padayatra dairy
-
252వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
249వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
247వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
246వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
241వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
240వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
239వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
237వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
235వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
234వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
232వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
231వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
230వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
215వ రోజు పాదయాత్ర డైరీ
-
213వ రోజు పాదయాత్ర డైరీ
-
210వ రోజు పాదయాత్ర డైరీ
-
209వ రోజు పాదయాత్ర డైరీ
-
205వ రోజు పాదయాత్ర డైరీ
-
198వ రోజు పాదయాత్ర డైరీ
-
197వ రోజు పాదయాత్ర డైరీ
-
196వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర డైరీ
-
193వ రోజు పాదయాత్ర డైరీ
-
192వ రోజు పాదయాత్ర డైరీ
-
191వ రోజు పాదయాత్ర డైరీ
-
190వ రోజు పాదయాత్ర డైరీ
-
186వ రోజు పాదయాత్ర డైరీ
-
185వ రోజు పాదయాత్ర డైరీ
-
182వ రోజు పాదయాత్ర డైరీ
-
176వ రోజు పాదయాత్ర డైరీ
-
175వ రోజు పాదయాత్ర డైరీ
-
173వ రోజు పాదయాత్ర డైరీ
-
172వ రోజు పాదయాత్ర డైరీ
-
169వ రోజు పాదయాత్ర డైరీ
-
168వ రోజు పాదయాత్ర డైరీ
-
163వ రోజు పాదయాత్ర డైరీ
-
160వ రోజు పాదయాత్ర డైరీ
-
159వ రోజు పాదయాత్ర డైరీ
-
155వ రోజు పాదయాత్ర డైరీ
-
154వ రోజు పాదయాత్ర డైరీ
-
150వ రోజు పాదయాత్ర డైరీ
-
148వ రోజు పాదయాత్ర డైరీ
-
147వ రోజు పాదయాత్ర డైరీ
-
145వ రోజు పాదయాత్ర డైరీ
-
143వ రోజు పాదయాత్ర డైరీ
-
142వ రోజు పాదయాత్ర డైరీ
-
139వ రోజు పాదయాత్ర డైరీ
-
136వ రోజు పాదయాత్ర డైరీ
-
131వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
126వ రోజు పాదయాత్ర డైరీ
-
125వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
124వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
123వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
122వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
118వ రోజు పాదయాత్ర డైరీ
-
117వ రోజు పాదయాత్ర డైరీ
-
113వ రోజు పాదయాత్ర డైరీ
-
112వ రోజు పాదయాత్ర డైరీ
-
111వ రోజు పాదయాత్ర డైరీ
-
110వ రోజు పాదయాత్ర డైరీ
-
108వ రోజు పాదయాత్ర డైరీ
-
106వ రోజు పాదయాత్ర డైరీ
-
105వ రోజు పాదయాత్ర డైరీ
-
103వ రోజు పాదయాత్ర డైరీ
-
102వ రోజు పాదయాత్ర డైరీ
-
101వ రోజు పాదయాత్ర డైరీ
-
100వ రోజు పాదయాత్ర డైరీ
-
99వ రోజు పాదయాత్ర డైరీ
-
97వ రోజు పాదయాత్ర డైరీ
-
96వ రోజు పాదయాత్ర డైరీ
24–02–2018, శనివారం టకారిపాలెం, ప్రకాశం జిల్లా స్థిరంగా నిలబడి.. తలెత్తి చూడలేని దైన్యం వారిది ఈ రోజు పాదయాత్ర అంతా సాగు నీరందని రైతన్నల వ్యథలు, ఫ్లోరైడ్ పీడిత ప్రజల కన్నీటి కథల ప్రతిధ్వనుల మధ్యనే సాగింది. సరిగ్గా చెప్పాలంటే.. కనిగిరి నియోజకవర్గమంతా సాగునీటికి, తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రాంతం. సాగునీటి సమస్యతో చేలన్నీ బీళ్లవుతున్న దృశ్యాలొక వైపు, తాగునీరే విషమవుతున్న విషాదఛాయలు మరోవైపు.. మనసును తీవ్రంగా కలచివేశాయి. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లా ప్రకాశం. ఈ జిల్లాలోనే అతి ఎక్కువ పీడిత ప్రాంతం కనిగిరి. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఫ్లోరైడ్ సమస్యతో కిడ్నీ పేషెంట్లయిన వాస్తవాలు కనిపిస్తాయి. వంకరపోయిన కాళ్లూచేతులు, దంతాలపై గార, వెన్ను, మెడ నొప్పులు, కిడ్నీ సమస్య, పెళుసుబారిన ఎముకలు.. ఫ్లోరైడ్ సమస్యతో ప్రజల్లో ఈ కష్టాలన్నీ తలెత్తుతున్నాయి. ఈ రోగగ్రస్తులు ఆకాశం కేసి చూడాలన్నా, ఎగిరెళ్లే విమానాన్ని చూడాలన్నా పడుకుని చూడాల్సిన పరిస్థితిని అక్కడ ఒకాయన చెబితే.. దేవుడా! అనిపించింది. అవును మరి.. స్థిరంగా నిలబడి తలెత్తి చూడలేని దైన్యం వారిది. చిన్న వయసులోనే వృద్ధాప్యఛాయలు కమ్ముకుంటుంటే.. పాలకుల నిర్లక్ష్యం వారికెంత శాపమైందనిపించింది. ఇక్కడ వీరి కష్టాలు చూసి చలించిపోయిన నాన్నగారు.. ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీరు, తాగునీరు అందించాలని తపించారు. రామతీర్థ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను ప్రారంభించి, ఆయన హయాంలోనే పూర్తిచేశారు. కనిగిరి సమగ్ర రక్షిత మంచి నీటి పథకం ఆయన చలవతో రెండు దశలు పూర్తిచేసుకుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, ఈ నాలుగేళ్లలో ఒక్కపనీ మొదలుపెట్టలేదు. ఒక్క రూపాయీ శాంక్షన్ చేయలేదు.. ఎంత బాధాకరమో! కిడ్నీ బాధితుల సమస్యలకు చలించి నేను కూడా ఈ ప్రాంతానికొచ్చి ధర్నా చేశాను. అప్పుడు కదలిక వచ్చిన ప్రభుత్వం.. ఐదుచోట్ల మొక్కుబడిగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంది. వాటి నిర్వహణను గాలికొదిలేసింది. ఈ ప్రభుత్వానికి పేదలన్నా, వారి ప్రాణాలన్నా లెక్కలేనితనం. అధికారంలోకొచ్చిన ఏడాదిలోనే ఇక్కడి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బాబుగారు.. ఇప్పుడు ఆ మాటే మరిచారని ఇక్కడి ప్రజలు బాధపడ్డారు. ‘నాన్నగారు ఉంటే వెలుగొండతో సహా మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.. మా బాధలు తీరేవి’అని చెప్పారు. ‘మీ వల్ల కనీసం డయాలసిస్ కేంద్రాలొచ్చాయి.. అందుకు కృతజ్ఞతలు సార్’అని నాతో అక్కడివారంటుంటే.. వీళ్లకు ఫ్లోరైడ్ నుంచి శాశ్వతంగా విముక్తి కల్గించాలి.. ఫ్లోరైడ్ రహిత ప్రకాశం జిల్లానే నా ధ్యేయం.. అని మనసులో గట్టిగా తీర్మానించుకున్నాను. ఈ రోజు ఉదయం బత్తాయి, నిమ్మ పండ్ల రైతులు కలిశారు. ‘ఇంతకు ముందు పండ్ల తోటలు లాభదాయకంగా ఉండేవి. కానీ, గత నాలుగేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా తోడైంది. జీవితకాలం ఆధారంగా ఉంటాయన్న నమ్మకంతో పండ్ల తోటలు వేసుకున్నాం. వర్షాల్లేక, బోర్లలో నీళ్లు సరిపోక చెట్లు చచ్చిపోతున్నాయి. తోటలకు తోటలే నాశనమైపోతున్నాయి’అని ఆ రైతన్నలు బాధపడిపోతుంటే.. అసలు రైతులకే ఇన్ని కష్టనష్టాలెందుకు? అనిపించింది. ‘ఇంత ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నా.. ప్రభుత్వం మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు’అని వారు చెబుతుంటే.. ప్రజా సమస్యలకన్నా ముఖ్యమైన విషయాలు ఈ పాలకులకేం ఉంటాయో.. అని ఆశ్చర్యం అనిపించింది. ఇలా సాగు, తాగు నీరు లేక, బతుకో జీవన్మరణ సమస్యగా తయారవుతుంటే, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తిచేయాల్సింది పోయి.. వాటిని గాలికొదిలేసిందీ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి గ్రామానికి, పట్టణానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ప్రత్యేక తాగునీటి సౌకర్యం, సముద్ర జలాలను శుభ్రపరిచి మంచి నీటిగా మార్చగల డిశాలినేషన్ ప్లాంట్లను మంజూరు చేస్తామంటూ మీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారు కదా.. అవేమైనా గుర్తున్నాయా? వాటిలో ఏ ఒక్కటన్నా నెరవేర్చి ఉంటే.. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇంత దీనావస్థలో ఉండేదా? - వైఎస్ జగన్ -
95వ రోజు పాదయాత్ర డైరీ
-
94వ రోజు పాదయాత్ర డైరీ
-
93వ రోజు పాదయాత్ర డైరీ
-
92వ రోజు పాదయాత్ర డైరీ
-
92వ రోజు పాదయాత్ర డైరీ
19–02–2018, సోమవారం విప్పగుంట, ప్రకాశం జిల్లా హెరిటేజ్ కోసం పలు సహకారరంగ డెయిరీలను బలిపెట్టారు ఈరోజు ఉదయం ఇద్దరు అక్కాచెల్లెళ్లు నాతో చెప్పిన మాటలు నా మనసును కలచివేశాయి. వెంకటాద్రిపాలేనికి చెందిన గురజాల రాణి, రిబ్కా అక్కాచెల్లెళ్లు. వాళ్ల నాన్న జబ్బుచేసి చనిపోయాడట. అండగా ఉంటాడనుకున్న అన్న యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడట. ఆ చావుల బాధను, పిల్లల కష్టాలను భరించలేక అమ్మ మనోవేదనతో కుంగి కృశించిపోయి గుండెపోటుతో మరణించిందట. ఇద్దరు ఆడబిడ్డలూ అనాథలయ్యారు. ఇన్ని కష్టాలలోనూ అక్క 85శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసిందట. పైచదువులు చదవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక రాజీపడిపోయిందట. టీటీసీ చదువుకుంటున్న చెల్లెలి చదువు కొనసాగాలంటే తను కూలో, నాలో చేయాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఇస్తానన్న ఉద్యోగం గానీ, నిరుద్యోగ భృతిగానీ రాలేదేంటన్నా..? అంటూ అమాయకంగా అడిగింది. ఆ బిడ్డలిద్దరు తమ బాధలు చెబుతున్నప్పుడు గుండె బరువెక్కింది. ఆ ఇద్దరు అక్కాచెల్లెమ్మల్లానే రాష్ట్రంలోని కోట్లాది మంది యువత బాబుగారిచే వంచించబడ్డారు. కొద్దిదూరం ముందుకెళ్లగానే.. ఉపాధి హామీ పథకంలో పనుల కోసం వెళ్లి, పని ప్రదేశంలోనే గాయపడి, ఒక కాలును పోగొట్టుకున్న ఎడ్లూరుపాడుకు చెందిన యలమందయ్య కలిశాడు. ఏడాది కిందట ఆయన ఉపాధి పనులకెళ్లినప్పుడు గాయపడ్డాడట. పని ప్రదేశంలో అనారోగ్యానికి లోనైనా, ప్రమాదానికి గురైనా.. వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని పార్లమెంటు ఆమోదించిన చట్టమే చెబుతోంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అతడి వైద్యం గురించి పట్టించుకోలేదట. ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో పాపం ఆ పెద్దాయన చేసేదిలేక లక్షా ఇరవై వేల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకున్నాడట. సమయానికి డబ్బు సమకూరక, వైద్యం ఆలస్యం కావడం వల్ల గాయం సెప్టిక్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చిందట. ఇది చాలదన్నట్లు 80శాతం అంగవైకల్యం ఏర్పడిన ఆ వ్యక్తికి కనీసం పింఛన్ ఇచ్చిన పాపానపోలేదట. యలమందయ్య విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పేదలంటే లెక్కలేని తనం.. ఆ కుటుంబాన్ని అప్పులపాల్జేసి వీధిన పడేసింది. విప్పగుంట వద్ద పాడి రైతులు కలిశారు. నిత్యం కరువుకాటకాలతో సతమతమవుతూ వర్షాల్లేక పాడిపైనే ఆధారపడి బతుకుతున్నామన్నారు. ప్రభుత్వ సహకారంతో, రైతుల శ్రమతో ఏర్పడ్డ ఒంగోలు డెయిరీపై ఆధారపడి సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామన్నారు. 2014 వరకు ఆ డెయిరీ లాభాలబాటలో పయనించేదని, సకాలంలో చెల్లింపులుండేవని, బోనస్లు కూడా ఇచ్చేవారని అన్నారు. ఆ డెయిరీ సహకారంతో గేదెల కొనుగోలుకు బ్యాంకు రుణాలు కూడా పొందామని చెప్పారు. కానీ, 2014లో బాబుగారి పాలన వచ్చాక ఒక్కసారిగా డెయిరీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, నెలల తరబడి చెల్లింపులే లేవని అన్నారు. జిల్లాలో పాడిరైతులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు రూ.11 కోట్లు ఉన్నాయట. ఇదే అదునుగా ప్రయివేటు డెయిరీలు కుమ్మక్కై రైతులకిచ్చే ధరను తగ్గించేసి దారుణంగా దెబ్బతీశాయన్నారు. అటు వ్యవసాయం చేసుకోలేక, ఇటు పాడిపై ఆధారపడి బతకలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నామని, వలసలే శరణ్యమని వాపోయారు. బాబుగారు ఇప్పటికే చిత్తూరు సహా పలు సహకార రంగ డెయిరీలను తన సొంత డెయిరీ హెరిటేజ్ కోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఒంగోలు డెయిరీ వంతు రావడం నిజంగా బాధేస్తోంది. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. లాభాల బాటలో సాగుతున్న ఒంగోలు డెయిరీ.. మీరు అధికారం చేపట్టగానే ఒక్కసారిగా నష్టాల ఊబిలోకి ఎలా వెళ్లింది? మీ అనుకూల పాలకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఒంగోలు డెయిరీని నష్టాల ఊబిలోకి నెట్టి పాడి రైతుల పొట్టగొట్టడం న్యాయమేనా? మీరు పాలన చేపట్టగానే ఒంగోలు డెయిరీతో సహా రాష్ట్రంలోని అన్ని సహకార డెయిరీలు అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లడం, హెరిటేజ్ డెయిరీ మాత్రం అంతకంతకూ లాభాల బాట పట్టడం వాస్తవం కాదా? -వైఎస్ జగన్ -
91వ రోజు పాదయాత్ర డైరీ
-
91వ రోజు పాదయాత్ర డైరీ
18–02–2018, ఆదివారం కందుకూరు, ప్రకాశం జిల్లా భావితరాల బంగారు భవితవ్యం కోసం.. ఎన్ని త్యాగాలకైనా సిద్ధం బడేవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన బొమ్మల చిన్నయ్య రావడం రావడమే బాబుగారిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ‘సార్.. ఈ గవర్నమెంటును నమ్మేదానికే లేకుండా పోతోంది. నాకున్న కొద్దిపాటి పొలాన్ని నమ్ముకుని కుటుంబాన్ని సాక్కుంటున్నాను. వర్షాల్లేక పంటలు ఎండి పోతుంటే బోరు వేసుకుందామనుకున్నాను. ఎస్సీ కార్పొరేషన్కు పోతే బోరు మంజూరు చేశారు. ఇది జరిగి రెండేళ్ల పొద్దయింది. ఇప్పటికీ నా పొలంలో బోరుపడ్డ పాపానపోలేదు. ఇదేమి సామీ అనుకుంటూ అధికారులకు, ఆఖరుకు కలెక్టర్కు కూడా పలుమార్లు విన్నవించుకున్నాను. పట్టించుకున్న నాథుడే లేడు. రెండేళ్లుగా తిరుగుతూ ఉంటే విసుగొస్తోంది.. కోపమొస్తోంది. ఆ కోపం ఎవరిమీద చూపించాలో తెలియడం లేదు.’ అంటూ 65 ఏళ్ల వృద్ధుడు ఆవేశపడిపోతుంటే ధర్మాగ్రహమే కదా.. అనిపించింది. పాపం ఇప్పుడు కూడా మిర్చి పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చిందట. పంట ఎండిపోతే రైతు బతుకులో జీవకళ పోయినట్టే కదా. అందుకే రైతులందరికీ ఉచిత బోరు పథకమనేది వర్తించేలా చేయాలన్న నా సంకల్పం దృఢపడింది. జలదంకి మండలానికి చెందిన దర్గాబాబుకూ ఇదేరకం చేదు అనుభవం ఎదురైంది. మినీ డెయిరీ పెట్టుకోవడం కోసం ఎస్సీ కార్పొరేషన్ను ఆశ్రయించాడట. గతేడాది ఇంటర్వ్యూ చేసి సెలక్ట్ అయ్యావన్నారట. మొదట రూ.6 లక్షలు మంజూరు చేస్తామన్నారట. సెలక్షన్లు అయిపోయాక లోన్ను రూ.3 లక్షలకే కుదించారట. కలెక్టర్ శాంక్షన్ లెటర్ అయితే ఇచ్చారు గానీ, ఆయనకు మాత్రం ఏడాది గడిచిపోతున్నా నిరీక్షణ తప్పలేదట. ఆయనతో పాటు ఆ లోన్లకు ఎంపికయిన మరో 32 మంది ఎస్సీ సోదరులదీ అదే పరిస్థితి. ఇంతవరకూ ఏ ఒక్కరికి కూడా లోన్ ఇవ్వకపోగా.. ఈ సంవత్సరా నికి సంబంధించి మళ్లీ ఇంటర్వ్యూలు జరుపుతున్నారట. ఇది ఎవర్ని మోసం చేయడానికి? కులానికో కార్పొరేషన్ పెట్టి.. వాటిని పట్టించుకోకుండా నిర్వీర్యం చేసి.. ఇలా ఎంతకాలం మోసం చేస్తూ పోతారు? ఇలా చేయడం ధర్మమేనా.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన మనసున్న నేత అధికారంలో ఉంటే.. ఏం జరుగుతుందనే దానికి నిదర్శనం కందుకూరు తాగునీటి సమస్య పరిష్కా రం. మెట్ట ప్రాంతం, ఆపై ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన కందుకూరు ఒకప్పుడు తాగునీటికి కటకటలాడిన పట్టణం. ఇక్కడ అక్కచెల్లెమ్మలు మైళ్ల దూరం వెళితేగానీ.. బిందెడు మంచినీరు దొరకని పరిస్థితి. ఆ ఇక్కట్లను గుర్తెరిగిన నాన్నగారు అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.110 కోట్లు ఖర్చు చేసి నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాలను కందుకూరుకు రప్పించి ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చారు. ఆ మేలును ఎన్నటికీ మరువలేమంటూ ఈ ప్రజలు పదే పదే గుర్తుచేస్తుంటే.. మనసంతా సంతోషంతో నిండిపోయింది. జనంతో పోటెత్తిన కందుకూరు సభలో హోదా కోసం ఎందాకైనా పోరాడాల న్న నా సంకల్పాన్ని, దృఢచిత్తాన్ని మరోసారి ప్రజల ముందుంచి.. హోదా సాధన కోసం రాష్ట్రమంతా ఏకమై చిత్తశుద్ధితో పోరాడదామని పిలుపుని చ్చాను. రాష్ట్రానికి పరిశ్రమల కోసం.. పిల్లల ఉద్యోగాల కోసం.. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం.. భావి తరాల బంగారు భవితవ్యం కోసం.. ఎవరితో నైనా కలుస్తాం. ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. ఎన్ని పోరాటాలకైనా సన్నద్ధం. అవిశ్వాసానికైనా.. రాజీనామాలకైనా. మన ఆశ, మన శ్వాస హోదాయే. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. హోదాను తాకట్టుపెట్టారు.. ప్రత్యేక ప్యాకే జీ అన్నారు.. హోదాలో ఉన్నవన్నీ ప్యాకేజీలో ఉన్నాయన్నారు.. అందుకే అంగీకరించామన్నారు. మీరు, బీజేపీ వారు ఇవే మాటలు మాట్లాడారు. రాజ్యసభలో వెంకయ్యగారు మాట్లాడిన మాటలు, తిరుపతిలో ప్రధాని సమక్షంలో మీరు పలికిన పలుకులు ఒక్కసారి గుర్తుచేసుకోండి.. అబద్ధాలు చెబుతూ మీ మనస్సాక్షిని ఎలా అమ్ముకోగలుగుతున్నారు? ఇది అధర్మం కాదా? అన్యాయం అనిపించలేదా? -వైఎస్ జగన్ -
90వ రోజు పాదయాత్ర డైరీ
-
90వ రోజు పాదయాత్ర డైరీ
17–02–2018, శనివారం పోకూరు, ప్రకాశం జిల్లా నాన్నగారి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని దేదీప్యమానంగా వెలిగించి తీరాలి ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే కోటేశ్వరమ్మ అనే అక్క ‘అన్నా.. మేము పాస్ పుస్తకాలు పెట్టి బంగారం లోను కింద రూ.87,000 తీసుకున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తానంటే ఆశపడ్డాం. ఇప్పటిదాకా ఒక్క పైసా మాఫీ కాలేదు. అధికారుల చుట్టూ తిరిగాం, కలెక్టర్ను కలిశాం. అమరావతి దాకా వెళ్లి అక్కడా పెద్దోళ్లకు విన్నవించాం. అటూ ఇటూ తిరగడానికే ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఆఖరుకు బంగారం వేలం వేస్తారని తెలిసి, బయట అప్పు తీసుకుని వడ్డీతో సహా బ్యాంకులో కట్టాం. మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్లయింది మా పరిస్థితి.. అంటూ ఆ అక్క చెబుతుంటే.. అయ్యో పాపం అనిపించింది. సంపత్ అనే సోదరుడిదీ కోటేశ్వరమ్మ కథే. బ్యాంకులో బంగారం పెట్టి రూ.లక్షన్నర లోను తీసుకున్నాడట. రుణమాఫీ కింద మొదటి విడత రూ.25 వేలు ఇచ్చినట్లు రుణ ఉపశమన పత్రం కూడా అందుకున్నాడు. అది పట్టుకుని బ్యాంకుకు పోతే.. ఇంకా రాలేదంటారట. అధికారుల దగ్గరకు పోతే మేం డబ్బులు వేశాం.. బ్యాంకులకు వెళ్లమంటారట. తిరిగీ తిరిగీ విసిగిపోయాడట. ఈ రుణమాఫీ అంతా మోసం సార్.. ఆయనగారి హామీ నమ్మిన పాపానికి నా లక్షన్నర లోను కాస్తా.. వడ్డీలతో కలిపి రూ.మూడు లక్షలు దాటిందంటూ ఆ సోదరుడు చెబుతుంటే.. ఎన్ని బతుకుల్లో బండలు పడ్డాయిరా దేవుడా అనిపించింది. వీవీపాలెం దగ్గర పొగాకు రైతులు కలిశారు. పొగాకు సేద్యం చేసినందుకు ఏటా నష్టాలేనట. మా లైసెన్స్లు తిరిగిచ్చేస్తాం పరిహారమివ్వండి.. పొగాకు సేద్యం ఎత్తేస్తాం.. అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నాన్నగారి హయాంలో పొగాకు సరాసరి ధర రూ.127 ఉంటే.. దాదాపు పదేళ్ల తర్వాత, సాగు ఖర్చులన్నీ రెట్టింపయ్యాక కూడా ఇప్పుడు సరాసరి ధర రూ.116 అంటే.. రైతుకెంత నష్టమో ఆలోచించండి సార్.. అంటూ వారు లెక్కలేసి మరీ చెప్పారు. ‘బతకలేక, వలసలు పోలేక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం చెప్పిందని గతేడాది శనగ పంట వేస్తే.. తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వం, వ్యాపారులు కుమ్మక్కై మమ్మల్ని నిలువునా ముంచేశారు. గతేడాది రూ.10,000 దాకా పలికిన శనగల బస్తా, ఇప్పుడు రూ.4,000 లోపే పలుకుతోంది. మా దగ్గరేమో రూ.3,800కు కొంటున్నారు. దళారుల చేతుల్లో పడ్డాక ధర రూ.10,000 దాటుతోంది. ఇదెక్కడి న్యాయం?’ అంటూ ఆ రైతన్నలు బాధపడ్డారు. వ్యవసాయాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తుంటే.. రాష్ట్రానికి ఎంత అరిష్టమో ఈ పాలకులు ఏమైనా ఆలోచిస్తున్నారా.. అనిపించింది. కందుకూరువాసి 21 ఏళ్ల ప్రవీణ్కుమార్ కథ కలచివేసింది. నడుం వంగిపోయి, కళ్లు ఉబ్బిపోయిన ప్రవీణ్ నన్ను చూడగానే కంటతడి పెట్టుకున్నాడు. ‘అన్నా.. మా కష్టాలు పగవాడికీ రాకూడదు. నాకు తలసీమియా. మా అక్కా ఈ జబ్బుతోనే చనిపోయింది. బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్న నాన్నకు నా వైద్యం ఖర్చులు తలకు మించిన భారమయ్యాయి. వారానికోసారి రక్తం ఎక్కించుకోవాలి. రోజూ మందులు వాడాలి. మందుల ఖర్చే ఏడాదికి రూ.లక్షవుతోంది. నా కోసం మా నాన్న పడుతున్న యాతన చూసి.. ఎందుకు పుట్టించావురా దేవుడా.. అనిపిస్తోంది. గతంలో నాకు అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు లక్షలాది రూపాయల ఆపరేషన్ను ఉచితంగా చేయించిన మీ నాన్నగారు మా పాలిట దేవుడు. మాలాంటోళ్లకు ఎంతో మేలు చేసేలా నెలకు రూ.10,000 పింఛన్ ఇస్తామని చెప్పారు మీరు. చాలా సంతోషం అనిపిస్తోంది’ అంటూ చేయి పట్టుకున్నాడు. నాన్నగారి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిని దేదీప్యమానంగా వెలిగించి తీరాలి. ఇలాంటి వారి కన్నీళ్లు తుడిచి తీరాలనుకుంటూ ముందుకు అడుగులేశాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ వేయండి.. అంటూ రైతులకు భరోసాగా చెప్పారు. తీరా పంటచేతికొచ్చాక ధరలు పతనమైపోతే.. ఆ రైతులు ఇప్పుడు ఎవరిని నిలదీయాలి? ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే వ్యాపారులతో కుమ్మక్కై ధరల పతనానికి కారణమైతే.. ఆ రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను మేస్తుంటే కాపాడేదెవరు? -వైఎస్ జగన్ -
89వ రోజు పాదయాత్ర డైరీ
-
89వ రోజు పాదయాత్ర డైరీ
16–02–2018, శుక్రవారం బంగారక్కపాళెం క్రాస్ రోడ్డు, ప్రకాశం జిల్లా యువతను మరోసారి వంచించే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజు నెల్లూరు దాటి ప్రకాశం జిల్లాలోకి అడుగు పెట్టాను. ఏచోటికెళ్లినా ఎండమావులే. ఏ ఎదను కదిపినా వేడి నిట్టూర్పులే. ఏ ప్రాంతం అయితే ఏంటి.. పేదోడి ఇంట కష్టాలూ, కన్నీళ్లే. పెదపవని గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆవేదన చూశాక గుండె బరువెక్కింది. కూలి చేసే ఆమె భర్త మంచానపడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లయిన ఏడాదికే కిడ్నీలు చెడిపోయి చావుతో పోరాడుతున్నాడు. కడుపుతీపి చంపుకోలేక తన కిడ్నీ ఇవ్వాలనుకుందా తల్లి. కానీ ఆమెకూ గర్భసంచి క్యాన్సరట. పోనీ, అవయవదానం ద్వారా కిడ్నీ మార్పిద్దామనుకుంటే.. ఆరోగ్యశ్రీ వర్తించదట. రూ.6 లక్షలు ఖర్చవుతుందట. ఏం చేయాలా తల్లి? ఎవరికి చెప్పుకోవాలి ఆమె ఘోష? సింగరపాలేనికి చెందిన 83 ఏళ్ల అవ్వ లచ్చమ్మ తన కష్టాలు చెప్పింది. పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదట. రేషన్ కూడా ఇవ్వడం లేదట. ఎందుకని అడిగితే.. ఫ్యాను గుర్తుకు ఓటేశావుగా.. అంటున్నారట. మానసిక వికలాంగుడైన మనవడితో బతుకు పోరు చేస్తున్న ఆ అవ్వను ఇలా మాటలతో చంపడం న్యాయమేనా? కొడుకు చనిపోయినా చంద్రన్న బీమా ఒక్క పైసా రాలేదయ్యా.. అంటూ ఆదిలక్ష్మి అనే అమ్మ ఆక్రోశించింది. చేపలు పట్టుకుని జీవించే చేటూరి భవానీది మరో కన్నీటి గాథ. నాన్నగారి హయాంలో పైసా ఖర్చులేకుండా గుండె ఆపరేషన్ చేయించుకుందట. ఇప్పుడు మళ్లీ జబ్బుచేసిందామెకు. ఇప్పుడేమో ఆరోగ్యశ్రీ చెల్లదన్నారట. భర్తలేని ఆ తల్లి.. ఇద్దరు కూతుళ్లను సాకుతోంది. దారి చూపాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వీళ్లను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా? వీరి పట్ల కూడా పార్టీల వివక్ష చూపుతున్న ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? కొత్తపేట నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు మీదుగా వెళుతుంటే.. ఆ ప్రాజెక్టు కమిటీ మాజీ ప్రెసిడెంటు నరసింహరావన్న ‘సార్.. నాలుగేళ్లుగా ఇక్కడ వ్యవసాయం తెల్లారిపోతోంది. వర్షాల్లేవు, ప్రాజెక్టుల్లోకి నీళ్లూ రావు. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పనుల్లేక, బతుకుదెరువు కనిపించక వలసలు పోతున్నారు. ఇలాంటి పరిస్థితులొస్తాయని మీ నాన్నగారు సోమశిల నుంచి ఉత్తర కాలువ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీటిని తరలించాలన్న బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. మా దురదృష్టం.. ఆయన తదనంతరం మా కష్టాలు తీర్చాలన్న తపన ఉన్న నాయకుడే రాలేదు. అందుకే ఈ పథకం అసంపూర్తిగానే ఉండిపోయింది’అని చెబుతుంటే.. ఆ ప్రాజెక్టును అలా చూస్తుండిపోయాను. ఈ పథకం పూర్తయితే వలసలు ఆగడంతో పాటు తాగునీరు అంది.. ఫ్లోరైడ్ బాధ తప్పేది కదా. ఈ రోజు పత్రికల్లో ముఖ్యమంత్రిగారి ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాడట. నాలుగేళ్లుగా మన పిల్లలు ఉద్యోగాల్లేక అవస్థలు పడుతుంటే.. నిద్రపోతున్నారా? మన రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉద్యోగాలను ఇతర రాష్ట్రాల వారు ఎగరేసుకుపోయిన విషయం కనిపించలేదా? వాచ్మేన్లు, స్వీపర్లు వంటి చిన్న చిన్న ఉద్యోగాలను మాత్రం మనవారికి ఇస్తూ ఉంటే.. ఇంతకాలం మీరేం చేస్తున్నారు? ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్న తరుణంలో ప్రజలను మళ్లీ మభ్యపెట్టాలని చూస్తున్నారా? మీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్న యువతను మరోసారి వంచించే ప్రయత్నం చేస్తున్నారా? ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని, పరిశ్రమలు కట్టడానికే మూడు నాలుగేళ్లు పడుతుంది కాబట్టి.. ప్రత్యేక హోదా పదేళ్లని.. పదిహేనేళ్లని వెంకయ్యనాయుడుగారు రాజ్యసభలోనూ, మీరు మోదీగారి సమక్షంలోనూ అనలేదా? ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే వచ్చే పారిశ్రామిక రాయితీలు మన రాష్ట్రానికి ఒక్కటైనా వచ్చిందా? అవి రానప్పుడు హోదాను పక్కన పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఎందుకు రాజీపడ్డారు? ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? పరిశ్రమల్లో ఉద్యోగాల విషయంలో స్థానిక యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నేను పదే పదే ప్రస్తావించిన తర్వాత.. నాలుగేళ్లపాటు పట్టించుకోని మీరు ఈ రోజు ఎన్నికలు దగ్గరపడుతున్న తరు ణంలో స్థానికులకు అత్యధిక శాతం ఉద్యోగాలను ప్రకటించడం మరోసారి వంచించడం కాదా? -వైఎస్ జగన్ -
88వ రోజు పాదయాత్ర డైరీ
-
88వ రోజు పాదయాత్ర డైరీ
15–02–2018, గురువారం తూర్పుపాలెం క్రాస్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ‘టెట్’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు ఉదయం ఆదిమూర్తిపురం దాటాక మహిళా కూలీలు కలిశారు. వాళ్లల్లో మస్తాన్బీ అనే కూలీ.. గుండె గొంతుకలోంచి తన్నుకొస్తున్న బాధను నా ముందుంచింది. భర్త చనిపోయి మూడేళ్లయిందట. ముగ్గురు పిల్లలను తన రెక్కల కష్టంతో పోషిస్తోందట. పొద్దంతా కష్టపడితే వచ్చే కూలి రూ.150 యేనట. ఎలా బతకాలయ్యా.. అంటూ బావురుమంది. పింఛన్ అయినా ఇస్తారేమోనని అధికారులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయానని చెప్పింది. ఇలాంటి కన్నీటి గాథనే బీబీజాన్ అనే మరో అక్కా చెప్పింది. ఆమె భర్త కూడా చనిపోయాడట. తాగుడుకు బానిసైన ఆమె ఇద్దరు కొడుకులూ భార్యలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరట. ‘ఏంటీ పాపం’ అని అడిగితే.. ఎముకలిరిగే వరకూ కొడుతున్నారని నిస్సహాయంగా చెప్పుకొంది. మా జీవితాల్లో ఈ మద్యం చిచ్చు రేపుతోందని పుట్టెడు దుఃఖంతో చెప్పింది. ఊరూరా అక్కచెల్లెమ్మల కన్నీరు ఏరులై పారుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం నిజంగా విచారకరం. తమ ఈతిబాధలకు మనందరి ప్రభుత్వంలో తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం అక్కచెల్లెమ్మల్లో కనిపిస్తోంది. కొండాపురం గ్రామంలో పద్మజ అనే చెల్లెమ్మ కలిసింది. ఆమె టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతోందట. ‘సార్.. ఈ పరీక్ష విధానమే బాగాలేదు. ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామ్ అన్నారు. పల్లెటూరి వాళ్లం.. దానికెలా ప్రిపేర్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. పరీక్ష నిర్వహణ ఓ ప్రయివేటు సంస్థకి ఇచ్చారట. నాకిప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఈ జిల్లాలో కాకుండా ఎక్కడో తిరువూరులో వేశారు. అదెక్కడుందో కూడా నాకు తెలీదు. ఈ పరీక్ష ప్రకటన వచ్చినప్పటి నుంచి అంతా గందరగోళమే. మాలో చాలామందికి ఆన్లైన్ విధానం అలవాటు లేదు. అందరికీ ఒకే ప్రశ్నాపత్రం కాదట.. కొందరికి సులభమైన, మరికొందరికి కష్టతరమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్కుల్ని డీఎస్సీలో 20 శాతం కలుపుతారట. భయంగా ఉంది.. అంటూ టెట్ కష్టాల్ని ఏకరవుపెట్టింది. ప్రతి జిల్లా నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాల తరబడి టెట్ ఎగ్జామ్ పెట్టింది లేదు. తీరా ఇప్పుడు పెడుతున్నారనుకుంటే.. అది పూర్తి గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. అడ్డగోలు నిర్ణయాల వల్ల అభాసుపాలవుతోంది. పరీక్ష నిర్వహణ కాంట్రాక్టు ఇచ్చిన ప్రయివేటు సంస్థకు ఆ సామర్థ్యం, అనుభవం ఉన్నాయా.. లేదా.. అని ఆలోచించాల్సిన అవసరం లేదా? కావాల్సినవాళ్లకో, కాసులకు కక్కుర్తిపడో ఎవరికి పడితే వారికి కాంట్రాక్టు ఇచ్చేస్తే.. ఇన్ని లక్షల మంది పడే ఇబ్బందికి ఏమని సమాధానం చెబుతారు? అసలు ప్రయివేటు వాళ్లకు కాంట్రాక్టు ఇవ్వడం సమంజసమేనా? లక్షల మంది రాసే పరీక్షలో ఆన్లైన్ వంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి కావాల్సిన ముందస్తు కసరత్తు చేయాలి కదా? అభ్యర్థులకు విస్తృతమైన అవగాహన కల్పించి వారిలోని అపోహలను, భయాందోళనలను తొలగించాల్సిన అవసరం లేదా? అందరికీ ఒకే ప్రశ్నాపత్రం ఇవ్వకపోతే.. సమన్యాయం జరుగుతుందని ఆశించగలమా? నాలుగున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్న పరీక్ష నిర్వహణలో పకడ్బందీ ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? ఏ జిల్లా వారికి ఆ జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించకుండా, ఆ మూల నుంచి ఈ మూలకు విసిరేసినట్లుగా వందల మైళ్ల దూరంలో సెంటర్లు కేటాయించారట. పొరుగు రాష్ట్రాల్లో సైతం సెంటర్లు వేశారట. పరీక్ష రాసేవారికి.. ముఖ్యంగా మహిళలకు, దివ్యాంగులకు ఎంత ఇబ్బందో కనీస ఆలోచనన్నా చేయరా? ఈ పరీక్ష కోసం కోట్లాది రూపాయలు ఫీజులుగా వసూలు చేసి, పరీక్ష నిర్వహణలో సరైన ఏర్పాట్లు చేయకుండా గందరగోళం సృష్టించడం సిగ్గుచేటైన విషయం కాదా? కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించిన పరీక్ష ఇంత లోపభూయిష్టంగా జరపబూనుకోవడం రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కాదా? -
86వ రోజు పాదయాత్ర డైరీ
13–02–2018, మంగళవారం కలిగిరి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రత్యేక హోదా మా ఊపిరి..దానికోసం ఊపిరి ఉన్నంత వరకూ పోరాడతాం.. తెలుగు నేల.. తెలుగు జాతి.. తెలుగు సంస్కృతి.. తెలుగువాడి ఆత్మాభిమానం..ఈ మాటలు వింటేనే మన మనసులు ఉప్పొంగుతాయి. ఒక అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు.. ఇలాంటి వారి పేర్లు వినగానే తెలుగు జాతి స్వాతంత్య్రం కోసం చేసిన మహోన్నత పోరాట చరిత్ర, ఆత్మాభిమానం గుర్తుకొస్తాయి. అటువంటి ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ రోజు మనకున్న ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర విభజన పరిణామాల్లో భాగంగా.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. విభజన వల్ల బాగా దెబ్బతిన్న ఈ రాష్ట్రం కోలుకోవాలంటే, హైదరాబాద్ లేని ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే.. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే.. ప్రత్యేక హోదా తప్ప మరో మార్గం లేదు. విభజన హామీల అమలు విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం నా మనసును తీవ్రంగా కలచివేసింది. కానీ, ఇవాళ చంద్రబాబు ప్రత్యేక హోదాను పూర్తిగా తాకట్టుపెట్టారు. ఎన్నికలకు ముందు.. ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావాలంటే తనను గెలిపించాలంటూ ప్రజల నుంచి అధికారాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ నాయకుడూ మార్చలేనన్ని మాటలు మార్చుకుంటూ వచ్చారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండం అన్నారు. ఈ రాష్ట్ర ప్రజల ఆమోదం లేకుండానే దానికి తలూపారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గుర్తించి ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాక.. ఇప్పుడు సరికొత్త డ్రామాలకు తెరతీశారు. ఈ సందర్భంగా చంద్రబాబుగారికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా.. - పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అవసరం లేదనే అధికారాన్ని మీకు ఎవరిచ్చారు? - ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని మీరు ఎందుకు అడిగారు? - మీ పార్టీ భాగస్వామిగా.. కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బడ్జెట్లను కేంద్ర మంత్రులుగా ఉన్న మీ ఇద్దరు ఎంపీలు ఆమోదించలేదా? అలాంటిది, ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ చేస్తున్న నానాయాగీ.. ఒక నాటకం కాదా? - గతేడాది.. అంటే 2017–2018 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జనవరి 26న.. దేశంలో ఏ రాష్ట్రానికీ రానన్ని నిధులు మన రాష్ట్రానికే వచ్చాయని మీడియా ముందు, ప్రజల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది వాస్తవమైనప్పుడు.. వాళ్లు తక్కువ ఇచ్చారని మీరు ప్రజలను ఏవిధంగా మభ్యపెడతారు? - మొన్నటికి మొన్న రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికిన తర్వాత కూడా ఆర్థిక మంత్రి జైట్లీగారు ఇచ్చిన ప్రకటనలో ఏమీ లేకున్నా సరే.. ఆ ప్రకటనకు మద్దతుగా కేంద్రంలోని మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు బల్లలు చరిచి మరీ హర్షాన్ని వ్యక్తంచేసింది నిజం కాదా? - ఇంత నాటకం నడిపి ఇప్పుడు మీరు చేస్తున్నదేంటంటే.. మీరుగానీ, మీ ఎంపీలుగానీ.. ప్రత్యేక హోదాను కోరడం లేదు. సరికదా.. మనకు వచ్చిన దాంటోŠల్ పావలానో, ముప్పావలానో తగ్గిందన్న రీతిలో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం లేదా? - ఇవాళ్టికి దాదాపుగా 13 రోజులుగా మీరు లీకులు మాత్రమే ఇస్తున్నారు తప్ప, ప్రజల ముందుకొచ్చి.. ఎందుకిలా చేశారని కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు? హా ఎందుకు ప్రత్యేక హోదాని తాకట్టుపెట్టి, లేని ప్యాకేజీని ఉన్నట్టుగా డ్రామాలాడారు? ఇక మీ డ్రామాలు, కపట నాటకాలు ముగించండి. మీలో నిజాయితీ లేదు. ప్రజలకు మేలు చేయాలన్న కోరికా లేదు. ఉన్నదల్లా సొంత ప్రయోజనాలే. 2014 ఎన్నికల తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా.. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం వెంటనే పోరాట పంథాలోకి దిగాం. ఏడాదైనా ప్రత్యేక హోదా రాకపోవడంతో ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేశాం. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నో ధర్నాలు, బంద్లు నిర్వహించాం. గుంటూరులో ఏకంగా 8 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశాను. ఇన్ని చేసినా.. రాష్ట్రానికి జరిగిన మోసం, అన్యాయం పరాకాష్టకు చేరాయి. అందుకే ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, బాధ్యతగల పార్టీగా.. ‘హోదా మా హక్కు – ప్యాకేజీతో మోసం చేయొద్దుŠ’ అనే నినాదంతో పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తున్నాం. బడ్జెట్ సమావేశాల చివరి రోజున.. అంటే ఏప్రిల్ 6న.. ప్రభుత్వం దిగిరాకపోతే హోదా సాధించేందుకు చివరి అస్త్రంగా.. మాతో ఉన్న ఎంపీలందరూ లోక్సభ సభ్యత్వానికి రాజీనామాలు చేస్తారు. ప్రత్యేక హోదా మా ఊపిరి! ఊపిరి ఉన్నంత వరకూ దీనికోసం పోరాడతాం. -వైఎస్ జగన్ -
85వ రోజు పాదయాత్ర డైరీ
-
84వ రోజు పాదయాత్ర డైరీ
-
84వ రోజు పాదయాత్ర డైరీ
11–02–2018, ఆదివారం అనంతాపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మహిళల కన్నీటికి కారణమైన మద్యం వ్యాపారం అవసరమా? ఈరోజు కొత్తపాళెం గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు కలిశారు. ఆ అమ్మలను ఆప్యాయంగా పలకరించాను. ‘మద్యం రక్కసి మా ఊరిని పీడిస్తోందయ్యా..’ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంపై కాళికలై కన్నెర్రజేశారు. మద్యం రాయుళ్ల ఆగడాలకు హద్దే ఉండటం లేదన్నారు. అర్ధరాత్రి.. అపరాత్రి.. వీధి వాడ.. ఊరంతా తాగుబోతులేనట. చీకటి పడితేచాలు.. బయటికెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారట. రోడ్డున వెళుతుంటే.. తాగుబోతుల అసభ్య ప్రవర్తనతో చచ్చిపోతున్నామని చెప్పారు. చదువుకునే అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. టెన్త్ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధమవుతున్న అమ్మాయిలు రాత్రి వేళ ఇళ్లకు చేరే వరకూ టెన్షన్గానే ఉంటోంది.. బడికెళ్లే దారిలోనే బ్రాందీ షాపు ఉందయ్యా.. అన్నారు. దొంగతనాలు జరుగుతున్నాయి.. మెడలో గొలుసులు తెంచుకుపోతున్నా రంటూ ఎంతో బాధగా చెప్పుకొన్నారు. విసిగిపోయాం.. భరించలేకపోతున్నాం.. ఈ ఊళ్లో మాత్రమే మూసేస్తే ప్రయోజనం లేదు.. చుట్టుపక్కల ఊళ్లలోనూ ఆ మద్యం షాపులు తీసేయించి పుణ్యం కట్టుకోండి.. అంటూ వేడుకున్నారు. ఆ అమ్మల ఆవేదన, ఆవేశమూ చూస్తే ఆశ్చర్యమేసింది. మద్యం మహమ్మారిపై సమరభేరీ మోగించిన చరిత్ర నెల్లూరు జిల్లాదే. కొంగు నడుముకు చుట్టి యావత్ రాష్ట్రాన్నీ కదిలించిన వీర వనితలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఇలాంటి జిల్లాలో మహిళలు కన్నీళ్లు పెడుతుంటే.. ఈ పాలకులకు చీమకుట్టినట్లయినా అనిపించదా? ఆ కన్నీటికి కారణమైన మద్యం వ్యాపారం అవసరమా? దారిలో గొట్టిగుండాల గ్రామస్తులు కలిశారు. ఆ ఊరి పేదలకు గతంలో భూపంపిణీ కింద దాదాపు 2,000 ఎకరాల భూములు పంచారట. 1995లో వేరే జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సహకారంతో, ఆ పార్టీ నాయకుల అండదండలతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఆ భూములను లాగేసుకున్నారట. ఆ తర్వాత ఎవరైనా నోరు విప్పితే బెదిరించడం మొదలెట్టారట. ‘మీ నాన్నగారి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరిగే దిశగా ప్రయత్నాలు జరిగాయి సార్.. దాదాపు 700 ఎకరాల అసైన్డ్ భూములు తిరిగి అసలైన లబ్ధిదారులకు అందించారు. ఇంకా దాదాపు 1,200 ఎకరాలకు పైగా ఆక్రమణదారుల అధీనంలోనే ఉన్నాయి.. కోర్టులో కేసులూ నడుస్తున్నాయి.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆక్రమణ దారుల నుంచి గ్రామస్తులకు బెదిరింపులు మొదలయ్యాయి. వేధింపులు ఎక్కువయ్యాయి’ అంటూ ఆ గ్రామస్తులు బాధగా చెబుతుంటే, అసైన్డ్ భూముల ఆక్రమణల కోసమే ఈ ప్రభుత్వం నడుస్తోందా.. అనిపించింది. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ అసైన్డ్ భూములు ఎలా అందాయన్నదానిపై విచారణ నిర్వహిస్తే నిజాలు బయటకురావా? చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా అసైన్డ్ భూముల నుంచి గుడి మాన్యాల వరకు వేటికీ భద్రత ఉండదు. గుడినే కాదు.. గుడిలో లింగాన్నీ మింగేసే అరాచకీయాలే నడుస్తుంటాయ్. చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత ఎన్నికల సమయంలో ‘మహిళలకు భద్రత కావాలంటే బాబు రావాలి’ అంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. మరి నేడు మీరు పెంచి పోషిస్తున్న మద్యం మహమ్మారితో తమపై అరాచకాలు పెరిగిపోతున్నాయని కన్నీరు పెడుతూ మహిళలు రోడ్డెక్కుతున్నారు. వీరికేం సమాధానం చెబుతారు? -వైఎస్ జగన్ -
83వ రోజు పాదయాత్ర డైరీ
అదే స్ఫూర్తి నాలోనూ ఉంది 10–02–2018, శనివారం బోడగుడిపాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఈ రోజు ఉదయం దుండిగం గ్రామంలో పాడి రైతులు కలిశారు. నన్ను కలిశామన్న ఆనందం వాళ్ల కళ్లలో కనిపించినా.. గుండెల్లోంచి బాధ ఎగదన్నుకొచ్చింది. పైసా పైసా అప్పుచేసి పాడి గేదెలను సాకుతున్నారా రైతన్నలు. కరువు కాలంలోనైనా వేడినీళ్లకు చన్నీళ్లలా పాడి తోడుంటుం దని భావించారు. కానీ, నీళ్లకున్న రేటు కూడా పాలకు ఇవ్వడం లేదయ్యా.. అంటూ బాధపడ్డారు. మూగ జీవాలకు మేతే కష్టమవుతోం దట. గడ్డి రేట్లు మిద్దెక్కాయన్నారు. గొడ్డు చాకిరీ తప్పడం లేదన్నారు. ఇంత చేసినా ఆ పాలమ్మితే కన్నీళ్లే మిగులుతున్నాయని బావురుమన్నారు. వారి ఆవేదన నా గుండెను పిండేసింది. ఆరుగాలం కష్టపడే రైతన్న ఎందుకు నష్టపోతున్నాడు? అదే రైతన్న దగ్గర పాలు తీసుకుని ప్రైవేటు వ్యక్తులు కోట్లాది రూపాయలెలా కూడబెడుతున్నారు? సహకార పాల సంఘాలను బలోపేతం చేస్తే.. పాడి రైతు ఇంత దారుణంగా మోసపోడు కదా. మన ప్రభుత్వం వచ్చాక పాడి రైతులకు లీటర్కు 4 రూపాయల ప్రోత్సాహకం ఇస్తామని చెప్పగానే.. సంబరపడ్డారు. ఆ మంచి రోజులు త్వరగా రావాలని ఆకాంక్షించారు. నాన్నగారి హయాంలో రైతన్నల ఇంట ఎంత ఆనందం ఉండేదో ఏ ఒక్కరూ ఇంకా మర్చిపోలేదు. పాదయాత్ర దుండిగం దాటాక.. పద్మజ అనే ఓ అమ్మ ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. నాన్నగారి పాలన రైతన్నలకు ఓ స్వర్ణయుగం అని చెప్పింది. వరుణుడు కరుణించడమే కాదు.. పంటకు గిట్టుబాటు ధర ఉండేదని తెలిపింది. బోనస్ ఇవ్వడం ఆయనకే చెల్లిందని చెప్పింది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వరికి మద్దతు ధర 13 శాతమే పెరిగితే.. నాన్నగారి కాలంలో 82 శాతం పెరగ డం చరిత్రలోనే గొప్ప విషయమంది. ఈ నాలుగేళ్లలో మద్దతు ధర 17శా తం మించలేదని అంకెలతో సహా వివరించింది. నాన్నగారిది రైతు రాజ్య మైతే.. చంద్రబాబుది రైతు వ్యతిరేక రాజ్యమంది. అందుకే నాన్నగారు అంతగా రైతన్నకు దగ్గరయ్యారేమో. అదే స్ఫూర్తి నాలోనూ ఉంది. ఐతంపాడు వద్ద రేషన్ డీలర్లు కలిశారు. నాలుగేళ్లుగా కష్టాల్లోనే కాలం గడుపుతున్నామన్నారు. ప్రతి కేజీకీ ప్రభుత్వం 70 పైసలు కమీషన్ ఇస్తోందట. షాపు నిర్వహణకు కూడా అది చాలడం లేదట. వారికొస్తున్న సరుకును కాటా వేస్తే తేడా ఉంటోందట. పైవాళ్లకు చెప్పినా పట్టించుకునే నాథుడే లేడట. అధికార పార్టీ వాళ్లదే రాజ్యమట. ఏం పాపం చేశామని ఇలా వేధిస్తున్నారంటూ వాపోయారు. వ్యూహాత్మకంగా వెంటాడుతున్నార నేది వారి అనుమానం. నిజమే కావొచ్చు. తాజా పరిణామాలు చూస్తుం టే.. వాళ్ల ఆందోళనకు అర్థముంది. ఈ మధ్య చంద్రన్న మాల్స్ వెలుస్తు న్నాయి. పేదల పొట్టగొట్టి, బడాబాబుల జేబులు నింపే కార్యక్రమానికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. రిలయన్స్, హెరిటేజ్లకు వాటా ఉన్న ఫ్యూచర్ గ్రూపునకు నామినేషన్ పద్ధతిలో వాటిని కట్టబెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఈ రోజు యాత్ర మొత్తం తాగునీటికి కటకటలాడుతున్న గ్రామాల నుంచి సాగింది. జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిచేసి, శాశ్వత కరువు నివారణకు చర్యలు తీసుకోకుండా.. కేవలం ప్రజలను మభ్యపెట్టి, మోసపుచ్చి ఓట్లు దండుకోవాలనుకునే నీతి లేని నేతలు పదవుల్లో ఉన్నంతకాలం ప్రజలకు ఈ ఇక్కట్లు తప్పవేమో! ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ గత తొమ్మిదేళ్ల హయాంలోగానీ, నేటి పాలనలో గానీ.. గిట్టుబాటు ధర గురించి ఏనాడైనా ఆలోచించా రా? కేంద్రాన్ని ఒక్కసారైనా అభ్యర్థించారా? ఈ నాలుగేళ్లలో మద్దతు ధర పెంచాలని కనీసం ఒక్క లేఖ కూడా రాయకపోవడం సిగ్గుగా అనిపించలేదా? -
82వ రోజు పాదయాత్ర డైరీ
-
82వ రోజు పాదయాత్ర డైరీ
07–02–2018, బుధవారం దుండిగం క్రాస్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆ తల్లులకు న్యాయం చేయాలన్నదే నా ఆశయం సేద్యం చేసే రైతే కాదు.. స్వేదం చిందించే కూలీ ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. ఎక్కడికెళ్లినా కష్టాలు, కడగండ్లే. ఇలాంటి రైతులు, కూలీలే.. ఈ రోజు కొరిమెర్లలో నన్ను కలిశారు. ఉన్న ఊళ్లో బతకలేని కొంతమంది రైతులు కొరిమెర్లలో భూమిని కౌలుకు తీసుకుని శనగ పంట వేశారట. మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక.. అప్పులే వెంటాడుతున్నాయన్నారు. తిన్నా, తినకున్నా కౌలు కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు కట్టాల్సిందేనట. పెట్టుబడితో కలుపుకొంటే ఎకరాకు రూ.22 వేలు ఖర్చవుతోందట. ఆ ఖర్చుకు, మార్కెట్ ధరకూ ఏమాత్రం పోలికే ఉండటం లేదన్నారు. క్వింటా రూ.9,500 పలికిన శనగ.. ఇప్పుడు రూ.3,500 కూడా పలకడం లేదని చెప్పారు. ధర వచ్చేదాకా దాచుకునే గిడ్డంగులూ లేవన్నారు. నిజమే! వాళ్ల బాధకూ అర్థం ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతన్న కంట నీరే. అన్నదాతకు ఇలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న నా తపన మరింత బలపడింది. అందుకే నవరత్నాల్లో రైతన్నకు పెద్దపీట వేశాను. కొరిమెర్ల వద్ద పాదయాత్ర చేస్తున్నప్పుడు.. పొలాల్లోంచి కొంతమంది మహిళలు పరిగెత్తుకుంటూ నా వైపు రావడం కనిపించింది. వారొచ్చే వరకూ ఆగాను. రొప్పుతూ.. చెమటతో పూర్తిగా తడిచిపోయి ఉన్నారు. ఆనందం పట్టలేక నాతో కరచాలనం చేశారు. ఆ చేతులు బొబ్బలెక్కి ఉన్నాయి. కాయకష్టంతో మృదుత్వాన్ని కోల్పోయాయి. ‘ఏంటమ్మా..’ అని ప్రశ్నించాను. కష్టాలన్నీ ఒక్కసారిగా చెప్పుకోవడం మొదలెట్టారు. రోజంతా కష్టపడ్డా రూ.150 రావడం లేదన్నా.. అంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. కరువు పనులూ లేవని, చేసినా డబ్బులే ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వాళ్ల ఊళ్లో ఏడెనిమిది నెలలుగా ఉపాధి బకాయి డబ్బులే రావడం లేదట. ఇలాంటి అమ్మలు, అక్కలను కూడా పట్టించుకోకపోతే.. రాష్ట్రంలో పాలన ఉన్నట్లేనా? నిండు మనసుతో, సడలని నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన ఆ తల్లులకు న్యాయం చేయాలన్నదే నా ఆశయం. రెండు రోజులుగా జలుబు వేధిస్తోంది. దుమ్మూధూళి వల్ల దగ్గు బాగా ఎక్కువైంది. గొంతు నొప్పి కూడా మొదలైంది. నిన్నటి నుంచి స్వరంలోనూ కొంత మార్పు కన్పించింది. కాస్త ఇబ్బందిపడుతూనే.. మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడాల్సి వచ్చింది. మధ్యాహ్నం వైద్యులు పరీక్షించి మందులిచ్చారు. జువ్వలకుంటపల్లిలో చేనేత కుటుంబానికి చెందిన ఓ చెల్లెమ్మ కలిసింది. భర్తతో కలిసి రోజంతా కష్టపడితే రూ.300 వస్తున్నాయని, పోనీ.. ముడి సరుకును తామే తెచ్చుకుని చీర నేద్దామంటే.. గిట్టుబాటు ధర లేదని బాధపడింది. చిన్న వయసులోనే నడుం నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చాయని, చూపు సైతం మందగిస్తోందని వాపోయింది. ఇలాంటి చెల్లెమ్మల కష్టాలు చూసే.. 45 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని సంకల్పించాను. మంచిరోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధైర్యం చెబుతూ ముందుకు సాగాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ నాలుగేళ్ల పాలనలో గిట్టుబాటు ధరలేక రైతన్నలు విలవిల్లాడుతున్నారు. ఏమైంది మీ రూ.5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి? - వైఎస్ జగన్ -
81వ రోజు పాదయాత్ర డైరీ
06–02–2018, మంగళవారం సంగం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పేదవాడికి ఈ పరిస్థితి వస్తే.. ప్రాణాలు పోగొట్టుకోవాలా? సిద్ధిపురం దగ్గర ఓ అమ్మ తన దయనీయ పరిస్థితిని నాకు చెప్పింది. రెక్కల కష్టంమీద బతికే ఆ తల్లికి పుట్టెడు కష్టమొచ్చింది. ఏడేళ్ల కూతురికి లివర్ జబ్బు వచ్చిందట. కాలేయ మార్పిడే పరిష్కారమని డాక్టర్లు చెప్పారంది. ఆ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి.. తన శరీరంలో భాగమైన కాలేయాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడింది. అయినా, లక్షలు ఉంటే తప్ప కాలేయ మార్పిడి సాధ్యం కావడంలేదని బావురుమంది. ఆ తల్లి మనోవేదన మనసున్న ఎవరినైనా కదిలిస్తుంది. నిజంగా ఆరోగ్యశ్రీకే ఆంక్షలు లేకపోతే.. ఇలాంటి పేదరాలు ఈ రోజు ఇలా కన్నీళ్లు పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. పేదవాడికి ఈ పరిస్థితే వస్తే ప్రాణాలు పోగొట్టుకోవాలా? పాలకులు ఆలోచించాల్సిన అంశమిది. మన ప్రభుత్వంలో ఇలాంటి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది. పూర్తికాని సంగం బ్యారేజీ పక్క నుంచి ఈ రోజు మ«ధ్యాహ్నం నడుస్తూ ఉంటే.. మనసెంతో బరువెక్కింది. ముందుకు అడుగులు భారంగా పడ్డాయి. నాన్నగారు ఉంటే.. ఎప్పుడో పూర్తయిపోయేది కదా అన్పించింది. అప్పట్లో బ్రిటిష్ పాలకులు ఎంతో దూరదృష్టితో ఈ ప్రాంత వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంత సౌభాగ్యం కోసం, భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం.. దాదాపు ఒకటిన్నర శతాబ్దం కిందట ఈ బ్యారేజీని నిర్మించారు. స్వతంత్ర భారతావనిలో ఎందరో పాలకులు మారినా.. ఈ ఆనకట్ట గురించి ఆలోచించిన దాఖలాల్లేవు. నాన్నగారు దీని విశిష్టతను గుర్తించి ఒకటిన్నర లక్షల ఎకరాలకు నీరిచ్చే మహదాశయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన తదనంతరం నేటి పాలకుల ఉదాశీనతకు, నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఈ ప్రాజెక్టు నిలిచింది. ఈ ఆలోచనల్లో ఉండగనే, బ్యారేజీ వద్ద గిరిజన కాలనీకి చెందిన మహిళలు.. ఏళ్ల నుంచి తమకు మరుగుదొడ్లు లేవని, ఎన్నిసార్లు విన్నవించుకున్నా మంజూరు చేయడం లేదని బాధపడ్డారు. బహిర్భూమికి పెన్నా గట్టుకు వెళ్లాలంటే చాలా సిగ్గుగా ఉందని వాపోయారు. వారి దయనీయ పరిస్థితి చూసి జాలేసింది. సిగ్గుపడాల్సింది వీరు కాదు, ఈ దుస్థితికి కారణమైన పాలకులు. ఏఎస్ పేట దళితవాడకు చెందిన అక్కచెల్లెమ్మలది మరో వ్యథ. మరుగుదొడ్లు కట్టుకుని ఎనిమిది నెలలైనా బిల్లులు రాని దుస్థితి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. ఈ రోజు చంద్రబాబుగారు చేసిన ప్రకటన చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే, ప్రజల మీద, అధికారుల మీద ధర్నా చేస్తాడట. ఇంతకన్నా చోద్యం ఎక్కడైనా ఉంటుందా? ఈయనగారి పాలనలో.. మరుగుదొడ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతి అంతా ఇంతా! పాత వాటికి, అసంపూర్తిగా ఉన్న వాటికి, అసలు కట్టనివాటికి కూడా బిల్లులు చేసుకుంటున్నారు పచ్చ చొక్కాల వారు. అర్హులైన ఎంతోమంది పేదలకు మరుగుదొడ్లు మంజూరు చేయడంలేదు.. మంజూరైన వాటికి బిల్లులు చెల్లించడం లేదు. మరుగుదొడ్ల లబ్ధిదారుల ఎంపికకూ జన్మభూమి కమిటీలే సిఫార్సులు చేయాలట. వాటిలోనూ పార్టీల పట్ల వివక్ష చూపుతున్నారట. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా? ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నచందంగా, పైస్థాయిలో మీరు వేల కోట్ల రూపాయల అవినీతి చేస్తుంటే, కింది స్థాయిలో మీ అనుయాయులు, మీ జన్మభూమి కమిటీలు.. మరుగు దొడ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు.. ఇలా వేటినీ వదలకుండా దోచేయడంలో ఆశ్చర్యమేముంది? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే ప్రజల మీద ధర్నా చేస్తానన్నారు.. మీరు నిజంగా ధర్నా చేయాల్సి వస్తే, ప్రజల మీద కాదు.. మీ మీద, ప్రజలకు ఆ పరిస్థితి కల్పించిన మీ పరిపాలన మీద కాదా? - వైఎస్ జగన్ -
80వ రోజు పాదయాత్ర డైరీ
-
80వ రోజు పాదయాత్ర డైరీ
05–02–2018, సోమవారం అన్నారెడ్డిపాళెం క్రాస్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇలాంటి వాళ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షి ఆలయం వద్ద అర్చకులు, ఆలయ సిబ్బంది నన్ను కలుసుకున్నారు. ‘మీరు అధికారంలోకి రావాలి’అంటూ మనసారా ఆశీర్వదించారు. ఆ క్షణంలోనే వారి కష్టాలు, కన్నీళ్లు నా ముందుంచారు. ‘మీ నాన్నగారి పాలనలో మాకో గౌరవం ఉండేది. ఆనందంగా బతికేవాళ్లం. ఆలయాల్లో వంశపారంపర్య హక్కులు కల్పించి ప్రోత్సహించారు’అని గర్వంగా చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లే పేద బ్రాహ్మణుల పిల్లలకు ఉన్నత విద్య అబ్బిందన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నో అగచాట్లు పడుతున్నట్టు తెలిపారు. ధూప దీప నైవేద్య ఆలయాలను 13 వేల నుంచి 3 వేలకు కుదించారని, బతుకే భారమన్నట్టు బతకులీడుస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని, వంశపారంపర్య హక్కును పునరుద్ధరించాలని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించడం లేదని వాపోయారు. ఆశీర్వదించే ఆ వేద పండితులకే.. చేయి చాచే దయనీయ పరిస్థితి రావడం దారుణం. గుడి భూములే మింగేసే చంద్రబాబు సర్కారులో.. ఇక అర్చకులకు, సిబ్బందికి న్యాయం జరుగుతుందా? పెనుబోలులో 70 ఏళ్ల గీత కార్మికుడు సుబ్బరామయ్యని చూస్తే జాలేసింది. ఈ వయసులో తాడేసుకుని చెట్టెక్కుతాడట. ఇద్దరు ఆడపిల్లలను బతికించుకోడానికి కాయకష్టం తప్పడం లేదన్నాడు. ఇంతా చేస్తే.. రోజుకు గిట్టుబాటయ్యేది రెండొందల రూపాయలేనట. నాన్నగారి హయాంలో గీత కార్మికులను ఆదరించారని, ఇళ్లు ఇచ్చారని, పిల్లల చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేశారని, ఆరోగ్యశ్రీ లబ్ధి కలిగించారని, సైకిళ్లు, పనిముట్లు అందించారని గుర్తుచేశాడు. ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని, గీత సొసైటీకి చెల్లించే పన్ను ఈ ప్రభుత్వ హయాంలో రూ.5 వేల నుంచి 35 వేలకు పెరిగిందని చెమ్మగిల్లిన కళ్లతో ఏకరవుపెట్టాడు. కనీసం పింఛన్ ఇచ్చినా కాస్తో కూస్తో ఊరటగా ఉంటుందని, ఆ పింఛన్ కోసం ప్రయత్నిస్తుంటే జన్మభూమి కమిటీలు మోకాళ్లడ్డుతున్నాయని బాధపడ్డాడు. ఈ వయసులోనూ ఇన్ని బాధలు పడుతున్న ఇలాంటి వాళ్లను పట్టించుకోకపోతే ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? పురిటిబిడ్డను, ప్రాణం పోసిన తల్లిని కాపాడే ఏఎన్ఎంల సేవలు ఏ పల్లే మరిచిపోదు. నవ్వుతూ కన్పించే వాళ్ల గుండెల్లో ఎంత బాధ ఉందో! జొన్నవాడలో నన్ను కలిసిన ఆ ఏఎన్ఎంలు వాళ్ల బతుకు కష్టాలను చెబుతుంటే.. గుండె తరుక్కుపోయింది. రూ.4,000 జీతాన్ని నాన్నగారి హయాంలో రూ.10,000 చేశారట. ఆ తర్వాత వారిని పట్టించుకున్న పాలకుడే లేడట. 24 గంటలూ మాతాశిశు సంరక్షణలోనే ఉన్నా.. వాళ్లకు మాత్రంమాతృత్వపు సెలవులు (మెటర్నిటీ లీవ్స్) ఇవ్వరట. రెగ్యులర్ ఏఎన్ఎంలకు రూ.40,000 జీతాలు ఇస్తున్నారని, తామూ అంతేపని చేస్తున్నా అందులో నాలుగో వంతే ఇస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని బాధపడ్డారు. వారి సేవలను కూడా కార్పొరేట్ సంస్థలకు కాంట్రాక్టుగా ఇచ్చి.. వారి ఉద్యోగాలను ఊడబెరికే ప్రయత్నాలు జరుగుతున్నాయట. వాళ్లందరినీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబే చెప్పారట. ఇంతవరకూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎంత దుర్మార్గం? ఎంత అన్యాయం? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న. మీ పాలనలో గుడి భూములనే గుటకాయ స్వాహా చేస్తుంటే.. ఇక దేవాలయాలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవైపు దేవాలయాలకు ఆదాయమూ రాక.. మరోవైపు ప్రభుత్వమూ పట్టించుకోకపోతే.. అర్చకులు, ఆలయ సిబ్బంది ఎలా బతకాలి? మీ మేనిఫెస్టోలో గీత కార్మికులకు తాటిచెట్ల పెంపకానికి భూములు కేటాయించడం.. రైతులకు చెల్లించాల్సిన చెట్టు పన్నును ప్రభుత్వమే చెల్లించడం.. తదితర ఏడు హామీలిచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా? - వైఎస్ జగన్ -
73వ రోజు పాదయాత్ర డైరీ