ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఈశ్వరి బుధవారం చిత్తూరులో మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు రెచ్చిపోతున్నారని వారు ఆరోపించారు. నగరి పట్టణంలో వారు రెండు రోజులుగా భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు.