టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా.. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటే భయపడేలా చేస్తున్నారు. పుస్తకాలు సమయానికి సప్లై చేయడం లేదు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు పెండింగ్లో పెడుతున్నారు. ప్రైవేటు స్కూల్స్ నారాయణ, చైతన్య పేర్లు వినబడుతున్నాయి. అధికారంలోకి వచ్చాక ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజులను నియంత్రిస్తాం. ప్రైవేటు ఫీజులు తగ్గించేందుకు రెగ్యూలేటరీ కమిటీ వేస్తాం. అంతేకాకుండా ప్రైవేటు స్కూళ్లలో, కాలేజీల్లో వసతులు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటాం.