ఐపీఎల్లో తమ జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నాయని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) లెగ్-స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. తమకు ప్లేఆఫ్ అవకాశం లేదన్న వాదనతో విభేదించాడు. ముంబై ఇండియన్స్తో వాంఖడే మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ముందుకెళ్లే దారులు దాదాపు మూసుకుపోయాయి.