Jaydev Unadkat
-
నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి ఓవర్లో ‘భయపెట్టిన’ ఉనాద్కట్! వీడియో
ఆఖరి ఓవర్.. మ్యాచ్ గెలవాలంటే ఆరు బంతుల్లో 29 పరుగులు కావాలి.. ఇదీ సమీకరణం.. ఇంతలో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు బౌలర్.. విజయావకాశం మీకే అన్నట్లుగా.. మొదటి బంతికే సిక్సర్.. ఆ తర్వాత వైడ్.. మళ్లీ వైడ్.. ఇప్పుడు గెలుపు సమీకరణం ఐదు బంతుల్లో 21 పరుగులు... ఫీల్డర్ తప్పిదం కారణంగా మళ్లీ సిక్సర్.. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు... ఫలితంగా గెలుపు సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులు... ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు.. మిగిలినవి ఆఖరి రెండు బంతులు.. ఇందులో మొదటిది వైడ్... రెండో బంతికి ఒక్క పరుగు.. ఇప్పటిదాకా డ్రామా నడిపించిన బ్యాటర్ కథ అప్పుడే ముగిసిపోవాల్సింది.. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అతడు బతికిపోయాడు. గెలవడానికి ఒక్క బంతికి తొమ్మిది పరుగులు కావాలి.. ఏమో మళ్లీ వైడ్ బాల్స్ పడతాయేమోనన్న ఉత్కంఠ.. కానీ ఈసారి అలా జరుగలేదు.. ఆఖరి బంతికి సిక్స్ బాదడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెండు పరుగుల తేడాతో ప్రత్యర్థి విజయం సాధించింది. A Fantastic Finish 🔥 Plenty happened in this nail-biter of a finish where the two teams battled till the end🤜🤛 Relive 📽️ some of the drama from the final over ft. Jaydev Unadkat, Ashutosh Sharma & Shashank Singh 👌 Watch the match LIVE on @starsportsindia and @JioCinema… pic.twitter.com/NohAD2fdnI — IndianPremierLeague (@IPL) April 9, 2024 ఓడిపోతామేమో.. భయపెట్టిన ఉనాద్కట్.. ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ మధ్య ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఈ హోరాహోరీ పోరులో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. ఆఖరి ఓవర్లో రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. జయదేవ్ ఉనాద్కట్ చేతికి బంతినివ్వగా.. పంజాబ్ బ్యాటర్ అశుతోశ్ శర్మ వరుసగా.. 6, వైడ్, వైడ్, 6, 2, 2, వైడ్, 1.. ఇలా 20 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి శశాంక్ సింగ్ సిక్స్ బాది స్కోరుకు మరో ఆరు పరుగులు జత చేశాడు. మధ్యలో రాహుల్ త్రిపాఠి ఓసారి క్యాచ్ జారవిడిచాడు. ఇలా సన్రైజర్స్ బౌలర్, ఫీల్డర్ తప్పిదాలు చేసినా ఆఖరికి విజయం వారినే వరించింది. ఫలితంగా తాజా ఎడిషన్లో హైదరాబాద్ జట్టు ఖాతాలో మూడో గెలుపు చేరింది. అదరగొట్టిన నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ కాగా ముల్లన్పూర్లో మంగళవారం జరిగిన పంజాబ్- సన్రైజర్స్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (37 బంతుల్లో 64), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 189 రన్స్ స్కోరు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన పంజాబ్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్తో పాటు ఒక వికెట్ తీసిన నితీశ్ రెడ్డిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక అభిమానులకు అసలైన టీ20 మజా అందించిన పంజాబ్- సన్రైజర్స్ ఆఖరి ఓవర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. So close, yet so far for Shashank and #PBKS 💔#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/F51V0OzroY — JioCinema (@JioCinema) April 9, 2024 -
IPL 2024 SRH VS MI: ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు.. కామన్గా ఒకే ఆటగాడు..!
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేసిన సన్రైజర్స్.. లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ను నమోదు చేసిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ ఈ రికార్డును నెలకొల్పే క్రమంలో ఆర్సీబీ పేరిట ఉండిన పాత రికార్డును బద్దలు కొట్టింది. 11 ఏళ్ల కిందట 2013 సీజన్లో ఆర్సీబీ.. పూణే వారియర్స్పై చేసిన 263 పరుగులే నిన్నటి మ్యాచ్కు ముందు వరకు ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్గా ఉండింది. ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు నమోదైన సందర్భాల్లో ఓ ఆటగాడు కామన్గా ఉండటం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సన్రైజర్స్ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ 2013లో ఆర్సీబీతో.. ప్రస్తుతం సన్రైజర్స్లో ఉన్నాడు. ఈ విషయం గురించి తెలిసి నెటిజన్లు ఉనద్కత్ను లక్కీ లెగ్గా పరిగణిస్తున్నారు. భారీ స్కోర్లు నమోదు కావాలంటే ఉనద్కత్ ఉండాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. రెండు మ్యాచ్ల్లో ఉనద్కత్ ప్రత్యర్దులపై రెండేసి వికెట్లు పడగొట్టాడు. Jaydev Unadkat is the only player who has been part of two of the highest totals in IPL history. 📸: IPL/BCCI pic.twitter.com/y0sU753Ovc — CricTracker (@Cricketracker) March 28, 2024 ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో సన్రైజర్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్రైజర్స్కు దడ పుట్టించారు. -
యానిమల్ ఓ బిగ్ డిజాస్టర్.. మండిపడ్డ టీమిండియా ఫాస్ట్ బౌలర్!
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్బస్టర్గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. (ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?) అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు. (ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..) -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214, సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే. -
రాణించిన ఉనాద్కట్, జయంత్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు జైదేవ్ ఉనాద్కట్, జయంత్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. లెస్టర్షైర్ క్లబ్తో జరిగిన డివిజన్–2 మ్యాచ్లో ససెక్స్ జట్టు తరఫున ఆడిన ఉనాద్కట్ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో ఉనాద్కట్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 94 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ససెక్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలిచింది. లాంకషైర్తో జరిగిన డివిజన్–1 మ్యాచ్లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడిన జయంత్ యాదవ్ 131 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలిసారి కౌంటీ క్రికెట్లో ఆడుతున్న భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (3/63, 2/43) కెంట్ తరఫున ఐదు వికెట్లు తీసుకున్నాడు. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్లో ససెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్షైర్ ఇన్నింగ్స్లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్లో. మరోవైపు ఇంగ్లండ్లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
విండీస్తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే!
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. విలాసంతమైన మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఎస్యూవీకి యజమాని అయ్యాడు. కాగా 2010లో ఐపీఎల్లో అడుగుపెట్టిన సౌరాష్ట్ర క్రికెటర్ ఉనాద్కట్.. అదే ఏడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కెరీర్లో టీమిండియా తరఫున 4 టెస్టులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడిన ఉనాద్కట్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3, 9, 14 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ టూర్-2023లో భాగంగా టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఈ రైట్ ఆర్మ్ ఫాప్ట్బౌలర్.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. రూ. కోటి! విండీస్తో ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో కేసీ కార్టీ వికెట్ తీసి రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక కరేబియన్ దీవి పర్యటన తర్వాత జయదేవ్ ఉనాద్కట్ తాజాగా కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. కోటి వరకు Mercedes-Benz GLE SUVని అతడు సొంతం చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ ఫినిషింగ్తో మెరిసిపోతున్న కారును ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఉనాద్కట్ క్రికెట్బాల్పై సంతకం చేసి షో రూం నిర్వాహకులకు ఇవ్వడం విశేషం. ఈ అత్యాధునిక కారులో పనోరమిక్ సన్రూఫ్తో పాటు ఏడు ఎయిర్బ్యాగులు ఉంటాయి. ఇక SUV కొనుగోలు చేసిన సందర్భంగా.. భార్యతో కలిసి కారు వద్ద ఉనాద్కట్ దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో 11.50 కోట్లు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2018 వేలం సందర్భంగా జయదేవ్ ఉనాద్కట్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయిన విషయం తెలిసిందే. ఈ పేసర్ కోసం రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆ సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనాద్కట్ రికార్డు సృష్టించాడు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్కమ్టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
Ind Vs WI Test Series 2023: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ అనంతరం టీమిండియా.. దాదాపు 20 రోజుల విశ్రాంతి తర్వాత కరేబియన్ దీవికి చేరుకుంది. జూలై 12 నుంచి వెస్టిండీస్తో మొదలుకానున్న టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా టెస్టులకు ఎంపికైన జట్టు మొత్తం ఇప్పటికే విండీస్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీసులో తలమునకలయ్యారు. బార్బడోస్ వేదికగా సాగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. విఫలమైన కోహ్లి టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్లో స్లిప్లో ఉన్న ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారగా.. ‘‘కోహ్లి.. మరీ ఇంత ఈజీగా అవుట్ అయ్యాడా?’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా టెస్టుల్లో మంచి రికార్డు కలిగి ఉన్న కోహ్లి.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ముందు వరకు సెంచరీ సాధించలేకపోయాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో మ్యాచ్ సందర్భంగా మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ వెయ్యి రోజుల తర్వాత శతకం బాది తిరిగి ఫామ్లోకి వచ్చాడు. అయితే, ఆ తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. విండీస్ గడ్డపై ఎలా ఆడతాడో? ఇక ఇటీవల ఇంగ్లండ్ వేదికగా ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లి రెండు ఇన్నింగ్స్లో వరుసగా.. 14, 49 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్(విండీస్తో)లో ఎలా ఆడతాడో అన్న ఆసక్తి నెలకొంది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపికైన భారత ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఎలక్ట్రీషియన్ కుటుంబంలో పుట్టి టీమిండియాలోకి.. హ్యాట్సాఫ్ తిలక్ వర్మ! టెస్టుల్లో స్టీవ్ స్మిత్ను మించినోడే లేడు.. బౌలర్గా మొదలుపెట్టి అత్యున్నత శిఖరాలకు! Virat Kohli's dismissal in the practice match in Barbados today. Jaydev Unadkat claimed his wicket. #WIvIND Video courtesy: Vimal Kumar pic.twitter.com/IltleUGgwy — Farid Khan (@_FaridKhan) July 5, 2023 -
లక్నో జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ సూర్యన్ష్?
ఐపీఎల్-2023 సీజన్ మధ్య నుంచి లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ గాయం కారణంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడి స్థానాన్ని ముంబైకు చెందిన యువ క్రికెటర్ సూర్యన్ష్ షెడ్జ్తో లక్నో భర్తీ చేసింది. ఈ ఆల్రౌండర్ను కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా 20 ఏళ్ల సూర్యన్ష్ 2022-23 రంజీ సీజన్కు ఎంపిక చేసిన 16 మంది సభ్యుల ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో అతడు కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకు కూడా ముంబై జట్టులో చోటు దక్కింది. ఇక్కడ కూడా సూర్యన్ష్కి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటి వరకు అతడికి ముంబై సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. కానీ గతేడాది డిసెంబర్లో జరిగిన బీసీసీఐ మెన్స్ అండర్ 25 స్టేట్-ఏ ట్రోఫీలో సూర్యన్ష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన అతడు 184 పరుగులు చేశాడు. ఇక లక్నో విషయానికి వస్తే.. ప్లే ఆఫ్స్కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. మే 20న కేకేఆర్తో జరగనున్న మ్యాచ్లో విజయం సాధిస్తే.. సూపర్ జెయింట్స్ ఫ్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంటుంది. కాగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు. చదవండి: #Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by SURYANSH SHEDGE (@suryanshshedge) -
WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన
#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 గెలిచిన టీమిండియా.. ఆసీస్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఆసీస్తో తలపడే భారత జట్టును ప్రకటించింది. రాహుల్ అవుట్ అయితే, ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. కుడి తొడ పైభాగంలో నొప్పి తీవ్రమైన నేపథ్యంలో సర్జరీ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపింది. వాళ్లిద్దరి సంగతి ఏంటి? ఇక ఎడమ భుజానికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అతడి గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది. ముగ్గురికి ఛాన్స్ అదే విధంగా మరో పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా కేకేఆర్ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడన్న బీసీసీఐ.. తమ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని తెలిపింది. ఇక శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండ్బై ప్లేయర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్లతో పాటు బౌలర్ ముకేశ్ కుమార్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్ ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
-
టీమిండియాకు బిగ్ షాక్
అనుకున్నదే అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు (జూన్ 7 నుంచి) కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. అతి త్వరలో తాను తొడ భాగంలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు రాహుల్ ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నాడు. ఐపీఎల్-2023తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అర్ధంతరంగా వైదొలగాల్సి వస్తున్నందుకు నిరాశ వ్యక్తం చేశాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరేందుకు తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తానని తెలిపాడు. కాగా, కొద్ది రోజుల ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు, డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక చేసిన భారత జట్టులో సభ్యుడు జయదేవ్ ఉనద్కత్ కూడా గాయం కారణంగా అధికారికంగా ఐపీఎల్-2023 నుంచి వైదొలిగాడు. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రాహుల్, ఉనద్కత్లు గాయాల కారణంగా ఒకేసారి వైదొలగడంతో లక్నో సూపర్ జెయింట్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఒకవేళ ఉనద్కత్ డబ్ల్యూటీసీ ఫైనల్ సమయానికి కూడా కోలుకోకపోతే అది టీమిండియాకు కూడా భారీ ఎదురుదెబ్బగా పరిగణించాల్సి ఉంటుంది. గాయాల కారణంగా ఇప్పటికే బుమ్రా, శ్రేయస్ అయ్యర్ జట్టుకు (డబ్ల్యూటీసీ ఫైనల్) దూరం కాగా.. తాజాగా రాహుల్ కూడా గాయం కారణంగా వైదొలగడం టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్, అదే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా ఉనద్కత్ గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ (ఔట్), పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్. -
టీమిండియా బౌలర్కు గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ గాయపడ్డాడు. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో బౌలింగ్ వేస్తుండగా స్లిప్ అయ్యాడు. దీంతో ఉనాద్కట్ ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆర్సీబీతో మ్యాచ్లో బరిలోకి దిగలేదు. రిపోర్డ్స్ వచ్చాకా కానీ ఉనాద్కట్ ఆడుతాడా లేదా అనేది తేలనుంది. అయితే ఐపీఎల్ కంటే మరొక విషయం కలవరపెడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరగనుంది. ఇక జైదేవ్ ఉనాద్కట్ 15 మందితో కూడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉనాద్కట్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైనప్పటికి మేజర్ మ్యాచ్ కావడం టీమిండియా ఆందోళనకు కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే బుమ్రా దూరం కాగా.. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఉనాద్కట్ గాయపడిన వీడియోనూ ఐపీఎల్ వెబ్సైట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ''గాయపడిన ఉనాద్కట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. భారత టెస్టు జట్టు WTC ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. See you back on the field soon @JDUnadkat Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN — IndianPremierLeague (@IPL) May 1, 2023 చదవండి: టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి -
ఐపీఎల్లో జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు! ఏకైక భారత క్రికెటర్గా
టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక జట్ల తరపున బరిలోకి దిగిన భారత ఆటగాడిగా ఉనద్కట్ అవతరించాడు. ఐపీఎల్-202లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన జయదేవ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఉనద్కట్ ఐపీఎల్లో ఇప్పటివరకు 7 జట్ల తరపున ఆడాడు. 2010లో కోల్కతా నైట్రైడర్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఉనద్కట్.. అనంతరం 2013లో ఆర్సీబీ, 2014లో ఢిల్లీ డేర్డెవిల్స్, 2017లో పుణే సూపర్ జెయింట్స్, 2018లో రాజస్తాన్ రాయల్స్కు పప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్లకు పాటు రాజస్తాన్ తరపున ఆడిన జయదేవ్ను.. ఐపీఎల్-2022కు ముందు రాయల్స్ విడిచిపెట్టింది. అనంతరం మెగా వేలంలోకి వచ్చిన అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ముంబై కూడా అతడిని ఐపీఎల్-2023 సీజన్కు ముందు విడిచిపెట్టింది. ఐపీఎల్-2023 మినీవేలంలో లక్నో సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఫించ్ ఐపీఎల్లో 8 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్లో న్యూజిలాండ్! సూపర్ ఓవర్లో -
బీసీసీఐని ఒప్పించాడు.. సౌ'స్వ'రాష్ట్రను గెలిపించాడు
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్గా సౌరాష్ట్ర జట్టు అవతరించింది. గత 3 సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్గా నిలవడం ఇది రెండోసారి. 2019-20 సీజన్లో సైతం ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర.. బెంగాల్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఓవరాల్గా నాలుగోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. సౌరాష్ట్ర తొలిసారి 1935-37 సీజన్లో.. ఆతర్వాత 1943-44 సీజన్లో రంజీ టైటిల్ను సాధించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్ట్ల కోసం ఎంపిక చేసిన టీమిండియాలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్కు చోటు లభించిన విషయం తెలిసిందే. అయితే వివిధ సమీకరణల దృష్ట్యా రెండు మ్యాచ్ల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ మధ్యలో తన సొంత జట్టు సౌరాష్ట్ర రంజీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మూడో థాట్ పెట్టుకోని ఉనద్కత్.. తనను టీమిండియా నుంచి రిలీవ్ చేయాల్సిందిగా బీసీసీఐ పెద్దలను అభ్యర్ధించాడు. తనను రిలీవ్ చేస్తే, తన సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్లో పాల్గొంటానని కోరాడు. ఉనద్కత్ విన్నపాన్ని మన్నించిన బీసీసీఐ.. అతను కోరిన విధంగానే టీమిండియా నుంచి రిలీవ్ చేసింది. దీంతో సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు మ్యాచ్కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్లో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు ఉనద్కత్. తన సారధ్యంలో సౌరాష్ట్రను రెండోసారి ఛాంపియన్గా నిలపడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అతను.. అనుకున్న విధంగానే అన్నీ తానై సౌరాష్ట్రను గెలిపించుకున్నాడు. ఫైనల్లో ఏకంగా 9 వికెట్లు (3/44, 6/85) పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం గెలిచాడు. ఉనద్కత్కు తన జట్టును గెలిపించుకోవాలన్న తపన, ఆకాంక్షను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం రాకపోతేనేం, తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జట్టుకు ఆడాలన్న అతని కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. ఈ సీజన్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన ఉనద్కత్.. 13.88 సగటున 26 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు.. బెంగాల్: 174 & 241 సౌరాష్ట్ర: 404 & 14/1 9 వికెట్ తేడాతో సౌరాష్ట్ర విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: జయదేవ్ ఉనద్కత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: అర్పిత్ వసవద (ఉనద్కత్ గైర్హాజరీలో సౌరాష్ట్ర కెప్టెన్గా వ్యవహరించాడు, ఈ సీజన్లో రెండో లీడింగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు, 10 మ్యాచ్ల్లో 75.58 సగటున 3 సెంచరీల సాయంతో 907 పరుగులు చేశాడు, ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు, మయాంక్ 9 మ్యాచ్ల్లో 82.50 సగటున 3 సెంచరీల సాయంతో 990 పరుగులు చేశాడు) -
ఉనద్కత్ ఉగ్రరూపం.. రంజీ ఛాంపియన్గా సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్గా సౌరాష్ట్ర అవతరించింది. గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్లో సైతం జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్గా నిలిచింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో గత నాలుగు రోజులుగా సాగిన ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర.. లోకల్ టీమ్ బెంగాల్ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆఖరి రోజు (ఫిబ్రవరి 19) లోకల్ హీరో, బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (68) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. That Winning Feeling 🏆 😊 Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph 🙌 🙌 #BENvSAU | #Final | @saucricket | @mastercardindia Scorecard 👉 https://t.co/hwbkaDeBSj pic.twitter.com/m2PQKqsPOG — BCCI Domestic (@BCCIdomestic) February 19, 2023 ఉనద్కత్ ఉగ్రరూపం దాల్చడంతో బెంగాల్ టీమ్ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్కు జతగా చేతన్ సకారియా (3/76) కూడా రాణించడంతో సౌరాష్ట్ర.. బెంగాల్ను సెకెండ్ ఇన్నింగ్స్లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. కేవలం 2.4 ఓవర్లలో జై గోహిల్ (0) వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జై వికెట్ను ఆకాశ్దీప్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఉనద్కత్ (3/44), చేతన్ సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ ఆహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వసవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్దీప్, ఇషాన్ పోరెల్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్ (61), మనోజ్ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్ (6/85), సకారియా (3/76) బెంగాల్ పతనాన్ని శాశించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్గా అవతరించింది. -
రంజీ ఫైనల్.. బెంగాల్ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి
బెంగాల్-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (57) షాబాజ్ అహ్మద్ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్ మజుందార్ (61) హాఫ్సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (16), సుదీప్ కుమార్ గరామీ (14) నిరాశపరిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్ (2/47), చేతన్ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వనవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్దీప్, ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్ (3/44), సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
రవీంద్ర జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్లో కెప్టెన్గా..
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Saurashtra: మోకాలి గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా తమిళనాడుతో పోటీపడుతున్న సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. కాగా 34 ఏళ్ల జడేజా గత ఏడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఆసీస్తో మ్యాచ్ కోసం..! ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా సౌరాష్ట్ర జట్టుకు దాదాపుగా నాకౌట్ బెర్త్ ఖరారు కావడంతో చివరి మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్, సీనియర్ స్టార్ చతేశ్వర్ పుజారాలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో జడ్డూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా స్వదేశంలో సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్తో తొలి రెండు టెస్టుల్లో జడేజాకు చోటు ఇచ్చింది బీసీసీఐ. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రంజీ ఆడేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం (జనవరి 24) మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: సౌరాష్ట్ర హార్విక్ దేశాయ్(వికెట్ కీపర్), చిరాగ్ జానీ, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవాడ, రవీంద్ర జడేజా(కెప్టెన్), సమర్థ్ వ్యాస్, ప్రేరక్ మన్కడ్, ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, యువరాజ్సిన్హ్ దోడియా, జే గోహిల్. తమిళనాడు: సాయి సుదర్శన్, నారాయణ్ జగదీశన్(వికెట్ కీపర్), బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్(కెప్టెన్), విజయ్ శంకర్, షారుక్ ఖాన్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, త్రిలోక్ నాగ్, మణిమారన్ సిద్ధార్థ్. చదవండి: Australian Open: సంచలనం సృష్టించిన అన్సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్తో పాటు.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
ఆరేసిన ఉనద్కత్.. హైదరాబాద్కు మరో ఘోర పరాభవం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో జయదేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది చివర్లో మొదలైన ఈ జట్టు జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2022 డిసెంబర్లో ముంబైపై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌరాష్ట్ర.. గత వారం ఢిల్లీని ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతో, తాజాగా హైదరాబాద్ను ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో (8/39, 70) చెలరేగిన ఉనద్కత్.. హైదరాబాద్తో మ్యాచ్లోనూ ఆరు వికెట్లు (3/28, 3/62) పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉనద్కత్కు జతగా ధరేంద్రసిన్హ్ జడేజా (3/8, 4/34, 40 పరుగులు) కూడా రాణించడంతో సౌరాష్ట్ర ప్రస్తుత రంజీ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్రాజ్సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. చిరాగ్ జానీ (68), హార్విక్ దేశాయ్ (81), షెల్డన్ జాక్సన్ (59) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 7 వికెట్లు పడగొట్టగా.. రోహిత్ రాయుడు 2, అబ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్ బ్యాటింగ్ తీరు రెండో ఇన్నింగ్స్లోనూ మారలేదు. జడేజా (4/34), ఉనద్కత్ (3/62), దోడియా (2/76), సకారియా (1/13) విజృంభించడంతో ఆ జట్టు 191 పరుగులకే కుప్పకూలింది. సంతోష్ గౌడ్ (58) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఫలితంగా హైదరాబద్ సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గతేడాది డిసెంబర్లో ముంబై చేతిలో ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఈ జట్టు.. ఆ తర్వాత అస్సాం చేతిలో (18 పరుగుల తేడాతో), ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ చేతిలో (154 పరుగుల తేడాతో), తాజాగా సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. -
విజృంభించిన ఉనద్కత్, జడేజా.. 79 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్
Ranji Trophy 2022-23 SAU VS HYD: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర-హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్లో సౌరాష్ట్ర బౌలర్లు రెచ్చిపోయారు. జయదేవ్ ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్రాజ్సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (2), అలంక్రిత్ అగర్వాల్ (7), తొలకంటి గౌడ్ (4), చందన్ సహాని (2) భవేశ్ సేథ్ (3), టి రవితేజ (8), మెహరోత్ర శశాంక్ (5), మహ్మద్ అబ్రార్ నిరాశపరిచారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్ర.. 24 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ఓపెనర్లు చిరాగ్ జానీ (55), హార్విక్ దేశాయ్ (49) క్రీజ్లో ఉన్నారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో ఇంకా చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవద, ప్రేరక్ మన్కడ్, ధరేంద్రసిన్హ్ జడేజా, చేతన్ సకారియా, సమర్థ్ వ్యాస్, జయదేవ్ ఉనద్కత్, యువ్రాజ్సిన్హ్ దోడియా బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్కు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతొ ఘన విజయం సాధించింది. ఉనద్కత్ (8/39, 70) ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ చేతిలో 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. -
చారిత్రక బౌలింగ్ ప్రదర్శన అనంతరం బ్యాట్తోనూ ఇరగదీసిన ఉనద్కత్
Jaydev Unadkat: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర కెప్టెన్, భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇరగదీస్తున్నాడు. తొలి ఓవర్లో హ్యాట్రిక్తో పాటు తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు పడగొట్టి చారిత్రక ప్రదర్శన కనబర్చిన ఉనద్కత్.. ఆతర్వాత బ్యాట్తోనూ విజృంభించి ఆల్రౌండర్గా, సమర్ధవంత నాయకుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. అప్పటికే (మూడో రోజు ఆటలో) హార్విక్ దేశాయ్ (107), వసవద (152 నాటౌట్) సెంచరీలతో.. చిరాగ్ జానీ (75), సమర్థ్ వ్యాస్ (54), ప్రేరక్ మన్కడ్ (64) అర్ధసెంచరీలతో అలరించగా, 8వ స్థానంలో బరిలోకి దిగిన ఉనద్కత్ తాను సైతం అంటూ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో 68 బంతులు ఎదుర్కొన్న ఉనద్కత్.. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 2 బంతులకే మరో వికెట్ పడటంతో ఉనద్కత్.. 574/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా సౌరాష్ట్రకు 441 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి కేవలం 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో బంతితో చుక్కలు చూపించిన ఉనద్కత్.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోవడం విశేషం. యువరాజ్సింగ్ దోడియ 4 వికెట్లు పడగొట్టగా.. పార్థ్ బట్, చిరాగ్ జానీ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్సలో 9వ స్థానంలో అర్ధసెంచరీతో ఢిల్లీ పరువు కాపాడిన హృతిక్ షోకీన్.. రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ చేసి ఆ జట్టు మరోసారి పేకమేడలా కూలకుండా కాపాడాడు. జాంటీ సిద్దు (17), లక్ష్యయ్ తరేజా (0) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఉనద్కత్ ధాటికి 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ దిశగా సాగిన ఢిల్లీ జట్టు పరువును ప్రాణ్షు విజయరన్ (15), షోకీన్ (68 నాటౌట్), శివాంక్ వశిష్ట్ (38) కాపాడారు. ఈ ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్ చేయడంతో ఢిల్లీ 133 పరుగులు చేసి ఆలౌటైంది. ఉనద్కత్ (8/39)కు జతగా చిరాగ్ జానీ (1/14), ప్రేరక్ మన్కడ్ (1/2) రాణించారు. -
Ranji Trophy: ఉనాద్కట్ సంచలనం.. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్గా
Ranji Trophy 2022-23- Saurashtra vs Delhi: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీతో మ్యాచ్లో వేసిన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే, వన్డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యశ్ ధుల్లను పెవిలియన్కు పంపాడు. ముగ్గురినీ డకౌట్ చేశాడు. రంజీ చరిత్రలోనే తొలిసారి కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్.. రెండో ఓవర్లోనూ విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్(0), లక్ష్యయ్ తరేజా(1)లను అవుట్ చేశాడు. అంతేకాదు.. తద్వారా... ఫస్ట్క్లాస్ క్రికెట్లో 21వ సారి.. ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్కట్. ఆ తర్వాత జాంటీ సిద్ధు(4)ను కూడా పెవిలియన్కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు(మూడు ఓవర్లలో) తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ను అతలాకుతలం చేశాడు. కాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుదేలైన ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం (జనవరి 3) మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఉనాద్కట్ దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఇందుకు తోడు, చిరాగ్ జానీ ఒక వికెట్, ప్రేరక్ మన్కడ్ ఒక వికెట్ తీశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఢిల్లీ 8 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. చదవండి: Hardik Pandya: స్లెడ్జింగ్తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్గా మళ్లీ అతడే! -
IPL 2023: మిస్టర్ ఐపీఎల్ ‘సూపర్స్టార్’ లెక్క తప్పింది! వాళ్లను పట్టించుకోనేలేదు!
IPL 2023 Mini Auction- Suresh Raina: ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అంచనా తలకిందులైంది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడతాయంటూ మిస్టర్ ఐపీఎల్ చెప్పిన జోస్యం తప్పింది. రైనా అంచనా వేసిన యువ ఆటగాళ్లలో సౌరాష్ట్ర క్రికెటర్ సమర్థ్ వ్యాస్ తప్ప మిగతా ఇద్దరూ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా ఐపీఎల్ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా షోలో.. ఆక్షన్ ఆరంభానికి ముందు రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన జయదేవ్ ఉనాద్కట్, నారాయణ్ జగదీశన్పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయని అతడు పేర్కొన్నాడు. వీళ్ల విషయంలో నిజమైంది అందుకు తగ్గట్లుగానే లక్నో సూపర్ జెయింట్స్ ఉనాద్కట్ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేయగా.. నారాయణ్ జగదీశన్ కోసం కోల్కతా నైట్రైడర్స్ 90 లక్షలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిస్ కోసం పోటీ నెలకొంటుందని రైనా అంచనా వేయగా.. గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. లెక్క తప్పాడు! వీరితో పాటు.. బెన్ స్టోక్స్, సామ్ కరన్ విషయంలో అందరిలానే రైనా అంచనాలూ నిజమయ్యాయి. కానీ అన్క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో మాత్రం మిస్టర్ ఐపీఎల్ లెక్క తప్పింది. జమ్మూ కశ్మీర్ ఆల్రౌండర్ ముజ్తాబా యూసఫ్ అమ్ముడుపోకుండా మిగిలి పోయాడు. అంతేగాక ఈ వేలంలో సూపర్స్టార్గా నిలవగల సత్తా ఉందని రైనా అంచనా వేసిన అల్లా అహ్మద్ను ఎవరూ పట్టించుకోలేదు. మిస్టర్ ఐపీఎల్ జోస్యంపై కామెంట్లు వేలంలో పేరు నమోదు చేసుకున్న అత్యంత పిన్న వయస్కుడైన 15 ఏళ్ల ఈ అఫ్గనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇక సమర్థ్ వ్యాస్ను 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రైనా జోస్యంపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాళ్ల విషయంలో మిస్టర్ ఐపీఎల్ అంచనాలు నిజమయ్యాయి. కానీ సూపర్స్టార్ అన్న విషయంలో మాత్రం లెక్క తప్పాడు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట Ind Vs Ban: అయ్యో పంత్.. సెంచరీ మిస్! అయితేనేం ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు! సాహా తర్వాత.. -
IPL 2023: 11వ సారి వేలంలోకి.. ఈసారి ఎంత ధర కంటే?
ఐపీఎల్ 2023 వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ 11వ సారి వేలంలోకి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.50 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో స్టార్ బౌలర్ అయిన ఉనాద్కట్ 2018 తర్వాత ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతి తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. 2018లో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 కోట్లకు కొన్నది. అయితే ఆ సీజన్లో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా 2019లో అతడిని 8.4 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020, 21లో రూ. 3 కోట్లకు ఉనాద్కట్ను రాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టకుంది. పోయిన సీజన్ వేలంలో ఉనాద్కత్ను ముంబై ఇండియన్స్ 1.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఉనాద్కట్ 2010లో కేకేఆర్ తరఫున ఐపీఎల్లో ఆరంగ్రేటం చేశాడు. అయితే.. అతని ఐపీఎల్ కెరీర్ 2017లో మలుపు తిరిగింది. ఆ సీజన్లో పూణె సూపర్ జెయింట్స్కు ఆడిన ఉనాద్కట్ 12 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. దాంతో తర్వాతి సీజన్లో అతడిని సొంతం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ రూ.11.5 పెట్టింది. దేశవాళీ టోర్నీల్లో సౌరాష్ట్ర తరఫున ఉనాద్కట్ అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఉనాద్కట్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2023: అన్క్యాప్డ్ ప్లేయర్కు రూ.5.5 కోట్లు.. ఎవరీ ముఖేష్ కుమార్? -
‘15 ఏళ్ల ఆ అఫ్గన్ బౌలర్ సూపర్స్టార్! ఉనాద్కట్కు భారీ ధర! ఇంకా..’
IPL 2023 Mini Auction- Watch Out: ఐపీఎల్- 2023 మినీ వేలం నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆక్షన్లో సత్తా చాటగల అన్క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లేనంటూ ముగ్గురు యువ క్రికెటర్ల పేర్లు ప్రస్తావించాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్ సహా అఫ్గన్ యువ కెరటం అల్లా మహ్మద్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు తమ తమ జట్ల తరఫున అద్భుత ప్రదర్శన చేశారని, వేలంలో వీరు మంచి ధర పలకడం ఖాయమని మిస్టర్ ఐపీఎల్ అభిప్రాయపడ్డాడు. కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తంగా 87 బెర్త్ల కోసం బరిలో 405 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఉనాద్కట్ ఇంకా.. ఈ మేరకు.. ‘‘భారత క్రికెటర్లలో.. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలిపిన కెప్టెన్, లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్, తమిళనాడు ప్లేయర్ జగదీశన్పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి. ఆ ఐరిష్ బౌలర్ విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, బెన్ స్టోక్స్ సహా టీ20 ప్రపంచకప్-2022లో సత్తా చాటిన ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కోసం పోటీ నెలకొంటుంది. సూపర్స్టార్ కాగలడు! అన్క్యాప్డ్ ప్లేయర్లలో ముజ్తాబా యూసఫ్, సమర్థ్ వ్యాస్, అల్లా మహ్మద్ సత్తా చాటగలరు. నేను ముజ్తాబాతో కలిసి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాను. తను అద్భుతమైన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్. ఇక సౌరాష్ట్ర తరఫున సమర్థ్ వ్యాస్ 150 స్ట్రైక్రేటుతో మెరిశాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టాప్-5 బ్యాటర్లలో ఒకడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడు. ఇక అల్లా మహ్మద్.. ఆరడుగుల మీద రెండు అంగుళాల ఎత్తు ఉండే ఈ 15 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.. సూపర్స్టార్ కాగలడు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున ఆడుతున్న ముజ్తాబా యూసఫ్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఇక సమర్థ్ వ్యాస్.. సౌరాష్ట్ర తరఫున గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అఫ్గనిస్తాన్ యువ సంచలనం 15 ఏళ్ల అల్లా మహ్మద్ అండర్-19 టోర్నీలో(బెస్ట్ 4/15) రాణిస్తున్నాడు. మిస్టర్ ఐపీఎల్ చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. ఐపీఎల్లో 5528 పరుగులు సాధించాడు. 205 మ్యాచ్లలో 136.76 స్ట్రైక్రేటుతో ఈ మేరకు రన్స్ చేసి మిస్టర్ ఐపీఎల్గా పేరొందాడు. రైనా ఐపీఎల్ ఖాతాలో ఓ సెంచరీ, 39 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs Ban: టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు! అప్పుడు తెలుస్తుంది మీకు.. IPL 2023 Auction: గ్రీన్కు 20, కర్రన్కు 19.5, స్టోక్స్కు 19 కోట్లు..! -
ఇంతకంటే మర్యాదపూర్వక పదం వాడలేకపోతున్నా: టీమిండియా దిగ్గజం
Bangladesh vs India, 2nd Test: ‘‘గత టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆటగాడిని తప్పించడం నమ్మశక్యంగా లేదు. నిజానికి.. ఈ విషయం గురించి మాట్లాడటానికి కఠిన పదజాలాన్ని వాడాలనుకున్నా. కానీ.. ఇలా మర్యాదపూర్వకమైన పదంతో సరిపెడుతున్నా. 20 వికెట్లలో 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న బౌలర్ను అసలు అలా ఎలా తప్పిస్తారు’’ అంటూ టీమిండియా దిగ్గజ ప్లేయర్ సునిల్ గావస్కర్ మేనేజ్మెంట్ తీరుపై మండిపడ్డాడు. వాళ్లను తప్పించాల్సింది! ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో మాత్రమే ఆడాలనుకుంటే.. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లలో ఎవరో ఒకరిని తప్పించాల్సిందని అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి పిచ్పై అతడు ఇంకా మెరుగ్గా రాణించేవాడు అని గావస్కర్ పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ను తప్పించి.. అతడి స్థానంలో పేసర్ జయదేవ్ ఉనాద్కట్ను తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఉనాద్కట్ కోసం కుల్దీప్ను పక్కనపెట్టిన నేపథ్యంలో సెలక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పిచ్ పేస్కు అనుకూలంగా మూడో పేసర్ను తీసుకున్నామని భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పినా, అది సంతృప్తికరమైన వివరణగా అనిపించలేదంటూ క్రీడా విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో గావస్కర్ సైతం మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మిర్పూర్ టెస్టులో భాగంగా... టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 4 వికెట్లు పడగొట్టగా... ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ వికెట్ తీయలేకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. 12 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 227 ఆలౌట్ అయింది. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. కుల్దీప్ లేని లోటు.. అప్పుడు తెలుస్తుంది! కాగా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ డిసెంబర్ 16, 2010న తన తొలి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగాడు. అందులో ఒకే ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయగా 26 ఓవర్లలో 101 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో టెస్టు టీమ్లో మళ్లీ చోటు దక్కలేదు. వరుసగా దేశవాళీ క్రికెట్లో చక్కటి ప్రదర్శనలతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావడంతో బంగ్లాతో సిరీస్కు మళ్లీ టెస్టు పిలుపు లభించింది. తద్వారా 12 ఏళ్ల తర్వాత అతను ఈ మ్యాచ్తో టెస్టు క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఈ రెండు టెస్టుల మధ్య భారత జట్టు 118 టెస్టు మ్యాచ్లు ఆడింది. తమ కెరీర్ రెండు మ్యాచ్ల మధ్య ఇంత విరామం ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉనాద్కట్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్కు చెందిన గారెత్ బ్యాటీ తొలి టెస్టు, రెండో టెస్టు మధ్య ఇంగ్లండ్ జట్టు 142 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇక తొలి రోజు ఉనాద్కట్ రాణించినా... రెండో ఇన్నింగ్స్లో మూడో స్పిన్నర్ అవసరం అనిపిస్తే మాత్రం కుల్దీప్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. చదవండి: IPL 2023 Auction: గ్రీన్కు 20, కర్రన్కు 19.5, స్టోక్స్కు 19 కోట్లు..! IND vs PAK: భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్లపై పీసీబీ కొత్త చీఫ్ కీలక వాఖ్యలు -
బౌలర్ల విజృంభణ.. తొలి రోజు టీమిండియా ఆధిపత్యం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు (డిసెంబర్ 22) టీమిండియా ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) కట్టడి చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు (8 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (20 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 3 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్ను ఎలాగైనా క్లీన్స్వీప్ చేసి, వన్డే సిరీస్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
చెలరేగిన ఉమేశ్, సత్తా చాటిన అశ్విన్.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన బంగ్లాదేశ్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) ఆలౌట్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్ను ఎలాగైనా క్లీన్స్వీప్ చేసి, వన్డే సిరీస్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అలాగే, ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మ్యాచ్ను చాలా సిరీయస్గా తీసుకుంది. -
IND VS BAN 2nd Test: ఉనద్కత్ ఖాతాలో అసాధారణ రికార్డు
Jaydev Unadkat Plays Test Cricket After 12 Years: ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్.. ఈ మ్యాచ్ కోసం ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఉనద్కత్తో పాటు ఉమేశ్ యాదవ్ (3/20), రవిచంద్రన్ అశ్విన్ (2/68) రాణించడంతో బంగ్లాదేశ్ 69 ఓవర్ల తర్వాత 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. మొమినుల్ హాక్ (82 నాటౌట్) అజేయమైన అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతని జతగా తస్కిన్ అహ్మద్ క్రీజ్లో ఉన్నాడు. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కాగా, అనూహ్య పరిణామాల మధ్య ఈ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఓ అసాధారణ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2010లో తొలి టెస్ట్ (సౌతాఫ్రికా) ఆడిన ఉనద్కత్.. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్ట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పార్థివ్ పటేల్ పేరిట ఉండేది. పార్థివ్.. 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ రికార్డుతో పాటు ఉనద్కత్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. అత్యధిక టెస్ట్ మ్యాచ్ల గ్యాప్ తర్వాత టెస్ట్ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉనద్కత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో గారెత్ బ్యాటీ (142 టెస్ట్లు, 2005-16) అగ్రస్థానంలో ఉండగా.. ఉనద్కత్ (118 టెస్ట్లు, 2010-22) రెండో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత మార్టిన్ బిక్నెల్ (114, 1993-2003), ఫ్లాయిడ్ రీఫర్ (109, 1999-2009), యూనిస్ అహ్మద్ (104, 1969-87), డెరెక్ షాక్లెటన్ (103, 1951-63) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, బంగ్లా టూర్కు తొలుత ఎంపికైన మహ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన (10 మ్యాచ్ల్లో 19 వికెట్లు) ఆధారంగా సెలెక్టర్లు అతనికి అవకాశం కల్పించారు. -
పట్టుదల, శ్రమ.. తొక్కేం కాదు! మరి కుల్దీప్ సంగతేంటి?! నెటిజన్ల ఫైర్
Ind Vs Ban 2nd Test- Jaydev Unadkat- Kuldeep Yadav: టీమిండియా తరఫున 2010 డిసెంబరు 16న ‘చివరి టెస్టు’ ఆడాడు జయదేవ్ ఉనాద్కట్. మళ్లీ ఇప్పుడు.. 12 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్లో నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో జయదేవ్ బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో రాణించిన నేపథ్యంలో ఈ లెఫ్టార్మ్ పేసర్కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. కానీ, మొదటి టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. అయితే, అనూహ్యంగా ఆ మ్యాచ్లో అదరగొట్టిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను కాదని జయదేవ్కు రెండో టెస్టులో అవకాశమిచ్చింది మేనేజ్మెంట్. దీంతో 12 ఏళ్ల గ్యాప్ తర్వాత అతడు టీమిండియా తరఫున తొలి టెస్టు ఆడనున్నాడు. బీసీసీఐ ట్వీట్.. ఈ క్రమంలో.. ‘‘పట్టుదల, కఠిన శ్రమ ఎన్నటికీ వృథా కావు.. ఈరోజు వైట్ జెర్సీలో జయదేవ్ ఉనాద్కట్’’ అంటూ అతడి ఫొటోను పంచుకుంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో జయదేవ్ కొంతమంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఈ నిర్ణయంపై మడిపడుతున్నారు. నెటిజన్ల ఫైర్ ‘‘పట్టుదల, శ్రమ తొక్కేం కాదు.. జయదేవ్కు అవకాశం ఇవ్వడం మంచిదే! కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ను తప్పించి అతడిని తీసుకురావడమేంటి? పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందనుకున్నా.. 8 వికెట్లు తీసిన కుల్దీప్ను తప్పించి.. ఒకే ఒక్క వికెట్ తీసిన అశ్విన్ జట్టులో ఉంచడం భావ్యం కాదు. ఏదేమైనా సౌరాష్ట్ర ప్లేయర్ కోసం కుల్దీప్ను పక్కనపెట్టారు కదా! అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. మీరూ మీ రాజకీయాలు’’ అంటూ సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్ సైతం మిర్పూర్ పిచ్ స్పిన్నర్లు, పేసర్లకు అనుకూలిస్తుందని.. అయినా ఉనాద్కట్ కోసమే దురదృష్టవశాత్తూ కుల్దీప్ను తప్పించినట్లు పేర్కొనడం గమనార్హం. కాగా 2010లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన జయదేవ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్రను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 19 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇక ఫస్ట్క్లాస్ కెరీర్లో 86 మ్యాచ్లలో 311 వికెట్లు పడగొట్టాడు. చదవండి: BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్ పటేల్... కుల్దీప్, పుజారా, గిల్ సైతం.. 𝐏𝐞𝐫𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐜𝐞 𝐚𝐧𝐝 𝐡𝐚𝐫𝐝 𝐰𝐨𝐫𝐤 𝐩𝐚𝐲𝐬 𝐨𝐟𝐟 🫡@JUnadkat last played a Test match for #TeamIndia on December 16, 2010. After 12 years, he will be donning the whites again today.#BANvIND pic.twitter.com/ziQGecIcrE — BCCI (@BCCI) December 22, 2022 -
Ind VS Ban: బంగ్లాతో టెస్టు.. టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి..
Bangladesh vs India, 2nd Test- Playing XI: సిరీస్ గెలవడమే లక్ష్యంగా రెండో టెస్టు బరిలోకి దిగిన భారత తుది జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మొదటి మ్యాచ్లో 8 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ను తప్పించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఈ చైనామన్ స్పిన్నర్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనాద్కట్ జట్టులోకి వచ్చాడు. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్తో పాటు ఈ లెఫ్టార్మ్ పేసర్ కూడా బంగ్లాతో రెండో టెస్టులో భాగమయ్యాడు. మరోవైపు తొలి టెస్టులో రాణించిన స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ను కొనసాగించారు. దీంతో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగినట్లయింది. కాగా బంగ్లాదేశ్తో సిరీస్ నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత జయదేవ్ టెస్టు జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మొమినుల్ స్థానంలో మోమినుల్ , ఇబాదత్ హొసేన్ స్థానంలో టస్కిన్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. అందుకే కుల్దీప్ అవుట్: రాహుల్ టాస్ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్ను తప్పించడం దురదృష్టకర నిర్ణయమని అయితే, జయదేవ్కు అవకాశం ఇవ్వడానికే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తాము టాస్ గెలిచినా ముందు బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ రెండో టెస్టు- తుది జట్లు ఇవే భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనాద్కట్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, జాకీర్ హసన్, మోమినుల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), నూరుల్ హసన్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, టస్కిన్ అహ్మద్. చదవండి: BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
పాపం ఉనద్కత్.. సెలక్టర్లు కరుణించినా, అదృష్టం వెక్కిరించింది..!
Jaydev Unadkat: 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అనూహ్య పరిణామాల నడుమ భారత టెస్ట్ జట్టులో (బంగ్లాతో టెస్ట్ సిరీస్) చోటు దక్కించుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ను విధి దారుణంగా వెక్కిరించింది. సెలెక్టర్లు కరుణించి టీమిండియాకు ఆడే అవకాశం కల్పించినా, ఈ సౌరాష్ట్ర బౌలర్తో అదృష్టం బంతాట ఆడుకుంది. ఉనద్కత్ ఎంపిక ఊహించని పరిణామాల మధ్య ఆలస్యంగా చోటు చేసుకోవడంతో వీసా సమస్యలు తలెత్తి బంగ్లాతో తొలి టెస్ట్ సమయానికి అతను భారత జట్టుతో కలవలేని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్తో రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుండగా, వీసా పేపర్లు అందని కారణంగా ఉనద్కత్ భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో 12 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకున్న అతని కలలు కలలుగానే మిగిలిపోయాయి. బీసీసీఐ లాజిస్టిక్ విభాగం అతన్ని వీలైనంత త్వరగా బంగ్లాదేశ్కు పంపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. కనీసం రెండో టెస్ట్ సమయానికైనా ఉనద్కత్ను జట్టుతో కలిపేందుకు లాజిస్టిక్ విభాగం శతవిధాల ప్రయత్నిస్తుంది. కాగా, 2010 డిసెంబర్లో చివరిసారిగా భారత టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 31 ఏళ్ల ఉనద్కత్.. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని సద్వినియోం చేసుకోలేక జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఉనద్కత్ పట్టువదలని విక్రమార్కుడిలా దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి సెలెక్టర్లు తనను ఎంపిక చేసేలా చేసుకున్నాడు. అయితే చేతికందిన అదృష్టం వీసా సమస్యల కారణంగా చేజారడంతో అతను వాపోతున్నాడు. బంగ్లా పర్యటనకు ముందు షమీ గాయపడటంతో అతనికి రీప్లేస్మెంట్గా ఉనద్కత్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. విజయ్ హజారే ట్రోఫీ-2022లో అతని అత్యద్భుతమైన ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ టీమిండియాలో స్థానం కల్పించింది. ఉనద్కత్.. టీమిండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20 ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ టోర్నీల్లో ఈ సౌరాష్ట్ర బౌలర్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఉనద్కత్ ఐపీఎల్లో సైతం మెరుగ్గా రాణించాడు. వివిధ ఫ్రాంచైజీల తరఫున 91 మ్యాచ్ల్లో 91 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను ముంబై ఇండియన్స్లో కొనసాగుతున్నాడు. -
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. 12 ఏళ్ల తర్వాత భారత బౌలర్ రీ ఎంట్రీ!
బంగ్లాదేశ్తో వన్డే, టెస్టు సిరీస్లకు టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్కు షమీ స్థానాన్ని యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్తో భర్తీ చేసిన బీసీసీఐ.. ఇప్పడు టెస్టులకు మాత్రం ఆనూహ్య నిర్ణయం తీసుకుంది. బంగ్లాతో టెస్టు సిరీస్కు షమీ స్థానంలో జయ్దేవ్ ఉనద్కట్ను బీసీసీఐ ఎంపిక చేసింది. కాగా జయ్దేవ్ ఉనద్కట్ 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్లో ఉనద్కట్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఆ తర్వాత నుంచి ఉనద్కట్కు భారత జట్టు తరపున ఆడే అవకాశం రాలేదు. అయితే ఇటీవల ముగిసిన విజయ్ హాజారే ట్రోఫీలో సౌరాష్ట్రకు సారథ్యం వహించిన ఉనద్కట్.. తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఉనద్కట్ 19 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో ఉనద్కట్కు మళ్లీ భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. కాగా ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో 86 మ్యాచులు ఆడిన ఉనద్కట్.. 311 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా అతడు సాధించాడు. ఇక బంగ్లా దేశ్- భారత జట్ల మధ్య తొలి టెస్టు ఛాటోగ్రామ్ వేదికగా డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: Abrar Ahmed: ఇదేం బౌలింగ్రా బాబూ! మొదటి 7 వికెట్లు.. ఆ గూగ్లీ స్పెషల్.. స్టోక్స్ మతిపోయింది! -
విజృంభించిన ఉనద్కత్.. ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్ర
Vijay Hazare Trophy 2022 Saurashtra VS Karnataka: విజయ్ హజారే ట్రోఫీ 2022లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో కర్ణాటకపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా టోర్నీ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌరాష్ట్ర.. జయదేవ్ ఉనద్కత్ (4/26), ప్రేరక్ మన్కడ్ (2/34) విజృంభించడంతో కర్ణాటకను 171 పరుగులకే (49.1 ఓవర్లు) కుప్పకూల్చింది. కర్ణాటక ఇన్నింగ్స్లో సమర్థ్ (88) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 172 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. పరుగులేమీ చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత కోలుకుని 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జే గోహిల్ (61) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (33), ప్రేరక్ మన్కడ్ (35), అర్పిత్ వసవద (25 నాటౌట్), చిరాగ్ జానీ (13 నాటౌట్) తలో చేయి వేసి జట్టును గెలిపించారు. ఇదే రోజు జరిగిన రెండో సెమీఫైనల్లో రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు), అంకిత్ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో మహారాష్ట్ర జట్టు 12 పరుగుల తేడాతో అస్సాంపై విజయం సాధించి, ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన అస్సాం లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రిషవ్ దాస్ (53), శివ్శంకర్ రాయ్ (78), స్వరూపం పుర్కాయస్తా (95) అర్ధశతకాలతో రాణించి, జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్లో గెలిచిన మహారాష్ట్ర రేపు (డిసెంబర్ 2) జరుగబోయే ఫైనల్లో తొలి సెమీస్ విన్నర్ సౌరాష్ట్రతో తలపడనుంది. -
VHT 2022: ఒకరు బ్యాట్తో, మరొకరు బంతితో.. అదరగొట్టిన కెప్టెన్లు!
Vijay Hazare Trophy 2022 Final: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, సౌరాష్ట్ర జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లలో మహారాష్ట్ర 12 పరుగుల తేడాతో అస్సాంపై గెలవగా.. సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం ఫైనల్ జరుగుతుంది. కాగా ఈ సెమీస్ మ్యాచ్లలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సౌరాష్ట్ర సారథి జయదేవ్ ఉనాద్కట్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. జట్ల గెలుపులో కీలక పాత్ర పోషించి వీరిద్దరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం. రుతు మరో సెంచరీ ముందుగా బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 168; 18 ఫోర్లు, 6 సిక్స్లు) తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ మరో సెంచరీ సాధించగా, అంకిత్ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా శతకం బాదాడు. అనంతరం అస్సాం చివరి వరకు పోరాడి 50 ఓవర్లలో 8 వికెట్లకు 338 పరుగులు చేయగలిగింది. చెలరేగిన ఉనాద్కట్ మరో సెమీస్లో ముందుగా కర్ణాటక 49.1 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. జయదేవ్ ఉనాద్కట్ 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌరాష్ట్ర 36.2 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. చదవండి: ICC WC Super League: సిరీస్ సమం చేసిన శ్రీలంక.. ఇంకో రెండు మ్యాచ్లు గెలిస్తే నేరుగా.. Shikhar Dhawan: పంత్కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే! -
IPL 2022: ధోని అరుదైన రికార్డు.. రైనా, పొలార్డ్ను వెనక్కి నెట్టి
IPL 2022 CSK Vs MI- MS Dhoni Rare Record: ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ బ్యాటర్, మిస్టర్ ఫినిషర్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డు సాధించాడు. క్యాష్ రిచ్ లీగ్లో ఒక ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్లో అత్యంత వేగంగా వంద పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్న సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్, కీరన్ పొలార్డ్లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. గురువారం నాటి మ్యాచ్లో ముంబై బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్లో వరుస షాట్లు బాది ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో మొత్తంగా ఉనాద్కట్ బౌలింగ్లో 42 బంతులు ఎదుర్కొన్న ధోని 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు సురేశ్ రైనా సందీప్ శర్మ బౌలింగ్లో 47 బంతుల్లో, ఏబీ డివిల్లియర్స్ కూడా సందీప్ శర్మ బౌలింగ్లోనే 47 బంతుల్లో, కీరన్ పొలార్డ్ రవీంద్ర జడేజా బౌలింగ్లో 47 బంతుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక ముంబైతో మ్యాచ్లో మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న ధోని 28 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతికి మిస్టర్ కూల్ ఫోర్ బాదడంతో 3 వికెట్ల తేడాతో జడ్డూ సేనను విజయం వరించింది. ఐపీఎల్లో ఒక ఆటగాడి బౌలింగ్లో అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన బ్యాటర్లు: ఎంఎస్ ధోని- 42 బంతుల్లో- జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్లో సురేశ్ రైనా- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్లో ఏబీ డివిల్లియర్స్- 47 బంతుల్లో- సందీప్ శర్మ బౌలింగ్లో కీరన్ పొలార్డ్- 47 బంతుల్లో- రవీంద్ర జడేజా బౌలింగ్లో చదవండి: CSK Vs MI: వరుసగా 7 ఓటములు.. అయినా ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే! Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'ముంబై గెలవాలంటే అతడు జట్టులోకి రావాల్సిందే'
ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2022లో పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఈ ఏడాది సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోను ఓటమి చెంది ముంబై ఘోర పరాభవం మూట కట్టుకుంది. కాగా ముంబై జట్టు బ్యాటింగ్లో రాణిస్తున్నప్పటటికీ.. పేస్ బౌలింగ్లో మాత్రం అంతగా రాణించలేక పోతుంది. జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగితా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. కాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. జయదేవ్ ఉనద్కత్ను ముంబై తుది జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఉనద్కత్ను బెంచ్కే ఎందుకు పరిమితం చేస్తున్నారో అర్ధం కావడంలేదు అని తెలిపాడు. "గత ఏడాది సీజన్ వరకు ముంబై జట్టులో నాథన్ కౌల్టర్ నైల్ ఉండేవాడు. జట్టులో ఏ బౌలరైనా బాగా రాణించకపోయినా లేదా గాయపడినా కౌల్టర్ నైల్ జట్టులోకి వచ్చేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ముంబై మేనేజ్మెంట్ బెంచ్లో ఉన్నవారికి తుది జట్టులో అవకాశం ఇవ్వడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్ వంటి వారు ఇంకా బెంచ్కే పరిమితం అవుతున్నారు. అంతే కాకుండా సంజయ్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్ వంటి యువ పేసర్లు కూడా జట్టులో ఉన్నారు. జట్టులో బాసిల్ థంపి, డేనియల్ సామ్స్ అంతగా రాణించడం లేదు. వీరిద్దరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. కాగా ముంబై మాత్రం తమ తుది జట్టులోకి జయదేవ్ ఉనద్కత్ను తీసుకునే సమయం వచ్చింది. అతడికి ఐపీఎల్లో చాలా అనుభవం ఉంది. గతంలో రైజింగ్ పూణె సూపర్జెయింట్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అదే విధంగా ఐపీఎల్ 2018 వేలంలో ఉనద్కత్ 11.5 కోట్లకు అమ్ముడు పోయాడు. అయితే అతడు తన తర్వాత సీజన్లో అంతగా రాణించలేక పోయాడు. అయినప్పటికీ ఐపీఎల్లో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా బుమ్రాకు అతడే సరైన జోడి" అని నేను భావిస్తున్నాను. చదవండి: IPL 2022: పంత్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే.. అసలు ఇలా ఎందుకు చేశాడో? -
Vijay Hazare Trophy: ప్రేరక్ మన్కడ్ అద్భుత ఇన్నింగ్స్.. సెమీస్లో సౌరాష్ట్ర
Saurashtra Won: విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో సౌరాష్ట్ర అదరగొట్టింది. జయదేవ్ ఉనద్కట్ సారథ్యంలోని జట్టు... విదర్భను ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. ప్రేరక్ మన్కడ్ హాఫ్ సెంచరీ(72 బంతుల్లో 77 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర.... 150 పరుగులకే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసింది. జట్టులోని ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీయడం విశేషం. ఈ క్రమంలో 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌరాష్ట్ర... ఆదిలోనే విశ్వరాజ్ జడేజా వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హర్విక్ దేశాయ్(9 పరుగులు) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. వన్డౌన్లో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ప్రేరక్ మన్కడ్, అర్పిత్ వాసవడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వరుసగా 77, 41 పరుగులతో అజేయంగా నిలిచి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విదర్భపై విజయం సాధించి సెమీస్ చేరుకుంది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రేకు రెండు, లలిత్ యాదవ్కు ఒక వికెట్ దక్కాయి. అంతకుముందుబ్యాటర్ అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు) చేయడంతో విదర్భ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్కోర్లు: విదర్భ- 150 (40.3) సౌరాష్ట్ర- 151/3 (29.5) DO NOT MISS: Prerak Mankad's match-winning 77* (72) against Vidarbha 👍 👍 The Saurashtra right-hander creamed 10 fours & 2 sixes to power his side to a convincing 7-wicket win in the #QF3 of the #VijayHazareTrophy. 👏 👏 #SAUvVID Watch his knock 🎥 🔽https://t.co/EVS1KXWGgV pic.twitter.com/iAQU5i8iJ9 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
Vijay Hazare Trophy: 23,1,1,1,18,14,1,0,5,0.. అందరూ చేతులెత్తేశారు.. ఒక్కడే 72!
Sheldon Jackson Super Diving Catch Video Viral: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ అద్భుత క్యాచ్తో మెరిశాడు. సూపర్డైవ్తో విదర్భ బ్యాటర్ అథర్వ టైడ్ పెవిలియన్ చేరేలా చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ-2021 మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన విదర్భకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ ఫాజల్ 23 పరుగులు చేయగా.. అతడికి జోడీగా ఓపెనింగ్కు దిగిన అథర్వ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి వెనుదిరిగాడు. మూడో ఓవర్ మూడో బంతికి జయదేవ్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పాదరసంలా కదిలి డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత విదర్భ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. అయితే అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు)తో రాణించడంతో 40.3 ఓవర్లలో 150 పరుగులు చేసి విదర్భ ఆలౌట్ అయింది. విదర్భ బ్యాటర్ల స్కోర్లు వరుసగా.. 23,1,1,1,18,14,72,1,0,5,0. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్కు 2, చేతన్ సకారియాకు ఒకటి, చిరాగ్ జానీకి 2, ప్రేరక్ మన్కడ్కు ఒకటి, డీఏ జడేజాకు రెండు, యువరాజ్ చౌడసమాకు 2 వికెట్లు దక్కాయి. సౌరాష్ట్ర బ్యాటింగ్ కొనసాగిస్తోంది. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! ఆ టీమిండియా బ్యాటర్కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ .@ShelJackson27's superb diving catch 👌 👌 Jackson, keeping the wickets, flew towards his left & completed a stunning catch off @saucricket captain @JUnadkat to dismiss Atharva Taide. 👍 👍 #SAUvVID #VijayHazareTrophy #QF3 Watch that catch 🎥 🔽https://t.co/aqsiKMv4A8 pic.twitter.com/Z0Rah3D6P5 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
బ్యాటింగ్ వీడియో షేర్ చేశాడు.. 'నన్ను ఆల్రౌండర్గా పరిగణించండి'
Jayadev Unadkat Shares Batting Video Ask Selectors Indirectly Consider For All Rounder.. జైదేవ్ ఉనాద్కట్.. టీమిండియాకు 2010లోనే టెస్టు క్రికెట్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఒక టెస్టు, 7 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఉనాద్కట్ బౌలర్గానే ఎంపికయ్యాడు. ఆ తర్వాత క్రమంగా టీమిండియాకు దూరమయ్యాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఉనాద్కట్ సౌరాష్ట్ర కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఉనాద్కట్ తన బ్యాటింగ్ వీడియోనూ షేర్ చేస్తూ.. ''జాతీయ జట్టులో ఆల్రౌండర్గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా.. నన్ను పరిగణలోకి తీసుకోండి.'' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: Syed Musthaq Ali T20: సయ్యద్ ముస్తాక్ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు కాగా ప్రస్తుతం టీమిండియాలో పేస్ ఆల్రౌండర్ అవసరం చాలా ఉంది. హార్దిక్ పాండ్యా రూపంలో ఆ భర్తీ జరిగిందని భావించినప్పటికీ.. అతను ఫామ్ కోల్పోయి జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2021లో హార్దిక్ టీమిండియాకు ఆల్రౌండర్గా ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్తో టి20 సిరీస్కు సెలక్టర్లు హార్దిక్ను పక్కనబెట్టారు. ఇక అతని స్థానంలో వెంకటేశ్ అయ్యర్ పేస్ ఆల్రౌండర్గా చోటు కల్పించినప్పటికీ అతనికి ఇదే డెబ్యూ సిరీస్ కావడం విశేషం. ఇక టీమిండియా తరపున 2018లో చివరి వన్డే ఆడిన ఉనాద్కట్ అప్పటినుంచి దేశవాలీ లీగ్లతో పాటు ఐపీఎల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్కు రాజస్తాన్ రాయల్స్కు ఉనాద్కట్ రూ. 11.5 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. చదవండి: IND vs NZ Test Series: కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు Just another pace bowler who can bat.. 😉 pic.twitter.com/FlIEns2JB6 — Jaydev Unadkat (@JUnadkat) November 12, 2021 -
ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు..
న్యూఢిల్లీ: దేశవాళీ స్టార్ ఆటగాడు, ప్రస్తుత రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ కు సంబంధించిన సంచలన విషయాలను సౌరాష్ట్ర కోచ్ కర్సన్ గావ్రి వెల్లడించాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్ .. ఇకఫై ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడని, ఈ విషయాన్ని సాక్షాత్తు బీసీసీఐ సెలెక్టరే తనతో చెప్పాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019-20 రంజీ సీజన్లో ఏకంగా 67 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రను తొలిసారి ఛాంపియన్ గా నిలబెట్టిన 30 ఏళ్ల ఉనద్కత్ పై సెలెక్టర్లు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగివుండటాన్ని ఆయన తప్పు బట్టాడు. వయసును బూచిగా చూపి ఉనద్కత్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేకపోవడమన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (ఒక సీజన్లో) సాధించిన ఆటగాడిని కనీసం భారత 'ఏ' జట్టులోకి కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నాడు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించి పెడుతుందని ఉనద్కత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, వాటిపై సెలెక్టర్లు నీళ్లు చల్లేలా ఉన్నారని విచారం వ్యక్తం చేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు ఉనద్కత్ ను ఎంపిక చేస్తారని తానూ కూడా ఆశగా ఎదురు చూశానన్నాడు. ఉనద్కత్ తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను 2010లో ఆడాడని, అప్పటి నుంచి జట్టులో స్థానం కోసం కఠోరంగా శ్రమించాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో షమీ, సైనీ, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఐపీఎల్ ఎంట్రీ.. అంతా అతని చలువే -
Covid-19: ధావన్ రూ. 20 లక్షలు, ఉనాద్కట్ 30 లక్షలు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో అతలాకుతలం అవుతోన్న భారత్కు సహాయం చేసేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్, మాజీ ప్లేయర్ బ్రెట్లీలు తమ వంతుగా ఆర్థిక సాయం ప్రకటించగా... ఇప్పుడు ఆ జాబితాలోకి భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, జైదేవ్ ఉనాద్కట్లతో పాటు వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా చేరాడు. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు ఆక్సిజన్ ఇండియా అనే ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో)కు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ రూ. 20 లక్షలు అందజేశాడు. దాంతో పాటు ఐపీఎల్లో తాను గెల్చుకొనే ప్రైజ్మనీని కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ధావన్ ప్రకటించాడు. రెండు రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే సంస్థకు రూ. కోటిని విరాళంగా ఇచ్చాడు. వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు తన ఐపీఎల్ జీతం నుంచి 10 శాతాన్ని అందజేస్తున్నట్లు ఉనాద్కట్ ప్రకటించాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని రాజస్తాన్ రాయల్స్ రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ లెక్కన అతడి విరాళం రూ. 30 లక్షలు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ (వెస్టిండీస్) కూడా తనకు ఐపీఎల్ ద్వారా లభించే వేతనంలో నుంచి కొంత భాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: కరోనా కల్లోలం: సచిన్, ఐపీఎల్ జట్ల విరాళాలు ఎంతంటే! -
పెద్ద మనసు చాటుకున్న ఉనాద్కత్
ఢిల్లీ: రాజస్థార్ రాయల్స్ పేసర్ జయ్దేవ్ ఉనాద్కత్ పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కట్టడి కోసం భారత్ సాగిస్తున్న పోరులో ఉనాద్కత్ తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. వైద్య సదుపాయాలు, అత్యవసరాలు కోసం తన ఐపీఎల్ శాలరీలో 10 శాతం విరాళంగా ఇవ్వనున్నట్లు ఉనాద్కత్ ప్రకటించాడు. ఉనాద్కత్ ఐపీఎల్ శాలరీ రూ. 3 కోట్లు కాగా అందులో 10 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నాడు. ఈ మేరకు వీడియోను ట్వీటర్లో విడుదల చేశాడు. ‘ కరోనా బాధితులు ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసు. కరోనా మనుషులతో ఆటలాడుకుంటోంది. కరోనా ఎఫెక్ట్తో నానా బాధలు పడుతున్న వారి వద్ద నా మనసు ఉంది. ఈ సమయంలో నా వంతు సాయంగా 10 శాతం ఐపీఎల్ శాలరీని విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా. మనకు అత్యంత దగ్గరగా ఉండే స్నేహితులే కరోనాతో పోరాటం చేస్తున్నారు. వారి బాధ వర్ణణాతీతం. ఈ సమయంలో క్రికెట్ ఆడటం మంచిదా.. కాదా అనే విషయం నేను చెప్పలేను. ప్రస్తుతం కుటుంబాలకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉది. ఐపీఎల్తో కొంతవరకూ అయినా ఎంజాయ్మెంట్ దొరకుతుందనే అనుకుంటున్నా. మనమంతా ఒకరికోసం ఒకరు ఐక్యంగా ఉండాలి. కరోనాతో బలంగా పోరాడటమే మనముందున్న కర్తవ్యం. ఈ పరిస్థితుల్లో మనకు చేతనైనా సాయం చేయడం మనధర్మం’ అని ఉనాద్కత్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ ఔదర్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. కేకేఆర్ ఆటగాడు ప్యాట్ కమిన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి, ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ తదితరులు సాయం చేసిన వారిలో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రూ 7.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. I am contributing 10% of my IPL salary towards providing essential medical resources for those in need. My family will make sure it reaches the right places. Jai Hind! pic.twitter.com/XvAOayUEcd — Jaydev Unadkat (@JUnadkat) April 30, 2021 ఇక్కడ చదవండి: స్వదేశానికి వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నాం: మ్యాక్సీ పృథ్వీ షాకు ఐదు అవార్డులు.. గర్ల్ఫ్రెండ్ సెటైర్ -
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్
అహ్మదాబాద్: టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ ఓ ఇంటి వాడయ్యాడు. రినీ కంటారియా అనే యువతిని అతడు పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో మంగళవారం వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. సంప్రదాయ వస్త్రధారణలో భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. దీంతో కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా సౌరాష్ట్ర పేసర్ అయిన జయదేవ్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.(చదవండి: భారత క్రికెటర్ విజయ్ శంకర్ వివాహం) కాగా 2010లో సంప్రదాయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉనద్కట్, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున ఆడాడు. ఇక 2018లో రాజస్తాన్ జట్టు అతడిని రూ .11.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అదే జట్టు మళ్లీ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది. అదే విధంగా 2020లో వేలంలోకి రాగా మళ్లీ అదే జట్టు రూ. 3 కోట్లకు దక్కించుకుంది. కానీ ఉనద్కట్ ఆశించిన మేర రాణించకపోవడంతో అంత భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన ఆటగాడితో రాజస్తాన్కు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు అతడిపై విమర్శల వర్షం కురిపించారు. 2.02.2021! ❤️ pic.twitter.com/J9wAop6gMO — Jaydev Unadkat (@JUnadkat) February 3, 2021 -
వారిద్దరి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..
ముంబై : భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లైన జయ్దేవ్ ఉనాద్కట్, రాబిన్ ఊతప్పలను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. కోట్టు పెట్టి వారిద్దరిని కొన్నందుకు రాజస్తాన్కు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ చురకలంటించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 'వీరు కీ బైతక్' పేరుతో ఒక చానెల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 13వ సీజన్కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తన చానెల్ ద్వారా రోజువారి ఎపిసోడ్లుగా రూపొందించి విడుదల చేస్తున్నాడు. వీరు ప్రారంభించిన ఈ న్యూ సిరీస్కు బాగా క్రేజ్ వచ్చింది. (చదవండి : ఎంఎస్ ధోని ఫన్నీ వాక్) తాజాగా నేడు(మంగళవారం) అబుదాబి వేదికగా రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉంటే మరోవైపు ముంబై వరుస విజయాలతో జోరుమీద ఉంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ జట్టులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వీరు విమర్శించాడు. ' రాజస్తాన్ జట్టు తమ ఆటగాళ్లలో కొందరికి అత్యధిక ధరను ఇచ్చి చాలా తప్పులు చేస్తుంది. అందులో ఉనాద్కట్ ఒకడు.. ఈ సీజన్లో ఉనాద్కట్ చెత్త ఫామ్ను కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్లాడి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఉనాద్కట్ను మొదట 2018లో రాజస్తాన్ జట్టే రూ .11.5 కోట్లకు కొనుగోలు చేసింది.. ఆ తర్వాత అదే జట్టు మళ్లీ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది.. 2020లో వేలంలోకి వచ్చిన ఉనాద్కట్ను మళ్లీ అదే ఆర్ఆర్ రూ. 3 కోట్లకు దక్కించుకుంది. ఈ స్కీమ్ చూడడానికి బాగుంది కానీ.. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వచ్చేసారి వేలంలో ఉనాద్కట్ను కొనుగోలు చేయాలంటే రాజస్తాన్కే అతను తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందేమో అంటూ చురకలంటించాడు. ఇక మరొక ఆటగాడు రాబిన్ ఊతప్ప.. నాలుగు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 33 పరుగులే చేసిన ఊతప్ప జట్టుకు భారంగా మారాడు. రాజస్తాన్ అతన్ని రూ. 3కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక ఊతప్ప పరిస్థితి ఎలా ఉందంటే.. బులెట్ కొందామని రాజస్తాన్ రాయల్స్ మార్కెట్(ఐపీఎల్ వేలం)లోకి వెళితే బులెట్కు బుదులు లూనాను కొనుగోలు చేసినట్లు తయారైంది. కోట్టు పెట్టి కొంటే వీరివల్ల జట్టుకు ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి 'అంటూ విమర్శించాడు. అయితే ముంబై ఇండియన్స్తో జరగనున్న నేటి మ్యాచ్లో రాజస్తాన్ కొంచెం ఆధిక్యంలో ఉంది.. అది ఎలా అంటారా.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి నాలుగు మ్యాచ్ల్లో ఆర్ఆర్ ముంబైపై పైచేయి సాధించింది అని చెప్పుకొచ్చాడు. (చదవండి : ధోనిలో ఉన్న గ్రేట్నెస్ అదే!) View this post on Instagram Dilli Ki Nikal Padi. Catch the fresh episode of 'Viru Ki Baithak' every morning only on Facebook Watch #CricketTogether A post shared by Virender Sehwag (@virendersehwag) on Oct 5, 2020 at 10:46pm PDT ఇక ఐపీఎల్ 13వ సీజన్లో ఆర్ఆర్ జట్టు ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్లను భారీ విజయాలుగా మలిచినా.. తర్వాతి రెండు మ్యాచ్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. స్టీవ్ స్మిత్, సంజూ శామ్సన్ తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. స్మిత్, శామ్సన్ విఫలమైతే ఆ జట్టును ఆదుకునేవారు కరువయ్యారు. ముంబై విషయానికి వస్తే ఆరంభ మ్యాచ్లో చతికిలపడి తర్వాత మూడు విజయాలు అందుకొని టాప్2 లో నిలిచి నూతన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. -
'సెంచరీ కంటే భార్య చేసే హెయిర్కట్ కష్టంగా ఉంది'
ముంబై : మ్యాచ్ ఆడేటప్పుడు సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్నప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతామో భార్యతో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజార అంటున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో సెలూన్ షాపులు బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెరిగిన జట్టును కొంతమంది తామే కట్ చేసుకుంటే మరికొందరు ఆ పనిని వారి జీవిత భాగస్వాములకు అప్పగిస్తున్నారు. తాజాగా పుజార తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు.(అఫ్రిది వ్యాఖ్యలకు రైనా స్ట్రాంగ్ కౌంటర్) 'సెంచరీకి ఒక్క పరుగు (99*) దూరంలో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మన్ను ఎంతగా నమ్ముతాము అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అదే జీవిత భాగస్వామితో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అదే నమ్మకం ఉంటుందని దైర్యంగా చెప్పడం మాత్రం చాలా కష్టం.' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సౌరాష్ట్ర సహచర ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ మంకీతో కూడిన ఒక ఎమోజీని పెట్టి పుజారతో నేను కూడా ఏకీభవిస్తా అంటూ కామెంట్ చేశాడు. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్ పుజార 48.86 సగటుతో 5840 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 25 అర్థ సెంచరీలున్నాయి. (మాటలతో జవాబివ్వకు అన్నాడు: కోహ్లి) -
‘మనసులో మాట.. ఆల్రౌండర్గా మారాలి’
హైదరాబాద్: లాక్డౌన్లోనూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని క్రికెటర్లు అందిస్తున్నారు. మొన్నటివరకు మైదానంలో తమ ఆటతో ఉర్రూతలూగించిన క్రికెటర్లు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వెరైటీ ముచ్చట్లతో ఫ్యాన్స్ను కాస్త రిలాక్స్ మోడ్లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్శర్మ, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చహల్, రిషబ్ పంత్, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్లు ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో సహచర క్రికెటర్లతో పాల్గొంటున్నారు. తాజాగా టీమిండియా స్పెషలిస్టు టెస్టు బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా కూడా ఇన్స్టా లైవ్ చాట్లోకి వచ్చాడు. సౌరాష్ట క్రికెట్ జట్టు సారథి జయదేవ్ ఉనాద్కత్తో సరాదాగా సంభాంషించాడు. ఈ సందర్భంగా పుజారా తను ఆల్రౌండర్ కావాలనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా రంజీల్లో సౌరాష్ట్ర తరుపున 203 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 6 వికెట్లు తీసిన విషయాన్ని గుర్తుచేశాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న ఉనాద్కత్ ‘సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలవడానికి నీ బౌలింగే కారణమంటావే ఏంటి?’అని ప్రశ్నించాడు. అయితే తను అలా అనడం లేదని, ప్రస్తుతం పార్ట్ టైమ్ బౌలర్గా ఉన్న తను పూర్తి ఆల్రౌండర్గా మారాలని అనుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఇక రంజీ ట్రోఫీ సౌరాష్ట గెలవడం అత్యంత ఆనందం కలిగించిందన్నాడు. అయితే జ్వరం, గొంతు నొప్పితోనే బెంగాల్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశాడు. లాక్డౌన్ సమయంలో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతూ పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని సూచించాడు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడే తన భార్యకు సహాయంగా ఉంటానని, ఇప్పుడు ఆమెకు వంటింట్లో, ఇతర పనుల్లో సాయం చేస్తున్నట్లు తెలిపాడు. గతంలో వంట చేసేవాడినని కానీ ప్రస్తుతం ఆ సాహసం చేయట్లేదని తెలిపాడు. ఇక వీరిద్దరికి సంబంధించిన సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ‘క్రీజులో పాతుకపోయి బౌలర్ల సహనాన్ని పరీక్షించే పుజారాను ఆదర్శంగా తీసుకొని లాక్డౌన్లో అందరూ ఓపికగా ఇంట్లోనే ఉండాలి’అని ఓ నెటిజన్ పేర్నొన్నాడు. View this post on Instagram The day when I changed my Batsman status to an All-rounder 😂😂 A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on Dec 27, 2019 at 6:32am PST చదవండి: చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు! మహ్మద్ కైఫ్కు షోయబ్ అక్తర్ సవాల్ -
సమష్టి మంత్రం... స్వప్నం సాకారం
ఒకరిద్దరు మినహా భారత్కు ఆడిన ఆటగాళ్లెవరూ ఆ జట్టులో లేరు. అయినా దేశవాళీ క్రికెట్లో ఈసారి ఆ జట్టు అద్భుతమే చేసింది. ఆద్యంతం నిలకడగా రాణించింది. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. నాలుగో ప్రయత్నంలో రంజీ ట్రోఫీ చాంపియన్గా అవతరించింది. ప్రత్యర్థి ఎవరైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, పిచ్ ఎలాంటిదైనా ... పక్కా ప్రణాళికతో ఆడితే తుది ఫలితం కోరుకున్నట్లు ఉంటుందని నిరూపించిన జట్టే సౌరాష్ట్ర. గత ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నా... నిరాశ చెందకుండా ఈసారి మరింత పకడ్బందీగా ఆడిన సౌరాష్ట్ర చాంపియన్గా నిలిచి ఔరా అనిపించింది. భారత జట్టులోకి పునరాగమనం చేయగల సత్తా నాలో ఉంది. ఆ పట్టుదలే ఈ సీజన్లో నేను అద్భుతంగా ఆడేలా ప్రేరేపించింది. దాదాపు ప్రతీ మ్యాచ్లో సుదీర్ఘ స్పెల్లు వేయాల్సి రావడం శారీరకంగా కూడా నన్ను తీవ్ర శ్రమకు గురి చేసింది. అయితే మేం ఈసారి రంజీ ట్రోఫీ గెలవగలిగాం. ప్రపంచంలో ఇప్పుడు అందరికంటే ఎక్కువగా నేనే సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఐపీఎల్లో భారీ మొత్తాలకు అమ్ముడుపోయిన ఆటగాడిగానే చాలా మంది నా గురించి మాట్లాడుతుంటారు. అయితే ఆడేటప్పుడు ఐపీఎల్ గురించి ఆలోచన రాదు. ఒక క్రికెటర్గా దేశంలో చాలా మందిలాగే మైదానంలో నేనూ కష్టపడతాను. ఇప్పుడు నా రాష్ట్ర జట్టు తరఫున రంజీ గెలవడంతో నా సుదీర్ఘకాల స్వప్నం సాకారమైంది. –జైదేవ్ ఉనాద్కట్, సౌరాష్ట్ర కెప్టెన్ సాక్షి క్రీడా విభాగం: రంజీ సీజన్ ప్రారంభమైన మొదట్లో సౌరాష్ట్ర జట్టు చాంపియన్గా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేదు. కర్ణాటక, తమిళనాడు, ముంబై, విదర్భ జట్లలో ఒకటి విజేతగా నిలుస్తుందని అంచనా వేశారు. కానీ సౌరాష్ట్ర జట్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రంజీ ట్రోఫీ టైటిల్ను ఎగరేసుకుపోయింది. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర జట్టుకు ఆడే భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒక్క మ్యాచ్లోనూ అందుబాటులో లేకుండా పోయాడు. భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కేవలం ఆరు మ్యాచ్ల్లో సౌరాష్ట్రకు ఆడాడు. వీరిద్దరి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకున్నా సౌరాష్ట్ర సీజన్ మొత్తం నిలకడగా రాణించింది. బ్యాటింగ్లో, బౌలింగ్లో మెరిపించి ప్రత్యర్థుల ఆట కట్టించింది. భారత క్రికెటర్, జట్టు కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ అన్నీ తానై సౌరాష్ట్రను ముందుండి నడిపించాడు. శుభారంభంతో... గత ఏడాది రన్నరప్గా నిలిచిన సౌరాష్ట్ర 2019–2020 సీజన్ను వరుసగా రెండు విజయాలతో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో హిమాచల్ప్రదేశ్పై ఐదు వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్లో రైల్వేస్పై ఇన్నింగ్స్ 90 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. అయితే ఉత్తర్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్రకు ఇన్నింగ్స్ 72 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. ఈ రంజీ సీజన్లో సౌరాష్ట్ర ఓడిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఉత్తర్ప్రదేశ్ చేతిలో ఓటమి ఎదురయ్యాక సౌరాష్ట్ర లీగ్ దశలో ఆడిన మిగతా ఐదు మ్యాచ్ల్లో నాలుంగిటిని ‘డ్రా’ చేసుకొని మరో మ్యాచ్లో గెలిచి 41 పాయింట్లతో 18 జట్లున్న ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్లో 31 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న ఆంధ్ర జట్టుతో ఒంగోలులో జరిగిన క్వార్టర్ ఫైనల్ను సౌరాష్ట్ర ‘డ్రా’ చేసుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించి సెమీఫైనల్ బెర్త్ను దక్కించుకుంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర ఒకదశలో తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చిరాగ్ జానీ అద్భుత సెంచరీ, ప్రేరక్ మన్కడ్ అర్ధ సెంచరీ చేసి సౌరాష్ట్రకు 419 పరుగుల భారీ స్కోరును అందించారు. అనంతరం బౌలింగ్లో జైదేవ్ ఉనాద్కట్ విజృంభణకు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులకే ఆలౌటైంది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా సౌరాష్ట్ర రిస్క్ తీసుకోకుండా వ్యూహాత్మకంగా రెండో ఇన్నింగ్స్ ఆడి మళ్లీ భారీ స్కోరు చేసింది. మాజీ చాంపియన్ గుజరాత్తో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ తొలి ఇన్నింగ్స్లో మూడు, రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లోనూ మెరిసిన ఉనాద్కట్ సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో 28 ఏళ్ల ఉనాద్కట్ ఓవరాల్గా ఈ సీజన్లో అత్యధికంగా 67 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఒకరు కాదంటే మరొకరు.... జట్టు క్రీడ అయిన క్రికెట్లో ఏ ఒక్కరితోనో ఎల్లవేళలా విజయాలు సాధించడం సాధ్యం కాదు. సమష్టి ప్రదర్శన చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సీజన్లో సౌరాష్ట్ర విషయంలో ఇదే జరిగింది. జట్టు ఒకరిద్దరు ప్రదర్శనపై ఆధారపడలేదు. ఒక మ్యాచ్లో ఒకరు మెరిస్తే మరో మ్యాచ్లో ఇతర ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఎడంచేతి వాటం బ్యాట్స్మన్ అర్పిత్ వసవాడ సెమీఫైనల్లో, ఫైనల్లో సెంచరీలు చేశాడు. ఓవరాల్గా టోర్నీ మొత్తంలో అర్పిత్ నాలుగు సెంచరీలతో కలిపి మొత్తం 763 పరుగులు చేశాడు. ఆల్రౌండర్ చిరాగ్ జానీ పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ హార్విక్ దేశాయ్, వెటరన్ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ కూడా తమవంతు పాత్ర పోషించారు. షెల్డన్ జాక్సన్ మొత్తం పది మ్యాచ్లు ఆడి మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 809 పరుగులు చేసి సౌరాష్ట్ర తరఫున రంజీ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్ పుజారా 573 పరుగులు... చిరాగ్ జానీ 544 పరుగులు... హార్విక్ దేశాయ్ 597 పరుగులు... ప్రేరక్ మన్కడ్ 445 పరుగులు సాధించారు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లేని లోటును తెలియకుండా మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్ర సింగ్ జడేజా ముఖ్యపాత్ర నిర్వర్తించాడు. అతను ఈ సీజన్లో 388 పరుగులు చేయడంతోపాటు 32 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు. ఈసారి సౌరాష్ట్ర చాంపియన్గా అవతరించడానికి సమష్టి ప్రదర్శనే కారణమని ఆ జట్టు కోచ్ నీరజ్ ఒదేద్రా అభిప్రాయపడ్డారు. ‘గతంలోనూ సౌరాష్ట్ర బాగా ఆడింది. ఫైనల్స్కూ చేరింది. అయితే ఆ సందర్భాల్లో స్టార్ ఆటగాళ్లపైనే పూర్తిగా ఆధారపడింది. స్టార్ ప్లేయర్లు విఫలమైతే ఫలితం మరోలా వచ్చేది. ఈసారి మాత్రం పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరూ తమవంతుగా రాణించడంలో సౌరాష్ట్రకు టైటిల్ లభించింది. గత సీజన్లో జైదేవ్ ఉనాద్కట్ జట్టు పగ్గాలు చేపట్టాక ఆటగాళ్ల మైండ్సెట్లోనూ మార్పు వచ్చింది. ఒకప్పుడు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తేనో, ‘డ్రా’ చేసుకుంటేనో సంతృప్తి పడేది. కానీ ఉనాద్కట్ కెప్టెన్ అయ్యాక సౌరాష్ట్ర ప్రతి మ్యాచ్లో విజయమే లక్ష్యంగా పోరాడటం అలవాటు చేసుకుంది’ అని నీరజ్ అన్నారు. ఉనాద్కట్ నిశ్చితార్థం... సౌరాష్ట్రను రంజీ చాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ త్వరలోనే ఇంటివాడు కానున్నాడు. ఆదివారం రాజ్కోట్లో తన ప్రియురాలు రిన్నీతో జైదేవ్ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత టెస్టు క్రికెటర్, సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారాతోపాటు సౌరాష్ట్ర జట్టుకు చెందిన ఇతర సభ్యులు హాజరయ్యారు. -
సౌరాష్ట్రకు ‘జై’
గత ఏడు సీజన్లలో మూడుసార్లు ఫైనల్కు చేరినా... ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీ గెలవలేకపోయిన సౌరాష్ట్ర ఎట్టకేలకు విజయబావుటా ఎగరేసింది. జైదేవ్ ఉనాద్కట్ నాయకత్వంలో తొలిసారి విజేతగా అవతరించింది. సొంత మైదానంలో హోరాహోరీగా సాగిన తుది పోరులో బెంగాల్పై సాధించిన 44 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సౌరాష్ట్రను చాంపియన్ను చేసింది. చివరి రోజు నాలుగు వికెట్లతో ఆధిక్యం కోసం బెంగాల్ పోరాడినా లాభం లేకపోయింది. చివరకు రంజీ చరిత్రలో ఎక్కువ సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. రాజ్కోట్: భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. జైదేవ్ ఉనాద్కట్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు మొదటిసారి విజేతగా నిలిచింది. సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం ‘డ్రా’గా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సౌరాష్ట్రకు ట్రోఫీ ఖరారైంది. చివరి రోజు 72 పరుగులు చేస్తే ఆధిక్యం అందుకునే స్థితిలో ఆట కొనసాగించిన బెంగాల్ తమ తొలి ఇన్నింగ్స్లో 381 పరుగులకు ఆలౌటైంది. దాంతో మొదటి ఇన్నింగ్స్లో 425 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 44 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. అయితే విజేత ఖరారైన నేపథ్యంలో ముందుగానే ఆటను నిలిపివేసేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఆ వెంటనే సొంత గడ్డపై సౌరాష్ట్ర సంబరాలు మొదలయ్యాయి. విజేత సౌరాష్ట్రకు రూ. 2 కోట్లు ప్రైజ్మనీ లభించింది. ఉనాద్కట్ జోరు... సీజన్ మొత్తం తన అద్భుత బౌలింగ్, కెప్టెన్సీతో సౌరాష్ట్రను నడిపించిన ఉనాద్కట్ చివరి రోజు కూడా కీలక పాత్ర పోషించాడు. ఓవర్నైట్ స్కోరు 354/6తో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు అనుస్తుప్ మజుందార్ (151 బంతుల్లో 63; 8 ఫోర్లు)పైనే తమ ఆశలు పెట్టుకుంది. అయితే ఆరో ఓవర్లోనే ఆ జట్టుకు దెబ్బ పడింది. ఉనాద్కట్ బౌలింగ్లో అనుస్తుప్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బ్యాట్స్మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అదే ఓవర్లో మరో రెండు బంతులకే ఆకాశ్ దీప్ (0) రనౌటయ్యాడు. సింగిల్ తీసేందుకు అవకాశం లేకపోయినా షాట్ ఆడిన ఆకాశ్ ముందుకు వచ్చాడు. కీపర్ బారోత్ విసిరిన బంతి స్టంప్స్ను తాకలేదు. అయితే చురుగ్గా వ్యవహరించిన ఉనాద్కట్ వెంటనే దాన్ని అందుకొని వికెట్లపైకి విసిరాడు. అప్పటికీ క్రీజ్లో వెనక్కి రాని ఆకాశ్ వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ (5)ను ధర్మేంద్ర జడేజా పెవిలియన్కు పంపగా... కొద్ది సేపటికే ఇషాన్ పొరెల్ (1)ను అవుట్ చేసి ఉనాద్కట్ బెంగాల్ ఆట ముగించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర తరఫున అవి బారోత్ (39) టాప్ స్కోరర్గా నిలిచాడు. హార్విక్ దేశాయ్ (21), విశ్వరాజ్ జడేజా (17), అర్పిత్ వసవాద (3) వికెట్లు తీయడంలో బెంగాల్ సఫలమైంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ చివరి బంతికి బారోత్ అవుట్ కాగానే ఇరు జట్లు ఆటగాళ్లు కరచాలానికి సిద్ధపడ్డారు. ►1 సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి. 1950–51 సీజన్ నుంచి జట్టు ఈ పేరుతో బరిలోకి దిగుతోంది. అంతకుముందు సౌరాష్ట్రకు పూర్వ రూపంగా ఉన్న, ఇదే ప్రాంతానికి చెందిన రెండు జట్లు నవానగర్ (1936–37), వెస్టర్న్ ఇండియా (1943–44) రంజీల్లో విజేతలుగా నిలిచాయి. ఆ రెండు సార్లు ఫైనల్లో బెంగాలే ఓడింది. ►12 రంజీల్లో అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. 14 సార్లు తుది పోరుకు అర్హత సాధించిన బెంగాల్ 2 సార్లు మాత్రమే టైటిల్ అందుకోగలిగింది. బెంగాల్ ఆఖరిసారిగా 1989–90లో టైటిల్ సాధించింది. ►67 ఈ సీజన్లో జైదేవ్ ఉనాద్కట్ తీసిన వికెట్లు. రంజీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జైదేవ్ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది బిహార్ బౌలర్ అశుతోష్ అమన్ 68 వికెట్లు పడగొట్టాడు. -
21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు..
రాజ్కోట్: తాజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్, పేసర్ జయదేవ్ ఉనాద్కత్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. గుజరాత్తో జరిగిన సెమీ ఫైనల్లో ఉనాద్కత్ సంచనల ప్రదర్శన నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు సాధించి గుజరాత్ను కట్టడి చేసిన ఉనాద్కత్.. రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ రంజీ సీజన్లో ఉనాద్కత్ తీసిన వికెట్ల సంఖ్య 65కు చేరింది. ఫలితంగా ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్గా ఉనాద్కత్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 1998-99 సీజన్లో కర్ణాటక పేస్ బౌలర్ దొడ్డా గణేశ్ నెలకొల్పిన 62 వికెట్ల రికార్డును ఉనాద్కత్ బద్ధలు కొట్టాడు. ఈ జాబితాలో బెంగాల్కు చెందిన రణదేబ్ బోస్ 57 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, హరియాణాకు చెందిన హర్షల్ పటేల్ 52 వికెట్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. (13 ఏళ్ల తర్వాత... రంజీ ఫైనల్లో బెంగాల్) మాజీ చాంపియన్ గుజరాత్తో బుధవారం ముగిసిన ఐదు రోజుల సెమీఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టు 92 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దాంతో వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్కు చేరింది. 327 పరుగుల లక్ష్యంతో... ఓవర్నైట్ స్కోరు 7/1తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ను జైదేవ్ ఉన్కాదట్ దెబ్బ తీశాడు. జైదేవ్ ధాటికి గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో 72.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పార్థివ్ పటేల్ (148 బంతుల్లో 93; 13 ఫోర్లు), చిరాగ్ గాంధీ (139 బంతుల్లో 96; 16 ఫోర్లు) త్రుటిలో సెంచరీలు కోల్పోయారు. వీరిద్దరిని జైదేవ్ ఉనాద్కట్ అవుట్ చేశాడు. ఈనెల 9 నుంచి రాజ్కోట్లో మొదలయ్యే ఫైనల్లో బెంగాల్తో సౌరాష్ట్ర తలపడుతుంది. -
క్రేజ్ తగ్గని ఉనాద్కత్
జైపూర్: సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనాద్కత్కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ సీజన్ 12 కోసం ప్రారంభమైన ఆటగాళ్ల వేలంలో ఈ లెఫ్టార్మ్ బౌలర్ మరోసారి రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా రూ. 8.40 కోట్ల ధరకు రాజస్తాన్ రాయల్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ సీజన్లోనూ రూ.11.5 కోట్లకు రాజస్థానే కోనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్లో ఉనాద్కత్ (15 మ్యాచ్ల్లో 11 వికెట్లు) పూర్తిగా నిరాశపరిచినప్పటికీ అతడిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది. ఇక ఈ ఆటగాడి కోసం పలు ఫ్రాంచైజీలు పోటిపడటం విశేషం. ఇప్పటివరకూ జరిగిన వేలంలో హనుమ విహారి జాక్పాట్ కొట్టాడు. అతని కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్ బ్రాత్వైట్ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్, హెట్మెయిర్ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ, వృద్దిమాన్ సాహాను రూ.1.2 కోట్లకు సన్రైజర్స్, లసింత్ మలింగాను రూ.2 కోట్లకు ముంబై ఇండియన్స్, ఇషాంత్ శర్మను రూ.1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, వరుణ్ ఆరోన్ను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. చదవండి: ఐపీఎల్ వేలం: హనుమ విహారి జాక్పాట్ -
వేలంలో హీరోలు..ఆటలో జీరోలు
-
ఐపీఎల్ : పైసల్ ఎక్కువ.. పరుగులు తక్కువ!
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ లీగ్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కు ఏమాత్రం కొదవ ఉండదు. ఈ లీగ్లో ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు సొంత జట్టుకు ఆడటానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏడాది పాటు జాతీయ జట్టుకు ఆడితే రాని డబ్బు సరిగ్గా ఒకటిన్నర నెల ఆడితే తమ ఖాతాల్లో జమ అవుతుంది. దీంతోనే ఐపీఎల్లో ఆడేందుకు అన్ని క్రికెట్ దేశ ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తారు. ఒక్కో ఆటగాడికి కోట్ల రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇప్పటికే ఐపీఎల్ లీగ్లో సగం షెడ్యూల్ పూర్తి అయింది. కానీ ఈ సీజన్ వేలంలో కొందరు ఆటగాళ్లు అధిక ధరకు అమ్ముడయ్యారు. కానీ వారు ఆటలో దారుణంగా విఫలమయ్యారు. వారు ఎవరంటే.. డీఆర్సీ షార్ట్ : ఆస్ట్రేలియాకు చెందిన షార్ట్ బిగ్బాష్ టీ20 లీగ్లో అత్యధిక పరుగులు చేశాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ జట్టు నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బిగ్బాష్లో లీగ్లో సంచలనం కలిగించిన ఈ యువ కెరటం ఐపీఎల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్ల్లో 97.01 స్ట్రైక్ రేట్తో కేవలం 65 పరుగులు చేశాడు. గ్లేన్ మ్యాక్స్వెల్ : టీ20 క్రికెట్లో మ్యాక్స్వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బరిలో దిగితే ప్రత్యర్థికి చుక్కలు చూపించేస్తాడు. కానీ గత రెండు సీజన్ల నుంచి మాత్రం తన ప్రభావం చూపించలేక పోతున్నాడు. కింగ్స్ పంజాబ్ను వదిలి ఢిల్లీ తరపున ఆడుతున్న మ్యాక్స్వెల్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్లు ఆడగా మొత్తం చేసిన పరుగులు 126, స్ట్రైక్ రేటు 159.49. ఈ ఆసీస్ ఆటగాడిని ఏడు కోట్ల రూపాలయకు ఢిల్లీ కొనుగోలు చేసింది. జయదేవ్ ఉనద్కట్ : బౌలర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఉనద్కత్ ఒకడు. గత సీజన్లో పూణె తరపున సంచలన బౌలింగ చేసిన ఇతడు ఈ సీజన్లో మాత్రం తన బౌలింగ్ పదును చూపెట్టలేక పోతున్నాడు. గత సీజన్లో ఉనద్కత్ బౌలింగ్ చూసిన రాజస్తాన్ రాయల్స్ 11.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 7మ్యాచ్లు ఆడి కేవలం 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎకనామీ 10.18గా ఉంది. కీరన్ పోలార్డ్ : క్రీజులో దిగంగానే బంతిని బౌండరీ తరలించడంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ముందుంటారు. ఈ కోవలో కీరన్ పోలార్డ్ ఒకరు. ముంబై తరపున ఆల్రౌండర్ పాత్ర పోషిస్తుంటాడు. చాలా సార్లు ఒంటిచేత్తో ముంబైకి విజయాలు అందించాడు. కానీ ఈ సారి దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్లు ఆడగా 108.57 స్ట్రైక్ రేటుతో కేవలం 76 పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ : ఆస్ట్రేలియాకు చెందిన ఫించ్ను కింగ్స్ పంజాబ్ 6.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక పోయాడు. ఆరు మ్యాచ్లు ఆడగా మొత్తం 24 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 150గా ఉంది. -
ఈసారి ఐపీఎల్ ట్రోఫీ మాదే: ఖరీదైన క్రికెటర్
సాక్షి, రాజ్కోట్: ఐపీఎల్-11 సీజన్ నేపథ్యంలో ఇటీవల జరిగిన వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రెండోవాడు జయదేవ్ ఉనాద్కట్. పంజాబ్కే ఖాయం అనిపించిన దశలో అనూహ్యంగా రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 11.5 కోట్లతో ఉనాద్కట్ను సొంతం చేసుకోవడంతో భారత్ నుంచి వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్గా నిలిచాడు. భారీ ప్యాకేజీతో తనను కొనుగోలు చేయడంపై టీమిండియా క్రికెటర్ ఉనాద్కట్ హర్షం వ్యక్తం చేశాడు. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న తమ జట్టు రాజస్తాన్ ఐపీఎల్-11 సీజన్ ట్రోఫీ నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు సాధ్యమైనన్ని విజయాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తొలిరోజు వేలంలో రూ.11 కోట్ల ధర పలికిన మనీశ్ పాండే, కేఎల్ రాహుల్లను రెండోరోజు జరిగిన ఐపీఎల్ వేలంలో అధిగమించాడు ఈ సౌరాష్ట్ర ప్లేయర్. రూ.11.5 కోట్ల ధరతో ఈ సీజన్ వేలంలో బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు) తర్వాత అత్యంత ఖరీదైన క్రికెటర్గా రికార్డులు తిరగరాశాడు ఉనాద్కట్. గత ఏడాది పుణే తరఫున ఆడిన ఉనాద్కట్ హ్యాట్రిక్ సహా 7.02 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ (26) తర్వాత రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత వేలం ధరతో ఈ ఆటగాడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
రైనాకు ఛాన్స్.. యువీకి మొండిచేయి
సాక్షి, ముంబై: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. సురేశ్ రైనా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ వేలంలో జాక్పాట్ కొట్టిన జయదేవ్ ఉనాద్కత్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన గత టీ20 సిరీస్లో విశ్రాంతి తీసుకున్న శిఖర్ ధవన్ కూడా టీమ్లోకి వచ్చాడు. యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకున్నాడు. దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన సీనియర్ ఆల్రౌండర్ సురేశ్ రైనాకు మళ్లీ అవకాశం దక్కింది. 31 ఏళ్ల రైనా గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20లో చివరిసారిగా ఆడాడు. యువరాజ్ సింగ్కు మరోసారి మొండిచేయి చూపారు. కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ ఛాన్స్ దక్కించుకున్నారు. టీ20 టీమ్ విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్ -
ఐపీఎల్ వేలంలో పెను సంచలనం
-
ఐపీఎల్ వేలంలో పెను సంచలనం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్కు సంబంధించి రెండో రోజు కొనసాగుతున్న వేలంలో పెను సంచలనం నమోదైంది. సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రూ. 11.50 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహించి బౌలింగ్లో సత్తాచాటిన ఉనాద్కత్కు ఈసారి వేలంలో అత్యధిక మొత్తాన్ని చెల్లించి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఉనాద్కత్కు కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు ఉండగా, అంతకు 10 రెట్లు అధికంగా అమ్ముడుపోవడం విశేషం. అయితే ఇప్పటివరకూ జరిగిన ఈ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఆటగాడిగా ఉనాద్కత్ నిలిచాడు. బెన్ స్టోక్స్(12.5 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాడు కాగా, ఆ తర్వాత స్థానంలో ఉనాద్కత్ నిలిచాడు. అయితే భారత్ నుంచి అత్యధిక ధర పలికిన ఆటగాడు ఉనాద్కత్ కావడం మరో విశేషం. మరొకవైపు హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఐపీఎల్ వేలంలో ఫర్వాలేదనిపించాడు. అతని కనీస ధర రూ. కోటి ఉండగా, రూ. 2.60 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఇక కౌల్టర్ నైల్ రూ. 2.2 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోగా, పేసర్ వినయ్ కుమార్ను రూ. 1 కోటి వెచ్చించి కేకేఆర్ సొంతం చేసుకుంది. -
వుయ్ డోంట్ కేర్: రవిశాస్త్రి
ముంబై:తమ జట్టు ఎప్పుడూ టీ 20 క్రికెట్ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. క్రికెట్లో భాగమైన టీ 20 ఫార్మాట్ కోసం హైరానా అనేది అనవరసమన్నాడు. ఇక్కడ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండటమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో మూడో టీ20లో విజయం సాధించిన తరువాత మాట్లాడిన రవిశాస్త్రి.. 'మేము ఎప్పుడూ ప్రత్యర్థి జట్టుకు గౌరవం ఇస్తాం. అలా అవతలి జట్టుకు గౌరవం ఇచ్చినప్పుడే ఫీల్డ్లో నిలబడతాం. అది ఒక మంచి జట్టు యొక్క లక్షణం కూడా. కాకపోతే టీ 20 క్రికెట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా సైడ్ నుంచి చూస్తే టీ 20 క్రికెట్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ గెలుపు-పరాజయాలు అనేవి విషయం కాదు. మా లక్ష్యం ఒక్కటే యువకులకు అవకాశాలు కల్పించడం. ఆ క్రమంలోనే 2019 నాటికి ఒక అత్యుత్తమ జట్టును తయారు చేయడం. వీటిపైనే మా దృష్టి. టీ 20 క్రికెట్ అనేది 'డోంట్ కేర్' అని రవిశాస్త్రి కాస్త ఘాటుగా స్పందించాడు. దీనిలో భాగంగా బౌలింగ్లో ఆకట్టుకున్న ఉనాద్కత్ పై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఉనాద్కత్ బౌలింగ్ చాలా విభిన్నంగా ఉందని కొనియాడాడు. లంకతో సిరీస్తో ద్వారా ఉనాద్కత్ తన బౌలింగ్ విలువ గురించి తెలుసుకున్నాడన్నాడు. ఇదే సమయంలో లంకతో టీ 20ల్లో భాగంగా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ను ఆకాశానికెత్తేశాడు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో మంచి పరిణితి సాధించాడంటూ కితాబిచ్చాడు. అతనొక క్లాస్ ఆటగాడని, అన్ని రకాల షాట్లు ఆడగల సత్తా ఉన్నవాడన్నాడు. -
ఉనాద్కత్ చెలరేగినా...
ముంబై: భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ న్యూజిలాండ్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రబౌర్న్ మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 343 పరుగులు చేసింది. లాథమ్(108), టేలర్(102) సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ 4 వికెట్లు పడగొట్టాడు. కేవీ శర్మ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ టీమ్ 47.1 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌటైంది. గురుకీరత్ సింగ్(65), కరుణ్ నాయర్(53) అర్ధసెంచరీలు చేశారు. రిషబ్ పంత్(7) నిరాశపరిచాడు. తొలి మ్యాచ్లో మెరిసిన టీనేజి సెన్సేషన్ పృథ్వీ షా(22) ఈ మ్యాచ్లో త్వరగా అవుటయ్యాడు. 231 పరుగులకే ఎలెవన్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఉనాద్కత్ అనూహ్యంగా విజృభించడంతో స్కోరు 300 దాటింది. ఉనాద్కత్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు సాధించాడు. ఇదే మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. -
'స్టీవ్ స్మిత్ వల్లే సక్సెస్ అయ్యా'
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్. తొలి నాలుగు మ్యాచ్ లు ఆడకపోయినప్పటికీ ఆ తరువాత జట్టులోకి వచ్చిన ఉనాద్కత్ 22 వికెట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉనాద్కత్.. ఇందుకు కారణం తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అని పేర్కొన్నాడు. 'స్టీవ్ స్మిత్-ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం నాకు చాలా ఉపయోగపడింది. వారిద్దర వద్ద ఆడటం నాకొక మంచి అనుభవం. ఈ సీజన్ లో ఆఖరి ఓవర్లను ఎక్కువగా వేశా. డెత్ ఓవర్లను వేసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కెప్టెన్ నుంచి సహకారం అవసరం. అటువంటి సహకారం నాకు స్మిత్ నుంచి అందింది. నాపై నమ్మకం ఉంచడంతోనే నా ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేసి సక్సెస్ అయ్యా. స్టీవ్ స్మిత్ కు బౌలర్లకు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. దాంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపడం కూడా తెలుసు'అని ఉనాద్కత్ పేర్కొన్నాడు. -
బాలుడి చిట్కాతో హ్యాట్రిక్ ఫీట్: ఉనద్కత్
న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్పై మ్యాచ్లో చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించి హీరో అయిపోయిన జయదేవ్ ఉనద్కత్ అందుకు గల కారణాలు వింటే షాకవ్వాల్సిందే. హ్యాట్రిక్ ట్రిక్స్ తాను 12 ఏళ్ల బాలుడి నుంచి నేర్చుకున్నానని పుణే బౌలర్ ఉనద్కత్ తెలిపాడు. గత ఆదివారం మ్యాచ్లో సన్రైజర్స్ పై 12 పరుగుల తేడాతో పుణేను గెలిపించాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వివరాలను పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 28న సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డుప్లెసిస్ లతో కలిసి ఉనద్కత్ పుణేలోని ఏపీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓంకార్ పవార్ అనే విద్యార్థి ఏ మోహమాటం లేకుండా తనకు బౌలింగ్ మెలకువలు నేర్పించాడని చెప్పాడు. బంతులలో వైవిధ్యం చూపించడానికి బౌలింగ్ చేసి చూపించాడని వివరించాడు. చివరి ఓవర్లో వరుస బంతుల్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లను పెవిలియన్ బాట పట్టించి హ్యాట్రిక్ ఫీట్ నమోదుచేశాడు. ఆ స్కూళ్లోనే తన హ్యాట్రిక్ ఫీట్కు బీజం పడిందని పుణే ప్లేయర్ హర్షం వ్యక్తం చేశాడు. హాట్రికె వికెట్లతో పాటు మెయిడిన్ ఓవర్ వేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. -
రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర
వడోదర: పేసర్ జయదేవ్ ఉనాద్కట్ (5/45) పదునైన బంతుల ధాటికి అస్సాం జట్టు విలవిలలాడింది. దీంతో పది వికెట్ల తేడాతో నెగ్గిన సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రోజు సోమవారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అస్సాం 39.1 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. సయ్యద్ మొహమ్మద్ (69 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. రాథోడ్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 21 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్కు దిగిన సౌరాష్ట్ర 3.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 24 పరుగులు చేసి నెగ్గింది. అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్ను 353 పరుగుల వద్ద ముగించింది. మరో సెమీస్లో మధ్యప్రదేశ్తో తలపడుతున్న ముంబై 429 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో 70 ఓవర్లలో 285/3 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (97 బ్యాటింగ్), ఆదిత్య తారే (90 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 227 పరుగులు చేసింది.