ఈ రోజు నుచ్చుపొద జాలర్ల సహకార సంఘం సభ్యులు కలిశారు. తమ జీవనోపాధికొచ్చిన కష్టాల గురించి చెప్పుకున్నారు. ‘సార్.. మేము ఎస్టీ తెగకు చెందిన యానాదోళ్లం. మా సహకార సంఘం తరఫున మోపాడు రిజర్వాయర్, చుట్టుపక్కల చెరువుల్లో చేపలు పట్టుకుని జీవించేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నేతల ఆగడాలు ఎక్కువైపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా మా సంఘం అధ్యక్షుడిని, సభ్యులను తొలగించారు. స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా అర్హతలు లేనివారిని సభ్యులుగా చేర్చుకుని, కోట్లాది రూపాయల మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు.