించారని అన్నారు. ఇప్పుడు విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆరే బాధ్యులని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంకు అప్పగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 89 వరకు విధివిధానాలను ఖరారు చేసే రూల్స్ ఫ్రేమ్ చేశారని తెలిపారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే పక్రియకు పునాది రాయి వేసింది 2014లోనని అప్పుడు కేసీఆర్ ఎంపీగా మద్దతు ఇచ్చారని తెలిపారు. -
కుమారి ఆంటీ ఎపిసోడ్లో ట్విస్ట్!
Kumari Aunty News: సోషల్ మీడియాతో వచ్చిన పాపులారిటీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనే విషయం దాసరి సాయికుమారి అలియాస్ కుమారి ఆంటీకి బోధపడినట్లు ఉంది. ఫేమ్ కోసమో.. తన వ్యాపారం నడవాలనో.. లేక అమాయకత్వంతోనో అడ్డగోలుగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఎక్కడెక్కడి నుంచో జనం క్యూ కట్టడంతో.. ఆమె దుకాణం ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తోందని, మరో చోటుకి తరలించాలని ట్రాఫిక్ పోలీసలు ఆదేశించడం వార్తలెక్కింది. అయితే.. ఈ విషయం అదే సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ వ్యాపారానికి ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద ఎక్కడైతే ఆమె స్ట్రీట్ఫుడ్ కోర్టు నడుస్తుందో.. అక్కడే నడిపించుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె ఇంతలా పాపులర్ కావడానికి కారణమైన ‘ఎక్స్ట్రా టూ లివర్స్’ కస్టమర్తో సహా మళ్లీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈసారి ఆమె తన సంపాదనతో సోషల్ మీడియాలో ఇంకా నానుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు.. త్వరలో ఆమె ఫుడ్కోర్టును సీఎం రేవంత్రెడ్డి స్వయంగా సందర్శిస్తారని ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి తెగ ఇబ్బంది పెట్టారు.. పాపం. తనకు ఇవేవీ తెలియవని.. దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే.. వాళ్లలో కొందరు సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దకు వచ్చినప్పుడు ఈ దరఖాస్తు ఇవ్వాలంటూ ఆమె చేతికి ఇవ్వబోయారు. ఈ ఘటనతో ఇప్పటికే మీ సమస్యను ఆయన(సీఎం రేవంత్) విని ఉంటారని చెబుతూ ఆమె ఆ దరఖాస్తును స్వీకరించేందుకు ఇష్టపడలేదు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాంగ్రెస్ కూడా నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. Unemployed protest at Kumari Aunty's food stall! Unemployed protest that Revanth Reddy said he will come to your food stall, tell him to cancel Jivo 46. #KumariAunty #RevanthReddy pic.twitter.com/NZhG4iVU4L — MD HAJI (@MDHAJI63535465) February 3, 2024 Video Credits: MD HAJI ఇదీ చదవండి: సామాన్యులకు సోషల్ మీడియా వరమా? శాపమా? -
TS: రాష్ట్రంలో టెస్లా, బీవైడీ తయారీ ప్లాంట్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో తయారీ ప్లాంట్ల ఏర్పాటు గురించి టెస్లా, బీవైడీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్లోని భారత హైకమిషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై ‘స్మార్ట్ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..! ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన బీవైడీ సంస్థకు కేంద్రం గత ఏడాది అనుమతి నిరాకరించింది. టెస్లా రెండు సంవత్సరాలుగా భారతదేశంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు కేంద్రం ఒప్పకోవడం లేదనే వాదనలున్నాయి. -
సీఎం రేవంత్కు మల్లారెడ్డి స్పెషల్ రిక్వెస్ట్..ఏంటంటే..?
సాక్షి,హైదరాబాద్:మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను సోమవారం మల్లారెడ్డి పరామర్శించారు. కేటీఆర్ను కలిసి కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంకా రెండుమూడు రోజులు తర్వాత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ కేసీఆర్ తెలంగాణను ఒక మోడల్గా తయారు చేశారు. కేటీఆర్ లేని హైదరాబాద్ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు’ అని మల్లారెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయి.లోకల్గా ఎమ్మెల్యే కి ఓటు వెయ్యకూడదని ప్రజలు అనుకున్నారు కానీ సీఎంగా కేసీఆర్ ఉండరని వారు అనుకోలేదు. కేసీఆర్ సీఎంగా లేనందుకు ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నా’ అని మల్లారెడ్డి చెప్పారు. ఇదీచదవండి..సీఎం రేవంత్తో భేటీ..జానారెడ్డి కీలక వ్యాఖ్యలు -
కాటిపల్లి..కామారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్పై రేవంత్రెడ్డి పైచేయి సాధించారు. అయితే కేసీఆర్, రేవంత్రెడ్డిలు ఇద్దిరినీ ఓడించిన కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి డబుల్ జెయింట్ కిల్లర్గా అవతరించారు. కామారెడ్డిలో పోటీచేసిన ఇరు పార్టీల అధినేతలపై సంచలన విజయం సాధించి వెంకటరమణారెడ్డి పాపులర్ అయ్యారు. కామారెడ్డిలో ఎవరికి ఎన్ని ఓట్లు... ఆదివారం ఉదయం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కామారెడ్డి ఫలితం రౌండ్ రౌండ్కు తీవ్ర ఉత్కంఠ రేపింది. తొలుత ఈ స్థానంలో వెంకటరమణారెడ్డి లీడ్లో ఉండగా తర్వాత రేవంత్రెడ్డి లీడ్లోకి వచ్చారు. చివరి రౌండ్లు లెక్కబెట్టే టైమ్కు రేవంత్రెడ్డిని వెనక్కి నెట్టేసి మళ్లీ వెంకటరమణారెడ్డి లీడ్లోకివచ్చారు. తర్వాత ఒక్కసారిగా కేసీఆర్ ముందుకు దూసుకువచ్చి రేవంత్ను మూడో స్థానానికి నెట్టారు. చివరగా కౌంటింగ్ ముగిశాక కేసీఆర్పై వెంకటరమణారెడ్డి 6741 వేల ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో వెంకటరమణారెడ్డికి 66652 ఓట్లు రాగా, రెండవ స్థానంలో ఉన్న కేసీఆర్కు 59911 ఓట్లు, రేవంత్రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి.. ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్న వెంకటరమణారెడ్డి తర్వాత బీజేపీలో చేరారు.ఈ ఎన్నికల్లో టికెట్ రాకముందు నుంచే ఆయనే బీజేపీ పార్టీ అభ్యర్థి అని కన్ఫామ్ అయిపోయింది. అయితే తర్వాత నియోజకవర్గానికి ఏకంగా ఇటు కేసీఆర్, అటు రేవంత్రెడ్డి పోటీకి వచ్చారు. దీంతో వెంకటరమణారెడ్డిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఎక్కడా కుంగిపోకుండా, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో వెంకటరమణారెడ్డి తన ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. పనిచేసిన లోకల్ కార్డు.. ఎన్నికల ప్రచారంలో వెంకటరమణారెడ్డి వ్యూహాత్మకంగా లోకల్ కార్డును తెరపైకి తీసుకువచ్చారు. ఆయన ప్రచారంలో వాడి వేడి డైలాగులు ప్రయోగించారు. ‘గజ్వేల్ డిపో నుంచి వచ్చిన బస్సులు గజ్వేల్కు, కొడంగల్ నుంచి వచ్చిన బస్సులు కొడంగల్కు వెళ్లిపోతాయి. కామారెడ్డి డిపో బస్సులు మాత్రం ఇక్కడే ఉంటాయి’ అని తాను స్థానికుడిని అని పరోక్షంగా చెప్పేలా ప్రచారం చేశారు. వెంకటరమణారెడ్డి చెప్పిన ఈ మాటలు అక్కడి ప్రజలను ఆకర్షించింది. కేసీఆర్,రేవంత్రెడ్డిలలో ఎవరు గెలిచినా నియోజకవర్గంలో ఉండరని కామారెడ్డి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఇదే ఆయన ఇద్దరు బడా నేతలపై విజయానికి కారణమైందని పొలిటికల్ అనలిస్టులు అభిపప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ తరపున గంప గోవర్ధన్ విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగిన విషయం తెలిసిందే. -
విజయశాంతికి ధన్యవాదాలు
-
కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా : రేవంత్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా అని, తనది మెరిట్ కోటా అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్కు ఒకరోజు ముందు శనివారం రేవంత్ ఇంటి వద్ద ఆయన అభిమానులు రేవంత్ సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు, కేటీఆర్కు మధ్య ఎలాంటి పోలికా లేదని కాంగ్రెస్ రాజకీయ పోరాటమంతా కేసీఆర్తోనేనని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వెల్లడైన తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోనే కొందరు రేవంత్రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బక్క జడ్సన్ లాంటి ఎస్సీనేత రేవంత్కు సీఎం పదవి ఇవ్వొద్దు అని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ప్లకార్డులు ప్రదర్శించి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్కు మద్దతిచ్చిన వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల కూడా పరోక్షంగా రేవంత్ సీఎం అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చారు. పార్టీలో ఆయనకన్నా విశ్వసనీయత కలిగిన నేతలున్నారని మీడియా సమావేశంలోనే డైరెక్టుగా చెప్పారు. ఇదీచదవండి..రంగంలోకి డీకే.. స్పెషల్ ఫ్లైట్లు రెడీ! -
మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా: రేవంత్రెడ్డి
సాక్షి,నర్సాపూర్ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. నర్సాపూర్లో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి , కేసీఆర్ స్నేహితులు అంటారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్కు మీరు ఓ లెక్కా. మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మా రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల జోన్లో కలిపి నిరుద్యోగులను మోసం చేశారు. మేం అధికారంలోకి వస్తే చార్మినార్ జోన్లో కలిపే అవకాశాన్ని పరిశీలిస్తాం. నర్సాపూర్ గడ్డ..లంబాడీల అడ్డ మేం అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు కేసీఆర్. పార్టీ మారి మోసం చేసిన సునీతా లక్ష్మా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆమె కోసం ప్రచారం చేస్తే నాపై కేసులు పెట్టారు. ఆమె మాత్రం కేసీఆర్ పార్టీలో చేరారు. నమ్మక ద్రోహులు ఎవరైనా సరే బండకేసి కొట్టాలి. అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు, గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్, శ్రీ శైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి’ అని రేవంత్రెడ్డి కేసీఆర్పై ఫైర్ అయ్యారు. ఇదీచదవండి..కాంగ్రెస్ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్ -
ఆయన రేవంత్ రెడ్డి కాదు..రైఫిల్ రెడ్డి : సీఎం కేసీఆర్ ఫైర్
సాక్షి, జనగాం : రేవంత్రెడ్డికి ఆయన పార్టీ నేతలే రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి ఉద్యమకారులపై తుపాకులు పట్టుకుని తిరిగాడని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రోళ్ల బూట్లు మోశాడని మండిపడ్డారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, పిచ్చికుక్కలు మొరిగితే పట్టించుకుంటామా అని దుయ్యబట్టారు. ‘ మన దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు. ఎన్నికలు వస్తే అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి సభలు జరగవు. అక్కడ టీవీల్లో చర్చలు పెడతారు. ప్రజాస్వామ్యంలో పరిణితి సాధించిన దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయి. మనదగ్గర ఎన్నికలు వస్తే నేరాలు ఘోరాలు, అబాంఢాలు పుట్టుకొస్తాయి. ఎన్నికల్లో ఎవరో చెప్పారని నిర్ణయం తీసుకోవద్దు. అన్ని విషయాలపై చర్చించి ఓటు ఎవరికేయాలో నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రను పరిశీలించాలి. మనం వేసే ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుంది. 2004 ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ తెలంగాణను మోసం చేసింది. బీఆర్ఎస్ను చీల్చాలని ప్రయత్నం చేసింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఇప్పుడు బచ్చన్నపేట చెరువు నిండుగా కనిపిస్తోంది. రైతులకు రైతు బంధు ఇచ్చిందెవరు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. ఎవరికి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయించాలి. 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ అంటున్నాడు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ అంటున్నడు. ధరణిని బంగాళాఖాతంలో పారేద్దామని భట్టి విక్రమార్క అంటున్నాడు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోవాలి. ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తాం. పల్లారాజేశ్వర్రెడ్డి నాతోనే ఉంటాడు. జనగామను అభివృద్ధి చేసే బాధ్యత నాది’అని కేసీఆర్ అన్నారు. ఇదీచదవండి.. అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో రూ. 6.5 కోట్ల పట్టివేత.. ఆ లీడర్వేనని అనుమానాలు? -
150 కోట్ల మంది చూపు కామారెడ్డి వైపే : రేవంత్రెడ్డి
సాక్షి, కామారెడ్డి : పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని, కేసీఆర్కు తిరిగి చెల్లించే సమయం వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ఇవాళ కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి ఎన్నికల తీర్పు భారత దేశ చరిత్రలో గొప్ప తీర్పుగా నిలవాలన్నారు. 150 కోట్ల మంది కామారెడ్డి వైపు చూస్తున్నారన్నారు. ‘డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెట్టి గెలవాలనుకుంటున్నాడు కేసీఆర్. తెలంగాణలో ఉచిత కరెంట్, మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనతో లేరు కానీ ఆయన హయాంలో 12 వేల కోట్ల రూపాయల కరెంటు బకాయిల రద్దు చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ , ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మేడిగడ్డ, పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్ మాట్లాడతలేడు. ప్రపంచం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. ఎమ్మెల్యేగా ఎక్కడైనా గెలుస్త కానీ కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి కామారెడ్డికి వచ్చిన. కామారెడ్డి రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. కర్ణాటకలో గెలిచినట్లుగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ జెండా ఎగురవేస్తుంది 24 గంటల ఉచిత విద్యుత్పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధం. తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే అటు కొడంగల్లో, ఇటు కామారెడ్డిలో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటా. సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉంది. లాగ్బుక్లు తీసుకుని కామారెడ్డికి రా’ అని రేవంత్ సవాల్ విసిరారు. దొరల రాజ్యానికి..ప్రజల రాజ్యానికి పోటీ.. షబ్బీర్ అలీ ‘కామారెడ్డిలోని పచ్చని భూములపై కేసీఆర్ కన్ను పడింది. కామారెడ్డిలో కేసీఆర్పై రేవంత్రెడ్డి పోటీ చేయలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం. కామారెడ్డిలో దొరల రాజ్యానికి ప్రజల రాజ్యానికి మధ్య పోటీ జరుగుతోంది. ప్రతి కార్యకర్త నేనే రాహుల్ గాంధీ, నేనే సోనియా గాంధీ, నేనే రేవంత్ రెడ్డి, నేనే షబ్బిర్ అలీ అని భావించుకొని పనిచేయాలి’ అని షబ్బీర్ అలీ కోరారు. ఇదీచదవండి..శుభకార్యాలు.. ప్రచారాలు -
రేవంత్ కంటే కేసీఆరే మంచోడు: ఎంపీ అర్వింద్
సాక్షి, మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కోరుట్లలో అర్వింద్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇంట్రస్టింగ్ కామెంట్లతో పాటు తిట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పోరు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగగ్రెస్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ కంటే కేసీఆర్ బెటరని అర్వింద్ అన్నట్లు తెలుస్తోంది. -
ఈనెల 4న సుప్రీకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
తెలంగాణ కాంగ్రెస్ లో రగులుతున్న బీసీ చిచ్చు
-
ఒకవేళ ఎన్నికల్లో ఓడితే..రేవంత్ కు జోగు రామన్న సవాల్
-
పార్టీకి ఊపు తెచ్చిన సోయంకు ప్రాధాన్యత ఇవ్వటంలేదా..!
-
సీడబ్ల్యూసీకి ఎవరో?.. రాష్ట్ర కాంగ్రెస్లో ఏఐసీసీ పదవులపై చర్చ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి ప్రాతినిధ్యం లభిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్లీనరీ అనంతరం ఏర్పాటు చేయనున్న సీడబ్ల్యూసీలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న టి.సుబ్బిరామిరెడ్డి (ఆంధ్రప్రదేశ్)తోపాటు తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఈ రేసులో ఉన్నారు. అయితే, సుబ్బిరామిరెడ్డికి మళ్లీ రెన్యువల్ అవుతుందని, మిగిలిన నేతలకు సీడబ్ల్యూసీలో చోటు దక్కే అవకాశం లేదని 10 జన్పథ్ వర్గాలు చెబుతున్నాయి. కోమటిరెడ్డితో పాటు పలువురు సీడబ్ల్యూసీ సభ్యత్వం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా డిమాండ్ కనిపించకపోయినా తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నారు. తనకు సీడబ్ల్యూసీ అవకాశం తప్పకుండా వస్తుందని, సీడబ్ల్యూసీ సభ్యుని హోదాలోనే పాదయాత్రను ప్రారంభిస్తాననే ధీమాతో ఉన్నారు. సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య కూడా సీడబ్ల్యూసీలో స్థానాన్ని ఆశిస్తున్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి పేరు నాలుగైదు నెలలుగా వినిపిస్తోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగితే తాను పోటీచేసి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సభ్యుల ఓట్లతో గెలుపొందాలని ఆయన భావించారు. కానీ సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నిక ద్వారా కాకుండా ఏఐసీసీ చీఫ్ ఎంపిక చేయాలని ప్లీనరీలో నిర్ణయించడంతో ఇప్పుడు తనను ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఏపీ నుంచి రఘువీరారెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయనతోపాటు తెలంగాణలోని ఏఐసీసీ కార్యదర్శుల్లో ఒకరికి ప్రమోషన్ ఇస్తారని తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా న్యాయం చేయలేమని, రాష్ట్రంలోనే ఉండాల్సి వస్తుందని కొందరు సీనియర్ నేతలు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
చంద్రబాబే నాతో మాట్లాడారు.. ప్రత్యేక కోర్టులో స్టీఫేన్
హైదరాబాద్: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలంటూ తనను ప్రలోభ పెట్టాడని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఫోన్లో నేరుగా తనతో మాట్లాడారని, ‘మనవాళ్లు అంతా బ్రీఫ్ చేశారు, వాళ్లు చెప్పినట్లు చేయాలి’ అని కోరారని.... తానున్నానని, వాళ్లు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని వివరించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్ గురువారం ప్రత్యేక కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్గా పరిచయం చేసుకున్న సెబాస్టియన్...చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడించారని తెలిపారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెబితే చంద్రబాబునాయుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సెబాస్టియన్ చెప్పినట్లు వివరించారు. రేవంత్రెడ్డి వస్తారని సెబాస్టియన్ చెప్పారు.. ‘‘2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసే విషయంలో చంద్రబాబునాయుడు నేరుగా మాట్లాడాలను కుంటున్నారని ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా హ్యారీ సెబాస్టియన్ నన్ను సంప్రదించారు. చంద్ర బాబునాయుడు ప్రతినిధిగా పార్టీలో కీలకమైన వ్యక్తి వస్తేనే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. దీంతో చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్రెడ్డి మాట్లాడడానికి వస్తారని చెప్పారు’’ అని స్టీఫెన్సన్ వివరించారు. లంచం తీసుకోవడం ఇష్టం లేదని, దీంతో వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించానని తెలిపారు. రూ.50 లక్షలు అడ్వాన్స్ అని చెప్పారు.. ‘‘ఏసీబీ అధికారులు మేము ఉన్న ఫ్లాట్లో ఐఫోన్ను, ఇతర ఆడియో, వీడియో పరికరాలను ఏర్పాటు చేశారు. 2015 మే 30న రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలు నేను ఉన్న ఫ్లాట్కు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తాం. అడ్వాన్స్గా రూ.50 లక్షలు ఇస్తున్నాం. మిగిలిన డబ్బు ఓటింగ్ తర్వాత ఇస్తాం అని చెప్పారు. ఇందులో భాగంగా రూ.2.5 లక్షలుగా ఉన్న 500 రూపాయల బండిళ్లు 20 టీపాయ్ మీద పెట్టారు. వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రేవంత్రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు’’ అని స్టీఫెన్సన్ వివరించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలాన్ని పాక్షికంగా నమోదు చేసిన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు....తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. రేవంత్రెడ్డి పిటిషన్పై అభ్యంతరం.. ఇదిలా ఉండగా ఇదే కేసులో మరికొందరు సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయ్యే వరకూ స్టీఫెన్సన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను ఆపాలంటూ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 7కు వాయిదా వేశారు. ఉదయసింహ అప్పీల్ కొట్టివేత.. మరోవైపు ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ తాను దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ప్రత్యేక కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసిందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. -
తీవ్రంగా కలతచెందిన సీఈఓ
సాక్షి, హైదరాబాద్: రేవంత్రెడ్డి అరెస్టు ఘటనను హైకోర్టుతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం తీవ్రంగా తప్పుబట్టడంతో సీఈఓ రజత్కుమార్ కలత చెందారు. సజావుగా సాగుతున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో వారంలో ముగుస్తాయన్న తరుణంలో ఈ ఘటనతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా సీఈఓను కలిసేందుకు ఆయన కార్యాలయ వర్గాలు సైతం భయపడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభ రద్దయినప్పటి నుంచి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు గత నాలుగు నెలలుగా పడిన కష్టం ఈ ఒక్క ఘటనతో విలువ లేకుండా పోయిందని సీఈఓ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. రేవంత్ అరెస్టుపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా.. ఎన్నికల సంఘం పనితీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన కలత చెందారు. ‘అవసరమైన చర్యలకే’ ఆదేశం ఈ నెల 4న కొడంగల్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడాన్ని వ్యతిరేకి స్తూ రేవంత్రెడ్డి బంద్కు పిలుపునివ్వడం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిరసనలు తెలపాలని కోరిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయగా, సీఎం సభ రోజు శాంతిభద్రతల సమస్య రాకుండా ‘అవసరమైన చర్యలు’ తీసుకోవాలని మాత్రమే సీఈఓ పోలీసు శాఖకు ఆదేశించారని అధికారవర్గాలంటున్నాయి. రేవంత్ దుందుడుకు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆయనను అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, ఆయన్ను అరెస్టు చేసి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచితే వివాదానికి అవకాశముండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ అరెస్టు పట్ల ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో సీఈఓ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. గత రెండ్రోజులుగా ఆయన విలేకరులను సైతం కలవడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. -
కొడంగల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరీ
కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఒకవైపు.. గెలుపే లక్ష్యంగా టీర్ఎస్ ఎంచుకున్ననరేందర్రెడ్డి మరో వైపు బరిలో ఉన్నారు. ఇద్దరు ఉద్దండుల రాజకీయ రణరంగంలో కొడంగల్ ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారనే అంశంపై ఉత్కంఠ సాగుతోంది. కొడంగల్: కొడంగల్లో పోరాటం నువ్వా.. నేనా అనేలా సాగుతోంది నియోజకవర్గంలోని సెకండ్ కేడర్ నాయకులు చాలా మంది ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. కుల సంఘాల ప్రతినిధులను నరేందర్రెడ్డి తన వైపునకు తిప్పుకొన్నారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవమే తనకు ముఖ్యమని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. 7న జరిగే ఎన్నికల్లో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. నేతలిద్దరూ గెలుపు తమదేనని చెబుతున్నా.. చివరికి ఏం జరుగుతుందోననే భయం వీరి లో కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కొడంగల్పై దృష్టిసారించి రేవంత్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించు కుంటున్నారు. రేవంత్రెడ్డి మాత్రం తనకు 30 వేల మెజారిటీ వస్తుందని, ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారని పేర్కొంటున్నారు. కొడంగల్ నియోజకవర్గం చుట్టూ హై టెన్షన్ వైరులా తాను కాపాలా ఉన్నానని.. తాను ఉన్నంత వరకు కొడంగల్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్నాళ్లు జరిగిన ఎన్నికలు ఒకవంతు అయితే డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలు మరో వంతుగా మారాయి. అభ్యర్థులిద్దరూ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమి తెలియని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. నువ్వా.. నేనా ! కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం పేరుతో రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి మంత్రంతో టీఆర్ఎస్ నరేందర్రెడ్డి జనానికి దగ్గరవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నేతగా ఉన్న రేవంత్ తనదైన ప్రణాళికతో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రెండేళ్లుగా ప్రతీ గ్రామంలో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను ఓవర్ టేక్ చేసే విధంగా రేవంత్ ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో రాటుదేలిన రేవంత్రెడ్డి తన గెలుపు కోసం వేస్తున్న ఎత్తుగడలు స్థానికులకు అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగా మంగళవారం సీఎం కేసీఆర్ కోస్గి సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేయాలని రేవంత్ పిలుపునివ్వడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎటువైపు.. నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు ఉన్నారో అంతుపట్టడం లేదు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీని గెలిపించారు. కొడంగల్ ఆది నుంచి కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోట. ఒకదఫా కాంగ్రెస్ను గెలిపిస్తే.. మరోసారి టీడీపీకి అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల వరకు కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ ఉండేది. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షాలుగా నిలిచాయి. అసెంబ్లీ సెగ్మెంట్కు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 సార్లు సార్వత్రిక ఎన్నికలు కాగా ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐదుసార్లు, టీడీపీ నాలుగు సార్లు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు గెలిచారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘రేవంత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం’
సాక్షి, కోస్గి: కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సోమవారం పట్టణంలో మాజీ వార్డు సభ్యుడు తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీసీ కాలనీతోపాటు బిజ్జారం బావుల కాలనీలో ప్రచారం చేశారు. రేవంత్రెడ్డిని మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పట్టణంలోని మోమిన్పేట కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ముస్లిం, మైనార్టీలు రేవంత్రెడ్డికి మద్దతుగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇద్రీస్, కోఆప్షన్ మెంబర్ ఆసీఫ్, రహీంపాష, నాయకులు మక్సూద్, సలీం, ఇలియాస్, ఫేరోజ్, ఖలీం తదితరులు ఉన్నారు. మద్దూర్లో.. మద్దూరు: మండల కేంద్రంలో, కొత్తపల్లిలో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారాన్ని చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ, రూ.5లక్షలతో ఇంటి నిర్మాణం, రూ.2లక్షలతో కల్యాణలక్ష్మి పథకం, 7 కిలోల సోనా బియ్యం ఇవ్వనున్నారని తెలిపారు. అభివృద్ధి చూసి హస్తం గుర్తుకు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో మురళిధర్రెడ్డి, వెంకట్రాములుగౌడ్, బాల్రాజ్, మహిపాల్, గణప చందు, సుభాష్, సంజీవ్, రామకృష్ణ, భీములు, సలాం, శేఖర్, నర్సిరెడ్డి, బారి, కన్కప్ప, సురేందర్ పాల్గొన్నారు.అదేవిధంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు రమేష్రెడ్డి, సుభాష్నాయక్, శివరాజ్, చంద్రశేఖర్, వెంకట్రాములుగౌడ్ ఆధ్వర్యంలో చింతల్దిన్నెకు చెందిన వీరప్ప, నీలప్ప, మొగులప్ప, గండెప్ప, మల్లప్ప, గోవిందు, ఆంజనేయులు, వెంకటయ్య, హన్మయ్య, రాములు, అంజప్ప, మొగులప్ప తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు రాంచందర్, వెంకట్రెడ్డి, వెంకటేష్ తెలిపారు. -
అమర వీరుల కుటుంబాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రానున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ పార్టీలో కూడా చర్చ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ మాట్లాడుతూ.. సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్కు రెండే రాజ్యసభ స్థానాలు వస్తాయని, ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మూడోది గెలవాలి కనుక తమ ఆలోచనకు అనుగుణంగా అమరవీరుల కుటుంబాలకు అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. తన బంధువు సంతోష్ను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ యోచిస్తున్నారని, రాజ్యసభకు వెళ్లే అర్హత సంతోష్కు ఏముందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్కు సపర్యలు చేయడమే సంతోష్ అర్హతా? అని ఎద్దేవా చేశారు. అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపుతామని రేవంత్ హెచ్చరించారు. -
కోదండరాంతో రేవంత్రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తమ బంధువు ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించేందుకంటూ బుధవారం రేవంత్రెడ్డి, కోదండరాం ఇంటికి వెళ్లడం, ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు నేతలు అధికార టీఆర్ఎస్ వ్యవహారశైలితో పాటు ప్రతిపక్షాలుగా తాము వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై చర్చ జరిగిందని వారి సన్నిహితులు చెపుతున్నారు. అయితే, కోదండరాం పార్టీ ప్రకటనకు కొద్ది రోజుల ముందే రేవంత్రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఏకాంతంగా చర్చించడం ఎందుకనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. కోదండరాంతో దోస్తీ కోసం రేవంత్ కాంగ్రెస్ దూతగా కలిశారా లేక వ్యక్తిగత పనిమీదనే వెళ్లి పనిలో పనిగా రాజకీయాలు చర్చించారా అన్నది హాట్టాపిక్గా మారింది. -
గుజరాత్లో నైతికంగా ఓడిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపులు, అబద్ధాలతో దిగజారుడు పద్ధతుల ద్వారా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని కాంగ్రెస్పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికల్లో ఒక్క రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులంతా కలిపి 182 మంది వరకు కష్టపడ్డారని అన్నారు. ప్రధాని మోదీ తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందంటూ మాట్లాడటం ద్వారా ప్రధాని పదవికే మచ్చ తెచ్చారని విమర్శించారు. ప్రధాని హత్యకు కుట్ర జరిగి ఉంటే కారకులపై కేసులు పెట్టాలని, పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలని సవాల్ చేశారు. ఇవేమీ చేయకుండా కేవలం ప్రచారానికే ఈ అంశాన్ని ఎందుకు వాడుకున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కులం, మతం పేరునే కాకుండా పాకిస్తాన్ పేరును కూడా మోదీ వాడుకుని, దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు దిగజార్చారని ఆరోపించారు. రాహుల్కు భయపడుతున్న మోదీ సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారో అర్థంకావడం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని స్థాయిలో ఉన్న మోదీ తన హత్యకు కుట్ర జరిగిందంటూ మాట్లాడటమే ఆయన భయపడుతున్నారనడానికి నిదర్శనమన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి గెలిచిన బీజేపీ ఏదో సాధించినట్టుగా గొప్పలు చెప్పు కోవడం హాస్యాస్పదమన్నారు. రాహుల్గాంధీ పరిణతి చెందిన నాయకుడిగా బీజేపీ నేతలే ఒప్పుకుంటున్నారన్నారు. విభజన చట్టంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులను అడగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని పొంగులేటి ఆరోపించారు. గెలుపు కోసం దిగజారిన మోదీ: సురవరం సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగజారి వ్యవహరించారని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రధానిగా అభివృద్ధి గురించి మాట్లాడకుండా కులం, మతం, చివరకు పాకిస్తాన్ పేరును కూడా వాడుకుని ఓటర్లను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అన్నారు. గుజరాత్లో గతంతో పోలిస్తే బీజేపీకి సీట్లు, ఓట్లు తగ్గాయన్నారు. కాగా, జనవరి 8, 9 తేదీల్లో విజయవాడలో సీపీఐ జాతీయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆరే గిరిజనుల మధ్య చిచ్చుకు కారణమని ఆరోపించారు. గిరిజన తెగల మధ్య తలెత్తిన సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. -
రేవంత్రెడ్డి ఫిర్యాదు అందిందా? లేదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరీ నిమిత్తం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’పేరుతో పెద్ద మొత్తాల్లో డబ్బు వసూలు చేసి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అందిందో? లేదో? చెప్పాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫిర్యాదు అందితే, అది ఎప్పుడు అందింది.. దానిని జనరల్ డైరీ (జీడీ)లో ఎప్పుడు నమోదు చేశారు.. అసలు నమోదు చేశారో? లేదో? చెప్పాలంది. ఒకవేళ జీడీ డైరీలో కూడా నమోదు చేసి ఉంటే ఆ ఫిర్యాదుపై ఏం చేశారో తెలియజేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా డబ్బు వసూలు చేయడం అవినీతి కిందకే వస్తుందని, దీనిపై ఫిర్యాదు చేసినా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎస్.వి.భట్ విచారణ జరిపారు. -
రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది: ఎ.జీవన్రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది. ఎక్కడ తట్టుకుంది. స్పీకర్ అయితే.. రాలేదన్నారు. రేవంత్.. ఆట మొదలయింది అన్నడు. ఎక్కడ పోయాడు?’అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంపత్ను ప్రశ్నించారు. ప్రతిగా ఎమ్మెల్యే సంపత్.. ‘అసలు రేవంత్ రాజీనామా గురించి అడిగే దమ్ము టీఆర్ఎస్కు లేదు. అసలు టీఆర్ఎస్ దగ్గర ఆయుధాలు లేవు..’అంటూ స్పందించారు. -
బాబు వదిలిన బాణం రేవంత్: సోలిపేట
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా సాగుతున్న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు వదిలిన బాణమే రేవంత్రెడ్డి అని దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన శాసనసభ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై రేవంత్ ప్రకటిస్తున్న విశ్వాసం, ఆయన చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మీద కడుతున్న ప్రాజెక్టులు అడ్డుకోవటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో చివరి అస్త్రంగా రేవంత్రెడ్డిని వదిలారన్నారు. తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన రేవంత్, నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనమని ఎంత డబ్బిచ్చాడో గుట్టు విప్పితే తెలంగాణ ప్రజలు ఆయన విశ్వసనీయతను నమ్ముతారన్నారు. -
ఒకే టోర్నీలో రెండు ట్రిపుల్ సెంచరీలు
కడప స్పోర్ట్స్: వైఎస్సార్ జిల్లా కడపలోని ఏసీఏ సౌత్జోన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కల్లూరు రేవంత్రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించాడు. కడప నగరంలో సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమైన ఏసీఏ అండర్–14 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పాడు. ఒకే టోర్నమెంట్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన (అన్ని ఫార్మాట్లలో) ఏకైక క్రికెటర్గా రికార్డు నమోదు చేశాడు. నెల్లూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి గతనెల 23వ తేదీన విజయనగరం జట్టుతో జరిగిన పోటీ మ్యాచ్లో 304 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తాజాగా గురువారం పశ్చిమగోదావరి జట్టుపై 289 బంతుల్లో 301 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో 5 మ్యాచ్లు ఆడగా 95.76 స్ట్రయిక్ రేట్తో 746 పరుగులు సాధించడం విశేషం. కాగా రేవంత్రెడ్డి 2014 నుంచి కడప నగరంలోని ఏసీఏ సౌత్జోన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సౌత్జోన్ అకాడమీ హెడ్ కోచ్ పి. మధుసూదన్రెడ్డి, సహాయ శిక్షకులు శ్రీనివాస్, కిశోర్, ట్రైనర్ ఆనంద్కుమార్ల నేతృత్వంలో క్రికెట్లో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాడు. అతను ప్రస్తుతం కడప నగరంలోని గురుకులం టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతనిది నెల్లూరు నగరం బి.వి.నగర్ కాగా ఈయన తండ్రి రామచంద్రారెడ్డి హైదరాబాద్లో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. రేవంత్ ప్రదర్శన పట్ల సౌత్జోన్ అకాడమీ చైర్మన్ ఎం.వెంకటశివారెడ్డి, కన్వీనర్ డి. నాగేశ్వరరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
కేటీఆర్ వల్లే డ్రగ్స్ విషసంస్కృతి
మంత్రి, ఆయన బంధువులపై రేవంత్ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: గత 60 ఏళ్లలో లేని డ్రగ్స్ విషసంస్కృతి ఈ మూడేళ్లలోనే జడలు విప్పడానికి సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్, వారి సమీప బంధువులే కారణమని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ కనుసన్నల్లోనే అంతర్జాతీయ డీజే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారని అన్నారు. కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈవెంట్స్ నౌ అనే సంస్థ ఈ మూడేళ్లలో దాదాపు 10 అంతర్జాతీయ డీజే షోలను ఏర్పాటు చేసిందని, ఈ షోలు డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, యువతులపై అఘాయిత్యాలకు వేదికలుగా ఉన్నాయని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇలాంటి షోలను ముంబై, గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లోనూ పోలీసులు అనుమతించడంలేదన్నారు. -
‘ఇసుక’తో కేసీఆర్ కుటుంబానికి రోజుకో కోటి
డ్రగ్స్ కేసులో కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తాం: రేవంత్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా కేసీఆర్ కుటుంబా నికి రోజుకు కోటి రూపాయలు ముడుపులుగా అందుతున్నాయని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆరోపించారు. సిరి సిల్లలో పోలీసుల దాడికి గురైన వారి కుటుంబసభ్యులు రేవంత్రెడ్డిని సోమవారం కలిశారు. ఆయన మాట్లాడుతూ ఇసుక క్వారీలు అన్నీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకే ఎలా దక్కుతాయని ప్రశ్నించారు. వారి ఇసుక అక్రమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికే ప్రశ్నించిన దళితులపై పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్పై ఉందన్నారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల కేసులో టీఆర్ఎస్ నేతలకు, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులకు అనుకూలంగా విచారణ జరుగుతున్నదని రేవంత్రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ బావమరిదికి చెందిన పబ్, సీనియర్ మంత్రి కుమారుని పబ్ నిబంధనలకు విరు ద్ధంగా నడుస్తున్నాయని, ఈ విషయం సీఎం కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. వీటిపై కేంద్ర హోంమంత్రికి, గవర్నర్కు ఫిర్యాదుచేస్తామని రేవంత్ హెచ్చరించారు. -
కాళ్లు మొక్కితే ఆశీర్వదించండి అంతేగానీ..
హైదరాబాద్: 'గవర్నర్ గారూ.. కాళ్లు మొక్కితే ఆశీర్వదించండి.. అంతేగానీ రాష్ట్రాన్ని ముంచుతుంటే ప్రేక్షకపాత్ర వహించకండి' అన్నారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్రెడ్డి.. పచ్చి అబద్దాలను రాస్తే గవర్నర్ యాంత్రికంగా చదివారని విమర్శించారు. 'గవర్నర్ ప్రసంగం చివరిపేజీలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహితంగా.. పారదర్శకంగా నడుస్తోందని ఉంది. ఇంతకన్నా అబద్దం ఉందా' అన్నారు రేవంత్రెడ్డి. అవినీతి ఆరోపణలతో ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారని ఆయన గుర్తు చేశారు. పారదర్శకతతో ప్రభుత్వం పనిచేస్తే.. అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్కు ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిపేదని అన్నారు. అలాగే గవర్నర్ ప్రసంగంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారని.. అసలు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా అని ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించలేదని.. ఇది గవర్నర్ వ్యవస్థనే అపహాస్యం చేయడమని ఆయన దుయ్యబట్టారు. గవర్నర్ గత మూడు ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావించిన డబుల్ బెడ్రూం ఇళ్లు, మైనార్టీ రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, దళితులకు భూమి లాంటి అంశాలను ఈ ప్రసంగంలో ప్రస్తావించలేదని.. అంటే ఇవేమీ చేయమని గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడించిందని రేవంత్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించొద్దని ఆయన గవర్నర్ను కోరారు. కనీసం బడ్జెట్లో అయినా గవర్నర్ ప్రసంగంలో కనిపించని కీలక అంశాలకు ప్రాధాన్యత దక్కేలా చూడాలని రేవంత్రెడ్డి కోరారు. -
కాళ్లు మొక్కితే ఆశీర్వదించండి అంతేగానీ..
-
నేటి సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు
హైదరాబాద్: అసెంబ్లీలో తమ హక్కులను కాలరాయడంపై నిరసనగా నేడు సమావేశాలను ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ నేతలు బహిష్కరించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారారిని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య కలిశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సభలో విపక్ష సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని, విపక్ష సభ్యులను సభలో మాట్లాడనివ్వడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నిన్న అసెంబ్లీలో భూ సేకరణ బిల్లు ఆమోదం సందర్భంగా నిరసన తెలిపి వాకౌట్ చేసే టైమ్ ఇవ్వకపోవడంపై స్పీకర్ తీరును టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. స్పీకర్ తీరును నిరసిస్తూ లేఖ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పదే పదే చెబుతున్నా స్పీకర్ వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. అందుకే అసెంబ్లీని బహిష్కరించాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు రేవంత్ వెల్లడించారు. తమతో పాటు అసెంబ్లీని బహిష్కరించాలని కాంగ్రెస్, సీపీఎం నేతలను కోరామని, బీజేపీ నేతలు ఆలోచించి చెబుతామని పేర్కొన్నట్లు వివరించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై స్పీకర్ను కలిశారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తమకు టైమ్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో విపక్షాలకు తలెత్తుతున్న సమస్యలపై స్పీకర్కు తెలియజేస్తూ కాంగ్రెస్ నేతలు లేఖ అందజేశారు. స్పీకర్ తీరుకు నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తామని తమ లేఖలో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నట్లు సమాచారం. ప్రాజెక్టులు, భూ సేకరణ చట్టం ఆమోదంపై నిన్న సభ జరిగిన తీరుపై నిరసనగా కాంగ్రెస్ నేతలు నేడు సమావేశాలను బహిష్కరించారు. -
ఇంత దిగజారుడా?!
‘నాపైన ఎన్నో కేసులు పెట్టారు. ఇబ్బందులు పెట్టాలని చూశారు. ఏదీ నిరూపించ లేకపోయారు. నేను నిప్పులాంటివాడినని రుజువైంది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తరచు చెబుతుంటారు. ఈమధ్య పెద్ద నోట్లు రద్దయిన దగ్గర నుంచి అది తన ఘనతేనని ఆయన వీలు దొరికినప్పుడల్లా చెప్పుకుంటున్నారు. అందుకు రుజువుగా గత నెలలో కేంద్రానికి రాసిన లేఖను సైతం గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తి తరఫున ఉమ్మడి హైకోర్టు ముందు ‘ఓటుకు కోట్లు’ కేసులో సాగుతున్న వాదనలు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. ఓటేయడం ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగ బాధ్యత మాత్రమేనని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. రాష్ట్రపతి పదవికి, రాజ్య సభ స్థానానికి లేదా ఎమ్మెల్సీ పదవికి ఎవరినైనా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఇవ్వడంలో ఉద్దేశం ఆ ఓటు ద్వారా ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుందనే. పార్లమెంటు, అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లాగే ఆ ఎన్నికలు కూడా ప్రజా స్వామ్య ప్రక్రియలో భాగమే. ప్రజాప్రతినిధులుగా ఉంటున్నవారు ఓటేయడం రాజ్యాంగ బాధ్యతే తప్ప అది ప్రజా విధుల్లో భాగం కాదని బాబు తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. ప్రజావిధిలో భాగం కానప్పుడు ఓటుకు డబ్బు తీసుకున్నా నేరం కాదన్నది ఆ వాదన సారాంశం. మరో విధంగా చెప్పాలంటే ఆయన దృష్టిలో ఓటును కొనడం, అమ్మడం నేరం కానే కాదు! న్యాయస్థానం వెలుపల బాబు చెప్పే కబుర్లు వేరు. వివిధ వేదికలపై ఇందుకు సంబంధించి ఆయన వల్లించే నీతులకు హద్దూ పద్దూ ఉండదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఉదంతం జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన మహానాడులో తెలంగాణలో తమ ఎమ్మెల్యేలను ‘సంతలో పశువుల్లా’ కొంటున్నారని చంద్రబాబు తెగ బాధపడ్డారు. తీరా అదే పని చేయ బోతూ తాను దొరికిపోయారు. ఓటు హక్కు అన్నది రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం హామీ ఇస్తున్న భావ ప్రకటనాస్వేచ్ఛలోనూ, 21వ అధికరణం హామీ ఇస్తున్న వ్యక్తి స్వేచ్ఛలోనూ అంతర్భాగమని మూడేళ్లక్రితం సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పునిస్తూ స్పష్టంచేసింది. ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగా జరిగే ఒక ఎన్నికలో పాల్గొనే ఎమ్మెల్యేలకు ఆ సూత్రం వర్తించదా? ఆ ఎమ్మెల్యేలకు డబ్బు కట్టలు ఎర చూపడం ఆ ఎమ్మెల్యేల భావప్రకటనాస్వేచ్ఛకూ, వారి వ్యక్తి స్వేచ్ఛకూ ముప్పు కలగజేయడంతో సమానం కాదా? ఆ నేరానికి పాల్పడ్డవారికి శిక్ష ఉండొద్దా? ఒకపక్క ఎన్నికల్లో డబ్బు ప్రభావం, ప్రలోభాలకు గురిచేయడం పెరిగిపోయిందని బాబు తరచు ఆవేదన పడుతుంటారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడం తగ్గుతుందని మొన్నటికి మొన్న మీడియా సమావేశంలో చెప్పారు. తీరా ఇప్పుడు ఎన్నికల్లో ఓటేయడానికి డబ్బు తీసుకోవడం అవినీతి కాదని న్యాయస్థానంలో వాదించడం సిగ్గుచేటు కాదా? ఒకపక్క సాధారణ పౌరులకు ఓటు హక్కును తప్పనిసరి చేయా లన్న వాదనలు వస్తున్నాయి. అందుకు సంబంధించి ఒకటి రెండు రాష్ట్రాలు చట్టాలు కూడా తీసుకొచ్చాయి. వాటి రాజ్యాంగ బద్ధత సంగతలా ఉంచి ప్రజాస్వామ్యంలో ఉంటూ దాని ఫలాలు అనుభవిస్తూ ఓటింగ్లో పాల్గొనకపోతే ఎలా అన్నది ‘తప్పని సరి ఓటు’ అనుకూలుర వాదన. అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు మాత్రం ఓటు అమ్ముకోవచ్చని చెప్పడం ఎలాంటి నీతి?‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు వాదనలన్నీ సాంకేతిక కారణాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవారు అన్నివేళలా నిజాయితీగా ఉండాలా, లేక కొన్ని సందర్భాల్లో ఉంటే చాలా అన్న తర్కం ఇందులో నడుస్తోంది. మరి ప్రజాప్రతినిధికి ఉండాల్సిన నైతిక విలువల సంగతి, ఉన్నత వ్యక్తిత్వం వగైరాలు ఏమైనట్టు? పోటీలో ఉన్నవారిలో మెరుగైన వ్యక్తి అని మాత్రమే కాదు... నైతికంగా దిగజారిన వ్యక్తి కాదన్న విశ్వాసంతోనే ఓటర్లు తమ ప్రతినిధిగా ఎంచు కుంటారు. అలాంటివారు ఓటుకు అమ్ముడుపోవడం లేదా వారిని కొనుక్కోవడానికి ప్రయత్నించడం నీతిబాహ్యమైన చర్య కాదనడం హాస్యాస్పదం కాదా? పైగా ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న కేసులో దర్యాప్తునకు ఆదేశించడం వల్ల మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుంది గనుక ఆ చర్య చెల్లదని బాబు తరఫు న్యాయవాది వాదించారు. తన వరకూ వచ్చేసరికి ఇన్ని రకాల సాంకేతిక లోపాలను వెదికే బాబు... రేవంత్రెడ్డిని తాను పంపలేదని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో జరిగిన ఫోన్ సంభాషణలో గొంతు తనది కాదని ఒక్క సందర్భంలో కూడా అనలేదు. పైగా ఆడియో, వీడియో టేపులు బయటికొచ్చిన వెంటనే ‘నా ఫోన్ ట్యాప్ చేయిస్తారా...’ అని ఉగ్రుడయ్యారు. ‘నాకూ ఏసీబీ ఉంది. నాకూ పోలీసులున్నారు...’అంటూ హుంకరించారు. ఈ పోకడలన్నీ నిజానికి ఏ న్యాయస్థానం విచారణా, ఏ ఫోరెన్సిక్ నిపుణుడి ధ్రువీకరణా అవసరం లేకుండానే ఆయన ప్రమేయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపించాయి. అయినా సరే ఆయన గాంభీర్యం ఏమాత్రం తగ్గలేదు. ఈ కేసు విషయంలో స్వీయ రక్షణకు చంద్రబాబు అవలంబిస్తున్న పద్ధతులు, వాదనల సంగతలా ఉంచి కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైనా, పట్టనట్టు ఉంటున్న కేంద్ర ప్రభుత్వ పోకడైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఆరోపణలు వచ్చిన కేసులో దర్యాప్తు ఇంత నత్త నడకన సాగడం తనకు పరువు తక్కువని తెలంగాణ ప్రభుత్వం అనుకోవడం లేదు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న పార్టీ అధినేత ఒకరు పబ్లిగ్గా దొరికినా వారితో చెలిమి కొనసాగించడం తనకు అపకీర్తి తెస్తుందని కేంద్రంలోని ఎన్డీఏ పెద్దలు అనుకోవడం లేదు. పైగా ఈ కేసులో తామే రాయబారం నడిపి రాజీ చేశామన్న ఆరోపణలు వస్తున్న సంగతిని గ్రహించినట్టు కనబడదు. ‘ఓటుకు కోట్లు’ కేసు దర్యాప్తు ఒత్తిళ్లు లేకుండా సాగి ఉంటే ఈపాటికే అది ఒక కొలిక్కి వచ్చేది. ఈ కేసును ఏదో విధంగా నీరుగార్చాలని చూస్తున్న చంద్ర బాబు పోకడలు వింతగొలుపుతాయి. ఇది సాధ్యమైనంత త్వరగా తేలాలని, దోషు లకు శిక్ష పడాలని ఆశిద్దాం. -
'కొత్త జిల్లాల మాటున కేసీఆర్ కుట్ర'
హైదరాబాద్: కొత్త జిల్లాల మాటున దాగిన కుట్రపై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని టీటీడీపీ నేత రేవంత్రెడ్డి తెలిపారు. జిల్లాల విభజన పేరుతో నియోజకవర్గాల డీలిమిటేషన్పై ప్రభావం చూపేలా కేసీఆర్ చేస్తున్న కుట్ర గురించి కేంద్ర హోంశాఖకు, న్యాయశాఖకు వివరిస్తామన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో సీఎం కేసీఆర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఎదిగివస్తున్న ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని అణచి వేయడానికి.. తనకు అడ్డంకిగా ఉన్న నేతలను దెబ్బతీయడానికి జిల్లాల పేరుతో కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా కేసీఆర్తో కుమ్మక్కైందని ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా వేసి కొత్త జిల్లాలను సీఎం ఏర్పాటు చేస్తుంటే నిలదీసి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు వంత పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టం తయారు చేయించిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలోనే ఉన్నారని, ఈ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే ఎందుకు నోరు విప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దాని ప్రభావం రిజర్వ్డ్ నియోజకవర్గాలపై పడుతుందన్నారు. డీలిమిటేషన్పై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చూసినా.. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల సరిహద్దులు మార్చడానికి వీలులేదన్నారు. డీలిమిటేషన్కు ముందుగానే సరిహద్దులు, పరిధిని మార్చడం ద్వారా తాను అనుకున్న విధంగా నియోజకవర్గాల రిజర్వేషన్లు వచ్చేలా కుట్ర పన్నారని ఆరోపించారు. నేతలు దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క, గీతారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత నియోజకవర్గాలు ఎస్సీల నుంచి జనరల్గా మారిపోతాయని రేవంత్ చెప్పారు. -
టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఆయా స్థానాల్లో ప్రజాతీర్పు కోరాలని సీఎం కేసీఆర్ను టీటీడీపీ నేత రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు న్యాయవ్యవస్థ ముందుకు రావడం శుభపరిణామమన్నారు.ఎమ్మెల్యేల అనర్హతలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎంకు చెంపపెట్టు వంటిదన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీకర్ కార్యాలయాన్ని రాజకీయపార్టీలను చీల్చే వేదికగా మార్చుకున్న సమయంలో హైకోర్టు ఈ తీర్పునివ్వడం మంచి పరిణామమన్నారు. టీడీపీ ఎన్నికల గుర్తుపై గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని గతంలోనే స్పీకర్కు ఫిర్యాదు చేసినా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిని పక్కన పెట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఆధారంగా టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ బులిటెన్ విడుదల చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించి మంత్రిగా ప్రమాణం చేసిన తలసాని శ్రీనివాసయాదవ్పై వేటు వేయాలని గవర్నర్ను కలసి ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన గవర్నర్, స్పీకర్ రాజకీయాలకు లోబడి రాజ్యాంగవ్యవస్థను నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే తాము న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చిందన్నారు. తమ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో 90 రోజుల లోపు ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొందన్నారు. స్పీకర్లు రాజ్యాంగానికి అతీతులు కారని, స్పీకర్ తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉంటే ఎవరూ ప్రశ్నించే అవకాశముండదని చె ప్పారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయన్నారు. -
నయీమ్ డైరీ బయటపెట్టండి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఉందో లేదో తెలియని గ్యాంగ్స్టర్ నయీమ్ డైరీని అడ్డు పెట్టుకుని తమ పార్టీకి చెందిన నేతలపై బురద చల్లి బెదిరించాలని చూస్తే సహించేది లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి హెచ్చరించారు.నయీమ్ డైరీపై వార్తలు రావడమే తప్ప అది ఉందని సిట్ అధికారులు ఎప్పుడూ చెప్పలేదన్నా రు. నిజంగానే ఉంటే ప్రభుత్వం దాన్ని సీజ్ చేసి అందులోని పేర్లను అధికారికంగా ప్రకటించాలన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులపై తెలంగాణకు నష్టం కలిగించేలా కుదుర్చుకున్న మహారా ష్ర్ట ఒప్పందాన్ని ప్రధాని చొరవ తీసుకుని రద్దు చేయించాలన్నారు. -
'పదవులు ఇవ్వకుంటే.. రేషన్ డీలర్గా ఉండేవాడు'
వరంగల్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్ర నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తెలిపారు. హన్మకొండలో గురువారం నిర్వహించిన జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా భిక్ష పెట్టి, అన్ని పదవులను కట్టబెట్టిన తెలుగుదేశం పార్టీకి ఎర్రబెల్లి దయాకర్రావు ద్రోహం చేసి టీఆర్ఎస్లో చేరాడని, అక్కడ చెల్లని పైసగా మారాడని విమర్శించారు. టీడీపీ లో ఉన్నప్పుడు పదవులు ఇవ్వకుంటే దయాకర్రావు ఇంకా రేషన్ డీలర్గానే ఉండేవాడని రేవంత్ ఎద్దేశా చేశారు. తాము ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన ఎర్రబెల్లి నేడు కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితిలో ఉన్నాడన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్రెడ్డి, ఉపాధ్యక్షుడు గరికపాటి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న కేసీఆర్
టవర్సర్కిల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నీచ, నికృష్ట వ్యవహారాలతో రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని టీఆర్ఎస్లో తెలుగుదేశం పార్టీ శాసనభ్యుల చేరికలే ఇందుకు పరాకాష్ట అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీని బలహీన పరిచేందుకు కేసీఆర్ వలసలు ప్రోత్సహిస్తున్నారన్నారు. 15 నెలలుగా ఎర్రబెల్లి టీడీపీకి సంబంధించిన కీలక సమాచారాన్ని కేసీఆర్కు చేరవేస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్రెడ్డి ఏసీబీకి పట్టుబడడానికి ఎర్రబెల్లే కారణమని ఆరోపించారు. అర్ధరాత్రి రహస్యంగా కేసీఆర్ వద్దకు వెళ్లి మంతనాలు జరిపినప్పుడే సస్పెండ్ చేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయడం కేసీఆర్కు సాధ్యం కాదన్నారు. గంట రాములు, రొడ్డ శ్రీనివాస్, చెల్లోజి రాజు, కళ్యాడపు ఆగయ్య, పుట్ట నరేందర్, సత్తు మల్లేశం, గాజె రమేశ్, జాడి బాల్రెడ్డి, దూలం రాధిక, నూజెట్టి వాణి, ఆడెపు కమలాకర్, సందబోయిన రాజేశం, నిజామొద్దీన్, విజయ్కుమార్, లక్ష్మణ్, సలీం పాల్గొన్నారు. -
'శవాల తెలంగాణగా మార్చారు'
హన్మకొండ: బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని శవాల తెలంగాణగా మార్చారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే 1,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన పీజీ విద్యార్థిని శ్రుతి, విద్యాసాగర్రెడ్డిని కిరాతకంగా హింసించి చంపారని ఆరోపించారు. తమది నక్సలైట్ల ఎజెండా అని కేసీఆర్ చెపుతున్నారని, దాన్ని నక్సలైట్లే వ్యతిరేకించారని గుర్తు చేశారు. కుటుంబంలో నలుగురికి పదవులు కట్టబెట్టాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? అని ప్రశ్నించారు. పత్తికి మద్దతు ధర కల్పించాలని ప్రశ్నిస్తే కొమురయ్య అనే రైతును జైలులో పెట్టారని, మరి ఆ రైతును బహిరంగంగా దూషించి అవమానపరిచిన కడియం శ్రీహరిపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. కడియంకు చేసిన ‘సన్మానమే’ కేసీఆర్కూ జరగాలన్నారు. సీఎం కేసీఆర్ను ప్రశ్నించిన వారిని టీడీపీ, బీజేపీ అభినందిస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు కూడా టీఆర్ఎస్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటే 1956కు ముందు తెలంగాణలో జన్మించినవారు అయి ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆంధ్రా కాంట్రాక్టర్లు కూడా 1956 ముందు పుట్టినోళ్లకు టెండర్లు ఇస్తామని ఎందుకు నిబంధన పెట్టలేదని ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే విషయంలో నిబంధనలు ఉండవని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలపై కోదండరాం వేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించినందున ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వం వద్దకు రైతుల సమస్యలు తీసుకెళ్లి, ఆత్మహత్యలు నివారించాలని కోరినా పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. -
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్ !
-
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్ !
సమన్వయంతో కలసి పనిచేయండి పరస్పరం గౌరవించుకోకుంటే కేడర్ ఎలా గౌరవిస్తుంది విజయవాడ భేటీలో టీటీడీపీ నేతలతో బాబు సాక్షి, హైదరాబాద్: స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మందలించారని తెలిసింది. మంగళవారం విజయవాడలో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి భేటీ అయ్యారు. విశ్వసనీయవర్గాలు చెబుతున్న వివరాల మేరకు... ‘రాష్ట్రస్థాయి నాయకుల మధ్య ‘ కమ్యూనికేషన్ గ్యాప్ ’ ఉంటే ఎలా..? అంతా కలసి ఉం డండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్న సం గతి మరిచిపోవద్దు. నాయకులు పరస్పరం గౌరవించుకోవాలి. మిమ్ముల్ని మీరు గౌరవించుకోకుంటే పార్టీ కేడర్ ఎలా మిమ్ముల్ని గౌరవిస్తుంది..’ అని రమణ, ఎర్రబెల్లి, రేవంత్కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జరగాల్సిన కృషిపైనా వీరికి హితబోధ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇవ్వమని మిత్రపక్షమైన బీజేపీని అడుగుతానని, అయితే ఏ పార్టీ పోటీచేసినా విజయం కోసం శ్రమించాలని టీటీడీపీ నాయకులకు బాబు సూచించారు. మరోవైపు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్లోకి వెళుతున్న అం శాన్నీ చంద్రబాబు ఆరా తీశారు. వచ్చే నెల 7న తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు తెలిసింది. బాబుతో రేవంత్ భేటీ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మంగళవారం ఉదయం ఏపీ సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని సీఎం విశ్రాంతి గృహంలో చంద్రబాబును కలిసిన ఆయన 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ నాయకుల మధ్య గొడవ నేపథ్యంలో రేవంత్ పార్టీ అధినేతతో ఒంటరిగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా, సోమవారమే విజయవాడ వెళ్లిన ఆయన చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే నిరాకరించినట్టు సమాచారం. -
'బాబు వేసే హెరిటేజ్ బిస్కట్లను రేవంత్ తింటూ..'
కరీంనగర్ సిటీ: 'ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విసిరే హెరిటేజ్ బిస్కట్లను తింటూ తెలంగాణ ఉద్యమకారులపై నోరు పారేసుకుంటున్నాడని, అర్థంలేని వ్యాఖ్యలు చేస్తే నాలుక కోసే రోజొస్తది' అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ టీడీపీ నేత రేవంత్రెడ్డిపై విరుచుకుపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్హ్యాండెడ్గా దొరికిన దొంగల ముఠా సభ్యుడు రేవంత్ అని ధ్వజమెత్తారు. బెయిల్తో ఏదో సాధించినట్లు నిస్సిగ్గుగా ఊరేగింపు చేశాడన్నారు. తెలంగాణ సాధించాడా, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడా... ఎందుకు ఈ అట్టహాసమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను రేవంత్ చదివారని, ప్రతి మాటకు ఏపీ సీఎం చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఒంటికాలుమీద లేచే మేధావులు, మీడియా ఎందుకు రేవంత్ బాషపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ టీడీపీ భూస్థాపితం కాక తప్పదన్నారు. -
'ఏసీబీ నుంచి నాకు నోటీసులు రాలేదు'
-
'ఏసీబీ నుంచి నాకు నోటీసులు రాలేదు'
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీ అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు రాలేదని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సాక్షి మీడియాతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారంలో ఒకవేళ ఏసీబీ నుంచి నోటీసులు అందితే, వారిచ్చిన గడువులోపు సమాధానాలు చెప్పెందుకు తాను సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. రేపు హైదరాబాద్ కు వచ్చి అసలు నోటీసులు ఏం ఇచ్చారో, వాటిలో ఏం ఉందో చూడాలన్నారు. ఆ తర్వాత నోటీసుల విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. -
‘కమలం’.. నోరు పదిలం
బీజేపీ నాయకులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. మిత్రపక్షం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేకు ముడుపుల వ్యవహారంలో అడ్డంగా బుక్కవడం వారికి కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. వారి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ఇచ్చి లోబరుచుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ప్రయత్నించి ఏసీబీకీ రెడ్హ్యాండెడ్గా దొరికిన తీరుపై ఏమని స్పందించాలో తెలియక వారు తమ నోళ్లకు తాళాలు వేసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో టేపులు, ఇతర ఆధారాలతో పాటు రేవంత్రెడ్డి అరెస్ట్ కావడం వారిని కిమ్మనకుండా చేసింది. అంతటితో ఆగకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడిన టేపులు కూడా బయటపడడం వారిని ఎటూ పాలుపోకుండా చేసింది. జాతీయస్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు మొదలుకుని ఈ వ్యవహారంపై మీడియా ఎదుట స్పందించేందుకు జంకుతున్నారు. ఒక కేంద్ర మంత్రి అయితే అసలు రేవంత్రెడ్డి వ్యవహారమే తనకు తెలియదంటూ తప్పించుకున్నారు. చంద్రబాబు టేపులపై మీడియా ఎదుట స్పందిస్తే దానిని ఒప్పుకోవడమో లేదా చట్టం తన పని చేసుకుపోతుందనో తాము చెప్పాల్సి ఉంటుందని బీజేపీ నేత ఒకరు వాపోయారు. అందువల్ల అసలు దేనిపైనా స్పందించకుండా మౌనం పాటించడం, మీడియా వారి కెమెరాలు ఎదురైనపుడు తప్పించుకు తిరగడమే మంచిదని వారు భావిస్తున్నారు. మిత్రపక్షం టీడీపీ తీరుపై స్పందించలేక, అట్లాగని అసలు ఏమీ మాట్లాడకుండా పరోక్షంగా మద్దతునిచ్చినట్లుగా తమ పరిస్థితి తయారైందని అంతర్గత సమావేశాల్లో మొత్తుకుంటున్నారట...! -
మౌనమే నీ భాష ఓ....
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రచ్ఛన్న మాటల యుద్ధానికి దారితీసిన 'ఓటుకు నోటు' కుంభకోణంపై కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తోంది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులతో సమావేశమైన తర్వాత కూడా ఎందుకు మౌనం వీడడం లేదు? నకిలీ డిగ్రీ పట్టాల కేసులో ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ను అరెస్టు చేయడంలో వేగంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అయినా ఎందుకు స్పందించడం లేదు? కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పక్షంగా కొనసాగుతుండడం వల్ల ఆ మకిలి జోలికి వెళ్లిక పోవడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తోందా? మౌనమే మన భాష అనుకుంటుందా, వేచి చూస్తే బెటర్ అనుకుంటోందా? అవినీతి స్టింగ్ ఆపరేషన్లో ఉత్త పుణ్యానికి దొరికిపోయిన అలనాటి పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్కే ఉద్వాసన పలికిన చరిత్ర కలిగిన బీజేపీ.. ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదన్నది ప్రస్తుతం సామాన్యులను, అవినీతి మయమైన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోరుకుంటున్న తెలుగు ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు. తెలుగు ముఖ్యమంత్రుల పరస్పరారోపణలు, దూషణలతో తమకు సంబంధం లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణల మీద అసలు విచారణ జరుగుతుందా, జరిగితే అది అర్ధవంతంగా ముగుస్తుందా? అన్న ప్రశ్నలకు కేంద్రం వైఖరి కారణం అవుతోంది. రాజకీయాల్లో 'అంటు' ఉండదని, కేంద్రం పెద్దన్న పాత్ర నిర్వహించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చి 'ఓటుకు నోటు' కుంభకోణాన్ని ఓ రాజకీయ నాటకంగా చూసి దానికి తెరదించుతారా? అన్న అనుమానాలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అంతో ఇంతో విశ్వాసం కలిగిన మధ్యతరగతి మనుషుల మెదడులను తొలుస్తున్నాయి. 'ఏ కేసులోనైనా న్యాయం చేకూర్చడమే కాదు. న్యాయం జరిగినట్టు ప్రజలకు కనిపించాలి' అనే సుప్రీంకోర్టు సహజ న్యాయ సూత్రం ఈ కేసులో నిజమవుతుందా? -
రేవంత్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం
-
రేవంత్ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుల ఇళ్లల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సుమారు ఐదు గంటల నుంచి తనీఖీలు కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్లల్లో, వారికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఏసీబీ డీఎస్పీ సునితారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెండు ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ కేసులో మరో నిందితుడైన సెబాస్టియన్ ఇంట్లో పాస్ పోర్టు, బ్యాంకు పాస్ బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉదయసింహ ఇంట్లో విదేశీ మద్యం భారీగా లభ్యమైందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
వారి ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు: ఏసీబీ డీఎస్పీ
-
వారి ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు: ఏసీబీ డీఎస్పీ
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నిందితుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు ఏసీబీ డీఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. సాధారణ విచారణలో భాగంగానే సోదాలు చేశామని ఆమె వివరించారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో, వారికి సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలలో ఎటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని ఆమె తెలిపారు. -
''ఓటుకు నోటు'లో ఏసీబీ పాత్రధారి..కేసీఆర్ సూత్రధారి'
హైదరాబాద్: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కావాలనే 'ఓటుకు నోటు' కుట్రలో ఇరికించారని టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. అయితే ఈ కుట్రలో ఏసీబీ పాత్రధారి.. సీఎం కేసీఆర్ సూత్రధారి అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఏడాది పాలన వైఫల్యాలపై నిమోజవర్గాల వారీగా పోరాటాలు చేస్తామని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. 63 ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ తరఫున ఐదుగురు ఎమ్మెల్సీలు ఎలా గెలిచారన్న దానిపై గవర్నర్ నరసింహన్ విచారణ జరిపించాలన్నారు. అధికారం శాశ్వతం కాదని తెలిసి టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతుందని రమణ ఆరోపించారు. -
'ఫోన్లను ట్యాపింగ్ చేయించడం కేసీఆర్ కు భావ్యం కాదు'
అమలాపురం టౌన్: చీటికీ మాటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అమలాపురంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో నుంచి పాలన సాగిస్తుంటే కేసీఆర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేయించడం భావ్యం కాదన్నారు. రేవంత్రెడ్డి కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందని రుజువు చేసే టేపులున్నాయంటున్న తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్ను ఎరగా వాడుకుని, రేవంత్రెడ్డి వలలో పడేలా చేసింది ఆ ప్రభుత్వమేనని ఆరోపించారు. కేసీఆరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20 మంది వేరే పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకున్నారని, సీబీఐ విచారణ జరిపిస్తే ఆ బండారం బయట పడుతుందన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. రేవంత్రెడ్డిపై ఏసీబీ చేసిన స్టింగ్ ఆపరేషన్ కోర్టులో నిలబడదని అభిప్రాయపడ్డారు. మంత్రి పీతల సుజాత ఇంటి వద్ద రూ.10 లక్షల నగదు పట్టుబడిన సంఘటనపై విచారణ జరుగుతోందని, ఎవరు దోషులని తేలినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
'రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలి'
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో తన ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు. ఏడాదికాలంగా ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునుందుకే నవనిర్మాణ దీక్ష చేపట్టారని బాబూరావు మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షపై టీడీపీ ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. -
'వైఎస్ఆర్ సీపీ సభ్యులు టీడీపీలో చేరలేదు'
హైదరాబాద్ : ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో చేరలేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం టీడీపీలో చేరినట్లు స్పీకర్ వద్ద కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కాగా పార్టీ మారిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం స్పీకర్ మధుసూదనాచారిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్య తీసుకోవాలన్నారు. కడియం శ్రీహరి ఓ వైపు ఎంపీగా, మరోవైపు మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. తక్షణమే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థ చట్టవిరుద్ధమని, దీనిపై హైకోర్టులో కేసు వేసినట్లు చెప్పారు. దొంగసాకులు చెప్పి రాజీనామాల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. -
స్పీకర్పై టీడీపీ అవిశ్వాసం?
జానాతో ఎర్రబెల్లి, రేవంత్ చర్చ నేడు నోటీసు ఇవ్వాలని నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీటీడీపీ యోచిస్తోంది. అందుకుగల అవకాశాలు, అవిశ్వాసం పెట్టిన తర్వాత ఉత్పన్నం కాబోయే అంశాలపై చర్చించడానికి టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్రెడ్డి గురువారం సీఎల్పీ నాయకుడు జానారెడ్డిని కలిశారు. నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కీలక సమయం లో ఒకసెషన్ మొత్తం, ఒక పార్టీని ఏకపక్షం గా సస్పెండ్ చేయడం చరిత్రలో ఎక్కడా లేదని వివరించినట్టుగా సమాచారం. పార్టీ ఫిరాయింపులు, మంత్రిగా తలసాని కొన సాగింపుపై తాము ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం నోటీసివ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతోనూ చర్చించారు. టీడీపీపై సస్పెన్షన్ ఎత్తివేయాలి తెలుగుదేశం పార్టీ సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయగీతాన్ని అవమానించారని, వారంతా బేషరతుగా సభకు క్షమాపణ చెప్పాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆ మరుసటి రోజు సభలో స్పీకర్ను, పోడియంను చుట్టుముట్టడంతో టీడీపీ సభ్యులు 11మందిని ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సబబు కాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు స్పీకర్ను కలిశారు. కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఎల్పీనేత డాక్టర్ లక్ష్మణ్, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీంద్రకుమార్లు స్పీకర్ను కలసి చర్చించారు. ఇదే సమయంలో పద్దులపై చర్చకు తాము సమయం అడిగామని, కనీసం అధ్యయనం చేయకుండా చర్చలో ఎలా పాల్గొంటామని స్పీకర్కు వివరించినట్లు బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏ రోజు డిమాండ్లు ఆ రోజు పూర్తి చేయాలనుకోవడం వరకూ ఓకే కానీ అప్పటికప్పుడే తాము ఎలా తయారై చర్చిస్తామని ఆయన ప్రశ్నించారు. -
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఇసుక దందాలో కూరుకు పోయిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మండలంలోని నర్సుల్లాబాద్ చౌరస్తా వద్ద టీఆర్ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోసారి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్థానిక టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. (బీర్కూర్)