ఆర్డర్లోని లేదని లోక్సభను వాయిదా వేయడం అన్యాయమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వెల్లోకి వచ్చి ఎంపీలు ఆందోళన చేస్తున్నారనే సాకుతో సభను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేసినా ఆర్థికబిల్లును ఎలా ఆమోదించారని సూటిగా అడిగారు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతామని, జాతీయపార్టీల మధ్దతు కూడగట్టి అవిశ్వాసతీర్మానాన్ని నెగ్గించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో ఎన్డీఏ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు.