ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్కు సంబంధించి రెండో రోజు కొనసాగుతున్న వేలంలో పెను సంచలనం నమోదైంది. సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రూ. 11.50 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించి బౌలింగ్లో సత్తాచాటిన ఉనాద్కత్కు ఈసారి వేలంలో అత్యధిక మొత్తాన్ని చెల్లించి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఉనాద్కత్కు కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని దక్కించుకుంది.